ఆంధ్ర క్షత్రియుల శిలాశాసనాలు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{తెలుగు శాసనాలు}} |
|||
==శిలాశాసనాలు== |
==శిలాశాసనాలు== |
||
*No. 1. (A. R. No. 581 of 1925): గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా వేల్పూరు లో ఉన్న రామలింగస్వామి గుడి ఆవరణలో శిధిలావస్థలో ఉన్న ఒక పాలరాతి స్థంభం మీద విష్ణుకుండినులకు చెందిన రాజు మాధవ వర్మ మరియు ఒక కుటుంబ పేరు కనిపించినవి. |
*No. 1. (A. R. No. 581 of 1925): గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా వేల్పూరు లో ఉన్న రామలింగస్వామి గుడి ఆవరణలో శిధిలావస్థలో ఉన్న ఒక పాలరాతి స్థంభం మీద విష్ణుకుండినులకు చెందిన రాజు మాధవ వర్మ మరియు ఒక కుటుంబ పేరు కనిపించినవి. |
07:48, 4 జూన్ 2012 నాటి కూర్పు
శిలాశాసనాలు
- No. 1. (A. R. No. 581 of 1925): గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా వేల్పూరు లో ఉన్న రామలింగస్వామి గుడి ఆవరణలో శిధిలావస్థలో ఉన్న ఒక పాలరాతి స్థంభం మీద విష్ణుకుండినులకు చెందిన రాజు మాధవ వర్మ మరియు ఒక కుటుంబ పేరు కనిపించినవి.
- No. 4. (A. R. No. 431 of 1915): నరసారావుపేట తాలూకా ఏలూరులో సోమేశ్వరాలయం వద్ద నంది బొమ్మ మీద చిక్క భీమరాజు అనే పరిచ్చేదుడు సోమనాధదేవుడికి భూమిని ఇచ్చినట్లు వ్రాయబడియున్నది.
- No. 64. (A. R. No. 567 of 1925.) గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకాలో ఉన్న రామలింగేశ్వర దేవాలయంలో గల ధ్వజ స్థంభం వద్ద పాలరాతి స్తంభం మీద కోట గోకరాజు అనేవాడు రామేశ్వర దేవాలయానికి నిరంతరం వెలిగే దీపాన్ని బహూకరించినట్లు వ్రాయబడియున్నది.
- No. 607. (A. R. No. 380 of 1904.) కమలాపురం తాలూకా కలమళ్ళ వద్ద చెన్నకేశవస్వామి దేవాలయ ఆవరణలో గల ఒక విరిగిపోయిన స్తంభం రెండువైపులా ధనుంజయుడు మరియు రేనాడు అనే పేర్లు వ్రాయబడియున్నాయి. మిగిలిన వ్రాత పూర్తిగా శిధిలమైపోయింది.
- No. 651. (A. R. No. 99 of 1909.) విశాఖపట్నంలో శ్రీ పరవస్తు రంగాచార్యులగారి ఇంటి వద్ద ఉన్న రాయి మీద అనంత వర్మ పేరు వ్రాసి యున్నది.
- No. 675 (A. R. No. 681 of 1926.) బొబ్బిలి తాలూకా నారాయణపురం నీలకంఠేశ్వర ఆలయంలో ఒక స్తంభం మీద చోడరాజు మహాదేవి నిత్యం వెలిగే దీపాన్ని ఆ దేవాలయానికి బహూకరించినట్లుగా వ్రాయబడి ఉంది.
- No. 727. (A. R. No. 827 of 1917.) ఒరిస్సా గంజాము జిల్లా చత్రాపుర్ తాలూకాలోను ప్రతాపూర్ గ్రామంలో ఉన్న తుంబేశ్వర దేవాలయంలో ఉన్న ఒక రాయిమీద అనంత వర్మ అనే పేరు వ్రాయబడి ఉన్నది. మిగిలిన వ్రాత అసంపూర్తిగా ఉన్నది. సంవత్సరము తెలియరాలేదు.
- No. 732. (A. R. No. 802 of 1922.) ఇదుపులపాడు, చెన్నకేశవ దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం వద్ద గరుడ స్తంభం రెండు వైపులా - వినుకొండకు ఉత్తర దిక్కున ఉన్న ఇడువులపాడు గ్రామాన్ని ప్రతాప రుద్రుడు భరద్వాజ గోత్రీకుడైన మాధవ మంత్రికి బహూకరించినట్లు వ్రాయబడింది. గజపతుల వంశావళి గురించి ఉంది.
- No. 733. (A. R. No. 375 of 1926.) పల్నాడు తాలూకా తంగేడ వద్ద ఓ శిధిలమైన రాయి మీద ప్రతాప రుద్రదేవ గజపతి పాలిస్తున్నట్లు చెప్పబడింది.
- No. 741. (A. R. No. 54 of 1912.) విశాఖపట్నం జిల్లా - వీరవల్లి తాలూకా చోడవరం వద్ద ఉన్న కేశవస్వామి ఆలయ స్తంభం మీద - గరుత్మంతుని చిత్రాన్ని బొండు మల్లయ్య అనే వాడు భూపతిరాజు వల్లభరాజు-మహాపత్ర శ్రేయస్సు కోసం సమర్పించినట్లు ఉంది.
ఇంకా చదవండి
లింకులు
http://pediaview.com/openpedia/Inscriptional_records_of_Andhra_Kshatriyas