కార్గిల్ యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (బాటు: pa:ਕਾਰਗਿਲ ਦੀ ਲੜਾਈ వర్గాన్ని pa:ਕਾਰਗਿਲ ਯੁੱਧకి మార్చింది
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: ca:Guerra de Kargil
పంక్తి 106: పంక్తి 106:
[[ml:കാര്‍ഗില്‍ യുദ്ധം]]
[[ml:കാര്‍ഗില്‍ യുദ്ധം]]
[[bn:কার্গিল যুদ্ধ]]
[[bn:কার্গিল যুদ্ধ]]
[[ca:Guerra de Kargil]]
[[cs:Kárgilská válka]]
[[cs:Kárgilská válka]]
[[da:Kargil-krigen]]
[[da:Kargil-krigen]]

18:31, 22 డిసెంబరు 2012 నాటి కూర్పు

కార్గిల్ యుద్ధము

భారతదేశానికి చెందిన బోఫోర్స్ 155 mm హోవిట్జర్ ఫీల్డ్ గన్ యుద్ధక్షేత్రానికి తరలిస్తున్న దృశ్యం.
తేదీమే - జులై 1999
ప్రదేశంకార్గిల్ డిస్ట్రిక్ట్, కాశ్మీర్
ఫలితంపాకిస్తాన్ ఆక్రమించుకున్న పర్వత శిఖరాలను భారత్ తిరిగి స్వాధీనపరచుకున్నది. పాకిస్తాన్ యుద్ధానికి పూర్వం ఉన్న సరిహద్దుకి వెనుతిరిగింది.
ప్రత్యర్థులు
India
భారత్
పాకిస్తాన్
పాకిస్తాన్, ముజాహిదీన్,
విదేశీ జీహాదీలు
సేనాపతులు, నాయకులు
India వేద్ ప్రకాష్ మాలిక్పాకిస్తాన్ పర్వేజ్ ముషారఫ్
బలం
30,0005,000
ప్రాణ నష్టం, నష్టాలు
భారత అధికారిక లెక్కలు:
527 మరణించారు[1][2][3]
1,363 గాయపడ్డారు[4]
1 యుద్ధఖైదీ
పాకిస్తాన్ లెక్కలు:
357 — 4,000 మరణించారు[5][6]
665+ గాయపడ్డారు[5]
8 యుద్ధఖైదీలు[7]

కార్గిల్ యుద్ధం , భారత్ పాకిస్తాన్ మధ్య మే - జులై 1999 లో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో మరియు మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగింది. ఈ యుద్దానికి కారణం పాకిస్తాన్ సైనికులు మరియు కాశ్మీరీ తీవ్రవాదులు ఎల్.ఒ.సి(వాస్తవాధీన రేఖ) దాటి భారతదేశంలోకి చొరబడడం.[8] యుద్ధప్రారంభ దశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలు మరియు తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి మరియు పాకిస్తాన్ సైన్యాధిపతి చేసిన వ్యాఖ్యలు బట్టి ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం కూడా ఉందని రుజువయ్యింది.[9][10][11] వాస్తవాధీనరేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారత వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుంది. అంతర్జాతీయంగా వస్తున్న వత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం వెనుతిరిగింది. ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్ధాలకి ఇది తాజా ఉదాహరణ. ఇంత ఎత్తులో యుద్ధం జరగడం వల్ల ఇరు పక్షాలకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అణుబాంబులు కలిగియున్న దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఇది రెండోది (మొదటిది చైనా - సోవియట్ ల మధ్య 1969 లో జరిగింది).

ప్రదేశం

భారత్-పాకిస్తాన్ విభజన జరగక ముందు కార్గిల్ ప్రాంతం లధాక్ ప్రాంతం లోని బల్టిస్తాన్ జిల్లా లో భాగంగా ఉండేది. మొదిటి కాశ్మీర్ యుద్ధం (1947–48) తర్వాత వాస్తవాధీన రేఖ బల్టిస్తాన్ జిల్లాగుండా ఏర్పడింది. దీంతో కార్గిల్ ప్రాంతం భారత దేశంలోని జమ్మూ-కాశ్మీర్ లో భాగమైంది. [12] 1971లో యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత ఇరు దేశాలు సిమ్లా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం ఈ సరిహద్దుని అంగీకరించడంతో పాటు ఇక్కడ ఎటువంటి కాల్పులకు దిగకూడదు.[13]

యుద్ధం జరిగిన ప్రదేశం

కార్గిల్ ప్రాంతం శ్రీనగర్ నుంచి 205 km ల దూరంలో ఉంది. [14] హిమాలయాల్లోని మిగతా ప్రాంతాల లాగా కార్గిల్ ప్రాంతం లో కూడా వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత −48 °C గా ఉంటుంది.[15] శ్రీనగర్ - లేహ్ లను కలిపే జాతీయ రహదారి(NH 1D) కార్గిల్ గుండా వెళుతుంది. ఈ ప్రాంతం లోకి పాకిస్తాన్ చొరబాటుదారులు వచ్చి 160 km పొడవునా కొండలపైనుంచి కాల్పులు జరిపారు. [8] కొండల మీదున్న సైనిక స్ధావరాలు 16,000 అడుగుల ఎత్తులో (కొన్నైతే 18,000 అడుగుల ఎత్తులో) ఉన్నాయి.[16] కార్గిల్ మీదే దాడికి దిగడానికి ముఖ్యకారణం, చుట్టూ ఉన్న ముఖ్యమైన సైనిక స్ధావరాలను స్వాధీన పర్చుకోవడం ద్వారా ఆ ప్రాంతం పై పట్టు సాధించడం. [17] అంతేకాక ఎత్తైన ప్రదేశం ఆక్రమించుకోవడం వల్ల కింద నుంచి పోరాడేవారి సంఖ్య ఎన్నో రెట్లు అధికంగా ఉండాలి. [18]దానికి తోడు గడ్డకట్టుకు పోయేంత చల్లటి ఉష్ణోగ్రతలు మరో అడ్డంకి.[19]

నేపద్యం

భౌగోలికంగా కీలకంగా ఉన్న కార్గిల్ పట్టణం

1971 లో భారత్-పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణలు తక్కువే అయినా శియాచిన్ హిమానీనదము మీద పట్టు సాధించటానికి ఇరు దేశాలు చుట్టు పక్కల ఉన్న కొండల మీద సైనిక స్ధావరాలను ఏర్పాటు చేస్తుండటంతో ఘర్షణలు పెరిగాయి. [20] 1990లలో కాశ్మీర్ లో పాకిస్తాన్ ప్రేరేపిత వేర్పటువాదం మరియు అణు ప్రయోగాల వల్ల ఉద్రిక్త పరిస్తుతులు నెలకొన్నాయి. వీటిని తగ్గించుకోడానికి ఇరు దేశాలు కాశ్మీర్ సమస్యని కేవలం సాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని లాహోర్ లో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
1998 -1999 ల మధ్య శీతాకాలములో పాకిస్తాన్ సైన్యం కొంత మంది సైనికులను ముజాహిదీన్ ల రూపంలో భారత్ కాశ్మీర్ లోకి పంపింది. ఈ చర్యకి "ఆపరేషన్ బద్ర్" అని గుప్త నామం. [21] దీని లక్షం కాశ్మీర్ మరియు లదాఖ్ ప్రాంతాలను విడదీసి , భారత సైన్యాన్ని శియాచిన్ నుండి వెనక్కి పంపడం మరియు భారత్ ని కాశ్మీర్ సరిహద్దు పరిష్కారంలో ఇరుకున పెట్టడం. అంతేగాక ఈ ప్రాంతం లో ఉద్రిక్తతల వల్ల కాశ్మీర్ సమస్య అంతర్జాతీయంగా ముఖ్య అంశం అవ్వాలని పాక్ ఉద్దేశం.
భారత సైన్యాధిపతి వేద్ ప్రకాష్ మాలిక్ మరియు ఎందరో ఇతర పండితుల ప్రకారం ,[22][23] ఈ కార్యక్రమానికి పాకిస్తానీయులు చాలా కాలం క్రితమే రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ యుద్ధ తీవ్రతకి భయపడి పాకిస్తాన్ నాయకులు వెనక్కి తగ్గారు. [24][25][26] 1998 లో పర్వేజ్ ముషారఫ్ పాక్ సైన్యాధిపతి అవ్వగానే మళ్ళీ ఈ పధకానికి ప్రాణం పోశాడు. [21][27] యుద్ధానంతరం పాక్ ప్రధాని, నవాజ్ షరీఫ్, ఈ విషయాలేవీ తనకు తెలియవని , భారత ప్రధాని వాజ్ పేయ్ చేసిన ఫోన్ ద్వారానే ఈ విషయాలు తెలిసాయని తెలిపాడు.[28] ఈ పధకం మొత్తం ముషారఫ్ మరియు అతని సన్నిహిత సైనికాధికారులు కలిసి చేశారని షరీఫ్[29] మరియు చాలా మంది పాక్ రచయతలు చెప్పారు..[24][30] కాని ముషరఫ్ ఈ పధకాన్ని , లాహోర్ ఒప్పందానికి 15 రోజుల ముందే షరీఫ్ కు తెలియపరిచాడని చెప్పాడు.[31]

యుద్ధం పురోగతి

యుద్ధం మొత్తాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు. మొదటి దశలో , పాక్ దళాలు భారత కాశ్మీర్ లోకి చొరబడి వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలను ఆక్రమించుకుని ఎన్.హెచ్.1 ( జాతీయ రహదారి ) ని శతాగ్నుల పరిధిలోకి తెచ్చుకున్నాయి. రెండో దశలో , భారత దళాలు చొరబాట్లను గుర్తించి సైన్యాన్ని సమాయుత్తం చేసింది. ఆఖరి దశలో, ప్రధాన యుద్ధాలు జరిగి భారత దేశం పాక్ ఆక్రమించుకున్న ప్రాంతాలను తిరిగి స్వాధీనంలోకి తెచ్చుకుంది. అంతర్జాతీయ వత్తిడి తట్టుకోలేక పాక్ సేనలు వెనుదిరిగాయి.

భారత భూభాగం ఆక్రమంచిన పాకిస్తాన్

చొరబాట్లు మరియు సైనిక దళాల మొహరింపు..

శీతాకాలములో వాతావరణం బాగా చల్లగా ఉండటం వల్ల ఇరు దేశాల సైన్యాలు కొన్ని సైనిక స్ధావరాలను వదిలి వెనక్కి వెళ్తారు. వాతావరణం అనుకూలస్తే తిరిగి వారి వారి స్ధానాలకి వెళ్శి గస్తీ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1999 లో, పాకిస్తాన్ సైన్యం తన సైనిక స్ధావరాలను వెంటనే తిరిగి ఆక్రమించుకోవడమే కాక ఎల్.ఒ.సి ( వాస్తవాధీన రేఖ ) దాటి భారత సైనిక స్ధావరాలను కూడా ఆక్రమించుకున్నారు.[32]స్పెషల్ సర్విసెస్ గ్రూప్ మరియు నార్తర్న్ లైట్ ఇన్ ఫాంట్రీ కి చెందిన సైనికులు భారత భూభాగంలోకి చొరబడి యుద్ధానికి అనువైన ప్రదేశాలను ఆక్రమించుకున్నారు. [33] [34] వీరికి కాశ్మీరీ తీవ్రవాదులు మరియు ఆఫ్గాన్ కి చెందిన కిరాయి తీవ్రవాదులు సహకరించారు. [35]

పాక్ చొరబాట్లను కనుగొని సైన్యాన్ని పంపిన భారత్

మొదట్లో భారత సైన్యం ఈ చొరబాట్లను పలు కారణాల వల్ల గుర్తించలేదు. గస్తీ కాసే దళాలను చొరబాట్లు జరిగిన ప్రాంతాలకి పంపలేదు మరియు శతాగ్నులతో పాక్ దాడులు చేస్తూ చొరబాటు దారులకు వీలు కల్పించింది. కానీ, మే రెండో వారానికి , సౌరభ్ కాలియా నేతృత్వం లోని భారత గస్తీ దళంపై జరిగిన ఆకస్మిక దాడి వల్ల చొరబాట్లు వెలుగులోకి వచ్చాయి.[36] మొదట్లో చొరబాట్ల తీవ్రత తెలియని భారత దళాలు , ఇది కేవలం తీవ్రవాదుల ( జీహాదీలు ) పని ఆనుకుని రెండు మూడు రోజుల్లో వారిని వెల్లగొట్టచ్చు అనుకుంది. కానీ ఎల్,ఒ,సి వెంబడ అనేక చోట్ల పరిస్ధితి ఇలాగే ఉండడం మరియు వీరు ఉపయోగించే పద్ధతులలో తేడాల వల్ల ఇది చాలా పెద్ద దాడేనని నిర్ధారణకు వచ్చాయి. మొత్తం 130 km² - 200 km² మేర భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నారు.[30][37] ముషారఫ్ మాత్రం 1,300 km² భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నారని చెప్పాడు.[33]
భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ తో జవాబిచ్చింది. 200,000 భారత సైనికులను పంపింది. భారత వైమానిక దళం ఆపరేషన్ సఫేద్ సాగర్ ని ప్రారంభించింది. భారత నావికా దళం కూడా పాకిస్తాన్ కు చెందిన ఓడరేవులకు(ముఖ్యంగా కరాచి ఓడరేవుకి)[38] వెళ్ళే మార్గలను మూసివేసేందుకు సిద్ధమైంది[39]. పూర్తి స్ధాయి యుద్ధం సంభవిస్తే పాక్ వద్ద కేవలం ఆరు రోజులకు సరిపడ ఇంధనము మాత్రమే ఉందని అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తెలిపాడు[8].

పాక్ ఆక్రమణల మీద భారత్ దాడి

కాశ్మీరు మొత్తం ఎత్తైన కొండ ప్రాంతం. ఇక్కడ NH 1D జాతీయ రహదారి వంటి అత్యుత్తమ రోడ్లు సైతం రెండు లేన్లకి పరిమితమయ్యాయి. ఇటువంటి కష్టతరమైన మార్గం వల్ల ట్రాఫిక్ నిదానంగా సాగింది. అంతేగాక, ఎత్తైన ప్రదేశం కావడంతో విమానాల ద్వారా సామాగ్రీని తరలించడం కష్టతరమైంది. దీంతో NH 1D రహదారిని కాపాడుకోవడం భారత్ కు అత్యంత ప్రధానం. పాకిస్తాన్ సైన్యానికి వారి స్ధావరాల నంచి NH 1D రహదారి స్పష్టంగా కనిపించడమే కాక శతఘ్నులతో దాడి చేయడం అత్యంత సులువు [40]. ఇది భారత సైన్యానికి పెద్ద సమస్య. ఎందుకంటే అన్ని రకాల సైనిక సామాగ్రీని తరలించుకోడానికి ఈ రహదారి చాలా అవసరం [41]. శతఘ్నులతో దాడి వల్ల లేహ్ ప్రాంతం విడిపోయే ప్రమాదం ఏర్పడింది (అయినా హిమాచల్ ప్రదేశ్ ద్వారా మరో దూర మార్గం ఉంది).

చొరబాటుదారుల వద్ద చిన్న ఆయుధాలు, గ్రనేడ్లు మాత్రమే కాక ఫిరంగులు, శతఘ్నులు మరియు యుద్ధవిమానాలని కూల్చివేసే తుపాకులు ఉన్నాయి. చాలా చోట్ల చొరబాటుదారుల మందు పాతరలు అమర్చారు. 8,000 మందుపాతరలు కనుగొన్నట్లు భారత్ ప్రకటించింది[42]. మానవ రహిత విమానాలు మరియు అమేరికా సమకూర్చిన AN/TPQ-36 ఫయర్ ఫైన్డర్ రాడార్ ల ద్వారా పాకిస్తాన్ పర్యవేక్షణ కొనసాగించింది [43]. NH 1D కి చేరువలో ఉన్న పర్వత శిఖరాలను స్వాధీన పర్చుకోవడం భారత సైన్యం మొట్టమొదటి ప్రాధాన్యత. అందుకే ద్రాస్ లో ఉన్న టైగర్ హిల్ మరియు టోలోలింగ్ కాంప్లెక్స్ ల మీద దాడి చేశారు [44]. ఆ తదుపరి వెంటనే శియాచిన్ గ్లేషియర్ కి ప్రవేశం కల్పించే బటాలిక్-టుర్ టోక్ సబ్ సెక్టార్ మీద దాడి చేశారు. పాకిస్తాన్ కి వ్యూహాత్మకంగా ముఖ్యమైన పర్వత శఖరాలలో పాయింట్ 4590 మరియు పాయింట్ 5353 ఉన్నాయి. పాయింట్ 4590 కి NH 1D కనుచూపు మేరలో ఉంది. పాయింట్ 5353 ద్రాస్ సెక్టార్ లోనే అత్యంత ఎత్తున ఉన్న ప్రదేశం. అందువల్లే పాక్ దళాలకి NH 1D సులభంగా కనిపించే అవకాసం ఏర్పడింది. [45] జూన్ 14న పాయింట్ 4590ని తిరిగి స్వాధీన పర్చుకున్న భారత సైన్యానికి ఈ చోటే అత్యధిక మంది జవానులు మృతి చెందారు.[46] రహదారి పరిసర ప్రాంతాలలోని సైనిక స్థావరాలను జూన్ మధ్య వరకు తిరిగి స్వాధీన పర్చుకున్నప్పటికీ ద్రాస్ ప్రాంతంలోని రహదారి పైకి మాత్రం యుద్ధం ముగిసే వరకు శతఘ్నులతో దాడులు కొనసాగాయి.

పాక్ దళాలు కూల్చిన మిగ్-21 ఫైటర్ విమాన శకలాలు. పైలట్ అజయ్ అహుజా మృతి చెందాడు..


NH 1D రహదారి కనిపించే కొండ ప్రాంతాలను తిరిగి స్వాధీన పర్చుకున్న తర్వాత భారత సైన్యం శతృవులను వాస్తవాధీన రేఖ అవతలకి తరిమికొట్టడం మీద దృష్టి పెట్టాయి. టోలోలింగ్ వద్ద జరిగిన యుద్ధం తర్వాత యుద్ధ పరిణామాలు భారత్ కు అనుకూలంగా మారింది. టోలోలింగ్ వద్ద పాకిస్తాన్ దళాలకి కాశ్మీర్ వేర్పాటువాదులు సహకరించారు. టైగర్ హిల్ (పాయింట్ 5140) మరియు పలు ఇతర చోట్ల గట్టి వ్యతిరేకత చూపించినా చివరికి విజయం భారత్ నే వరించింది. పాక్ దళాలు టైగర్ హిల్ వద్ద పాతుకుపోయారని భారత్ సైన్యానికి అర్ధం అయ్యింది. అంతేగాక ఇక్కడ ఇరు పక్షాలకి బాగా ప్రాణ నష్టం సంభవించింది. చివరగా జరిపిన దాడిలో 10 పాక్ సైనికులు , 5 భారత సైనికులు మృతి చెందగా, టైగర్ హిల్ భారత్ వశమైంది. మరి కొన్ని పేరు లేని కొండలపై కూడా తీవ్ర పోరాటాలు జరిగాయి.
ఆపరేషన్ పూర్తిగా మొదలయ్యే సరికి దాదాపు 250 శతఘ్నులను కనుచూపు మేరలో ఉన్న సైనిక గుడారాలలోని చొరబాటుదారులని వెల్లగొట్టడానికి సిద్ధం చేశారు. బోఫోర్స్ ఫీల్డ్ హోవిట్జర్ (కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో జరిగిన బోఫోర్స్ కుంభకోణం తో అపఖ్యాతి మూటగట్టుకున్నాయి) చాలా ముఖ్య పాత్ర పోషించాయి. కొన్ని ప్రాంతాలలో వీటిని పూర్తి స్ధాయిలో భారత దళాలు ఉపయోగించుకున్నాయి. మిగిలిన ప్రాంతాలలో వీటిని మొహరించడానికి సరిపడ స్థలం లేకపోవడంతో అనుకున్న ఫలితాలు రాలేదు.
ఆపరేషన్ పూర్తిగా మొదలయ్యేసరికి దాదాపు 250 శతఘ్నులను కనుచూపు మేరలోని సైనిక గుడారాలలో ఉన్న చొరబాటుదారులని వెళ్ళగొట్టేందుకు సిద్ధం చేశారు. బోఫోర్స్ ఫీల్డ్ హోవిట్జర్ (బోఫోర్స్ కుంభకోణం వల్ల అప్రతిష్ట మూటగట్టుకున్నాయి.) కీలక పాత్ర పోషించాయి. భారత్ దళాలు వీలైన చోట వీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నాయి. మిగిలిన ప్రదేశాల్లో స్థలాభావం వల్ల వీటిని మొహరించలేకపోవడంతో ఇవి పరిమితికి మించిన ఫలితాలనివ్వలేదు. భారత వైమానిక దళం ఒక మిగ్-27 స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్ ని ఇంజిన్ విఫలం కావడంతో కోల్పోయింది. మరో మిగ్-21 ఫైటర్ ని పాక్ దళాలు కూల్చివేశాయి. మొదట్లో రెండిటినీ తామే కూల్చినట్లు పాకిస్తాన్ చెప్పుకుంది[47][48]. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత రిటైర్డ్ పాక్ ఆఫీసరు సాంకేతిక సమస్యల వల్లే కూలిందని చెప్పాడు[49]. పాక్ దళాలు పాతుకు పోయిన స్థలాల మీద భారత వైమానిక దళం లేసర్ గైడెడ్ బాంబులు ప్రయోగించింది[8].
మే 27, 1999 న ఫ్లైట్ లెఫ్టినెంట్ నచికేత నడుపుతున్న మిగ్-27లో ఇంజిన్ లోపాలు రావడంతో బటాలిక్ సెక్టార్ లో ఉండగా పారాషూట్ సాయంతో బయటపడ్డారు. ఆయన జాడ కనిపెట్టడానికి వెళ్ళిన స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజా విమానాన్ని మిసైల్ సహాయంతో పాక్ దళాలు కూల్చేశాయి. అందిన వార్తల ప్రకారం , ఆయన విమానం కూలిపోవడానికి ముందే బయటకు క్షేమంగా వచ్చినప్పటికీ పాక్ దళాలకు దొరకడంతో కాల్చి చంపారు. ఆయన శవం మీద బుల్లెట్ గాయాలున్నాయి[8].

వెనుదిరగడం మరియు ఆఖరి యుద్ధాలు

ప్రపంచ దేశాల అభిప్రాయం

పరాక్రమమవంతులకి పురస్కారాలు

అనంతర పరిణామాలు

ఇవి కూడా చూడండి

భారత్ పాక్ యుద్దం 1965
భారత్ పాక్ యుద్దం 1971

మూలాలు

  1. Government of India site mentioning the Indian casualties, Statewise break up of Indian casualties statement from Indian Parliament
  2. "Breakdown of casualties into Officers, JCOs, and Other Ranks". Parliament of India Website. Retrieved 2009-05-20.
  3. "Complete Roll of Honour of Indian Army's Killed in Action during Op Vijay". Indian Army. Retrieved 2009-05-20.
  4. "Official statement giving breakdown of wounded personnel". Parliament of India Website. Retrieved 2009-05-20.
  5. 5.0 5.1 "President Musharaffs disclosure on Pakistani Casualties in his book". Indian Express. Retrieved 2009-05-20.
  6. "Over 4000 soldier's killed in Kargil: Sharif". The Hindu. Retrieved 2009-05-20.
  7. "Tribune Report on Pakistani POWs". Retrieved 2009-05-20.
  8. 8.0 8.1 8.2 8.3 8.4 "1999 Kargil Conflict". GlobalSecurity.org. Retrieved 2009-05-20.
  9. Tom Clancy, Gen. Tony Zinni (Retd) and Tony Koltz (2004). Battle Ready. Grosset & Dunlap. ISBN 0-399-15176-1.
  10. "Pak commander blows the lid on Islamabad's Kargil plot". June 12, 2009. Retrieved 2009-06-13.
  11. "Sharif admits he let down Vajpayee on Kargil conflict". 2007-09-10. Retrieved 2007-10-06.
  12. Hussain, Javed (2006-10-21). "Kargil: what might have happened". Dawn. Retrieved 2009-05-20.
  13. Cheema, Pervaiz Iqbal (2003). The Armed Forces of Pakistan. Allen & Unwin. ISBN 1865081191. Pg 4
  14. Profile of Kargil District Official website of Kargil District
  15. "Climate & Soil conditions". Official website of Kargil District. Retrieved 2009-05-20.
  16. "War in Kargil - The CCC's summary on the war" (PDF). Retrieved 2009-05-20.
  17. Chandran, Suba (2004). "Limited War with Pakistan: Will It Secure India's Interests?". ACDIS Occasional Paper. Program in Arms Control, Disarmament, and International Security (ACDIS), University of Illinois. Retrieved 2009-05-20.
  18. Against the accepted 3:1 ratio for attacking troops vs defending troops, the ratio over mountain terrain is estimated at 6:1.Men At War India Today
  19. Acosta, Marcus P., CPT, U.S. Army, High Altitude Warfare- The Kargil Conflict & the Future, June 2003. Alternate Link
  20. "The Coldest War". Outside Magazine. Retrieved 2009-05-20.
  21. 21.0 21.1 Kargil: where defence met diplomacy - India's then Chief of Army Staff VP Malik, expressing his views on Operation Vijay. Hosted on Daily Times; The Fate of Kashmir By Vikas Kapur and Vipin Narang Stanford Journal of International Relations; Book review of "The Indian Army: A Brief History by Maj Gen Ian Cardozo" - Hosted on IPCS
  22. Ludra, Kuldip S. (2001). Operation Badr:Mussharef's contribution to Pakistan's thousand years war against India. Institute for Strategic Research and Analysis Chandigarh. {{cite book}}: Cite has empty unknown parameter: |coauthors= (help)
  23. Low Intensity Conflicts in India By Vivek Chadha, United Service Institution of India Published by SAGE, 2005, ISBN 0-7619-3325-5
  24. 24.0 24.1 Hassan Abbas (2004). Pakistan's Drift Into Extremism: Allah, the Army, and America's War on Terror. M.E. Sharpe. ISBN 0-7656-1497-9.
  25. Musharraf advised against Kargil, says Benazir, ‘Musharraf planned Kargil when I was PM’ : Bhutto - Previous interview to Hindustan Times on November 30, 2001
  26. Crossed Swords: Pakistan, Its Army, and the Wars Within by Shuja Nawaz Oxford University Press
  27. Kapur, S. Paul (2007). Dangerous Deterrent. Stanford University Press. p. 118. ISBN 0804755507. {{cite book}}: Cite has empty unknown parameter: |coauthors= (help)
  28. "Nawaz blames Musharraf for Kargil". The Times of India. 2006-05-28. Retrieved 2009-05-20.
  29. "I learnt about Kargil from Vajpayee, says Nawaz". Dawn. 2006-05-29. Retrieved 2006-05-29.
  30. 30.0 30.1 Qadir, Shaukat (April 2002). "An Analysis of the Kargil Conflict 1999" (PDF). RUSI Journal. Retrieved 2009-05-20.
  31. "Kargil planned before Vajpayee's visit: Musharraf". Indian Express. 2006-07-13. Retrieved 2009-05-20.
  32. "How I Started A War". Time. 1999-07-12. Retrieved 2009-05-20.
  33. 33.0 33.1 Pervez Musharraf (2006). In the Line of Fire: A Memoir. Free Press. ISBN 0-7432-8344-9.
  34. "The Northern Light Infantry in the Kargil Operations". Retrieved 2009-05-20. by Ravi Rikhye 1999 August 25, 2002 - ORBAT
  35. It is estimated that around 2,000 "Mujahideen" might have been involved as Musharraf stated on July 6, 1999 to Pakistan's The News; online article in the Asia Times quoting the General's estimate. An Indian Major General(retd) too puts the number of guerrillas at 2,000 apart from the NLI Infantry Regiment.
  36. Saurabh Kalia’s parents waging a lone battle to highlight war crimes
  37. War in Kargil (PDF) Islamabad Playing with Fire by Praful Bidwai - The Tribune, 7 June 1999
  38. Grare, Frédéric. "The Resurgence of Baluch nationalism" (PDF). Carnegie Endowment for International Peace. Retrieved 2009-05-20.
  39. "Exercise Seaspark—2001". Defence Journal. April 2001. Retrieved 2009-05-20. {{cite web}}: |first= missing |last= (help)
  40. "Indian general praises Pakistani valour at Kargil". Daily Times, Pakistan. 2003-05-05. Retrieved 2009-05-20.
  41. Kashmir in the Shadow of War By Robert Wirsing Published by M.E. Sharpe, 2003 ISBN 0-7656-1090-6 pp36
  42. Landmine monitor - India
  43. Indian Army gets hostile weapon locating capability[dead link]
  44. Managing Armed Conflicts in the 21st Century By Adekeye Adebajo, Chandra Lekha Sriram Published by Routledge pp192,193
  45. Swami, Praveen (2004-06-30). "Commander ordered capture of Point 5353 in Kargil war". The Hindu. Retrieved 2009-05-20.
  46. The State at War in South Asia By Pradeep Barua Published by U of Nebraska Press Page 261
  47. SA-7 GRAIL 9K32M Strela-2, Anza MKI - Pakistan
  48. India loses two jets
  49. "Himalayan Showdown" - Air Commodore Kaiser Tufail, Air Forces Monthly, June 2009