కొండా లక్ష్మణ్ బాపూజీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
+ వర్గం
పంక్తి 44: పంక్తి 44:
[[వర్గం:2012 మరణాలు]]
[[వర్గం:2012 మరణాలు]]
[[వర్గం:ఆదిలాబాద్ జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:ఆదిలాబాద్ జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:తెలంగాణ విమోచనోద్యమం]]
[[en:Konda Laxman Bapuji]]
[[en:Konda Laxman Bapuji]]

17:27, 21 సెప్టెంబరు 2012 నాటి కూర్పు

కొండా లక్ష్మణ్ బాపూజీ

వ్యక్తిగత వివరాలు

జననం సెప్టెంబరు 27, 1915
ఆంధ్రప్రదేశ్
మరణం సెప్తెంబరు 21, 2012
హైదరాబాదు
జీవిత భాగస్వామి శకుంతల
సంతానం ఇద్దరు కుమారులు,
ఒక కూతురు
నివాసం హైదరాబాదు
మతం హిందూ

తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ అదిలాబాదు జిల్లా వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబరు 27న జన్మించాడు. స్వాతంత్ర్యోద్యమంలో మరియు నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1957లో ఆంధ్రప్రదేశ్ రెండవ శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత కూడా ఎన్నికై 1971 వరకు శాసనసభ్యునిగా కొనసాగినాడు. నిఖార్సయిన తెలంగాణ వాది. తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త. 1969 మరియు 2009-12 తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నాడు. రాష్ట్ర చేనేత సహకార రంగానికి కృషిచేశాడు. సెప్టెంబరు 21, 2012 నాడు 97 సంవత్సరాల వయస్సులో హైదరాబాదులో మరణించాడు.

కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రముఖ తెలంగాణా స్వాతంత్ర్య సమరయోధులు. వీరు భారత స్వాతంత్ర్యోద్యమము లోని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు[1]. తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించినారు.

బాల్యం, విద్య

కొండా లక్ష్మణ్ బాపూజీ 1915 సెప్టెంబరు 27న ఆదిలాబాదు జిల్లా వాంకిడిలో జన్మించాడు. 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తల్లి మరణించింది. రాజురామానికి ఘర్ లో బాల్యం గడిచింది. ప్రాథమిక వీద్యాభ్యాసం ఆసిఫాబాదులో, న్యాయశాస్త్రవిద్య హైదరాబాదులో పూర్తిచేశాడు. 1940లో న్యాయవాద వృత్తి చేపట్టాడు.

స్వాతంత్యోద్యమం, నిరంకుశ నిజాం విమోచనోద్యమం

1940లో న్యాయవాద వృత్తి చేసేటప్పుడు బాపూజీ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారి తరఫున వాదించి కేసులను గెలిపించేవాడు.[2] 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నాడు. 1948లో విమోచనోద్యమంలో పోరాడినాడు. 1947 డిసెంబరు 4న నిజాం నవాబుమీద బాంబులు విసిరిన నారాయణరావు పవార్ బృదంలో కొండా లక్ష్మణ్ కూడా నిందితుడే.[3] ఆజ్ఞాతంలో ఉండి ప్రాణం కాపాడుకున్నాడు.

రాజకీయ జీవితం

1952లో బాపూజీ తొలిసారిగా ఆసిఫాబాదు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైనాడు. 1957లో చిన్నకొండూరు నుంచి విజయం సాధించి అదే సంవత్సరం శాసనసభ డిప్యూటి స్పీకరుగా ఎన్నికయ్యాడు. 1962లో స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అయితే ప్రత్యర్థి పాల్బడిన అక్రమాలపై కేసువేసి విజయం సాధించారు. 1967లో భువనగిరి నుంచి విజయం సాధించాడు. కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా పనిచేస్తూ 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేశాడు. 1972లో భువనగిరి నుంచి ఎన్నికయ్యాడు. 1973లో పి.వి.నరసింహారావు తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారింది. ఇందిరాగాంధీ ఒప్పుకున్ననూ అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి ఉమాశంకర్ దీక్షిత్ జలగం వెంగళరావు పేరు ప్రతిపాదించి ఆయన్ను ముఖ్యమంత్రి చేశారు.

వ్యక్తిగత జీవితం

బాపూజీ భార్య శకుంతల. ఈమె వైద్యురాలు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు. ఒక కుమారుడు భారత సైన్యంలో వైమానిక దళంలో ఉంటూ దేశసేవలో వీరమరణం పొందినాడు.

జలదృశ్యం

1958లో సచివాలయం సమీపంలో హుస్సేన్ సాగర్ తీరాన (ప్రస్తుత నెక్లెస్ రోడ్డుపై) భూమి కొని జలదృశ్యం నిర్మించుకున్నాడు. 2002లో చంద్రబాబు ప్రభుత్వం దాన్ని నేలమట్టం చేయగా కోర్టు తీర్పు బాపూజీకి అనుకూలంగా వచ్చింది. ఆయన అంత్యక్రియలు 22-09-2012 నాడు జలదృశ్యంలో జరుగనున్నాయి.

మూలాలు

  1. The Hindu : News / National : Agitators, police clash at Osmania varsity
  2. చిరస్మరణీయులు, పి.వి.బ్రహ్మ, ప్రచురణ 2009, పేజీ 291
  3. స్వాతంత్ర్య సమరంలో తెలంగాణ ఆణిముత్యాలు, రచయిత మల్లయ్య