శాసన మండలి: కూర్పుల మధ్య తేడాలు
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ta:மாநிலச் சட்டமன்ற மேலவை (இந்தியா) |
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: fr:Vidhan Parishad, hi:विधान परिषद |
||
పంక్తి 17: | పంక్తి 17: | ||
[[en:Vidhan Parishad]] |
[[en:Vidhan Parishad]] |
||
[[hi:विधान परिषद]] |
|||
[[ta:மாநிலச் சட்டமன்ற மேலவை (இந்தியா)]] |
[[ta:மாநிலச் சட்டமன்ற மேலவை (இந்தியா)]] |
||
[[fr:Vidhan Parishad]] |
|||
[[mr:विधान परिषद]] |
[[mr:विधान परिषद]] |
07:26, 20 జూన్ 2011 నాటి కూర్పు
భారతదేశం |
ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం. |
|
|
|
భారత దేశము యొక్క రాష్ట్రాల శాసన వ్యవస్థలో రెండవ సభను శాసనమండలి అంటారు. 28 రాష్ట్రాలలో కేవలం 6 రాష్ట్రాలలో మాత్రమే ప్రస్తుతం శాసనమండలి ఉన్నది. అవి ఉత్తర ప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీరు,ఆంధ్ర ప్రదేశ్. రెండు సభలు కలిగిన రాష్ట్రాల శాసన వ్యవస్థలో ఇది ఎగువ సభ. శాసన మండలి సభ్యులు ప్రజలచే పరోక్షముగా ఎన్నికౌతారు. ఇది శాశ్వత సభ. అనగా శాసన సభ వలె దీన్ని రద్దు చేయలేము. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడొంతుల సభకు ఎన్నికలు జరుపుతారు. శాసన మండలి సభ్యుని పదవీకాలం 6 సంవత్సరాలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మొత్తం సభ్యుల స్థానాల సంఖ్య 90 [1]
సభ్యుల అర్హతలు
- శాసనమండలి సభ్యుడు కాదలచిన వ్యక్తి భారత పౌరుడై ఉండాలి.
- కనీసం 30 ఏళ్ళ వయసు ఉండాలి.
- మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి.
- దివాళా తీసి ఉండరాదు.
సభా సభ్యత్వం
శాసన మండలి సభ్యుల సంఖ్య ఆయా రాష్ట్రాల శాసన సభ్యుల సంఖ్యలో మూడో వంతు కంటే మించరాదు. కానీ సభ్యుల సంఖ్య 40 కి తగ్గరాదు. (జమ్మూ కాశ్మీరు శాసన మండలిలో 32 మంది సభ్యులే ఉండటం చేత ప్రత్యేక పార్లమెంటు చట్టము వలన అనుమతించబడినది). శాసన మండలి సభ్యులలో ఆరోవంతు (1/6) మంది సభ్యులు గవర్నరు చే నియమించబడతారు. వీరు శాస్త్రము, కళలు, సామాజిక సేవ మరియు ఇతర రంగములలో రాణించినవారై ఉంటారు. ఇంకొక మూడోవంతు (1/3) మందిని స్థానిక ప్రభుత్వ సంస్థలు ఎన్నుకుంటాయి. పన్నెండో వంతు (1/12) మందిని ఉన్నత పాఠశాలల, కళాశాలల, విశ్వవిద్యాలయాల అధ్యాపకులు ఎన్నుకొంటారు.మరొ (1/12) మందిని పటతబద్రులు ఎన్నుకుంటాయి.