కె. చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు
Maheshbandaru (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Maheshbandaru (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 32: | పంక్తి 32: | ||
# తల్లీ కూతుళ్లు (1971) |
# తల్లీ కూతుళ్లు (1971) |
||
# జ్యోతిలక్ష్మి (1973) |
# జ్యోతిలక్ష్మి (1973) |
||
# [[శారద |
# [[శారద(1973 సినిమా)]] |
||
# ఇదాలోకం (1973) |
# ఇదాలోకం (1973) |
||
# హారతి (1974) |
# హారతి (1974) |
16:16, 25 ఏప్రిల్ 2012 నాటి కూర్పు
చక్రవర్తి | |
జన్మ నామం | కొమ్మినేని అప్పారావు |
జననం | పొన్నెకల్లు గ్రామము తాడికొండ మండలం గుంటూరు జిల్లా | 1936 సెప్టెంబరు 8
మరణం | 2002 ఫిబ్రవరి 3 | (వయసు 65)
క్రియాశీలక సంవత్సరాలు | 1936–2002 |
చక్రవర్తి గుంటూరు జిల్లా , తాడికొండ మండలం, పొన్నెకల్లు వాస్తవ్యుడు . ఆయన అసలు పేరు కొమ్మినేని అప్పారావు. ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు.చక్రవర్తి తెలుగు చలన చిత్ర రంగములో ప్రముఖ స్వరకర్త. ఆయన 1971 నుంచి 1989 వరకు తెలుగు చలన చిత్ర రంగములో మకుటంలేని మహారాజుగా వెలిగారు. 1936 సెప్టెంబరు 3వ తేదీన జన్మించాడు. ప్రాథమిక విద్య పొన్నెకల్లు. గుంటూరు హిందూ కాలేజిలో డిగ్రీ. ఆయన మేనమామ కుమార్తె అయిన రోహిణి దేవిని వివాహం చేసుకొని 1958లో కుటుంబంతో మద్రాసు చేరాడు.
ఆయన గురించి
చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు. అతని తమ్ముడే దర్శకుడిగా రాణించిన కొమ్మినేని శేషగిరిరావు. అప్పారావుది గుంటూరు జిల్లా, పొన్నెకల్లు గ్రామం. ఆయన తల్లిదండ్రులు సంగీతజ్ఞానం కలవారు. ఆ కారణంగా ఆయనకి సంగీతంపై ఆసక్తి కలిగింది. అతని ఉత్సాహంచూసి తండ్రిగారు గుంటూరులో ఉన్న మహావాది వెంకటప్పయ్య శాస్త్రి దగ్గర సంగీతం నేర్పించారు. ఒక పక్క చదువు, మరో పక్క సంగీతాభ్యాసం నిరాటంకంగానే సాగాయి. ఆయన ఉత్సాహం పట్టలేక వినోద్ ఆర్కెస్ట్రా అనే బృందాన్ని ఏర్పాటు చేసి పాటలు, పద్యాలు పాడుతూ ప్రదర్శనలు ఇచ్చేవారు. విజయవాడ ఆల్ ఇండియా రేడియో లో 1954-58ల మధ్య కె.అప్పారావు కంఠం పాటలతో ప్రతిధ్వనించేది. నాటి శ్రోతలకి అతని కంఠం బాగా పరిచయం. 1958లో బి.ఏ.లో డిగ్రీ తీసుకున్నా, హిందీ పరీక్షలో విశారదుడైనా ఉన్న ఉత్సాహం సంగీతాన్ని ఎన్నుకున్నాడు, నమ్ముకున్నాడు కానీ ఉద్యోగ ప్రయత్నం మాత్రం చేయలేదు.
నేపథ్య గాయకునిగా, గాత్రదాన కళాకారునిగా
అప్పారావు మద్రాసు వచ్చి హెచ్.ఎమ్.వి. వారికి గ్రామఫోను పాటలు పాడటం మొదలుపెట్టాడు. ఒక రికార్డింగులో సంగీతదర్శకులు రాజన్, నాగేంద్రలు అవకాశం ఇప్పించి పాడించారు. బి.విఠలాచార్య ఆపారావుకి తన సినిమా జయ విజయ (1959)లో ఆడాలి ... పెళ్ళాడాలి అనేపాటను పాడించారు, ఆ పాటను చిత్రంలో హాస్యనటుడు బాలకృష్ణ పాడతాడు. ఇదే అప్పారావు సినిమాలలో పాడిన మొదటి పాట. ఆ కాలంలో అనువాద చిత్రాలు ఎక్కువగా ఉండేవి, అందులో అప్పారావుకి అవాకాశాలు వచ్చాయి, నాటకాలలో అనుభవం ఉండడం చేత ఆయన సంభాషణలను బాగా చెప్పగలిగారు.ఈ విధంగా అప్పారావు పాటలు పాడడంతో పాటు అనువాద చిత్రాలలో పాత్రలకు గాత్రం అందించటం మొదలుపెట్టాడు. అతని కంఠం, చెప్పే విధానం బాగా ఉండడంతో హీరో పాత్రలకు గాత్రదానం చేసే స్థాయికి ఎదిగాడు. ఆయన ఎం.జి.రామచంద్రన్, జయశంకర్, జెమిని గణేశన్ లకు గాత్రం అందించాడు. హాస్యనటులైన నగేష్, కులదైవం రాజగోపాల్ లకూ ఆయన గాత్రదానం చేసారు. ముఖ్యంగా ఆయన నగేష్కు బాగా డబ్బింగు చెప్పేవారు. అప్పారావు సినిమాలలో 200లకు పైగా పాటలు పాడాడు. కొన్ని కలిసి పాడినవి ఐతే, కొన్ని యుగళ గీతాలు. పరమానందయ్య శిష్యుల కథ (1966)లో ఘంటసాలతో పరమగురుడు చెప్పినవాడు పెద్దమనిషి కాడురా అనే పాటను పాడారు. బంగారు సంకెళ్ళు (1968)లో రాజబాబుకి తొలగండెహే అనే తాగుడు పాటని పాడారు. నిలువు దోపిడి (1968)లో ఎన్.టి.రామారావుకి ఒక పద్యం చదివినప్పుడు, నాగార్జున పద్యాలు, శ్లోకాలు చదివినప్పుడు అందరూ మెచ్చుకున్నారు.
సంగీత దర్శకునిగా
ఫలోమా అనే మలయాళ చిత్రం హిందీ దబ్బింగుకి వచ్చింది, దానికి అప్పారావుని సంగీత దర్శకునిగా తీసుకున్నారు. టైటిల్స్లో అన్నీ హిందీ పేర్లే ఉన్నాయి, వాటి మధ్య అప్పారావు అనే తెలుగు పేరు ఎందుకని సినిమావారు ఆయనకు చెప్పి చక్రవర్తిగా వేశారు. మూగ ప్రేమ (1970) చిత్రంకి ఆయన సంగీత దర్శ్కత్వం వహించారు, అందులోనూ చక్రవర్తి పేరు ఖాయమైంది. ఈ విధంగా అప్పారావు చక్రవర్తిగా మారాడు. మూగ ప్రేమలో పాటలు బాగున్నాయి అని పేరు వచ్చిన తరువాత, భలే గూఢచారి (1970), తల్లీ కూతురు (1971)లకు సంగీత దర్శకత్వం వహించారు. మూగ ప్రేమలో ఈ సంజెలో..., నాగులేటి వాగులోన... పాటలు పేరు తెచ్చినట్లు, తల్లీ కూతురు పాటలు కూడా పేరు తెచ్చాయి. అయినా అతను అంతగా పేరు తెచ్చుకోలేదు. కొంత కాలం ప్రయత్నాలు అటూ-ఇటూ సాగాయి. వీటి మధ్య దర్శకుడు సి.ఎస్.రావు దగ్గర సహాయ దర్శకుడిగా చేరి నిలువు దోపిడి, మళ్ళీపెళ్ళి, కంచుకోట, పెత్తందార్లు సినిమాలకు పనిచేశాడు. మధ్య మధ్యలో తనకి ఇష్టమై శాఖ సంగీతాన్ని విడిచి పెట కుండా పాటలూ పాడేవాడు. శారద చిత్రంతో సినీ రంగంలో స్థిరపడ్డారు. అక్కినేని నాగేశ్వరరావుతో ప్రేమాభిషేకం, ఎన్.టి.రామారావుతో కొండవీటి సింహం వంటి విజయవంతమైన చిత్రాలకు సంగీత దర్శకులుగా వ్యవహరించి 850 తెలుగు చిత్రాలకు సంగీతాన్ని అందిచారు. చక్రవర్తి కొన్ని చిత్రాలలో కూడా నటించారు.చివరిసారిగా నిన్నే ప్రేమిస్తా చిత్రంలో సౌందర్య నాన్నగారిగా నటించారు.
సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు
- మూగ ప్రేమ (1971)
- తల్లీ కూతుళ్లు (1971)
- జ్యోతిలక్ష్మి (1973)
- శారద(1973 సినిమా)
- ఇదాలోకం (1973)
- హారతి (1974)
- అనగనగా ఒక తండ్రి (1974)
- సత్యానికి సంకెళ్లు (1974)
- తిరుపతి (1974)
- ఆడంబరాలు అనుబంధాలు (1974)
- దీర్ఘ సుమంగళి (1974)
- ఊర్వశి (1974)
- ఇంటి కోడలు (1974)
- అభిమానవతి (1975)
- బాబు (1975)
- భారతి ( ఎస్పి కోదండపాణితో) (1975)
- చీకటి వెలుగులు (1975)
- అన్నదమ్ముల అనుబంధం (1975)
- బలిపీఠం (1975)
- జేబుదొంగ (1975)
- తీర్పు (1975)
- యవ్వనం కాటేసింది (1976)
- ఇద్దరూ యిద్దరే (1976)
- నా పేరే భగవాన్ (1976)
- జ్యోతి (1976)
- పొరుగింటి పుల్లకూర (1976)
- రాజా (1976)
- ముగ్గురు మూర్ఖులు (1976)
- గంగా యమున సరస్వతి (1977)
- జీవితంలో వసంతం (1977)
- జీవనతీరాలు (1977)
- కల్పన (1977)
- ఖైదీ కాళిదాసు (1977)
- మా ఇద్దరి కథ (1977)
- రంభ ఊర్వశి మేనక (1977)
- ఆమె కథ (1977)
- యమగోల (1977)
- చరిత్రహీనులు (1977)
- దేవతలారా దీవించండి (1977)
- ఈ తరం మనిషి (1977)
- అడవిరాముడు (1977)
- ఇంద్రధనస్సు (1978)
- ముగ్గురూ ముగ్గురే (1978)
- విచిత్ర జీవితం (1978)
- బొమ్మరిల్లు (1978)
- అల్లరి బుల్లోడు (1978)
- అతనికంటే ఘనుడు (1978)
- మల్లెపూవు (1978)
- రాముడు రంగడు (1978)
- సింహగర్జన (1978)
మరణం
అమ్మోరు చిత్రానికి చివరి సారిగా సంగీతాన్ని అందించిన చక్రవర్తి 2002 ఫిబ్రవరి 3న కన్నుమూశారు. ఆయన శిష్యుడు ఏ.ఆర్.రెహమాన్ ఆస్కార్ అవార్డు పొందాడు. చక్రవర్తి రెండవ కుమారుడు అయిన శ్రీ సినీ సంగీత రంగంలో పనిచేస్తున్నాడు.