స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 89: పంక్తి 89:
==== గాంధారి ద్రౌపదిని ఓదార్చుట ====
==== గాంధారి ద్రౌపదిని ఓదార్చుట ====
ఆ మాటలకు [[ద్రౌపది]] దుఃఖ భారం తాళ లేక మొదలు నరికిన చెట్టులా కుప్ప కూలింది. కుంతీదేవి కోడలిని పొదివి పట్టుకుని భోరుమంది. కొంత సేపటికి తేరుకుని [[ద్రౌపది]]ని ఓదార్చి గాంధారి వద్దకు తీసుకు వెళ్ళింది. గాంధారి ద్రౌపదిని ఓదారుస్తూ " అమ్మా ! ద్రౌపదీ ! ఊరుకోమ్మా. పాండవులకు మాత్రం కొడుకులను పోగొట్టుకున్న బాధ లేదా ! మీ అత్త కుంతీ దేవికి మాత్రం మనుమలను పోగొట్టుకున్న దుఃఖం లేదా ! అమ్మా ద్రౌపదీ ! నీవు నేను ఒకే మాదిరి శోకం అనుభవిస్తున్నాము. నీకూ కొడుకులు పోయారు. నాకూ కొడుకులు పోయారు.ఇలా జరుగుతుందనే [[విదురుడు]] కురు సభలో ఎంతగానో చెప్పి చూసాడు. నే ఏమాత్రం నా కుమారుల దుశ్చర్యలు ఆప లేక పోయాను కనుకనే ఫలితం అనుభవిస్తూ ఉన్నాను. అయినా అంతా విధి విలాసం కాల మహిమ ఊరుకోమ్మా ! " అని [[ద్రౌపది]] ఓదార్చింది.
ఆ మాటలకు [[ద్రౌపది]] దుఃఖ భారం తాళ లేక మొదలు నరికిన చెట్టులా కుప్ప కూలింది. కుంతీదేవి కోడలిని పొదివి పట్టుకుని భోరుమంది. కొంత సేపటికి తేరుకుని [[ద్రౌపది]]ని ఓదార్చి గాంధారి వద్దకు తీసుకు వెళ్ళింది. గాంధారి ద్రౌపదిని ఓదారుస్తూ " అమ్మా ! ద్రౌపదీ ! ఊరుకోమ్మా. పాండవులకు మాత్రం కొడుకులను పోగొట్టుకున్న బాధ లేదా ! మీ అత్త కుంతీ దేవికి మాత్రం మనుమలను పోగొట్టుకున్న దుఃఖం లేదా ! అమ్మా ద్రౌపదీ ! నీవు నేను ఒకే మాదిరి శోకం అనుభవిస్తున్నాము. నీకూ కొడుకులు పోయారు. నాకూ కొడుకులు పోయారు.ఇలా జరుగుతుందనే [[విదురుడు]] కురు సభలో ఎంతగానో చెప్పి చూసాడు. నే ఏమాత్రం నా కుమారుల దుశ్చర్యలు ఆప లేక పోయాను కనుకనే ఫలితం అనుభవిస్తూ ఉన్నాను. అయినా అంతా విధి విలాసం కాల మహిమ ఊరుకోమ్మా ! " అని [[ద్రౌపది]] ఓదార్చింది.

== ద్వితీయాశ్వాసం ==
వైశంపాయన మహర్షి జనమేజయునకు చెప్పిన మహా భారతకధను సూతుడు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులకు చెప్పసాగాడు. ఆ ప్రకారంగా [[ద్రౌపది]]ని ఓదార్చిన తరువాత యుద్ధభూమికి జరిగింది. వ్యాస మహాముని కరుణ వలన ఆమెకు కళ్ళకు గంతలు ఉన్నా యుద్ధ భూమి సవిస్తరంగా కనిపించ సాగింది. సుదూరంలో ఉన్న దృశ్యాలు దగ్గరగా కనిపించసాగాయి. [[గాంధారి]] యుద్ధ భూమి అంతా పరికిస్తూ ముందుకు నడుస్తుంది. ఆమె కళ్ళు సుయోధనుడి శవం కొరకు గాలిస్తున్నాయి. విరిగిన రధాలు, ముక్కలైన ధ్వజాలు, చచ్చిన ఏనుగులు, గుర్రాల కళేబరాలు గుట్టలుగా పడి ఉన్నాయి. చనిపోయిన సారధులు, సైనికుల శవాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. తల ఒక చోట ఉంటే మొండెం మరొక్క చోట ఉంది. అది చూసి [[గాంధారి]] మనసు కలత చెందింది. మహా మహా సామ్రాజ్యాలు ఏలిన మహారాజులు నోళ్ళు తెరచుకొని శవాలై పడి ఉన్నారు. వారి శరీరాల నుండి కారిన రక్తం కాలువలై ప్రవహిస్తుంది. వారు ధరించిన విల్లులు, అంబులు, కత్తులు మొదలైన ఆయుధములు గుట్టలుగా పడి ఉన్నాయి. కొంత మంది శరీరాలు గుర్తించ వీలు లేని విధంగా ఉన్నాయి. వాటి కొరకు వచ్చిన రాబందులు, గద్దలు, అక్కడక్కడా ఎగురుతూ దొరికిన శవాన్ని దొరికినట్లు పీక్కు తింటూ తిరుగుతున్నాయి. తోడేళ్ళు స్వైర విహారం చేస్తూ శవాలని చీల్చి కండలు ఊడబెరికి తింటున్నాయి.


==== గాంధారి బాధ ====
ఇదంతా చూసిన [[గాంధారి]] మనసు బాధతో విలవిల్లాడింది. తన కుమారుడి మూర్ఖత్వం ఇంతటి మాఋఅణహోమానికి దారి తీసింది బాధపడింది. [[వ్యాసుడు]] ధృతరాష్ట్రుడితో శవాలన్నింటికీ సామూహిక దహనకాండలు జరిపించమని చెప్పి వెళ్ళి పోయాడు. పాండవులు, [[శ్రీకృష్ణుడు]], ధృతరాష్ట్రుడిని నడిపించుకుంటూ తీసుకు యుద్ధభూమికి తీసుకు వచ్చారు. [[గాంధారి]] కోడళ్ళు అందరూ తమ తమ భర్తల శవాల కొరకు యుద్ధ భూమి అంతా కలియ తిరుగుతున్నారు. ఇతర హస్థినాపుర స్త్రీలు కూడా తమ భ్యర్తల కళేబరాల కొరకు తిరుగుతున్నారు. అందరూ బిగ్గరగా ఏడుస్తూ, కుమారులనూ, భర్తలను పిలుస్తూ తూలుతూ నడుస్తున్నారు. కొంత మంది తమ సోదరులు, భర్తలు, కుమారులు, బంధువులు శవాలుగా పడి ఉండటం చూసి సహించ లేక హాహాకారాలు చేస్తూ మూర్ఛ పోయారు. మరి కొంత మంది చని పోయిన వారి గురించి తలచుకుంటూ వారి గురించి చెప్పుకుంటూ తలలు బాదుకుంటున్నారు.

==== గాంధారి కృష్ణుడితో చెప్పి విలపించుట ====
ఇది చూసిన [[గాంధారి]] మనసు కకావికలు కాగా దూరంగా ఉన్న కృష్ణుడిని దగ్గరకు పిలిచి " కృష్ణా ! చూడవయ్యా ధృతరాష్ట్ర మహారాజు కోడళ్ళు ఎలా ఏడుస్తున్నారో చూడు.
వారి భర్తల శవాల కొరకు ఎలా వెదుకుతున్నారో చూడు. ఒకరి భర్తల శరీరాలను ఒకరు వెతుకుతూ ఏడుస్తూ వారి వారి భార్యలను ఏడుస్తూ ఎలా పిలుస్తున్నారో చూడవయ్యా !
నా కుమారుల మీద కసి ద్వేషం పెంచుకున్న వారి కళ్ళు ఈ దృశ్యాలు చూసి చల్లబడ్డాయా ! వీరంతా ఏమి పాపపం చేసారని వీరికి ఈ శిక్షవేసారయ్యా మీరు. అడుగో [[భీష్ముడు]], [[ద్రోణుడు]], [[కర్ణుడు]], [[శల్యుడు]], [[ద్రుపదుడు]] వీరంతా చనిపోయినా ముఖంలోని కళ తగ్గకుండా ఎలా వెలిగిపోతున్నారో చూడవయ్యా ! అత్యంత భోగాలను అనుభవించిన ఆ మహానుభావులు ఎలా పడి ఉన్నారో చూడవయ్యా ! వంది మాగధులు కైవారముతోగాని నిద్ర లేవని ఈ మహా మహులు ఈ రోజు నక్కల ఊళల మద్య అచేతనంగా పడి ఉన్నారయ్యా ! హంస తూలికా తల్పమున గాని శయనించని రాజాధి రాజులు కటిక నేలన పడి ఉన్నారయ్యా ! నానా విధ సుఘంధ లేపనాలతో శరీరాలను అలంకరించుకునే రాజాధి రాజులు ధూళి దూసరిత రక్తమయ భూమిలో దొర్లుతున్నారు చూడవయ్యా ! కృష్ణా ! ఇవన్నీ చూసి ఎలా ఊరుకున్నావయ్యా ! ఇదంతా నీవు సాధించిన ఘనకార్యం కాదా ! అటు చూడవయ్యా ! కొంత మంది కౌరవ కాంతలకు తమ భర్తల తలలు కానక ఎలా విలపిస్తూ వెతుకుతున్నారో చూడవయ్యా ! మరి కొందరు తలలు చేత పట్టి మోడెములు కానక అల్లాడుతున్నారయ్యా ! మరి కొందరు ముక్కలై పోయిన తమ భర్తల శరీరభాగాలను ఒకటిగా చేర్చి కుమిలి కుమిలి ఏడుస్తున్నారయ్యా !
మరి కొందరు నక్కలు తోడేళ్ళు చిందర వందర చేయడంతో శరీరాలను కానక క్షోభిస్తున్నారయ్యా ! ఇటువంటి దురవస్థలను చూడడానికి నేను ఈ జన్మలో ఏపాపపం చేసానో కృష్ణా ! నా కొడుకులను, కోడళ్ళను, తమ్ముళ్ళను, బంధువులను ఇలాంటి దుస్థితిలో చూస్తున్నాను " కాని [[కృష్ణుడు]] మాటాడక నిశ్శబధంగా గాంధారి వెంట నడుస్తున్నాడు.

==== గాంధారి సుయోధనుడిని చూసి విలపించుట ====
ఇంతలో దూరంగా సుయోధనుడి శవం పడి ఉండటం చూసింది. దిక్కు లేకుండా పడి ఉన్న అభిమానధనుడైన సుయోధనుడి శవం చూసి [[గాంధారి]] కుప్పకూలి పోయింది.
తన కుమారుడి శవం మీద పడి రోదిస్తూ " నాయనా సుయోధనా ! ఏమిటిది సుయోధనా ! నీ శరీరం దుమ్ము ధూళిలో పడి దొర్లడం ఏమిటయ్యా ! నీ తల్లి గాంధారిని వచ్చాను నన్ను చూసి కూడా లేచి నిలబడవా నాయనా ! కృష్ణా ! చూడవయ్యా నా కుమారుని చూడు. వీడు యుద్ధముకు వెళుతూ నా ఆశీర్వాదం కొరకు వచ్చాడయ్యా ! నాకు పాదాభివందనం చేసాడయ్యా ! అప్పుడు నేను ధర్మమం జయిస్తుందని ఆశీర్వదించాను. అలా ఎందుకు ఆశీర్వదించానో తెలుసా కృష్ణా నాడు కురు సభలోజూద క్రియ తరువాత
పాండవులకు జరిగిన అవమానము [[ద్రౌపది]]కి జరిగిన ఘోర పరాభవం కళ్ళారా చూసిన వారు " ఎప్పటికైనా ధర్మం జయిస్తుంది. కౌరవులకు నాశనం తప్పదు " అనుకోవడం నా మనసులో ఇంకా ప్రతిధ్వనిస్తుంది. అందుకే నా కుమారుడని ఉపేక్షించక అలా దీవించాను. కృష్ణా ! నేను ఇంకా ఇలా అన్నాను యుద్ధంలో వెనుతిరిగి పోవడం కంటే వీరమరణం పొందడమే మేలు అన్నాను. అప్పుడే వీరస్వర్గం లభిస్తుంది. వస్తే విజయలక్ష్మితో తిరిగి రా ! లేకున్న వీరమరణాన్ని వరించి వీరస్వర్గం అనుభవించు అన్నానయ్యా !
నా కుమారుడు రెండవది నిజంచాసాడు. ఇప్పుడు నేను కడుపు తీపితో ఏడుస్తున్నానే కాని వేరు కాదు. వాడి మరణానికి నేను ఏడవడం లేదు. వీరోచితంగా పోరాడి వీర మరణం పొంది వీరస్వర్గం చేరిన నాకుమారుడి గుర్తించి ఎందుకు దుఃఖిస్తాను. ఈ ముదిమి వయసులో నాకూ నా భర్తకు కొడుకుల ఆసరా లేక పోయిందే నన్నదే నా బాధ. కృష్ణా ! నా కుమారుడు అభిమానధనుడు అష్టైశ్వర్య సంపన్నుడు అలాంటి వాడికి ఇలాంటి మరణమా అన్నదే నా బాధ. ఏమి చేస్తాం [[విదురుడు]] ఎంతో చెప్పాడు. నా భర్తకు నా కుమారుడికి ఎన్నో విధముల చెప్పాడు. మదించిన గర్వంతో వారా మాటలను పెడ చెవిన పెట్టారు. విదురుడి మాట ఒక్కటి విన్నా దుర్మరణాలు తప్పేవి కదా ! పదకొండు అక్షౌహినుల సైన్యమున్న నా కుమారుడు ఇలా ఒంటరి చావు చచ్చాడయ్యా ! నా భర్త కుమారుడు ఏకచ్ఛత్రాధిపత్యం వహించిన కురు సామ్రాజ్యం పరుల హస్తగతం అయింయ్యా ! అది చూసే దౌర్భాగ్యం నాకు పట్టింది "

==== గాంధారి వైరాగ్యంతో కోడళ్ళను చూసి దుఃఖించుట ====
కృష్ణా ! పోయిన కొడుకులు ఏటూ పోయారు. బతికి ఉన్ననా కోడళ్ళ దుఃఖమును చూడ లేక పోతున్నానయ్యా ! ఇలాంటి మనో వేదన అనుభవించడానికి వారు చేసిన పాపమేమిటి ! రాజకీయాలేమిటో యుద్ధం ఎందుకు సంభవించిందో ఎరుగని వారికీ ఘోర శిక్ష ఏమిటి. అలా చూడు నా పెద్ద కోడలు భానుమతి భర్త శవాన్ని చూసి ఎలా ఏడుస్తూ తల బాదుకుంటుందో చూడవయ్యా ! కడుపున పుట్టిన కుమారుడి ముఖాన్ని చూసి గుండెలు పగిలేలా రోదిస్తుందయ్యా ! నాకుమారుడు, ఆమె కుమారుడి శవాలు ఆమె కన్నీటితో తడుస్తున్నాయి చూడవయ్యా ! కురులు విరబోసుకుని పిచ్చి వారిలా తిరుగుతున్న నా కోడళ్ళను చూడవయ్యా ! వాళ్ళేమి చేసారని వారికి ఈ చిత్త క్షోభ. నా కుమారుడు సుయోధనుడి సరసన విరాజిల్లిన భానుమతి ముఖాన్ని ఇలా శోకతప్త ముఖంతో నేను ఎలా చూడగలను. నా కుమారులకేమి చచ్చి హాయిగా స్వర్గాన ఉన్నారు.
నా కోడళ్ళు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు చూడవయ్యా ! వీరి దుఃఖముకు అంతు లేదా ! భీముని చేతిలో హతులైన నాకుమారుల శవాలు చూసి నాకోడళ్ళు భోరు భోరున రోదిస్తున్నారయ్యా ! పాలరాతి భవనాల్లో చందనచేర్చిత ముఖాలతో కళ కళ లాడే వారి ముఖాలు ఈ రోజు మరణించిన భర్తల కొరకు కటిక నేల మీద పడి పొర్లి రోదిస్తున్నారయ్యా ! ఇంకా ముద్దు ముచ్చటలు తీరని లేత వయస్కులైన నా కోడళ్ళ్కు పట్టిన దుర్గతి చూసావా ! ఇదంతా నేను నా భర్తా చేసిన పాప ఫలితం కాక పోతే [[ధర్మరాజు]] నా కుమారులను సంహరిస్తాడా ! అని [[గాంధారి]] పలు విధముల విలపిస్తుంది. [[కృష్ణుడు]] ఆమె పక్కన నిలబడి మైనంగా చూస్తున్నాడు. ఆమె మనసులో ఉన్న బాధ, దు!ఖం బహిర్గతమైతే కాని దుఃఖోపశమనం కలుగదని అనుకున్నాడు.

==== గాంధారి దుశ్శాసనుడి కొరకు దుఃఖించుట ====
ఇంతలో [[గాంధారి]] దుశ్శాసనుడి శవాన్ని చూసి మహోద్వేగంతో " కృషా ! వీడేనయ్యా నా కుమారుడు దుశ్శాసనుడు. మహా బల సంపన్నుడు. భీముడి గదా ఘాతానికి బలి అయి ఇలా దిక్కు లేకుండా నేల పడి ఉన్నాడు. భీముడు వీడి గుండెలు చీల్చి రక్తం త్రాగిన తరువాత నిర్జీవుడయ్యాడు. వీడు నా కోడలు జుట్టు పట్టి సభకు ఈడ్చినందుకు ఫలితం అనుభవించాడయ్యా ! భీముడి గుండెలు మండేలా [[ద్రౌపది]] ఏడుస్తుంటే వీడు నా కుమారుడు సుయోధనుడికి, అంగరాజు కర్ణుడికిప్రీతి కలిగించడానికి [[ద్రౌపది]] వలువలు ఊడదీయ ఉద్యుక్తుడైన వీడి పాపం ఊరికే పోతుందా ! అందుకే దిక్కు లేని చావు చచ్చాడు. వీడి విషయం విని నేను సుయోధనుడితో " కుమారా ! ఈ [[ద్రౌపది]] తన అన్న కృష్ణుడి సంరక్షణలో ఉన్న విషయం నీకు తెలుసా ! ఆమెను ఇంత నీచంగా అవమానించడం మీకు మంచిది కాదు. ఇందుకు పర్యవసానం తెలిసే మీరు ఈ పనికి ఒడిగట్టారా ! భీముడి బలపరాక్రమాలు తెలిసే అతడి భార్య [[ద్రౌపది]]ని అవమానించారా ! తక్షణమే ఆమెను విడిచి పెట్టండి. కౌరవ కుల కాంత ద్రౌపదిని గౌరవించండి. నా తమ్ముడైన [[శకుని]] అత్యంత నీచుడు, క్రూరుడు, దౌర్భాగ్యుడు వాడి మాట వినకు వాడి స్నేహం వదులు కౌరవ వంశాన్ని రక్షించు " అని ఎన్నో విధముల సుయోధనుడికి చెప్పాను. అయినా నా మాటను ఎవరు వినక ఇలా చచ్చారయ్యా కృష్ణా ! విధి రాతను తప్పించ ఎవరి తరం కృష్ణా !

==== గాంధారి భీముని నిందించుట ====
కృష్ణా ! ఆ [[భీముడు]] నాడు కురుసభలో ఎన్ని మాటలన్నా ! ఎంత అవమానించినా ! సహించాడు భరించాడు. సమయం కొరకు పగబట్టిన త్రాచు పాములా కాచుకుని ఉన్నాడు.
యుద్ధంలో అవకాశం రాగానే నా కుమారులందరినీ తన గదతో మోది చంపాడు. పగ తీర్చుకోవడం న్యాయమే ఇలా గుండెలు చీల్చడం న్యాయమా ! మహా వీరుడైన భీముడికి ఇది తగునా ! ఇందు వలన భీముడికి కీర్తి కలుగుతుందా ! చూడవయ్యా కృష్ణా ! నా కొడుకు దుశ్శాసనుడు ఎలా ఉన్నాడో చూడు. చెల్లా చెదురైన అవయవములను చూడు.
సింహం గోళ్ళతో చీల్చినట్లు ఆ [[భీముడు]] నా కుమారుడి గుండెలు ఎలా చీల్చాడో చూడు. కని పెంచిన కొడుకు శరీరం ఇలాంటి స్థితిలో చూసిన తల్లి మనస్సు కుమిలి పోకుండా ఎలా ఉంటుంది కృష్ణా !

==== గాంధారి వికర్ణుడి కొరకు దుఃఖించుట ====
అయ్యో ! [[వికర్ణుడు]] ఇక్కడున్నాడు చూడవయ్యా ! ఆ ఏనుగుల కళేబరాల మధ్య వికర్ణుడి భార్య నా కోడలు గుండెలు అవిసేలా ఎలా రోదిస్తుందో చూసావా కృష్ణా ! వికర్ణుడి శరీరం మీద పొడుచుకు తినడానికి వాలు తున్న గద్దలను రాబందులను తోలుతూ భర్త శరీరం మీద పడి రోదిస్తుంది చూడవయ్యా ! కృష్ణా ! ఇలాంటి స్థితిలో కొడుకులను కోడళ్ళను చూసే ధౌర్భాగ్యురాలిని ఎక్కడైనా చూసావా ! ఎలాంటి వీరుడినైనా అవలీలగా ఎదుర్కునే దుర్ముఖుడు అలాంటి వీరుడు భీముడి గదాఘాతానికి ఎలా బలి అయ్యాడో చూసావా ! న్ కొడుకు శూరసేనుడిని చూసావా ! అతడి భార్యలను చూడు భర్త శవం చుట్టూ చేరి ఎలా రోదిస్తున్నారో చూడయ్యా ! కాకులూ గద్దలూ పొడుచుకు తిన్న అతడి శరీరం గుర్తించ వీలు కావడం లేదయ్యా ! కృష్ణా ! నా కుమారుడిని వివిశంతిని చూసావా ! వీడికి సంగీతం అంటే ప్రాణం. ఎప్పుడూ సంగీత విద్వాంశులైన స్త్రీలు సంసేవిస్తుండగా గానామృతంలో తేలియాడే వివిశంతి ఇప్పుడు నక్కల ఊళలు వింటున్నాడు. అని పరి పరి విధముల కుమారుల మరణానికి [[గాంధారి]] విలపిస్తుంది.

==== గాంధారి అభిమన్యుని కొరకు విలపించుట ====
కుమారుల కొరకు విలపిస్తున్న [[గాంధారి]] అభిమన్యుడి మృతదేహాన్ని చూడగానే భావోద్వేగానికి లోనయ్యింది. ఆమె మనసు బాధతో " కృష్ణా ! వాడేనయ్యా [[అభిమన్యుడు]]
శత్రు దుర్భేద్యమైన పద్మవ్యూహమును ఛేదించి అరి వీర భయంకరుడైన సుయోధనుడిని ఎదిరించిన మహావీరుడు [[అభిమన్యుడు]]. చివరకు ద్రోణ, కర్ణ, అశ్వత్థామ, శల్య, కృపాది యోధాను యోధులందరూ అతడిని చుట్టు ముట్టి కడతేర్చారయ్యా ! చావు కళ ఇసుమంతైనా లేక నిద్రిసతున్నట్లున్న సుభద్రా పుత్రుడి ముఖం చూడవయ్యా ! అందుకే ఉత్తర అతడి ముఖం మీద ముఖం పెట్టి నిద్రలేవమని భర్తను ప్రార్ధిస్తుందయ్యా ! అభిమన్యుడిని అల్లంత దూరంలో చూడగానే పారిపోయే ఆ సుకుమారి. ఇప్పుడు పది మంది ముందు భర్త శరీరాన్ని కౌగలించుకుని నెత్తీ నోరూ బాదుకుంటూ రోదిస్తుందయ్యా ! ఉత్తర ఏమని ఏడుస్తుందో వినవయ్యా ! " ఓ అభిమన్య కుమారా ! మీ అమ్మ సుభద్ర, మీ నాన [[అర్జునుడు]] ఎదురు చూస్తున్నారు వారిని వదిలి ఎక్కడకు వెళ్ళావు ? నీ మేన మామ [[కృష్ణుడు]] వచ్చాడు లేవవయ్యా ! ఇన్ని మాట్లాడుతున్నా ఒక్క మాటైనా మారు పలుకవేమి ఆర్యపుత్రా ! అయ్యో దైవమా ! గురువుగారు [[ద్రోణుడు]], [[కృపాచార్యుడు]], అంగరాజు [[కర్ణుడు]], గురుపుత్రుడు [[అశ్వత్థామ]] న్యాయం ధర్మం తెలిసిన ధర్మాత్ములు ఒంటరి వాడివైన నిన్ను ఒక్కసారిగా దాడి చేసి చుట్టి ముట్టి తుద ముట్టించడం న్యాయమా ! ధర్మమా ! వారిదీ మగతనమేనా ! ఇంతటి నీచ కార్యానికి పాల్పడుటకు వారికి మనసెలా ఒప్పిందో ! తాను లేని సమయాన ఆ దుర్మ్,ఆర్గులు నిన్నిలా అధర్మమంగా వధించినందుకు నీ తండ్రి అర్జునుడి మనసెంత రగిలి పోయిందో !
నీ మరణం కలిగించిన దు!హ్ఖం శత్రురాజులను జయించి రాజ్యలక్ష్మిని కైవంశం చేసుకున్నా ఉపశమించ లేదు కదా ! నన్ను విడిచి స్వర్గానికి వెళ్ళి అక్కడి అప్సరసలతో సుఖించడానికి నీకు మసెలా ఒప్పింది " అంటూ [[ఉత్తర]] ను చూడు కృష్ణా ! ఇంత చిన్న వయసులో భర్తృవియోగం [[ఉత్తర]] ఎలా సహించగలదు. మహావీరుడైన ఉత్తర తండ్రి విరాటుడు ఆయన పక్కన చేరి సుధేష్ణ ఎలా రోదిస్తుందో చూడవయ్యా ! ఆ పక్కన ఆమె కుమారుడు ఉత్తర కుమారుడు పడి ఉన్నాడు. ఆ అభాగ్యురాలు మరణించిన భర్త కోసం ఏడుస్తుందా చచ్చిన కుమారుడి కొరకు విలపింస్తుందా ! చెప్పవయ్యా కృష్ణయ్యా !

==== గాంధారి కర్ణుడి కొరకు దుఃఖించుట ====
కృష్ణా ! అదుగో చూడు కర్ణుడి కళేబరం వద్ద అతడి భార్యలు ఎలా రోదిస్తున్నారో చూడవయ్యా ! ఈ కర్ణుడిని నమ్ముకునే నా కుమారుడు ఈ ఘోర యుద్ధానికి శ్రీకారం చుట్టి తుదకు దుర్మరణం పాలైంది. అటు చూడవయ్యా ! కర్ణుడి ధర్మ పత్ని వృషసేనుడి తల్లి అటు భర్త మరణానికి ఇటు కుమారుడి మరణానికి ఎలా విలపిస్తుందో చాడవయ్యా !
అమె రోదన వినవయ్యా ! " నాధా ! పరశురాముని శాపం, బ్రాహ్మణుడి శాపం, అర్జునుడి బాణాలు నిన్ను బలిగొన్నాయా ! " అంటూ విలపిస్తున్నాడయ్యా ! అడుగో మహావీరుడు
బాహ్లికుడు, చచ్చినట్లు ఉన్నాడా ! ఘాఢ నిద్రలో ఉన్నట్లు ఉన్నాడయ్యా ! కృష్ణా !

==== గాంధారి సైంధవుడి కొరకు దుఃఖించుట ====
కృష్ణా ! అటు చూడు నా అల్లుడు దుస్సల భర్త జయద్రధుడు. [[అర్జునుడు]] చేసిన ప్రతిజ్ఞకు బలి అయిన అభాగ్యుడు. నాడు అరణ్యమున [[ద్రౌపది]] ని కామించిన నాడే సగం చచ్చాడు. కాని ఆ నాడు పాండవులు చెల్లెలి భర్త అని వదిలారు. ఈ నాడు చెల్లెలి భర్త అన్న కనికరం మాని చంపారు కదయ్యా ! పాపం దుస్సల భర్త శిరస్సు కొరకు వెదుక్కుంటుందయ్యా ! కుమార్తెను ఇలాంటి దుస్థితిలో చూడడం కంటే దురదృష్టం తల్లికి మరేమి కలదో చెప్పవయ్యా ! కృష్ణా ! నీకుయ్ తెలుసో లేదో [[అర్జునుడు]] ప్రతిజ్ఞ గురించి విన్న దుస్సల భర్తకు ఎంతగా నచ్చచెప్పిందో " అర్జునుడికి ఈ ముల్లోకాలలో తిరుగు లేదు. నా మాట విని [[ధర్మరాజు]] ను శరణు వేడిన అతడు నిన్ను తప్పక కాపాడగలడు " అని పరి పరి విధముల వేడుకున్నా ! [[సైంధవుడు]] వినక తన మరణమును తానే కొని తెచ్చుకున్నాడు. " ఏ శుభకార్యానికి వెళ్ళ లేకుండా చేసారని [[దుస్సల]] ఎంతగా పాండవులను నిందిస్తుందో వినవయ్యా ! కృష్ణా ! అయినా [[సైంధవుడు]] చేసిన అపరాధం ఏమిటి ? యుద్ధధర్మం ప్రకారం భీమ, నకుల, సహదేవ, [[ధర్మరాజు]] లను అభిమన్యుడికి సహకరించకుండా ఆపాడు. అయినా ! బాలుడైన [[అభిమన్యుడు]] యోధానుయోధులైన భీష్మ, ద్రోణ, కర్ణ, [[అశ్వత్థామ]], శల్యులను ఒంటరిగా ఎదుర్కోవడం అతడి దసుస్సాహసం కాదా ! అతడి తొందరపాటే అతడి మరణానిక్మి కారణమైంది. చంపిన వారిని వదిలి అడ్డగించిన సైంధవుడిని చంపుట న్యాయమా ! ధర్మమా అర్జునుడికే అది తెలియాలి. కృషా ! మహావీరుడైన [[శల్యుడు]] ధర్మనిరతిలో ధర్మరాజుతో సమానుడు అటూవంటి వాడు దుర్యోధన పక్షం చేరి కర్ణుడికి సారధ్యం వహించి అతడిని సూటి పోటీ మాటలతో వేధించి అతడి ధైర్యాన్ని నీరు కార్చి అతడి మరణానికి ఒక కారణమయ్యాడే ! అలాంటి శల్యుడూ మరణించక మాన లేదు. అతడి శల్యుని చుట్టూ చేరి అతడి బంధువులు ఎలా విలపిస్తున్నారో చూడవయ్యా ! కృష్ణా ! మహేంద్రుడిని కూడా గెలువగలిగిన భగదత్తుడిని చూడు అర్జునుడి మీద ప్రేమతో ఇతడిని దారుణంగా చంపింది నువ్వే కదా !

==== గాంధారి భీష్మ ద్రోణుల కొరకు రోదించుట ====
అడుగో కోరి మరణం కిని తెచ్చుకున్న [[భీష్ముడు]] శరతల్పం మీద ఎలా పడుకుని ఉన్నాడో చూసావా ! అతడు అలా మరణాన్ని కోరి ఉండక ఉన్న అతడిని జయించడం మానవమాత్రుల తరమా ! కృష్ణా ! అతడికి నిజమైన శిష్యుడు [[అర్జునుడు]]. అతడిని శరతల్పం మీద పరండజేసి అతడికి పాతాళ గంగ తీసుకు వచ్చి దాహార్తి తీర్చిన మహా వీరుడు అర్జునుడే కదా ! సూర్యుడే భూమి మీదకు దిగి వచ్చి శరతల్పం మీద విశ్రమించినట్లు ఉంది. అలాంటి భీష్ముడు మరణిస్తే కురుకుమారులకు దిశా నిర్ధేశం చేయగల సమర్ధుడెవ్వడు. ఇంద్రుడితో సన్మానమైన [[ద్రోణుడు]] వేద వేదాంగపారతుడు. ధనుర్వేదం ఔపాశన పట్టాడు. ఎందరో రాకుమారులకు విద్యనేర్పిన వాడు. నేడు దిక్కులేకుండా పడి ఉన్నాడు. విధి ఎంత క్రూరమైంది కృష్ణా ! భీష్మ, ద్రోణులను నమ్ముకునే నా కుమారుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. అయినా అతడి తలను ద్రుపద పుత్రుడు ధృష్టద్యుమ్నుడు దారుణంగా నరికాడు. ఇది ఎలా సంభవించింది. ద్రోణుడి భార్య భర్త శవం పక్కన కూర్చుని ఎలా రోదిస్తుందో చూడు. ద్రోణుడి శిష్యులు అతడిని దహించడానికి కట్టెలు దొరకక అమ్ములు విల్లులు పోగు చేసి చితి పేరుస్తున్నారు చూడు. [[కృపి]] మొదలైన వారు ద్రోణుడికి అపసవ్యంగా ప్రదక్షిణ చేసి స్నానం చెయ్యడానికి వెళుతున్నారయ్యా !

==== గాంధారి అర్జున సాత్యకులను నిందించుట ====
కృష్ణా ! [[సాత్యకి]] అమానుషంగా తల నరికిన భూరిశ్రవసుడిని చూడు. అతడి శరీరాన్ని నక్కలు గద్దలు ఎలా పీక్కు తింటున్నాయో చూడు. ఆ భూరిశ్రవసుడి పక్కన అతడి తల్లి,
కుమారులు, భార్య ఎలా రోదిస్తున్నారో చూడు. కృష్ణా ! [[అర్జునుడు]] భూరిశ్రవసుడి భుజము నరికాడు. [[సాత్యకి]] తల నరికాడు. అయినా ! కృష్ణా ! మహావీరులైన [[అర్జునుడు]], [[సాత్యకి]] మీద ప్రేమతో ఇలా చేసి ఉంటాడంతావా ! సాధువు మంచి వాడు అయిన భూతిశ్రవసువును చంప్[ఇనందువలన అర్జునుడికి ఏమి ఒరిగింది కృష్ణా ! [[సాత్యకి]] సాధించినది ఏమిటి అపకీర్తి మూటకట్టుకోవడం తప్ప. కృష్ణా ! ఇదంతా నీ కళ్ళ ముందే జరిగింది. భూరిశ్రవసుడు సాత్యకితో యుద్ధం చేస్తున్నప్పుడు [[అర్జునుడు]] సిగ్గుమాలి అతడి చేయి నరకవచ్చునా ! అర్జునుడు చేసిన పని నీవు హర్షిస్తావా ! కృష్ణా ! " అని పరిపరి విధముల విలపించసాగింది గాంధారి.
==== గాంధారి శకునిని నిందించుట ====
[[కృష్ణుడు]] ఒక్క మాట కూడా మాటాడక కుండా [[గాంధారి]] ని అనుసరిస్తున్నాడు. ఇంతలో [[గాంధారి]]కి [[శకుని]] కళేబరం కనిపించింది. అది చూడగానే ఆమె ముఖం కోపంతో జేవురించింది. [[గాంధారి]] " కృష్ణా ! తన మేనల్లుడు నకులుని చేతిలో చచ్చిన నా తమ్ముడు [[శకుని]]ని చూసావా ! వీడొక మాయావి వీడి మాయలు నీ ముందు పని చేయ లేదు. నాడు మాయా జూదంలో [[ధర్మరాజు]] ను అడవులకు పంపాడు. ఇప్పుడు యుద్ధమనే జూదంలో తన ప్రాణాలు ఒడ్డి ఒడిపోయాడు. కురు పాండవులకు మధ్య శత్రుత్వానికి ముఖ్య కారకుడు ఇతడే కృష్ణా ! మేలు చేస్తున్నానని నమ్మించి నాకుమారుని నట్టేట ముంచాడు. వీడు మాత్రం బాగుపడింది ఏముంది. పుత్ర పౌత్రులతో నాశనం అయ్యాడు. అసలు నాకొడుకులకు బుద్ధి అనేది ఉంటే మాయావి అయిన వీడి మాటలు నమ్ముతారా ! అందుకు తగిన ఫలితం అనుభవించారు

==== గాంధారి మిగిలిన వారి కొరకు రోదించుట ====
కృష్ణా ! అదుగో కళింగ దేశాధిపతి, ఇదుగో మగధ దేశాధిపతి, ఇతడు కోసల దేశాధిపతి బృహద్బలుడు. తమ తమ రాజ్యాలలో సకల భోగములను అనుభవించిన వారు నేడు దిక్కులేకుండా పడి ఉన్నారు. వారి చుట్టూ చేరి వారి భార్యా బిడ్డలు ఎలా రోదిస్తున్నారో చూడవయ్యా ! ఇలాంటి రోదనలు ఎక్కడైనా విన్నామా కృష్ణా ! ఇరుగో కేకయ రాజులు.
ద్రోణాచార్యుని చేతిలో హతులైనట్లున్నారు. అడుగో పాంచాల రాజు [[ద్రుపదుడు]] తన సహాద్యాయి ద్రోణుడి చేతిలో హతుడైనాడు. చిత్రం చూసావా ! అతడి స్వేత చ్ఛత్రం ఇంకా అతడి మీద ఎండ పడకుండా నిలిచి ఉంది. అటు చూడవయ్యా !! కృష్ణా ! ఆ మహారాజుల భార్యలు కొడుకులూ వారికి దహనక్రియలు గావించి మైల స్నానాలు చేయడానికి వెళుతున్నారు. ఇంకా కొంత మంది మమకారం వీడక వారి తలలను ఒడిలో పెట్టుకుని రోదిస్తున్నారు. కృష్ణా ! ఇతడిని గుర్తు పట్టావా ! వీడే నీ మేనత్త కొడుకు శిశుపాలుని కుమారుడు దుష్టకేతువు. అతడి కుమారుడు సుకేతుడు. తాండ్రి కొడుకులిద్దరూ మరణించారయ్యా ! తండి కొడుకుల మరణానికి వారి భార్యలు తల్లులు బంధువులు ఎలా రోదిస్తున్నారో చూడవయ్యా ! కృష్ణా ! అవంతీ పాలకులు విందానువిందులను చూడు. పెను గాలికి కూలిన వృక్షములవలె ఎలా కూలి పోయారో చూడు. ఇదంతా చూస్తుంటే నాకు ఒక సందేహం కలుగుతుంది కృష్ణా !

==== గాంధారి కృష్ణుడిని నిందించి శపించుట ====
[[భీష్ముడు]], [[ద్రోణుడు]], [[కర్ణుడు]], [[అశ్వత్థామ]], భూరిశ్రవసువు, కృపుడు, [[సైంధవుడు]], [[కృతవర్మ]] నా కుమారుడు సుయోధనుడు వీరంతా అతిరధ మహారధులు. వీరందరితో యుద్ధం చేసి కూడా నువ్వు, నీ తమ్ముడు [[సాత్యకి]], పాండవులు నిరపాయంగా ఎలా బయట పడ్డారయ్యా ! మహాఆద్భుతంగా ఉంది కదూ ! నాకు నమ్మ బుద్ధి కావడం లేదు కృష్ణా ! . అపారమైన దైవ బలం ఉంటే కాని ఇది సాధ్యం కాదు. కాని ఆ దైవం కూడా దయమాలి నా నూరుగురు కుమారులకు అన్యాయం చేసిందంటే నా మనస్సు క్షోభిస్తుందయ్యా ! ఏమి చెయ్యగలను నా కుమారులందరిని పోగొట్టుకుని అనాధను అయ్యాను. ఈ ముదిమి వయస్సులో నాకు ఆసరాగా ఒక్క కొడుకుని కూడా మిగల్చలేదయ్యా ! ఆ [[భీముడు]]. [[భీముడు]] మాత్రం ఏమి చేస్తాడులే ! అంతా నేను నా కొడుకులు చేసుకున్న ప్రారబ్ధం. ఆ నాడు నువ్వు రాయబారానికి వచ్చినప్పుడు
విన్నట్లైతే ఇంత జరిగేదా ! నువ్వే కాదు [[భీష్ముడు]], [[విదురుడు]] కూడా ఎన్నో హితోక్తులు చెప్పారే ! నేను నా భర్త నాకుమారులు ఆమాటలు వినక పెడ చెవిన పెట్టి ఫలితం అనుభవిస్తున్నాము. కృష్ణా ! నాడు కురుసభలో నీవు పలికిన పలికులు నిజమైయ్యాయి. ఈ సర్వనాశనానికి నువ్వే కారకుడవు. ఊరకే హితవులు చెపుతూ కూర్చుని ఉండక
నువ్వు నా కుమారులు పాండవుల మీద అసూయతో చేస్తున్న అకృత్యములు ఆపే ప్రయత్నం ఎందుకు చేయ లేదు. నువ్వు తలచిన ఈ యుద్ధం ఆపలేక పోయే వాడివా !
నాడు కొలువులో ఎంత మంది పెద్దలు ఉన్నారు. మానవీయ వాక్చాతుర్యం కలిగిన వ్డవు ధర్మవేత్తవు నీవు ఉన్నావు. మీరందరూ కలసి ఈ ఘోరకలికి కారకులయ్యారు. కృష్ణా ! నీవు సుయోధనుడిని నాశనం చేయడానికి ఈ రాయబార నాటకం ఆడి ఎందరో రాజులను ఈ రణభూమికి బలి ఇచ్చావు. ఇందుకు ప్రతిగా అంతకు అంతా నువ్వు అనుభవిస్తావు కృష్ణా ! ఇదిగో ఇదే నీకు నా శాపం. నేను ణా జీవితాంతం సంపాదించుకున్న పాతివ్రత్య పుణ్యఫలాన్ని ఫణంగా పెట్టి పలుకుతున్నాను. నీవు ఎలాగైతే ఈ కురుక్షేత్ర సంగ్రామంలో దాయాదులను ఒకరి చేత ఒకరిని చంపించావో అలాగే నీ వారంతా తమలో తాము కలహించుకుని దారుణ మరణానికి గురి ఔతారు. నువ్వు కూడా సరిగ్గా నేటికి సరిగ్గా ఒక్క సంవత్సరం ముప్పై ఆరు దినములకు అతి కౄరంగా దిక్కు లేని చావు చస్తావు. నేడు నా వాళ్ళు ఎలా ఏడుస్తున్నారో నాడు నీ వాళ్ళు అలాగే భర్తలను, కుమారులను, బంధువులను పోగొట్టుకుని ఏడుస్తారు. ఇదే నా శాపం అనుభవించు " అని ఘోరంగా శపించింది [[గాంధారి]]. [[శ్రీకృష్ణుడు]] ఆ శాపాన్ని చిరునవ్వుతో స్వీకరించాడు.

==== గాంధారికి కృష్ణుడు సమాధానం చెప్పుట ====
అమ్మా ! గాంధారీ ! నీవు ఈ రోజు ఇచ్చిన శాపం నాకు కొత్త కాదు. అది ఇంతకు ముందు ఉన్నదే. ఇది వరలో యాదవులు మహా మునిని అవహేళన చేసిన కారణంగా
ఆ మహాముని ఇదే విదంగా శపించాడు. నీ నోట ఆమాటలే ఈ రోజు వెలువడ్డాయి. యాదవులకు ఎవరి చేతిలోనూ చావు లేదు. అందు వలన వారు వారిలో వారు కలహించుకుని మాత్రమే అంతమొందగలరు. నీ శాపం అందుకు ఉపకరిస్తుంది " అని పలికాడు [[శ్రీకృష్ణుడు]]. ఆ మాటలు విని పాండవులు కంపించి పోయారు. [[శ్రీకృష్ణుడు]]
లేకున్న తాము జీవించి ఉండడం వృధా అనుకుని తమ జీవితముల మీద ఆశలు వదులుకున్నారు. అప్పుడు [[శ్రీకృష్ణుడు]] [[గాంధారి]] ని చూసి " అమ్మా ! ఇక లే ! చని పోయిన వారికి దహనక్రియలు జరిపించాలి " అని పలికాడు. [[గాంధారి]] పైకి లేచింది ఆమెను పట్టుకుని [[శ్రీకృష్ణుడు]] నడిపిస్తూ " అమ్మా ! నీకుమారుడు సుయోధనుడు, దుశ్శాసనుడు చేసిన దుర్మార్గపు పనులు నీవు ఎరుగవా ! నీకుమారుడి దుష్కృత్యములు నేను కానీ, భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ , కడకు నీ భర్త ధృతరాష్ట్రుడు కాని మాన్పలేక పోయాము కదమ్మా ! వారి దుర్నయముల వలన కదమ్మా ! ఇంతటి చేటు దాపురించింది. అందుకు నన్ను నిందించి ప్రయోజనమేమిటి ! ఇక నైనా శోకం మాను. ఇలా శోకిస్తుంటే నీ శోకం రెండింతలు ఔతుంది. నీవు వీరమాతవు. మహా వీరులను పుత్రులుగా పొందావు. వారి మరణానికి శోకించ తగదు " అన్నాడు. ఈ మాటలకు [[గాంధారి]] చింతించడం మానుకుంది.

=== ధృతరాష్ట్ర ధర్మరాజులు ఉత్తర క్రియలు గురించి చర్చించుట ===
[[ధృతరాష్ట్రుడు]] [[ధర్మరాజు]] ను చూసి " కుమారా ! ఇరు పక్షముల లోని సైన్యముల లెక్క నీకు తెలుసు కదా ! ఇరి పక్షములలో సైన్యం ఎంత మంది మరణించారో చెప్పగలవా ! " అని అడిగాడు. [[ధర్మరాజు]] సమాధానంగా " తండ్రీ మన సైన్యంలో ఉత్తమ క్షత్రియులు 76 కోట్ల ఇరవై వేల మంది. మిగిలిన సైనికులు 24 వేల మంది యుద్ధంలో చని పోయారు. వీరందరూ యుద్ధంలో చనిపోయారు కనుక వీర స్వర్గం అలంకరించాడు. కాని కొంత మంది భయపడి పారి పోయారు. వారు గుహ్యక లోకానికి వెళతారు. కాని యుద్ధంలో ఏవిధంగా మరణించినా నరక లోకముకు వెళ్ళరు " అన్నాడు [[ధర్మరాజు]]. [[ధృతరాష్ట్రుడు]] " ధర్మజా ! యుద్ధంలో చనిపోయిన వారిలో అనాధలు అయిన వారు ఉన్నారు కదా ! వారికి అగ్ని కార్యం చెయ్యడంలో తప్పేమి లేదు కదా ! " అని అడిగాడు. [[ధర్మరాజు]] " మహారాజా ! ఈ యుద్ధమే ఒక మహా యజ్ఞం. ఈ మహా యజ్ఞంలో ఆహుతి అయిన వారందరూ అగ్ని కార్యముకు అర్హులే ! ఇక్కడ మరణించిన అనాధలకు అగ్ని కార్యం నెరవేర్చి ఉత్తమ గతులు ప్రాప్తించేలా చేద్దాము " అని పలికాడు.
==== యోధులకు దహన క్రియలు జరిపించుట ====
[[ధర్మరాజు]] వెంటనే [[విదురుడు]], [[సంజయుడు]], తన పురోహితుడు ధౌమ్యుడిని పిలిపించి భరత వంశ సంజాతకులకు తప్ప మిగిలిన వారికి దహనసంస్కారం చెయ్యమని చెప్పి అందుకు కావలసిన చందనము, అగరు, కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యములను తదితర సామగ్రిని కావలసిన మనుషులను అప్పగించాడు. తరువాత [[ధర్మరాజు]]
బ్రాహ్మణ సంఘాల తోడ్పాటుతో దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శల్య మొదలైన వారికీ అభిమన్య, ఘటోత్కచ, విరాట, దుష్టకేతు వంటి ప్రముఖులకు నానాదేశాధీశులకు చితులు పేర్పించి అగ్ని కార్యం నిర్వహించాడు. అనాధలుగా మిగిలిన రాజుల కళేబరములకు వేలకు వేలుగా ప్రోగులుగా పెట్టించి సామూహిక దహన క్రియ జరిపించాడు. అందుకు కావలసిన కట్టెలు దొరకక విరిగిన రధములు, బాణములు, ధనస్సు మొదలైనవి సేకరించి దహన క్రియ నిర్వహించాడు. తరువాత [[ధర్మరాజు]] [[ధృతరాష్ట్రుడు]] అంతఃపుర కాంతలతో కలిసి స్నానములు ఆచరించారు. కౌరవులందరికీ [[ధృతరాష్ట్రుడు]] తర్పణములు విడిచాడు.

=== కుంతీ దేవి కర్ణుడు తన కుమారుడని చెప్పుట ===
ఆ సమయంలో కుంతీ దేవి కన్నీటితో అందరూ వింటుండగా " అయ్యా ! అందరూ వినండి. కౌరవులకు పెట్టని కోటగా విరాజిల్లిన [[కర్ణుడు]] రాధేయుడిగా లోకానికి తెలిసి ప్రసిద్ధి చెందిన [[కర్ణుడు]] నిజంగా రాధేయుడు కాదు. [[కర్ణుడు]] నా కుమారుడు, కౌంతేయుడు మీకందరికి అగ్రజుడు. నేను కన్యగా ఉన్నప్పుడు మంత్ర ప్రభావం వలన భాస్కర ప్రభావంతో సహజ కవచ కుండల శోభితుడు [[కర్ణుడు]] జన్మించాడు. కనుక మీరు కర్ణుడికి తిలోదకాలు ఇవ్వండి " అని ధర్మరాజుతో చెప్పింది.
==== ధర్మరాజు కర్ణుడి మరణానికి విలపించుట ====
ఆ మాటలకు [[ధర్మరాజు]] వివశుడయ్యాడు.మిగిలిన వారు అమిత దుఃఖముకు లోనయ్యారు. [[ధర్మరాజు]] ఎలాగో మాట పెగల్చుకుని " అమ్మా ! [[కర్ణుడు]] నీకు జ్యేష్ట పుత్రుడు, మాకు అన్నగారు కొంగున నిప్పు కట్టుకున్న చందాన ఈ నిజం ఇంత కాలం ఎలా దాచావమ్మా ! ఈ లోకములో ఒక్క [[అర్జునుడు]] తప్ప కర్ణుడిని గెలువగలవారెవ్వరు. అమ్మా ! కర్ణుడిని తొలి చూలిగా ఎందుకు కన్నావమ్మా ! నీకు దుర్వాసుడు ఇచ్చిన శాపం మా పట్ల శాపంగా పరిణమించి మాకు అంతు లేని శోకాన్ని మిగిల్చింది కదమ్మా ! అమ్మా ! [[అభిమన్యుడు]] మరణించినప్పుడు కూడా ఇంత దు!హ్ఖం పొంద లేదమ్మా ! ద్రుపదుడి కుమారులు, ధృతరాష్ట్రుడి కుమారులు చని పోయినప్పుడు కూడా ఇంతటి వ్యధ చెంద లేదు కదమ్మా ! అమ్మా [[కర్ణుడు]] మా అన్న అని తెలిసిన ఈ యుద్ధం జరిగేది కాదు ఈ మారణ హోమం జరిగేది కాదు కదమ్మా ! "
అని పరి పరి విధముల వాపోయాడు [[ధర్మరాజు]]. వెంటనే [[ధర్మరాజు]] కర్ణుడి గోత్ర నామాలు చెప్పి తిలోదకాలు ఇచ్చాడు. తరువాత భీమ, అర్జున, నకుల, సహదేవులు కూడా తిలోదకాలతో తర్పణములు వదిలారు. [[కర్ణుడు]] కుంతీ కుమారుడు అని తెలియగానే పాండ, కౌరవ కాంతలలో హాహాకారాలు చెలరేగాయి. [[ధృతరాష్ట్రుడు]] కూడా [[గాంధారి]] తో చేరి కుంతీ దేవితో కలిసి ఉదక కర్మ చేయించాడు. వెంటనే [[ధర్మరాజు]] కర్ణుని పట్ల సోదర భావంతో కర్ణుడి భార్యలను అతడి బంధువులను పిలిపించి సముచిత రీతిని గౌరవించి ఓదార్చాడు. వారితో కర్ణుడికి ఉత్తమ లోక ప్రాప్తి కొరకు అనేక దానధర్మములు చేయించాడు. తరువాత బంధు, మిత్రులు అందరితోకలిసి [[ధర్మరాజు]] గంగా నదిని దాటి అక్కడ అనేక దానధర్మములు చేయించాడు.

=== వనరులు ===
{{మహాభారతం}}

19:08, 17 ఆగస్టు 2011 నాటి కూర్పు

ప్రధమాశాసం

వైశంపాయనుడు జనమేజయునకు చెప్పిన మహాభారతకధను సూతుడు శౌనకాది మహామునులకు చెప్పసాగాడు. మహాభారత కధను వింటున్న జనమేజయుడు వైశంపాయుడిని చూసి " మహాత్మా ! తన కుమారుడు సుయోధనుడు భీముని చేతిలో చనిపోయిన విషయం సంజయుడి ద్వారా తెలుసుకుని ధృతరాష్ట్రుడు ఏమి చేసాడు. హస్థినకు వెళ్ళిన రధిక త్రయం ఎవరిని కలుసుకున్నారు. తరువాత ఎక్కడకు వెళ్ళారు. అశ్వత్థామ వ్యాసాశరమానికి వెళ్ళిన పిదప కృపాచార్యుడు, కృతవర్మ ఎక్కడకు వెల్లారు. మహావిజయమును సాధించిన పిదప కుమారుల బంధువుల మరణాన్ని ధర్మరాజు ఎలా తట్టుకున్నాడు "అని ఆడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు.

కుమారుల మణానికి దుఃఖించిన దృతరాష్ట్రుడు

తన నూరుగురు కుమారులు యుద్ధములో మరణించారు అని తెలుసుకున్న ధృతరాష్ట్రుడు మొదలు నరికిన వృక్షంలాగా కూలి పోయాడు. భరించరాని దుఃఖంలో మునిగి పోయాడు. అతడి హృదయం కకావికలైంది. దుఃఖ భారంతో తనలో తానే కుమిలి పోతున్న సంజయుడు " ధృతరాష్ట్ర మహారాజా ! ఏమిటీ వెర్రి. ఎవరి కొరకు దుఃఖ పడుతున్నావు ? నీశోకానికి అంతు లేదా ! దుఃఖాన్ని వదిలి నేను చెప్పేది విను. కురుక్షేత్ర సంగ్రామంలో 18 అక్షౌహినుల సైన్యం మరణించారు. నీ తాతలు, తాండ్రులు, అన్నలు, తమ్ములు, బంధువులు, మిత్రులు, మిత్ర రాజులు, సామంత రాజులు నీ కోసం మరణించారు కదా ! వారికి దహన సంస్కారాలు చేయాలి కదా ! పద యుద్ధ భూమికి వెళదాము " అన్నాడు. కాని ధృతరాష్ట్రుడు కదల లేదు తల బాదుకుంటున్నాడు. " సంజయా ! నా కొడుకులంతా చచ్చారయ్యా ! నా వైభవమంతా నశించిందయ్యా !అతి దీనంగా బ్రతుకుతున్న నాకు ఈ దేహం ఎందుకు. ఒకరి దయాభిక్ష మీద ప్రతకడానికా ! నాదీ ఒక బ్రతుకేనా ! బ్రతికి నేను సాధించేది ఏముంది.

ధృతరాష్ట్రుడి పశ్చాత్తాపము

సంజయా ! కృష్ణుడు సంధి చేయడానికి వచ్చినప్పుడు నాకు ఎంతో నచ్చచెప్పాడు. భీష్ముడు, ద్రోణుడు నా హితవు కోరి చెప్పారు. పరశురాముడు లాంటి మహా మునులు ఎందరో బుద్ధిమతి చెప్పారు. నేను దుర్బుద్ధితో వారి మాటలు పెడచెవిన పెట్టాను. పాండవులకు రాజ్యభాగం ఇవ్వ నిరాకరించి ఫలితం అనుభవిస్తున్నాను. కొడుకులను పోగొట్టుకున్నాను. బంధి మిత్రులను పోగొట్టుకున్నాను. అందరూ మరణించారు. దహనక్రియలు చేయడానికి నేను మాత్రం బ్రతికి ఉన్నాను. సంజయా ! రాబోయే ఆపద తెలిసి కూడా పాండవులకు రాజ్యభాగం ఇవ్వ లేదు. కనుక నా అనే వారందరిని పోగొట్టుకున్నాను. సంజయా ! నేను ఇలా కావడానికి నా పూర్వజన్మ సుకృతం కాక వేరు కాదు. అయినా ధర్మరాజు ఉండగా దహనక్రియలు చేయడానికి నేను ఎందుకు ? నా కుమారులను చంపి తమ ప్రతిజ్ఞలు నెరవేర్చుకున్న పాండవులు ఈ పని కూడా చేస్తారులే "అన్నాడు.

ధృతరాష్ట్రుడికి సంజయుడి హితవు

అతడిని చూసి సంజయుడు " ధృతరాష్ట్ర మహారాజా ! నీకు తెలియని శాస్త్రాలు లేవు అన్నీ తెలిసిన నీవే ఇలా దుఃఖిస్తే లోకులు నవ్వరా ! ఇంతకు ముందు నీవు సృంజయుడి కధ విన్నావు కదా ! అభిమన్యుడి మరణానికి ధర్మరాజు దుఃఖిస్తుంటే నారదుడు ఈ కధ చెప్పాడు అది విని కూడా నీవు ఇలా దుఃఖిస్తున్నావా ! నీ మంచి కోరే మంత్రుల మాట విన లేదని అన్నావు కదా ! నీకూ, నీ కుమారుడికీ శకుని, దుశ్శాసనుడు, కర్ణుడు వీరే కదా మంత్రులు ! వీరే మీకు మంత్రులు అయితే ఇక వినాశనం కాక మిగిలేది మరేమిటి. నీ కొడుకు ఎదుటి వాడి మీద కత్తి దూసాడే కాని మంత్రాంగం మీద దృష్టి మరల్చాడా ! విదురుడు చెప్పింది వన్నాడా ! నీవు అతడికి బుద్ధి చెప్పి అతడిని కట్టడి చేసి అతడి అకృత్యాలను ఆపగలిగావా ! నీకూ నీ కుమారుడికీ లోభత్వం బాగా వంటబట్టి ఎవరి మాటా విన లేదు. కనుక నీ దు2హ్ఖం మాను. నీ పని ఎలా ఊందంటే చుట్టూ మంట పెట్టుకుని మద్యలో కూర్చుని అయ్యో కాలి పోతున్నాను అని గొంతెండి పోయేలా అరచినట్లు ఉంది. ఈ పరిస్థితిలో అందరూ నిన్ను నిందిస్తారే కాని జాలి చూపుతారా ! నీ కుమారుడి పరుష వాక్యాలకు అర్జునుడి కోపాగ్నికి వారంతా దగ్ధం అయ్యారు. ఇక విచారించడం ఎందుకు " అన్నాడు.

ధృతరాష్ట్రుడిని విదురుడు మందలించుట

ఇంతలో అక్కడకు విదురుడు వచ్చి ధృతరాష్ట్రుని చూసి " చేసింది చాలక ఇంకా నేల మీద పడి దొర్లి దొర్లి ఏడుస్తున్నావా ! ఏడిచింది చాలు కాని ఇక లే ! " అన్నాడు. విదురుడి మాటలకు ధృతరాష్ట్రుడు లేచి కూర్చున్నాడు. దుఃఖమును ఆపుకున్న ధృతరాష్ట్రుడిని చూసి విదురుడు " ధృతరాష్ట్ర మహారాజా ! పెరుగుట విరుగుట కొరకే కొత్త కొత్త రుచుల కొరకు అర్రులు చాస్తే ఉన్న రుచే పోతుంది పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు. ఎంత దగ్గరైతే అంత దూరం కావడమే ప్రకృతి సహజం. దీనిని తప్పుకొనుట ఎవరికైనా సాధ్యమా ! యమధర్మరాజు తన పాశముతో ప్రాణుల ప్రాణమును హరించునప్పుడు వీడు మంచి వాడా, చెడ్డ వాడా, ధనికుడా, పేద వాడా, వీరుడా పిరికి వాడా అని చూడడు ఎలాంటి వాడైనా చావు తప్పదు. యుద్ధం చేస్తేనే మనిషి చస్తాడా ! ఎక్కడ ఉన్నా చావును తప్పించుకో లేడు. కనుక చావును గురించి చచ్చిన వారి గురించి దుఃఖించడం దండగ. నీ కుమారులందరూ యుద్ధంలో మరణించి వీరస్వర్గం పొంది స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నారు. నువ్వు వారి కొరకు దుఃఖిస్తున్నావు. అయినా ! పండితుడవు జ్ఞానివి అయిన నీకు తెలియనిది ఏముంది. మనిషి పుట్టిన తరువాత బాల్యము, యవ్వనము, అందచందాలు, ఈ ప్రకృతి, అందున్న పదార్ధములు అన్నీ మిద్య, అశాశ్వితమైన స్థిరము కాని వాటి కొరకు దుఃఖించుట తగదు. తెలివి కలిగిన వారు దుఃఖించరు. దుఃఖం సర్వ అనర్ధములకు హేతువు. కాగల కార్యము మీద మనసు నిలుపు. మహారాజా ! మామూలు మనుషుల ఆలోచనా పరిధి చిన్నది. కనుక వారు చిన్న దు2హ్కమునకు ,కూడా తట్టుకోలేరు. తమకు ప్రియమైనది దూరమైనా కోల్పోయినా వారి జ్ఞానం నశించి దుఃఖిస్తారు. చెయ్యకూడని పనులు చేస్తారు. కాని జ్ఞానులకు పండితులకు ప్రియము అప్రియము ఉండదు. అన్నీ సమానంగా చూస్తారు.

ధృతరాష్ట్రుడు దుఃఖోపశమనం పొందుట

విదురుడి మాటలకు ధృతరాష్ట్రుడు దుఃఖోపశమనం పొంది " విదురా ! నీ మాటలు నా దుఃఖాన్ని ఉపశమింప చేసాయి. విదురా ! నీవు చెప్పినట్లు జ్ఞానులకు పండితులకు అప్రియములు ప్రియములు అనేవి లేకుండా అంతా సమానంగా చూస్తారని చెప్పావు కదా ! వారు అలా ఎలా ఉండగలరు " అని అడిగాడు. విదురుడు " ఓ ధృతరాష్ట్ర మహారాజా ! సంసారమనే వృక్షము అరటి చెట్టు వలె దుర్బలమైంది, నిస్సారమైనది. కాని మానవుడు ఈ సంసారం అందే అనురక్తుడై నిరంతర వ్యధకు గురి ఔతున్నాడు. ప్రస్థుతం మనకు లభించిన ఈ శరీరం పతమై మరొక శరీరం లభిస్తుంది అంతే కాని ఈ శరీరం శాస్వతం కాదు కదా ! అది తెలుసుకున్న వాడు నీ మాదిరి వ్యధ చెందడు. ఒక ఇంటి నుండి మరొక ఇంటికి పోయిన మాదిరి జీర్ణమైన ఒక వస్త్రమును వదిలి నూతనమైన వేరొక వస్త్రమును ధరించిన మాదిరి ఒక శరీరం వదిలి వేరొక శరారాన్ని ధరిస్తాడు. కుమ్మరి వాడు కుండను చేసే సమయంలో మద్యలోనే విరుగ వచ్చు, లేకున్న కుండగా తయారైన తరువాత విరుగవచ్చు, దానిని కాల్చే సమయాన విరిగి పోవచ్చు, వాడుకునే సమయాన కింద పడి విరిగి పోవచ్చు. కనుక ఈ మట్టి కుండ ఏ దశలో విరుగుతుందో చెప్ప లేము కదా ! మానవుడూ అంతే ! పురుషుడి తేజస్సు స్త్రీ అండముతో కలిసిన పిండోత్పత్తి జరుగుతుంది అది అండ దశలో విచ్ఛిత్తి కావచ్చు, ఆ పిండం శిశువుగా రూపుదిద్దుకునే సమయంలో కాని ప్రసవ సమయంలో కాని, శిశువుగా జన్మించిన తరువాత గాని, బాల్యంలో కాని, యవ్వనంలో కాని, వృద్ధాప్యంలోగాని ఎప్పుడైనా సంభవించ వచ్చు. కనుక ఈ శరీరం ఎప్పుడైనా మరణించ వచ్చు. కనుక మరణానంతరం మనం చేసే సుకృత, దుష్కృత ఫలితంగా స్వర్గ నరకములు ప్రాప్తిస్తాయి. కనుక మరణించిన వారి కొరకు దుఃఖించడం అవివేకం. వివేకం కల వారు ఈ సంసారం దుఃఖభూయిష్టం అని ఎరిగి దాని అందు చిక్కుకొనరు. కనుక నీవూ చచ్చిన పుత్రుల కొరకు విచారించక నీవు ముక్తి పొందే మార్గం ఆలోచించు " అని చెప్పాడు విదురుడు.

ధృతరాష్ట్రుడు దుఃఖం నివృత్తి గురించి తెలుసుకొనుట

విదురుడి మాటలకు ధృతరాష్ట్రుడు మరి కొంత శాంతించిన మనసుతో " విదురా ! అసలు సంసారంలో దుఃకం ఎందుకు ఉంటుంది. దానిని మనం ఎలా నివృత్తి చేసుకోవాలి " అని అడిగాడు. విదురుడు " మహారాజా ! పురుషుడి తేజస్సు స్త్రీ అండంతో కలిసిన పిండోత్పత్తి జరుగుతుంది అని నీకు ముందే చెప్పాను. క్రమ క్రమంగా అవయవ నిర్మాణం జరుగి శిశువుగా రూపుదిద్దుకుంటుంది. ఆశిశువులోనికి ప్రాణవాయువు ప్రవేశించి ఆ శిశువు గిర గిరా తిరుగుతూ బాధను అనుభవిస్తుంది. ఆ శిశువు వేదనను భరించ లేక గర్భ ముఖ ద్వారం చేరుకున్న సమయంలో ఆ శిశువును గ్రహములు భూతములు ఆవహిస్తాయి. ఆ తరువాత శిశువు జన్మించడానికి సిద్ధమై గర్భము నుండి బయటకు వస్తుంది. ఆశిశువు బాలుడిగా ఉన్నప్పుడు శుచి, అశుచి తెలియదు. వివేకము తెలియదు. ఆట పాటలతో తెలియక పొరబాటుగా అనేక దుష్టకార్యాలు చేస్తాడు. బాల్య చేష్టలతో బాల్యావస్థ దాటగానే యవ్వనంలోకి ప్రవేశిసించగానే కామపరమైన ఆసక్తి జనిస్తుంది. స్త్రీ సౌఖ్యం కొరకు పాకులాడుతాడు. ఆ సమయంలో అధికంగాడే ఇంద్రియ లోలత్వం వలన సుఖము, దుఃఖము అనుభవిస్తాడు. కోరికలతో వేగిపోతూ అనేక దుష్కార్యములు చేస్తాడు. బాల్యంలాగే యవ్వనమూ గడిచి పోతుంది. వృద్ధాప్యంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు శరీరంలోని బలము శక్తి ఉడిగి పోయి వ్యాధి పీడితుడు ఔతాడు. అయినా ఉచితానుచితాలు తెలియక అనువిత కార్యములను చేస్తాడు. వ్యాధి ప్రాబల్యంతో వయోభారంతో కృంగి కృశించి పోతాడు. అప్పుడు యముడు వచ్చి తన పాశముతో ప్రాణములను హరిస్తాడు. ఈ జీవుడు పోలేక పోలేక యాతన అనుభవిస్తాడు. అంతటితో ఈ జన్మ ముగుస్తుంది. కనుక ఈ లోకం నిరంతర దుఃఖ భూయిష్టమైంది అన్నది స్పష్టము. ఈ మానవులు కామ, క్రోధ, మదోన్మత్తులై లోభంతో అనేక దుష్కృత్యములు ఆచరిస్తారు. కాస్తంత సుఖం ఆశించి ఒకరి జీవితం ఒకరు నాశనం చేసుకుంటూ ఒకరిని ఒకరు చంపుకుంటూ అధర్మపరులౌతారు. చివరకు యమలోక ప్రాప్తిని పొందుతారు. వివేకం కలిగిన వారు పెద్దలను ఆశ్రయించి సన్మార్గమున పయనిస్తారు.

సంసారమును అధిగమించుట

విదురుడు తన మాటలను కొన సాగిస్తూ ధృతరాష్తృఅ మహారాజా ! నేను ఈ సంసారమును ఎలా అధిగమించాలో పెద్దల వలన విని యున్నాను అది నూకు వివరిస్తాను. శ్రద్ధగా విను. దుర్గమైన అడవిలో ఒక బ్రాహ్మణుడు వెళుతున్నాడు. అప్పుడు పులులు, సింహాలు, ఏనుగులు మొదలైన అడవి జంతువులు అతడిని వెన్నాంటాయి. ఆ బ్రాహ్మణుడు ప్రాణ భయంతో ఆడ్డదారిలో పరుగెడగా ఆ కౄర జంతువులు అతడిని వదిలి వెళ్ళి పోయాయి. ఇంతక్లో ఒక దొంగల గుంపు అతడిని అడ్డగించింది.ఆ బ్రాహ్మహ్మణుడు ప్రాణ భయంతో కాళ్ళు గజ గజ వణుకుతుండగా చలన రహితంగా నిలబడ్డాడు. చుట్టూ పరికించి చూసి తనను రక్షించడానికి ఎవరూ లేనందున వెనక్కి తిరిగి పారి పోసాగాడు. వెనుక నుండి దొంగలు ముందు నుండి కౄరజంతువులు ఎంత పరుగిడినా అడవికి అంతు దొరకడం లేదు. ఇంతలో భయంకరాకారంతో ఉన్న ఒకస్త్రీ అతడిని కౌగలించుకుంది. అతడిలో భయం ఇనుమడించింది. అయిదు తలలు కలిగిన ఏనుగులను చూసాడు. ఆస్త్రీని విడిపించుకుని పరుగెడుతూ లతలతో నిండి పకి కనిపించని బావిలో పడ్డాడు. పడుతూ పడుతూ బలమైన తీగను ఒక దానిని పట్టుకుని తల కిందులుగా వేలాడ సాగాడు. కిందికి చూడగా ఒక పెద్ద పాము నాలుకలు భయంరంగా చాస్తూ అతడి వైపు రాసాగింది. పైకి చూడగా 6 తలలు 12 కాళ్ళతో ఒక ఏనుగు బావి చెంత ఉన్న ఒక చెట్టు వద్దకు వచ్చింది. ఆ చెట్టు చిత్ర విచిత్ర రంగులతో వెలిగి పోతుంది. తుమ్మెదలు ఆ చెట్టులోని మకరందం తాగుతున్నాయి. కాని నల్లని తెల్లని ఎలుకలు ఆ చెట్టు మొదలును కొరుకుతున్నాయి. ఆ చెట్ల పూల నుండి బొట్టు బొట్టుగా మధువు ఆ బ్రాహ్మణుడి నోట్లో పడుతుంటే అతడు దానిని త్రాగి ఆనందిస్తున్నాడు. ఆ మధువు ఎంత త్రాగినా తృప్తి తీరక తాను ఉన్న దుస్థితిని మరచి ఆనందిస్తున్నాడు. ఈ విధంగా ఆ బ్రాహ్మణుడికి కింద ఉన్న పాము, పైన ఉన్న భయంకరాకార స్త్రీ, క్రూర మృగములు, ఎలుకలు కొకడంతో ఏనిముషమైనా పాడడానికి సిద్ధంగా ఉన్న చెట్టు, వేచి ఉన్న దొంగలు, ఝూంకారం చేస్తున్న తుమ్మెదలు వీటితో మనసు కకావికలు ఔతున్నా అతడికి జీవితం మీద వ్యామోహం పోలేదు. ప్రాణముల మీద తీపి చావ లేదు " అన్నాడు విదురుడు. ధృతరాష్ట్రుడు " విదురా ! ఈ కధ నాకు అర్ధం కాలేదు. వివరంగా చెప్పు " అన్నాడు.

సన్మార్గ బోధన

విదురుడు " మహారాజా ! ఈ ప్రపంచంలో పెద్దలు మనుషులకు సన్మార్గ బోధన చేయడానికి ఈ కధ చెప్తారు. ఈ కధ మన జీవితంలాంటిది. ఈ కధని వివరిస్తే కాని అర్ధంకాదు. ఆ బ్రాహ్మణుడు పనిస్తున్న అడవి సంసారం. అందు ఉన్న క్రూర మృగములు, దొంగలు, మృగముల కొరకు పన్ని ఉచ్చులు రోగములు, భయంకరాకారంతో పయనిస్తున్న స్త్రీ ముసలి తనము, అయిదు తలల ఏనుగు పంచేంద్రియాలు, బావిలో ఉన్న పాము యమధర్మరాజు, ఆ బ్రాహ్మణుడు పట్టుకున్న తీగ బ్రతకాలన్న ఆశ, ఆ ఒడ్డున ఉన్న చెట్టు ఆయుషు, దాని వైపు వచ్చిన ఏనుగు ఒక సంవత్సర కాలం దాని ఆరు తలలు ఆరు ఋతువులు, పన్నెండు కాళ్ళు పన్నెండు నెలలు. ఆచెట్టును కొరుకుతున్న నల్లని తెల్లని ఎలుకలు రాత్రి పగలు, ఆ బ్రాహ్మణుడి చుట్టూ ఝోంకారం చేస్తున్న తుమ్మెదలు కోరికలు. పూలనుండి స్రవిస్తున్న మకరందం సుఖ సంతోషాలు. తన చుట్టూ ఇన్ని బాధలు ఉన్నా జీవుడు ఆ సుఖసంతోషాల కొరకు పాకులాడుతుంటాడు. కలకాలం బ్రతకాలని అనుకుంటాడు. బ్రాహ్మణుడే జీవుడు. ఇదే సంసార చక్రం. వివేకవంతులైన వారు ఈ సంసార చక్రంలో బంధించ బడక వెలుపలి నుండి చూస్తూ శాశ్వితమైన ఆనందాన్ని పొందుతారు. .

విదురుని జ్ఞానబోధ

ఓ ధృతరాష్ట్ర మహారాజా  ! నిరంతరం ప్రాపంచిక సుఖాల కొరకు ప్రితపిస్తూ ఈ బురద గుంటలో మునుగుతూ తేలుతూ తనను తాను మరచి పోతాడు మానవుడు. శరీర బలం తగ్గగానే రోగాలు ఆవహిస్తాయి. ముసలితనం మీద పడి అందం అంతరించి దైన్యం ఆవహిస్తుంది. సుఖాలు అనుభవించడానికి పనికి రాక దిక్కులేని చావు చస్తాడు. మహారాజా ! ఈ దేహమే ఒక రధము. బుద్ధి రధ సారధి. పంచేంద్రియములే గుర్రములు. మన ఆలోచనలే పగ్గాలు. పంచేంద్రియాలు అనే గుర్రాలు అదుపు తప్పి ప్రవర్తించినప్పుడు బుద్ధి అనే పగ్గాలతో పఠిష్టంగా లేని ఎడల గుర్రాలు ఇచ్ఛ వచ్చిన రీతిలో ప్రవర్తిస్తాయి. కనుక బుద్ధిని ఉపయోగించి ఆలోచనలు అనే పగ్గాలతో వాటిని నియంత్రించిన మానవుడు దుఃఖభాజనుడు కాడు. పుట్టినప్పటి నుండి ఈ జీవితం యమధర్మరాజు ఆధీనంలో ఉంటుంది. ఈ జీవితం అనేక దుఃఖాలకు మూలము. వివేకవంతులు వివేకము అనే మందును ఉపయోగించి తమ దుఃఖాలను తొలగించుకుంటారు.వివేక వంతులు తమ బుద్ధిని ఉపయోగించి గుర్రములను అదుపులో పెట్టి రధమును సక్రమ మార్గమున నడిపించి ముక్తిని పొందుతారు. కనుక ధృతరాష్ట్ర మహారాజా ! నీకుమారుల మరణానికి దుఃఖించుట మాని నీ కుమారులు, బంధు మిత్రులకు ధన సంస్కారం జరిపించు " అని అన్నాడు విదురుడు.

వ్యాసుడి రాక

విదురుడి మాటలతో తిరిగి కుమారులు గుర్తుకు రాగా ధృతరాష్ట్రుడు ఏడుస్తూ మూర్చిల్లాడు. పరిచారికలు అతడి ముఖము మీద చల్లని నీళ్ళు చిలకరించి సేద తీర్చారు. ఇంతలో వ్యాసుడు అక్కడకు వచ్చాడు. అనుకోకుండా వచ్చిన వ్యాసుడికి విదురుడు, సంజయుడు నమస్కరించారు. మూర్ఛ నుండి తేరుకున్న ధృతరాష్ట్రుడికి వ్యాసుడి రాక ఎరిగించారు. ధృతరాష్ట్రుడు చేతులు వణుకుతుండగా వ్యాసుడికి నమస్కరించి " మహా మునీ ! చూసితివా ! నా దుర్గతి. నేను ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నానో తెలియడం లేదు. ఈ జన్మ ఎంత దుర్బరమో ఇప్పుడు తెలిసింది. నా దుస్థితి చూసారా ! కుమారులంతా మరణించారు బంధుమిత్రులు నశించారు. సంపదలంతా ఊడ్చుకు పోయింది. అయినా నా ప్రాణములు నన్ను అంటి పెట్టుకునే ఉన్నాయి. ఇది నా దౌర్భాగ్యం కాక మరేమిటి " అని దుఃఖించాడు. ధృతరాష్ట్రుడి దుఃఖం చూసి వ్యాసుడు " కుమారా ! నీ దుఃఖం పోగొట్టడానికే నేను వచ్చాను. సకల శాస్త్రములను తెలిసిన వాడివి, నీతి శాస్త్ర కోవిదుడివి చని పోయిన కుమారుల కొరకు దుఃఖించుట సమంజసం కాదు. పుట్టిన వాడు మరణించక తప్పదు. ఈ జీవితం ఎవరికి శాశ్వితం కాదన్న జ్ఞానం ఎరిగి దుఃఖం పోగొట్టుకుని నీ తరువాతి కర్తవ్యం నెరవేర్చు. కుమారా ! అసలు నీకుమారులకూ పాండు సుతులకు నీకు తెలియకనే వైరం సంభవించిందా ! కురువంశ నాశన కారకుడు నీ కుమారుడు కాదా ! ఇక నీవు దుఃఖించడం తగునా ! జూద క్రీడా సమయమున విదురుడు నీకు అనేక విధముల చెప్పినా నీవు వినక ఫలితం అనుభవిస్తున్నావు. ఇదంతా ఈశ్వర సంకల్పమే పోనీలే బాధపడకు దుఃఖం పోగొట్టుకో బాధ పడకు. నీకు మేలు కోరి నీకు ఒక దేవ రహస్యం చెప్తాను విను.

ధృతరాష్ట్రుడికి వ్యాసుడు దేవరహస్యం చెప్పుట

ఒకసారి నేను దేవసభకు వెళ్ళాను. అక్కడ ఇంద్రాది దేవతలు నారదాది మహా మునులు ఉండగా భూదేవి అక్కడకు వచ్చి దేవతలను చూసి ఇలా అన్నది " దేవతలారా ! ఇదివరకు మీరు నాకు పెరిగిన భూభారం తగ్గించడానికి ఉత్సుకత చూపారు. ఎందుకనో ఆ మాట మరిచారు. నాకు రోజు రోజుకు భారం పెరిగి పోతుంది. దీనిని తగ్గించే ఉపాయం ఆలోచించండి " అని అడిగింది. అప్పుడు శ్రీమహావిష్ణువు చిరు నవ్వుతో " భూదేవీ ! నీవడిగిన దానికి తగు సమయం ఆసన్నమైంది. ధృతరాష్ట్రుడు అనే మహారాజుకు నూరుగురు కుమారులు కలుగుతారు. అందులోని జ్యేష్టుడైన దుర్యోధనుడు నీ కోరికను తీరుస్తాడు. ఇది త్వరలో సంభవించగలదు. అతడి కారణంగా కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది. అతడికి ఈ భూమిలోని రాజులంతా సాయానికి వచ్చి నశించి పోతారు. సోదరసమేతంగా దుర్యోధనుడు మరణిస్తాడు. నీ భారం తగ్గ కలదు " అని పలికాడు. ఆ మాటలకు భూదేవి సంతసించి అక్కడ నుండి వెళ్ళి పోయింది. విష్ణువు ఆదేశానుసారం కలి పురుషుడు దుర్యోధనుడిగా జన్మించాడు. అతడు మహా బలిష్టుడు, కోపిష్టి పరుల ఉన్నతిని సహించ లేడు. అతడు ఎవరిని లక్ష్యపెట్టక అందరితో వైరము పెట్టుకుని అతడికి తోడుగా అతడి మేన మామ శకుని, తమ్ముడు దుశ్శాసనుడు, అంగరాజు కర్ణుడు అనుచరులుగా ఉంటారు. అనేక దుష్కర్మలు ఆచరించి వాటి కారణంగా సోదర, బంధు మిత్ర సమేతంగా నశిస్తాడు. ఇది దేవతల అభీష్టం కనుక నీవు దుఃఖించ పని లేదు.

వ్యాసుడు ధృతరాష్ట్రుడికి ధైర్యం చెప్పుట

కానీ నీ మనసులో ఒక సందేహం ఉంది. పాండు సుతులు నిన్ను ఆదరిస్తారో లేదో అని శంకిస్తున్నావు. పాండవుల వలన నీకు కీడు జరుగదు. నీ కుమారుడికి భూమిని అంతా పాలించాలని దుర్భుద్ధి పుట్టి పాండవుల రాజ్యమును అన్యాయంగా అపహరించి వారి రాజ్యాన్ని వారికి ఇవ్వక వారికి కీడు తలపెట్టినా వారు నీ ఎడల ఇంచుక అపకార బుద్ధిని ప్రదర్శించ లేదు. సంధి కొరకు ప్రయత్నించారు. నేను కూడా అనేక విధముల సంధి చేసుకొనుట మంచిదని నీకుమారునకు చెప్పాను నీకుమారుడు ఎవరి మాటలు లక్ష్య పెట్టక ఇప్పుడు ఫలితం అనుభవించాడు. ఇదంతా దైవ నిర్ణయం ఎవరూ తప్పించ లేరుకనుక కనుక నీ కుమారుల కొరకు నీవు చింతించపని లేదు. నీ తమ్ముని కుమారుడు ధర్మరాజు అజాత శత్రువు. అతడు సాటి మనుష్యుల అందే కాదు పశుపక్ష్య్దుల్సందు జాలి కలిగి ఉంటాడు. ఈ విషయము నీకూ తెలిసు. ధర్మరాజుకు నీ అందు విముఖత లేదు. కనుక పాడవులను నీ కుమారుల వలె ఆదరించు. మహాజ్ఞావివైన నీవు నీ శోకాగ్జ్ఞిని జ్ఞానాగ్నిలో దగ్ధం చెయ్యి. ప్రశాంతిని పొందు " అని పలికాడు వ్యాసుడు. ధృతరాష్ట్రుడు వ్యాసుడితో " మహానుభావా ! అమృతతుల్యమైన నీ మాటలు నాకు దుఃఖోపశమనం కలిగింది. నేను పాండవులను నా కుమారుల వలె ఆదరిస్తాను " అని పలికాడు. ఆమాటలు విని వ్యాసుడు ధృతరాష్ట్రుడిని ఆశీర్వదించి వెళ్ళాడు ధృతరాష్ట్రుడు సంజయుడిని చూసి " సంజయా ! మనం యుద్ధ భూమికి వెళదాము అందుకుయ్ కావలసిన సన్నాహములు కావించండి. గాంధారిని అంతఃపుర స్త్రీలను ప్రయాణముకు సిద్ధం కమ్మని చెప్పు " అన్నాడు. సంజయుడు ధృతరాష్ట్రాదులు యుద్ధ భూమికి పోవడానికి సన్నాహాలు పూర్తి చాసాడు.

ధృతరాష్ట్రుడు గాంధారి యుద్ధ భూమికి వెళ్ళుట

పుత్ర శోకంతో గాంఢారికి అడుగులు తడబడుతున్నాయి. గాంధారి కోడళ్ళు కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నారు. దుఃఖ భారంతో నడుస్తున్న వారు పైట తొలగినా జుట్టు విడివడినా పట్టించికునే స్థితిలో లేరు. కుంతీదేవి వారిని ఓదారుస్తుంది. అందరూ ఓదారుస్తున్నారు.హస్థినాపరంలో ఉన్న సాధారణ స్త్రీల పని అలాగే ఉంది. వారిని ఓదార్చే వారే క్కఏవయ్యారు. పురుషులంతా యుద్ధ భూమిలో మరణించగా భార్యా బిడ్డలు అనాధల వలె మిగిలారు. వాళ్ళలో వాళ్ళు ఒకరిని ఒకరు ఓదార్చుకుంటున్నారు. అ,ందరి ఇళ్ళు అర్తనాదాలతో నిండి పోయాయి. ఇదంతా చూసి విదురుడికి మనసు కలత చెందింది. యుద్ధ పరిణామం ఇంత భయంకరంగా ఉంటుందా ! ఎంత మందిని అని ఓదార్చగలడు. కొంత దూరం నడిచేసరికి రధికత్రయం ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి " మహారాజా ! నీ కుమారుడు సుయోధనుడు దేవతలు మెచ్చేలా యుద్ధం చేసి వీరమరణం చెందాడు. మేము ముగ్గురం తప్ప మిగిలిన కురు సైన్యమంతా మరణించింది " అన్నారు.

కృపాచార్యుడు భీమసుయోధన యుద్ధం వర్ణించుట

గాంధారిని చూసిన కృపాచార్యుడు దుఃఖం ఆగక " అమ్మా గాంధారీ ! నీ కుమారులు యుద్ధ భూమిలో వీరోచితంగా పోరాడి తమ ప్రాణాలు సమర్పించి వీరస్వర్గం అలంకరించారు. కనుక నీవు దుఃఖించకమ్మా ! నీ కొడుకుల్లో ఒక్కడూ యుద్ధ భూమిలో వెన్నిచ్చి పారి పోలేదు. యుద్ధముకు జంక లేదు. అమ్మా ! పాండవులకు జయించినా సంతోషం లేదు. భీముడు సుయోధనుడిని అధర్మంగా నాభి కింద భాగాన కొట్టి పడగొట్టింది చాలక తలను కాలితో తన్నాడు. అది విని మాకు కోపం ఆగ లేదు. మేము ముగ్గురం పాండవ శిబిరంలో ప్రవేశించి వారి కుమారులను, బంధువులను పాంచాల రాకుమారులను, వారి సైన్యమును గజమును హయములను దారుణంగా చంపాము. కనుక పాండవుల విజయం వ్యర్ధమైంది. ఆ సమయంలో పాండవులు శ్రీకృష్ణుడు సాత్యకి అక్కడ లేరు కనుక బ్రతికి పోయారు. లేకున్న అపాండవమై సుయోధనుడి ఆఖరి కోరిక నెరవేరేది. మేము అర్ధరాత్రి పాడవుల కుమారులను, బంధువులను ససైన్యంతో చంపిన విషయం తెలుసుకున్న పాండవులు క్రోధంతో మమ్ము వెతుకుతుంటారు. కనుక మాకు శలవిప్పించండి వెళతాము " అని శలవు తీసుకుని తమ తమ రధముల మీద వెళ్ళారు. కొంత దూరం పోయిన కృపాచార్యుడు వెనక్కు తిరిగి హస్థినకు వెళ్ళాడు. కృతవర్మ ద్వారకకు వెళ్ళాడు. అశ్వత్థామ గంగా తీరమున ఉన్న వ్యాసాశ్రమానికి వెళ్ళాడు. ఓ జనమేజయా మహారాజా ! వ్యాశ్రమంలో జరిగిన విషయం నీకు ముందే చెప్పాను కదా ! తరువాత ధృతరాష్ట్రుడు అంతః పుర స్త్రీలతో సహా యుద్ధభూమికి వెళ్ళాడు.

ధర్మరాజు ధృతరాష్ట్రుడికి ఎదురేగుట

ధృతరాష్ట్రుడు యుద్ధభూమికి వస్తున్నాడు అని తెలిసి ధర్మరాజు తన తమ్ములతోనూ కృష్ణుడితోనూ ధృతరాష్ట్రుడికి ఎదురేగాడు. కాని తన కుమారులను అంరదినీ పోగొట్టుకుని మనసంతా దహించుకు పోతున్న మనసుతో వస్తున్న ధృతరాష్ట్రుడిని చూడడానికి ధర్మరాజు మనసులో కలవర పడ్డాడు. ధర్మరాజు వడివడిగా ధృతరాష్ట్రుడికి ఎదురు వెళ్ళాడు. అతడి వెంట సాత్యకి, భీముడు, అర్జునుడు, నకులసహదేవులు, ద్రౌపది వెళ్ళారు.

కురుసామ్రాజ్య ప్రజలు ధర్మరాజును నిందించుట

ధర్మరాజును చూసి కౌరవ వనితలు హాహాకారాలు చేసారు. మరి కొంత మంది ధర్మరాజును తిట్ట సాగారు " ఇతడు ధర్మరాజట ! ఇతడికి ధర్మం తెలుసా ! ఇతడికి జాలి దయా ఉన్నాయా ! ఉంటే తాతలను, తమ్ములను, బంధువులను, మిత్రులను, గురువులను, కుమారులనూ చంపాడు. వీడికి కనికరమేమిటి ! " అని ఈసడించుకొనగా ! మరి కొంత మంది ధర్మరాజుకు వెళ్ళి " ఓ ధర్మరాజా ! చదువులు చెప్పిన గురువునే చంపడానికి నీకు మనసెలా ఒప్పింది " అని అడిగాడు. మరికొంత మంది " ఓయీ ధర్మరాజా ! చెల్లెలి భర్త అని చూడక జయధ్రధుడిని చంపించావే ! శ్మశానం లాగా మారిన ఈ రాజ్యం అంతా కట్టకట్టుకుని ఊరేగు " అన్నారు. ఎవరేమన్నా ! పాండవులు ఒక్క మాట కూడా మాట్లాడ లేదు. అయినా వారు తిట్టడం ఆప లేదు. ఇంకొంత మంది పాండవులకు అడ్డంగా వచ్చి " ఒయీ ! ధర్మరాజా ! నీ వలన కాదా ! అభిమన్యుడు మరణించింది, ద్రౌపది కొడుకులంతా వధించబడింది. నీ మరుదులందరినీ వధించినా నీ రక్త దాహం తీర లేదా ! " అన్నారు. అందరి తిట్లను భరిస్తూ ధర్మరాజు ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళాడు. పక్కన ఉన్న వారు ధర్మరాజు వచ్చాడని చెప్పగానే ధృతరాష్ట్రుడిలో కోపం ముంచుకు వచ్చి భోరున ఏడుస్తూ ధర్మరాజును కౌగలించుకున్నాడు.

ధృతరాష్ట్ర హృదయం

తరువాత ధృతరాష్ట్రుడికి పక్కన ఉన్న వారు వలన భార్జున, నకుల సహదేవులు కూడా వచ్చారని వినగానే భీముడు అన్న మాట ధృతరాష్ట్రుడిలో కోపాగ్నిని రగిల్చింది. అతడి ముఖం వికృతంగా మారింది దహించుకు పోతున్న హృదయంతో అతడిని కౌగలించుకోబోయాడు. ఏదో ప్రమాదం జరుగుతుందని ముందుగా ఊహించిన కృష్ణుడు తాను ముందే సిద్ధంగా ఉంచిన భీముని విగ్రహాన్ని అతడి ముందుకు తోసాడు. లోహ విగ్రహమే భీముడు అనుకుని ధృతరాష్ట్రుడు ఘాఢ కౌగిలిలో బంధించి దానిని ముక్కలు చేసాడు. ఆ ముక్కలు గుచ్చుకుని ధృతరాష్ట్రుడి శరీరానికి గాయాలు అయ్యాయి. ముఖం నుండి రక్తం స్రవించగా ! అతడు మూర్చిల్లాడు. తరువాత " నాకుమారులను చంపిన వాడిని చంపి నా పగ తీర్చుకున్నాను " అంటూ లేచాడు. అతడి ముఖంలో సంతోషం వెల్లి విరిసినా పక్కన ఉన్న వారు ఏదైనా అనుకుంటారన్న జంకుతో దుఃఖాన్ని అభినయిస్తూ భీముడి మరణానికి ఏడవసాగాడు. పక్కన ఉన్న శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి భుజం తట్టి ధృతరాష్ట్ర మహారాజా ! భీముడు జీవించే ఉన్నాడు. నీవు దుఃఖించ వలసిన అవసరం లేదు. భీముని మీద నీకు ఉన్న క్రోధం ముందుగా ఊహించి అతడికి బదులుగా భీముని వంటి విగ్రహాన్ని నీ ముందుంచాను. నీవు నలిపింది భీముని విగ్రహాన్నే కాని భీముడిని కాదు. ధృతరాష్ట్ర మహారాజా ! నీ బలణం ముందు ఈ భీముడెంత ధృతరాష్ట్ర మహారాజా ! ఈ మూడు లోకాలలో నీకు సాటి రాగల బలాఢ్యుడెవ్వడు ! కొడుకులు పోయారన్న దుఃకంతో భీముని చంపాలనుకున్నా భీముడికి నీ చేతిలో చావు లేదు కదా ! అయినా మహారాజా ! భీమ్కుడే కాదు పాండవులు అందరిని చంపినా నీ కుమారులు తిరిగి వస్తారా ! అనవసరంగా అపవాదు మూట కట్టుకోవడం తప్ప " అన్నాడు.

శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి దోషం ఎత్తి చూపుట

ధృతరాష్ట్రుడు సిగ్గుతో తలవంచుకున్నాడు.తనవంటికి అంటుకునా రక్తం గాయాల నుండి స్రవిస్తున్న రక్తం కడుక్కున్నాడు. తిరిగి కృష్ణుడు " ధృతరాష్ట్ర మహారాజా ! వేద వేదాంగ పారంగతుడవు ఎన్నో శాస్త్రములను పురాణములను విని వాటి సారం గ్రహించిన నీవు నీ తప్పు తెలుసుకోకుండా ఈతరులను నిందిస్తూ నీలో నీవే దుఃఖిస్తున్నావు. నాడు నేను, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, మహా మునులు నీకు పరి పరి విధముల చెప్పినా లక్ష్యపెట్టక కోరి యుద్ధం కొని తెచ్చుకుని ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నావు. స్వయంకృతాపరాధముకు చింతించిన ఫలమేమి ! భీమార్జునులను ఎదుర్కొని గెలువగల వీరులు ఈ ఉర్విలో ఉన్నారా ! అది నీవు ఎరుగవా ! నీ మనస్సును నీవు నియంత్రించ లేక పోయావు. నీకుమారుడి చెడునడతను అదుపులో పెట్టడం నీకు చేత కాలేదు. జూదంలో గెలిచామన్న నెపంతో నీవు పాండవ పత్ని నీ కోడలు అయిన ద్రౌపదిని కొప్పు పట్టి సభకు ఈడ్చి దుర్భాషలు ఆడి వలువలు ఊడదీస్తున్నప్పుడు వారిని మందలించి అదుపులో పెట్ట లేని అసమర్ధుడవయ్యావు. కాని భీముడు నాడు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటూ నీకుమారులను చంపినందుకు అతడిని నిందిస్తున్నావు. ఇది న్యాయమా ధర్మమా ! నీ కుమారుల అవినీతిని దుష్ప్రవర్తనను తలచుకొని నీ కోపాన్ని విడిచి పెట్టు " అని హితవు పలికాడు. ధృతరాష్ట్రుడు " కృష్ణా ! నీవు పలికినదంతా నిజమే. కాని కొడుకులను పోగొట్టుకున్న దుఃఖం భరించ లేక అనుచితంగా ప్రవర్తించినందుకు సిగ్గుపడుతున్నాను. నీ మాటలతో నాకు జ్ఞానోదయం అయింది. ఇక మీద పాండుకుమారులను నా కుమారులుగా భావిస్తాను " అని పలికి. తరువాత భీమార్జున నకుల సహదేవులను కౌగలించుకున్నాడు. తరువాత యుయుత్సుడు వచ్చాడని విని కనీసం ఒక్క కొడుకైనా మిగిలాడని అనుకుని సంతోషంగా యుయుత్సుడిని కౌగలించుకున్నాడు.

వ్యాసుడు గాంధారి శాపం నుండి రక్షించుట

ధృతరాష్ట్రుడు పాండవులతో " పాండుకుమారులారా ! మీ తల్లి గాంధారి వద్దకు వెళ్ళి ఆమెను ఓదార్చండి " అన్నాడు. ధర్మరాజాదులు తమ పెద తల్లి గాంధారి వద్దకు వెళ్ళారు. ఆమెకు నమస్కరించారు. కుమాఆరుల మరణానికి రగిలిపోతున్న మనసుతో గాంధారి ధర్మరాజును శపించడానికి ఉద్యుక్తురాలైంది. అంతలో అక్కడకు వచ్చిన వ్యాసుడికి పాండవులు నమస్కరించారు. గాంధారి మనస్సు తెలుసుకున్న వ్యాసుడు ఆమెను వారిస్తూ " అమ్మా గాంధారీ ! ధర్మరాజును శపించడం ధర్మం కాదు. ధర్మజుడి మీద కోపం మాని శాంతించు. నీకింత రజోగుణం ఎందుకు. సాత్వికంగా ఉండు. నీ కుమారుడు సుయోధనుడు యుద్ధానికి పోతూ నీ ఆశీర్వాదం కోరినప్పుడు నీవు ఏమని ఆశీర్వదించావో తెలుసా ! " ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడ ఉంటుంది " అన్నావు. అదేనిజమైంది. ఈ మహా సంగ్రామంలో ధర్మమూర్తులైన పాండవులకు విజయం లభించింది. నీ మాట ప్రకారం ధర్మం జయించినట్లే కదా ! అసూయుఅ వదిలి పాండవులలో ఉన్న ధర్మనిరతిని చూడు. నిదానిం,చి యోచించిన నీకే అర్ధం ఔతుంది. అమ్మా ! గాంధారి ! జరిగి పోయిన వషయం తలచి బాధపడిన ఫలితమేమి ! కనుక పాండవుల మీద కోపం మాను " అన్నాడు.

గాంధారి శాంతించుట

ఆ మాటలకు శాంతించిన గాంధారి " మహర్షీ ! నాకు పాండవుల మీద కోపము అసూయ ఎన్నటికీ లేదు. వాదికి ఎన్నడూ కీడు తపపెట్ట లేదు. కుమారులను పోప్గొట్టుకున్న దుఃఖంతో అలా అనుకున్నానే కాని పాండవులు కుంతి కి ఎంతో నాకూ అంతే నా కుమారుడి దుర్బుద్ధి దుర్మార్గులైన శకుని, కర్ణ, దుశ్శాసనుల దొర్బోధలు కురు వంశ నాశనానినికి కారణమయ్యాయి కాని వేరు లేదు. కాని భీముడు నామారుడిని కృష్ణుడి సమక్షంలో నాభి కింద కొట్టి పడగొట్టాడు. అది తల్లినైన నాకు క్షోభ కలిగించదా ! యుద్ధంలో చంపడం చావడం న్యాయమేకాని యుద్ధ నీతిని తప్పి చంపడం అధర్మం కాదా ! ద్రోహం కాదా ! " అని పలికింది. ఆ మాటలు విన్న భీముడు గడగడలాడుతూ భీముడి వద్దకు వచ్చి ఇలా అన్నాడు " అమ్మా గంధారీ దేవీ ! నేను చేసింది ధర్మమో అధర్మమో ప్రాణభయంతో అలా చేసానో జరిగి పోయింది. దయచేసి నన్ను క్షమించమ్మా ! నా కంటే బలవంతుడు యుద్ధంలో నేర్పరి అతడిని ఓడించడం నాకు వీలైనది కానందున అలా చేసాను. అయినా నీకు తెలియనిది ఏమున్నది. నీకుమారుడు ధమరాజుకు చేసినదంతా ధర్మమా ! ఏక వస్రగా ఉన్న ద్రౌపదిని సభకు ఈడ్పించి వలువలు ఊడదీయమిని చెప్పడం ధర్మమా ! తల్లితో సమానమైన వదినకు తొడలు చూపి కూర్చోమని సైగ చేయడం ధర్మమా ! ఆ సమయంలో ఆగ్రహించిన నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి నీ కుమారుని తొడలు విరిచాను. చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకొనుట క్షత్రియ ధర్మమం కాదా ! నేను క్షత్రుయుడను కనుక నేను చేసిజ్ఞ ప్రతిజ్ఞ నెరవేర్చి నా ధర్మం నెరవేర్చుకున్నాను. నాడు కురుసభలోనే ఆ పని చేసి ఉంటే బాగుండేది. కాని ధర్మరాజు నన్ను ఆపాడు కనుక ఊరక ఉన్నాను. అన్న మాట మీర లేక అడవులకు వెళ్ళి అష్టకష్టాలు పడ్డాము. మా అన్నయ్య ధర్మరాజు శ్రీకృష్ణుడిని కురుసభకు రాయబారానికి పంపే సమయాన నా పులుకులు విని ఉంటే నువ్వు నన్ను తప్పు పట్టి ఉండే దానివి కాదు. నేను " సుయోధనా ! అన్నదమ్ములమైన మనకు వైరము తగదు. నలుగురు వేలెత్తి చూపేలా నడుచుకోవడం తగదు మా రాజ్యభాగం మాకిచ్చిన అందరం సుఖంగా ఉంటాము " అన్నాను. నీ కుమారుడు ఆ మాట విని ఉంటే ఇలా జరిగి ఉండేదా ! ఎవరి మాటను లక్ష్యపెట్టక మాతో యుద్ధం కొని తెచ్చుకున్నాడు. పోగొట్టుకున్న రాజ్యం కొరకు ధర్మరాజు, చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకొనుటకు నేను యుద్ధం చేసాము. మా కర్తవ్యం మేము నిర్వహించాము. సర్వం తెలిసిన నీవే ఏది ధర్మమో నిర్ణయించు " అన్నాడు.

గాంధారి దుశ్శాసనుడి మరణం గురించి భీముని ప్రశ్నించుట

గాంధారి కొంత సేపు ఆలోచించింది " భీమసేనా ! నీవు చెప్పినది నిజమే అయినా నా కుమారుని తోడలు విరుచుట ధమమా ! నీ ప్రతిజ్ఞ నీవు నెరవేర్చుకున్నావులే ! కాని భీమసేనా ! యుద్ధంలో శత్రువులను చంపవచ్చు కాని సాటి మానవుని గుండెలు చీల్చి రక్తం తాగే క్రూరులు ఎక్కడైనా ఉంటారా ! రాక్షసులు మాత్రమే చూయగలిగిన ఆపని నువ్వు చేసి వృకోదరుడనే నీ పేరు సార్ధకం చేసుకున్నావా ! ఇది ధర్మమా ! " అని అడిగింది. భీముడు " సాటి మానవుడి నెత్తురు తాగడానికి నేను అంతటి క్రూరుడనా ! నాడు ద్రౌపది కొప్పు పట్టి ఈడ్చినప్పుడు నేను చేసిన ప్రతిజ్ఞ చేసుకోవడానికి నేను అలా చేసాను. కాని నెత్తురు నోటికి తాగించానే కాని తాగలేదమ్మా ! అలా చేయడానికి నేను రాక్షసుడనా ! అమ్మా ! ఇంకొక విషయం నేను దుశ్శాసనుడిని చంపినప్పుడు కురు వీరులు నన్ను చుట్టుముట్టి ఉన్నారు. స్వీయరక్షణ కొరకు అలా భీకరాకారందాల్చాను కాని నేను అంతటి క్రూరుడను కాదమ్మా ! ఆ సమయంలో నేను అలా చేయకుంటే కురు వీరులు నన్ను ముక్కలు చేసి ఉండే వాళ్ళు. సాటి మనుషుల రక్తంతాగి వెర్రివాడిలా కరుణ లేకుండా తీగి పాతకం చేసేంత దుర్మార్గుడినా ! నేను అంత పాపాత్ముడను కాను నన్ను నమ్ము అమ్మా నేను రక్తం తాగ లేదు " అన్నాడు.

గాంధారి ఆగ్రహం

గాంధారి అంతటితో ఊరుకోలేదు " భీమసేనా ! నాకు నూరుగురు కొడుకులు ఈ గుడ్డి వాళ్ళను కడతేర్చడానికి ఒక్క కొడుకునైనా మిగల్చకుండా అందరినీ దయాదాక్షిణ్యం లేకుండా చంపావే ! ఇది ధర్మమా ! నూరుగురు కుమారులలో నీకు అపకారం చెయ్యని వాడు ఒక్కడైనా నీకు కనిపించ లేదా ! ఒక్క కుమారుడిని మిగిల్చిన నీ ప్రతిజ్ఞ నెరవేరదా ! నీ అన్న ధర్మరాజు రాజ్యం చేయడానికి నా కుమారుడు అడ్డు వస్తాడని అలాచేసావా ! " అని పక్కకు తిరిగి " ఎక్కడ ఆ మహారాజు ధర్మరాజు " అని కోపంగా అరిచింది. ఆ అరుపుకు ధర్మరాజు గడగడ లాడుతూ " అమ్మా ! ఇక్కడ ఉన్నానమ్మా ! నేనమ్మా ! పాండవాగ్రజుడను ధర్మరాజును. నీ నూరుగురు కుమారులను చంపిన క్రూరుడను, పాపాత్ముడను నన్ను క్షమించకమ్మా ! నీ ఇష్టం వచ్చినట్లు దూషించి నీ శాపాజ్ఞిలో నన్ను ధగ్ధం చెయ్యి. అమ్మా నీ నూరుగురు కుమారులనే కాదు ఈ భూమండలం లోని రాజులందరిని యుద్ధ భూమికి బలి ఇచ్చిన పాపాత్ముడికి నీవు ఏ శిక్ష చినా భరిస్తాను అనుభవిస్తాను. బంధు మిత్రులను అందరినీ పోగొట్టుకున్న నాకు ఈ రాజ్యమేల ఈ శరీరంలో ప్రాణం ఎందుకు ! నా లాంటి ద్రోహికి స్వర్గ సుఖాలు ఎందుకు " అని భోరున ఏడ్చాడు. ధర్మరాజు మాటలకు గాంధారికి నోట మాట రాలేదు. ఒక్క నిట్టూర్పు విడిచి కిందకు చూసింది. ఆమె కంటికి కట్టుకున్న బట్ట కిందకు జరిగి ఆమె చూపు ధర్మరాజు కాలి మీద పడి అతడి కాలి గోళ్ళు ఎర్రగా అయ్యాయి. అది చూసి భీమార్జునులు పక్కకు తప్పుకున్నారు. అంతలో గాంధారి శాంతించి ధర్మరాజు తల నిమిరి " నాయనలారా ! మీ అమ్మ కుంతీ దేవిని కలిసి ఆమె దీవెనలు పొందండి " అన్నది. హమ్మయ్య ని పాండవులు నిట్టూర్చి తల్లి కుంతీ దేవి దగ్గరకు వెళ్ళారు.

పాండవులు కుంతీ దేవిని చూచుట

చాలా కాలం తరువాత పాండవులను చూసి కుంతీ దేవికి దుఃఖము ఆనందమూ కలగలుపుగా స్పందించింది. పాండవులు తాము అరణ్యవాసంలో పడిన బాధలు కుంతీదేవికి చెప్పుకున్నారు. అది విని కుంతీదేవి తల్లడిల్లింది. జరిగిన యుద్ధంలో తన మనుమలు మరణించినందుకు చాలా దుఃఖించింది. తనకు నమస్కరిస్తున్న పాడవులను చూసి వారి తలలు నిమిరి భోరుమంది. " పాండు కుమారులార ఇన్ని రోజులకు మీకు అమ్మ గుర్తుకు వచ్చిందా ! అని వారి శరీరాలు తడిమి కుమిలి పోయింది. పక్కనే శోక మూర్తిలా ఉన్న ద్రౌపదిని చూసి " అమ్మా ! ఏరమ్మా నా మనుమలు ! అభిమన్యుడు ఎక్కడమ్మా ! ఎక్కడికి వెళ్ళారమ్మా ! నన్ను చూడడానికి ఎందుకు రాలేదు " అని అడిగుతూ పేరు పేరు వరుసనా పిలిచింది.

గాంధారి ద్రౌపదిని ఓదార్చుట

ఆ మాటలకు ద్రౌపది దుఃఖ భారం తాళ లేక మొదలు నరికిన చెట్టులా కుప్ప కూలింది. కుంతీదేవి కోడలిని పొదివి పట్టుకుని భోరుమంది. కొంత సేపటికి తేరుకుని ద్రౌపదిని ఓదార్చి గాంధారి వద్దకు తీసుకు వెళ్ళింది. గాంధారి ద్రౌపదిని ఓదారుస్తూ " అమ్మా ! ద్రౌపదీ ! ఊరుకోమ్మా. పాండవులకు మాత్రం కొడుకులను పోగొట్టుకున్న బాధ లేదా ! మీ అత్త కుంతీ దేవికి మాత్రం మనుమలను పోగొట్టుకున్న దుఃఖం లేదా ! అమ్మా ద్రౌపదీ ! నీవు నేను ఒకే మాదిరి శోకం అనుభవిస్తున్నాము. నీకూ కొడుకులు పోయారు. నాకూ కొడుకులు పోయారు.ఇలా జరుగుతుందనే విదురుడు కురు సభలో ఎంతగానో చెప్పి చూసాడు. నే ఏమాత్రం నా కుమారుల దుశ్చర్యలు ఆప లేక పోయాను కనుకనే ఫలితం అనుభవిస్తూ ఉన్నాను. అయినా అంతా విధి విలాసం కాల మహిమ ఊరుకోమ్మా ! " అని ద్రౌపది ఓదార్చింది.