విద్యుద్ఘాతము: కూర్పుల మధ్య తేడాలు
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
||
పంక్తి 4: | పంక్తి 4: | ||
==వైద్యంలో విద్యుద్ఘాతము యొక్క ఉపయోగం== |
==వైద్యంలో విద్యుద్ఘాతము యొక్క ఉపయోగం== |
||
పేరు పొందిన ఆసుపత్రుల లో [[కాన్సర్]] వంటి కొన్ని రోగాలను తక్కువ మోతాదులో విద్యుత్ ఘాతంను ఉపయోగించి నయం చేస్తున్నారు. |
|||
==తేమ వలన సంభవించే విద్యుత్ ఘాతాలు== |
==తేమ వలన సంభవించే విద్యుత్ ఘాతాలు== |
07:30, 29 ఆగస్టు 2012 నాటి కూర్పు
విద్యుత్తు ప్రవహిస్తున్నపుడు విద్యుత్ ప్రవహిస్తున్న యానకంను శరీరం తగిలి ఆ శరీరం గుండా విద్యుత్ ప్రవహించినపుడు శరీరానికి కలిగే ఘాతంను విద్యుద్ఘాతము అంటారు. విద్యుద్ఘాతంను ఆంగ్లంలో ఎలక్ట్రిక్ షాక్ అంటారు. విద్యుద్ఘాతము యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ విద్యుత్ ఘాతంను తట్టుకోలేని జీవులకు మరణం సైతం సంభవిస్తుంది. మానవుని శరీరం ద్వారా విద్యుత్ ప్రవహించినపుడు విద్యుత్ ప్రవహిస్తున్న మానవుడు దిగ్భ్రాంతికి లోనవుతాడు, విద్యుత్ ప్రవాహం యొక్క తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నప్పుడు గాయాలపాలవుతాడు.
వైద్యంలో విద్యుద్ఘాతము యొక్క ఉపయోగం
పేరు పొందిన ఆసుపత్రుల లో కాన్సర్ వంటి కొన్ని రోగాలను తక్కువ మోతాదులో విద్యుత్ ఘాతంను ఉపయోగించి నయం చేస్తున్నారు.
తేమ వలన సంభవించే విద్యుత్ ఘాతాలు
వర్షం పడుతున్నప్పుడు ఇంటిలోని నాణ్యతలేని గోడలు తడిసి ఉంటాయి. గోడలతో పాటు కరెంట్ బోర్డ్ లు కూడా తడిసి ఉంటాయి. తడిసిన కరెంట్ బోర్డులు తగలడం వలన నెమ్ము ద్వారా విద్యుత్ శరీరం లోనికి ప్రవహిస్తుంది. తడిగా ఉన్న చేతులతో కరెంట్ బోర్డ్ స్విచ్ఛ్ వేసేటప్పుడు కూడా షాక్ కొడుతుంది.
భయం వలన మరణం
విద్యుద్ఘాతం వలన కలిగిన ప్రమాదం తక్కువగా ఉన్నా కొన్ని సార్లు మరణం సంభవించడం జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం భయం. భయం వలన గుండె ఆగి పోయే అవకాశాలు ఉంటాయి.
నిర్లక్ష్యం వలన మరణాలు
కరెంట్ పని చేసే ఉద్యోగులు విద్యుత్ సరఫరాను నిలిపి వేయమని తగిన సమాచారం సంబంధిత వారికి అందించి వారి అనుమతి లభించిన తరువాతే వీరు మరమ్మత్తులు చేయవలసి ఉంటుంది. అలా కాకుండా ఈ సమయంలో కరెంట్ రాదులే అని సంబంధిత వారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మరమ్మత్తులు చేసేటప్పుడు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అందించిన సమాచారాన్ని సరిగ్గా ఆలకించక విద్యుత్ సరఫరాను నియంత్రణ చేసే వ్యక్తి ఒక లైనును పునరిద్ధరించబోయి మరమత్తులు జరుగుతున్న మరొక లైనుకు విద్యుత్ ను సరఫరా చేసినట్లయితే మరమత్తులు చేస్తున్న వారు ప్రమాదానికి గురవుతారు.
పిడుగు ద్వారా విద్యుత్ ఘాతం
వర్షం కురుస్తున్నప్పుడు మెరుపు మెరిసి ఉరుము ఉరిమి పిడుగులు పడుతుంటాయి. పిడుగు అంటే మేఘాలు గుద్దుకున్నప్పుడు ఉత్పన్నమయిన విద్యుత్. ఈ పిడుగు పడిన చోట ఉన్నవారికి విద్యుద్ఘాతం కలిగి ప్రమాదానికి గురవుతుంటారు. ఈ పిడుగు పాటు విద్యుత్ నుండి రక్షించుకోవడానికి పెద్ద పెద్ద భవనాలపై అయస్కాంతపు మెరుపు కడ్డీలను అమర్చడం ద్వారా ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా విద్యుత్ ను నేరుగా భూమిలోనికి పంపిస్తారు.
కరెంట్ తీగల మీద కూర్చున్న పక్షులు ఎందుకని చనిపోవు
కావాల్సినంత వోల్టేజ్ విద్యుచ్ఛక్తి శరీరం గుండా ప్రవహించినప్పుడు మాత్రమే కరెంట్ షాక్ కొడుతుంది. కరెంట్ తీగల మీద కూర్చున్న పక్షులు సాధారణంగా ఒక వైరు మీదనే కూర్చుంటాయి. అందువల్ల వాటి శరీరం గుండా విద్యుచ్ఛక్తి ప్రవహించదు. విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు కరెంట్ తీగ మీద కూర్చొన్న పక్షి నేలను తాకినా, కూర్చున్న తీగ కాక మరొక తీగ తగిలినా, మరొక తీగపై కూర్చున్న మరొక పక్షిని తగిలినా ఎలక్ట్రిక్ సర్క్యూట్ పూర్తయి దాని శరీరం ద్వారా విద్యుత్ ప్రవహించి ఆ పక్షికి షాక్ కొట్టి మరణిస్తుంది.
చెప్పులు ధరించిన వ్యక్తికి షాక్ ఎందుకు తగలదు
దాదాపు అన్ని రకాల చెప్పులు విద్యుత్ ప్రవాహా నిరోధకాలుగా ఉంటాయి. ఒక వ్యక్తికి షాక్ తగలాలంటే తన ద్వారా తగినంత విద్యుత్ మరొక చోటుకి ప్రవహించి సర్క్యూట్ పూర్తికావాలి. ఫేస్ వైర్ అనగా విద్యుత్ ప్రవహిస్తున్న వైరును నేలపై నిలిచి ఉన్న వ్యక్తి తగిలినట్లయితే సర్క్యూట్ పూర్తయి ఆ వ్యక్తికి షాక్ కొడుతుంది. విద్యుత్ ప్రవాహా నిరోధకాలైన చెప్పులు ధరించిన వ్యక్తి విద్యుత్ ప్రవహిస్తున్న వైరును తగిలినప్పటికి ఫేస్ కి ఎర్త్ కి మధ్యన విద్యుత్ ప్రవాహ నిరోధకాలు ఉన్నందున సర్క్యూట్ పూర్తి కాలేదు కాబట్టి ఫేస్ వైరు తగిలి ఉన్నప్పటికి ఆ వ్యక్తి షాక్ తగలదు, కాని చెప్పులు తడిగా ఉన్నట్లయితే షాక్ కొడుతుంది.
విద్యుద్ఘాతము ద్వారా మరణశిక్ష
కొన్ని దేశాలలో మరణశిక్ష పడిన ఖైదీలకు ఎలక్ట్రిక్ కుర్చీ ద్వారా విద్యుద్ఘాతము కలిగించి మరణశిక్షను ఆమలు చేస్తున్నారు.