పాండవ వనవాసం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
name = పాండవ వనవాసం |
name = పాండవ వనవాసం |
image = TeluguFilm PandavaVanavasam.jpg|
image = TeluguFilm PandavaVanavasam.jpg|
writer = [[సముద్రాల రాఘవాచార్య]]|
dialogues = [[సముద్రాల రాఘవాచార్య]]|
lyrics = [[సముద్రాల రాఘవాచార్య]],<br>[[ఆరుద్ర]],<br>[[కొసరాజు]]|
lyrics = [[సముద్రాల రాఘవాచార్య]],<br>[[ఆరుద్ర]],<br>[[కొసరాజు]]|
director = [[ కమలాకర కామేశ్వరరావు ]]|
director = [[ కమలాకర కామేశ్వరరావు ]]|

13:41, 15 ఆగస్టు 2011 నాటి కూర్పు

పాండవ వనవాసం
(1965 తెలుగు సినిమా)
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
నిర్మాణం ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు
తారాగణం నందమూరి తారక రామారావు,
సావిత్రి,
ఎస్వీ రంగారావు,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రాజనాల,
కాంతారావు,
ముదిగొండ లింగమూర్తి,
బాలయ్య,
మిక్కిలినేని,
హరనాధ్,
ప్రభాకరరెడ్డి,
కైకాల సత్యనారాయణ,
ముక్కామల,
రమణారెడ్డి,
పద్మనాభం,
ధూళిపాళ,
అల్లు రామలింగయ్య,
ఎల్.విజయలక్ష్మి,
సంధ్య,
వాణిశ్రీ,
సవితాదేవి,
వీణావతి,
సరస్వతి,
బేబీ లత,
రాజ సులోచన,
చిత్తూరు నాగయ్య,
ఋష్యేంద్రమణి,
అజీత్ సింగ్,
హేమామాలిని,
మాలతి
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల,
పి.బి.శ్రీనివాస్,
పి.లీల,
మాధవపెద్ది సత్యం,
ఎస్.జానకి,
మంగళంపల్లి బాలమురళీకృష్ణ,
ఎల్.ఆర్.ఈశ్వరి
నృత్యాలు పసుమర్తి కృష్ణమూర్తి
గీతరచన సముద్రాల రాఘవాచార్య,
ఆరుద్ర,
కొసరాజు
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
ఛాయాగ్రహణం సి.నాగేశ్వరరావు
కళ ఎస్.కృష్ణారావు
నిర్మాణ సంస్థ మాధవీ ప్రొడక్షన్స్
నిడివి 188 నిమిషాలు
భాష తెలుగు

పాండవ వనవాసం 1965 లో నిర్మించబడిన పౌరాణిక తెలుగు సినిమా. ఈ చిత్రరాజాన్ని మాధవీ ప్రొడక్షన్స్ అధినేత ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు, "పౌరాణిక బ్రహ్మ"గా ప్రసిద్ధిచెందిన కమలాకర కామేశ్వరరావు దర్శకులుగా తెరకెక్కించారు. మహాభారతం లోని పాండవులు మాయాజూదంలో ఓడి వనవాస కాలంలో జరిగిన విశేషాల్ని సముద్రాల రాఘవాచార్య రచించారు.

సంక్షిప్త చిత్రకథ

మయ సభలో దుర్యోధనునికి జరిగిన పరాభవం, తాము పొందిన ప్రశంసలను గుర్తుకు తెచ్చుకొని శ్రీకృష్ణుని సహాయానికి కృతజ్ఞత తెలుపుతారు పాండవులు. జరిగిన పరాభవాన్ని తలచుకొని కృంగిపోతున్న దుర్యోధనునికి ధైర్యం చెప్పి మాయా జూదంలో పాండవుల సంపదను హరిస్తానని చెబుతాడు శకుని. ధృతరాష్ట్రుని ఆహ్వానంపై వచ్చిన ధర్మరాజు జూదములో పాల్గొని సర్వస్వం వోడిపోయి చివరకు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయవలసి వస్తుంది.

అరణ్యవాస సమయంలో పాండవుల్ని దూర్వాసుడు పరీక్షించడం, ద్రౌపది కోరికపై భీమసేనుడు సౌగంధికా కమలాలను సాధించి తేవడం, ఘోషయాత్రకు వచ్చిన దుర్యోధనుడు చిత్రసేనుని చేతిలో పరాభవం పొందటం, పాండవుల ధాతృత్వంతో ప్రాణాలు దక్కించుకున్న సుయోధనుని ఆత్మహత్యా ప్రయత్నం, శశిరేఖ వివాహ సమయంలో లక్ష్మణ కుమారుని పరాభవం, అభిమన్యునితో వివాహం మొదలైన సంఘటనలన్నీ రసవత్తరంగా కూర్చి ఈ చిత్ర కథను రూపొందించారు.

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
నా చందమామ నీవె భామ తారలే ఆన నీ నీడనే నా ప్రేమ సీమ సముద్రాల రాఘవాచార్య ఘంటసాల ఘంటసాల పి.సుశీల
దేవా దీన బంధవా అసహాయురాలరా సముద్రాల రాఘవాచార్య ఘంటసాల పి.లీల
విధి వంచితులై విభవమువీడి అన్నమాట కోసం అయ్యో అడవి పాలయేరా సముద్రాల రాఘవాచార్య ఘంటసాల ఘంటసాల
హిమగిరి సొగసులు మురిపించును మనసులు సముద్రాల రాఘవాచార్య ఘంటసాల ఘంటసాల పి.సుశీల
రాగాలు మేళవింప
ఉరుకుల పరుగుల దొర

విశేషాలు

  • ఈ సినిమాలో ఆ తరువాత ప్రఖాత్య హిందీ సినిమా తార అయిన హేమామాలిని కొన్ని నృత్య సన్నివేశాలలో నటించింది. ఇదే ఆమె తొలి సినిమా.
  • ఘంటసాల పాడిన ఆంజనేయ స్తుతి భక్తిపూరితంగా ఉంటుంది.
  • జూద ఘట్టంలో తిక్కన వ్రాసిన మహాభారతంలోని కొన్ని పద్యాలు, ద్రౌపది వస్త్రాపరహణ ఘట్టం అద్భుత భీభత్స, కరుణ, వీర రసాల్ని ఆవిష్కరించాయి.

మూలాలు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.

బయటి లింకులు