ఏనుగు లక్ష్మణ కవి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 9: పంక్తి 9:
తిరిగి కుందేటి కొమ్ము సాధింప వచ్చు</br>
తిరిగి కుందేటి కొమ్ము సాధింప వచ్చు</br>
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.</br>
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.</br>
</br>
</br>
ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు </br>
శ్లోకంబైన హిమాద్రినుండి భువి, భూలోకమునందుండి య </br>
స్తోకాంభోధి, పయోధినుండి పవనాంధోలోకమున్ చేరె గం </br>
గా కూలంకష, పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్. </br>
</br>
</br>
ఉరుతర పర్వతాగ్రముననుండి దృఢంబగు ఱాతిమాద స </br>
త్వరముగ త్రెళ్ళి కాయము హతంబుగ చేయుట మేలు, గాలి మే </br>
పరిదొర వాత కేలిడుట బాగు, హుతాశన మధ్యపాతమున్ </br>
వరమగు, చారుశీల గుణవర్జన మర్హముకాదు చూడగన్. </br>


==లక్ష్మన కవి గారి యితర రచనలు==
==లక్ష్మన కవి గారి యితర రచనలు==

12:54, 22 జూలై 2012 నాటి కూర్పు

ఏనుగు లక్ష్మన కవిగారు క్రీ.శ.18 వ శతాబ్దికి (1797)చెందిన వారు. కవిగారి తల్లిగారి పేరు పేరమాంబ,మరియు తండ్రిగారి పేరుతిమ్మకవి.జన్మస్దలము పెద్దాపురము(ప్రస్తుత తూర్పుగోదావరిజిల్లాలోని సామర్లకోటకు దగ్గరులో వున్నది).శ్రీ లక్ష్మనకవి గారి ముత్తాతగారు"శ్రీ పైడిపాటి జలపాలామాత్యుడు".ఈయన ఒక ఏనుగును పోషించెవాడు.దానిని ఈయనకు పెద్దాపురం పాలకుడు బహుమతిగా యిచ్చాడు.అందుచే కాలక్రమేన వీరి యింటిపేరు ఏనుగు వారిగా స్దిరపడినది.శ్రీ వత్యవాయ తిమ్మజగపతి పాలకుని వద్ద వున్న ప్రసిద్ద కవి'కవి సార్వభౌమ కూసుమంచి తిమ్మకవి,లక్ష్మనకవి గారి సమ కాలికుడు.లక్ష్మనకవిగారు,భర్తృహరి సంస్కృతంలో రచించిన "సుభాషిత త్రి శతిని" తెలుగులోనికి "సుభాషిరత్నావళి" పేరు మీదఅనువాదం చేసినాడు. సుభాషిరత్నావళి నీతి, శృంగార, వైరాగ్య శతకములని మూడు భాగములు. భర్తృహరి సుభాషితములను తెలుగులోనికి అనువాదము చేసినవారు ముగ్గురు 1. ఏనుగు లక్ష్మణ కవి 2. పుష్పగిరి తిమ్మన 3. ఏలకూచి బాల సరస్వతి. వీటన్నింటిలోను ప్రజాదరణ పొంది అందరి నోళ్ళ్లలో నానినవి "ఏనుగు లక్ష్మణ కవి" అనువాదాలు.

ఉదాహరణలు:

నీతి శతకములోని ఒక పద్యం.

తివిరి యిసుమంబు తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింప వచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.


ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు
శ్లోకంబైన హిమాద్రినుండి భువి, భూలోకమునందుండి య
స్తోకాంభోధి, పయోధినుండి పవనాంధోలోకమున్ చేరె గం
గా కూలంకష, పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్.


ఉరుతర పర్వతాగ్రముననుండి దృఢంబగు ఱాతిమాద స
త్వరముగ త్రెళ్ళి కాయము హతంబుగ చేయుట మేలు, గాలి మే
పరిదొర వాత కేలిడుట బాగు, హుతాశన మధ్యపాతమున్
వరమగు, చారుశీల గుణవర్జన మర్హముకాదు చూడగన్.

లక్ష్మన కవి గారి యితర రచనలు

1.రామేశ్వర మహత్యము.
2.రామ విలాసం
3.సూర్య శతకము.
4.లక్ష్మీనరసింహ శతకము.
5.గంగా మాహాత్మ్యము