రాజులు (కులం): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము తొలగిస్తున్నది: hi:क्षत्रिय (strongly connected to te:క్షత్రియులు)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
[[File:Rajputs.jpg|right|thumb|రాజ్ పుట్]]
[[File:Rajputs.jpg|right|thumb|రాజ్ పుట్]]
== పరిచయం ==
== పరిచయం ==
[[క్షత్రియులు]] ఆంధ్రప్రదేశ్‌లోనే కాక భారతదేశంలో అన్ని ప్రాంతాలలోనూ వున్నారు. ఆంధ్రప్రదేశ్ లోన్న క్షత్రియుల్ని ఆంధ్ర క్షత్రియులు (లేక ) క్షత్రియ రాజులు (లేక) రాజులు (లేక) క్షత్రియులు అని అంటారు. వీరి భాష ప్రధానంగా [[తెలుగు]]. వీరి పేరుల్లో చివర 'రాజు' లేక 'వర్మ' అని ఉంటుంది. ఇతర కులాల వారి పేర్ల చివర 'రాజు' అని వున్నా వారు జన్మతరహా క్షత్రియ జాతికి చెందినవారు కారు. సూర్యవంశానికి మరియు చంద్రవంశానికి చెందిన వీరు ఆంధ్ర ఇక్ష్వాకులు, తూర్పు చాళుక్య, చాళుక్య-చోళ, విష్ణుకుండిన, గజపతి, చాగి, పరిచెద, కాకతీయ, హోయసాల మరియూ ధరణి కోట రాజుల వంశస్తులు. ఆంద్ర క్షత్రియులలో కొన్ని [[రాజస్థాన్]] రాజ్ పుట్ తెగలు కూడా కలిసి ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కుల విభజన ప్రకారం వీరు ఇతర కులాల(ఓ.సి) కి చెందుతారు <ref>Caste, Class and Social Articulation in Andhra Pradesh: Mapping Differential Regional Trajectories - by K. Srinivasulu
[[క్షత్రియులు]] ఆంధ్రప్రదేశ్‌లోనే కాక భారతదేశంలో అన్ని ప్రాంతాలలోనూ వున్నారు. ఆంధ్రప్రదేశ్ లోన్న క్షత్రియుల్ని ఆంధ్ర క్షత్రియులు (లేక ) క్షత్రియ రాజులు (లేక) రాజులు (లేక) క్షత్రియులు అని అంటారు. వీరి భాష ప్రధానంగా [[తెలుగు]]. వీరి పేరుల్లో చివర 'రాజు' లేక 'వర్మ' అని ఉంటుంది. ఇతర కులాల వారి పేర్ల చివర 'రాజు' అని వున్నా కేవలం గోత్రాలను బట్టి వీరిని గుర్తుపట్టవచ్చును. సూర్యవంశానికి మరియు చంద్రవంశానికి చెందిన వీరు ఆంధ్ర ఇక్ష్వాకులు, తూర్పు చాళుక్య, చాళుక్య-చోళ, విష్ణుకుండిన, గజపతి, చాగి, పరిచెద, కాకతీయ, హోయసాల మరియూ ధరణి కోట రాజుల వంశస్తులు. ఆంద్ర క్షత్రియులలో కొన్ని [[రాజస్థాన్]] రాజ్ పుట్ తెగలు కూడా కలిసి ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కుల విభజన ప్రకారం వీరు ఇతర కులాల(ఓ.సి) కి చెందుతారు <ref>Caste, Class and Social Articulation in Andhra Pradesh: Mapping Differential Regional Trajectories - by K. Srinivasulu
Department of Political Science, Osmania University, Hyderabad </ref> .
Department of Political Science, Osmania University, Hyderabad </ref> .

== చరిత్ర ==
ఆంధ్ర క్షత్రియులు అనే పదము పురాణములలో,చరిత్రలో ఎక్కడా లేదు.క్షత్రియ అనే పదము సంస్కృతము లోనిది.సంస్కృతము మాట్లాడటము,వ్రాయటము రాని,అధికముగా చదువు,విద్యా లేని(ఎక్కువ సంఖ్య) వారు తాము క్షత్రియులమని చెప్పుకోవటము ఇతర ప్రజలను మభ్య పెట్టడమే తప్ప వాస్తవము కాదు.క్షత్రియ లేదా రాజు/వర్మ అనే వారు వాస్తవములను తెలుసు కోవటము అవసరము.రాజు/వర్మ అని పేరు చివర తగిలించుకున్నంత మాత్రాన క్షత్రియులైతే ప్రతి ఒక్కరూ ఆ పని చేయ గలరు.ఆంధ్రదేశంలో చాలా ప్రాంతాల్ని పాలించిన వారు బోయలు,బోయలనే సంస్కృతములో క్షత్రియులు అంటారు.బోయ అనేది అచ్చు తెలుగు పదము.క్షత్రియ అనే పదమే తెలుగులో లేనప్పుడు ఆంధ్రక్షత్రియులు ఎక్కడనుండి వస్తారు.బోయలే నాయక,నాయకరాజు.అయి రాజులు ,రాజ్యపాలకులు అయినారు.చరిత్రలో ఎక్కడా ఆంధ్రక్షత్రియులు అని వ్రాయ బడలేదు. అయితే బోయలే భయములేని వారని,వీరినే సంస్కృతములో క్షత్రియులు అంటారు.


===పూసపాటి రాజులు (పరిచ్చేదులు)===
===పూసపాటి రాజులు (పరిచ్చేదులు)===

14:50, 7 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

వ్యాసక్రమం
హిందూ మతం

ఓం

చరిత్ర · దేవతలు
Denominations
Mythology

ధర్మము · Artha ·
కామము · మోక్షము ·
కర్మ · సంసారం
యోగ · భక్తి · మాయ
పూజ  · హిందూ దేవాలయం

వేదములు · ఉపనిషత్తులు
రామాయణం · మహాభారతము
భగవద్గీత · పురాణములు
ధర్మ శాస్త్రములు · others

సంబంధిత విషయాలు

en:Hinduism by country
Gurus and saints
Reforms · Criticism
హిందూ కేలండర్ · హిందూ చట్టము
ఆయుర్వేదం · జ్యోతిష్యము
వర్గం:హిందువుల పండుగలు · Glossary

హిందూ స్వస్తిక గుర్తు

రాజ్ పుట్

పరిచయం

క్షత్రియులు ఆంధ్రప్రదేశ్‌లోనే కాక భారతదేశంలో అన్ని ప్రాంతాలలోనూ వున్నారు. ఆంధ్రప్రదేశ్ లోన్న క్షత్రియుల్ని ఆంధ్ర క్షత్రియులు (లేక ) క్షత్రియ రాజులు (లేక) రాజులు (లేక) క్షత్రియులు అని అంటారు. వీరి భాష ప్రధానంగా తెలుగు. వీరి పేరుల్లో చివర 'రాజు' లేక 'వర్మ' అని ఉంటుంది. ఇతర కులాల వారి పేర్ల చివర 'రాజు' అని వున్నా కేవలం గోత్రాలను బట్టి వీరిని గుర్తుపట్టవచ్చును. సూర్యవంశానికి మరియు చంద్రవంశానికి చెందిన వీరు ఆంధ్ర ఇక్ష్వాకులు, తూర్పు చాళుక్య, చాళుక్య-చోళ, విష్ణుకుండిన, గజపతి, చాగి, పరిచెద, కాకతీయ, హోయసాల మరియూ ధరణి కోట రాజుల వంశస్తులు. ఆంద్ర క్షత్రియులలో కొన్ని రాజస్థాన్ రాజ్ పుట్ తెగలు కూడా కలిసి ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కుల విభజన ప్రకారం వీరు ఇతర కులాల(ఓ.సి) కి చెందుతారు [1] .

పూసపాటి రాజులు (పరిచ్చేదులు)

పరిచ్చేదులు వశిష్ట గోత్రానికి చెందినవారు. పూసపాటి కుటుంబాలకు వారికి పూర్వీకైన పరిచ్చేదులు క్రీస్తు శకం 626 లో కృష్ణా నది మీదుగా బెజవాడ (ఇప్పటి విజయవాడ) నగరాన్ని నిర్మించారు. విజయరామరాజు కళింగ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సూర్యవంశీయులైన పరిచ్చేదులు హిందూ ధర్మాన్ని అనుసరించారు. 16 వ శతాబ్దంలో నందాపుర్ (కొరాపుట్ జిల్లా, ఒరిస్సా) గజపతులను ఓడించిన తర్వత 'గజపతి' అనే బిరుదు పొందారు. 1850 లో మహారాజా పూసపాటి ఆనంద గజపతి రాజు తన కుమార్తెను మహారాజా కుమర్ సింగ్ కు ఇచ్చి వివాహం చేశాడు. విజయనగరం మహారాజు ఉదయ్ పూర్ రాణాల వంశస్తుడని చెప్పబడినది. 1484 లో పూసపాటి రచిరాజు 'వశిష్టగోత్ర సీస మాలిక' వ్రాశాడు. ఔరంగజేబు మహారాజ సీతారామరాజుకి రెండు అంచుల ఖడ్గాన్ని బహూకరించాడు. పరిచ్చేదులు కోస్తా ప్రాంతానికి వచ్చిన తర్వాత వీరి పేరు పూసపాటిగా మారింది. పరిచ్చేదులలో పాలించిన రాజుల పేర్లు ఇవి:

  • పూసపాటి అమలరాజు - కళింగ విజయనగరం వ్యవస్థాపకుడు;
  • పూసపాటి తమ భూపతులు (1620-1670);
  • పూసపాటి పెద విజయరామ రాజు (1670 - 1757);
  • పూసపాటి ఆనందరాజు (1760);
  • పూసపాటి చిన విజయరామరాజు (1760 - 1794);
  • పూసపాటి నారాయణ బాబు రాజు (1794 - 1845);
  • పూసపాటి విజయరామ గజపతి రాజు (1845-1879);
  • పూసపాటి ఆనంద గజపతి రాజు (1879-1897)

ఛాగి (సాగి)

ఛాగివారు కృష్టా జిల్లాలో గుడిమెట్లను రాజధానిగా చేసుకొని నటవాడి ప్రాంతాన్ని పాలించారు. సూర్యవంశానికి చెందిన వీరు వశిష్ట గోత్రీకులు. కొద్ది కాలం స్వతంత్రంగా పరిపాలించినా అనతి కాలంలో వీరు విష్ణుకుండినులకు, తూర్పుచాళుక్యులకు, గజపతులకు, విజయనగర రాజులకు సామంతులయ్యారు. నటవాడి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నా సాగి బుద్ధరాజు కాకతీయ గణపతి దేవుడి సోదరి మెలంబికను వివాహమాడాడు. వీరికి తూర్పుచాళుక్యులు, పరిచ్చేదులు, కాకతీయులు మరియు ధరణికోట రాజులలో వివాహ సంబంధాలు ఉండేవి. ఛాగి అనే పేరు కాలక్రమేణా సాగి గా మారింది. ఛాగివారిలో పరిపాలించిన రాజుల పేర్లు ఇవి:

  • ఛాగి బుద్ధరాజు; ఛాగి పోతరాజు; వత్సవాయి ప్రతాప అయ్యపదేవ మహారాజు; మహారాజ వత్సవాయి పెద్ద పాత్రుడు; రాజా వత్సవాయి చతుర్బుజ తిమ్మ జగపతి బహదూర్; రాయ జగపతి; తిమ్మ జగపతి; బలభద్ర జగపతి; శ్రీ వత్సవాయి రాయ జగపతి (1791-1804); బుచ్చి సీతమ్మ (1828-1835)

ధరణి కోట రాజులు

చంద్ర వంశం, ధనుంజయ గోత్రీకులైన కోట వంశం వారు క్రీస్తు శకం 8 - 12 శతాబ్దాలలో ధరణికోటను రాజధానిగా చేసుకొని గుంటూరు జిల్లా ను పాలించారు . వీరు మొదటిగా జైన మతం ఆచరించినప్పటికీ తర్వాత హిందూ మతాన్ని ప్రోత్సాహించారు., హిందూ దేవాలయాలను కట్టించారు. వీరు చాలా కాలం స్వతంత్రులైనప్పటికీ తర్వాత కాకతీయులకు సామంతులైయ్యారు. వీరికి తూర్పుచాళుక్యులు, పరిచ్చేదులు, కాకతీయులు, ఛాగి మరియు కలచురిలతోను వివాహ సంబంధాలు ఉండేవి. కోట బెతరాజు కాకతీయ గణపతి దేవుడి కుమార్తె అయిన గణపాంబను వివాహం చేసుకొన్నాడు. దాట్ల, దంతులూరి, భూపతిరాజు, జంపన వంటి కుటుంబాలకు పూర్వీకుడైన కోట కెతరాజు 1182 లో సింహాసనాన్ని అధిష్టించాడు. ధరణికోట రాజులలో పరిపాలించిన రాజుల పేర్లు ఇవి:

  • కోట హరిసీమ కృష్ణుడు - సామ్రాజ్య వ్యవస్థాపకుడు;
  • కోట భీమరాజు 1 - 1100 AD;
  • కోట కేతరాజు 1 - 1130 AD; కోట భీమరాజు 2;
  • కోట కేతరాజు 2 - 1182 AD to 1232 AD; కోట రుద్రరాజు;
  • కోట బెతరాజు - 1268 AD.

కాకతీయులు

సూర్యవంశీకులైన కాకతీయులు ఓరుగల్లు (వరంగల్) ని రాజధానిగా చేసుకుని 1083 నుండి 1323 వరకూ ఆంధ్ర దేశాన్ని పాలించారు. వీరికి చంద్ర వంశీయులైన తూర్పు చాళుక్యులతోను, ధరణికోట రాజులతోను వివాహ సంబంధాలుండేవి. గణపతి దేవుడు దూర్జయ అనే శూద్ర జాతికి చెందిన నారమ్మ మరియు పేరమ్మ అను కన్యలను వివాహమాడాడు. కాకతీయులలో పాలించిన రాజులు వీరు:

  • బెతరాజు (1000 -1030),
  • ప్రోలరాజు (1030–1075),
  • బెతరాజు 2 (1075–1110),
  • ప్రోలరాజు 2 (1110–1158),
  • ప్రతాపరుద్ర / రుద్రదేవ 1 (1158–1195),
  • మహాదేవ (1195–1198),
  • గణపతి దేవ (1199–1261),
  • రుద్రమదేవి (1262–1296),
  • ప్రతాపరుద్ర/రుద్రదేవ 2 (1296–1323).

విష్ణుకుండినులు

ఇంద్రపాలనగరాన్ని రాజధానిగా చేసుకొని నల్లగొండ జిల్లాను పాలించిన వీరు కౌండిన్య గోత్రానికి చెందినవారు. మాధవ వర్మ హయంలో విష్ణుకుండినులు స్వతంత్రులై శాలంకాయనుల నుండి కోస్తా ఆంధ్ర ను చేజిక్కించుకున్నారు. విష్ణుకుండినులలో పాలించిన రాజులు వీరు:

  • ఇంద్రవర్మ ( last 1/4 of 4 CE);
  • మాధవ వర్మ; గోవిందవర్మ; మాధవవర్మ 2 (461-508 C.E.);
  • విక్రమేంద్రవర్మ (508–528 C.E.);
  • విక్రమేంద్రవర్మ (555–569 C.E);
  • గోవిందవర్మ 2

గజపతులు

గజపతులు మధ్య యుగానికి చెందిన హిందూ రాజవంశము. వీరు కళింగ (ఇప్పటి ఒరిస్సా) ను, ఆంధ్ర ప్రదేశ్ లో చాలా ప్రదేశాలు, పశ్చిమ బెంగాల్, మరియు మధ్య ప్రదేశ్ లో తూర్పు, మధ్య భాగాలను, దక్షిణ బిహార్ ను 1443 - 1541 మధ్య పాలించారు. 1434 లో కపిలేంద్ర దేవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. నరసింహదేవ కోణార్క్ లో సూర్య దేవాలయాన్ని కట్టించాడు. గజపతులలో పాలించిన రాజులు వీరు:

  • కపిలేంద్ర దేవ (1434-67);
  • పురుషోత్తమ దేవ (1467-97);
  • ప్రతాపరుద్ర దేవ (1497-1540);
  • కలువ దేవ (1540-41);
  • కఖరువ దేవ (1541)

ఆంధ్ర ఇక్ష్వాకులు

సూర్య వంశానికి చెందిన వీరు విజయపురి (నాగార్జున కొండ) ను రాజధానిగా చేసుకొని కృష్ణానది తూర్పు దిక్కు ప్రాంతాలను క్రీస్తు శకం 2 వ శతాబ్దంలో పాలించారు. పురాణాల ప్రకారం వీరిలో 100 మంది రాజులున్నా, శిలాశాసనాల్లో మాత్రం నాలుగు పేర్లే లభించాయి.

  • వశిష్టపుత్త శ్రీ శాంతముల; వీరపురుష దత్త; ఎహువుల శాంతముల; రుద్రపురుష దత్త

చోళులు

చోళులు తమిళ సామ్రాజ్యానికి చెందినవారైనప్పటికీ వీరు క్రీస్తు పూర్వం 300 - క్రీస్తు శకం 1279 మధ్య శ్రీలంక నుండి వెంగి (పశ్చిమ గోదావరి - ఏలూరు సమీపంలో చెందిన పెదవేగి, చినవేగి, దెందులూరు ప్రాంతాలు) వరకూ పాలించారు. మధ్య యుగ చోళులలో పాలించిన రాజులు ఎవరనగా:

  • విజయలాయ చోళ, ఆదిత్య 1, పరంటాక చోళ 1, గండరాదిత్య, అరింజయ చోళ, సుందర చోళ, ఉత్తమ చోళ, రాజ రాజ చోళ 1, రాజేంద్ర చోళ 1, రాజాధిరాజ చోళ, రాజేంద్ర చోళ 2, వీరరాజేంద్ర చోళ, అతిరాజేంద్ర చోళ

చాళుక్య చోళులు

సూర్యవంశీయులైన చోళులకు, చంద్రవంశీయులైన చాళుక్యులకు వివాహ సంబంధాల మూలంగా ఆవిర్భవించినవారు చాళుక్య-చోళులు. వీరు క్రీస్తు శకం 1070 నుండి క్రీస్తు శకం 1279 వరకూ పాలించారు. చాళుక్య చోళులలో పాలించిన రాజుల పేర్లు ఏవనగా:

  • కుళోత్తుంగ చోళ 1, విక్రమ చోళ, కుళోత్తుంగ చోళ 2, రాజరాజ చోళ2, రాజాధిరాజ చోళ 2, కుళోత్తుంగ చోళ 3, రాజరాజ చోళ2, రాజేంద్ర చోళ 3

వర్నాటులు (హోయసాలులు)

హోయసల సామ్రాజ్యం 10 నుండి 14వ శతాబ్ధం వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన రాజవంశాలలో ఒకటి. వీరు సూర్యవంశపు క్షత్రియులు. క్రీస్తు శకం 12 వ శతాబ్దంలో మొదటి భల్లాలుడు చాళుక్య సామంతుడై బేలూరు రాజధానిగా చేసుకొని పాలించాడు. తరువాత రాజధాని హళిబేడు (ద్వారసముద్రము) కు మారినది. భల్లాలుడు అనంతరం అతని తమ్ముడు విష్ణువర్ధనుడు అను బిట్టి దేవుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడు క్రీస్తు శకం 1131 నాటికి రాజ్యాన్ని ఆంధ్ర ప్రదేశ్లో కృష్ణా నది వరకూ విస్తరింపజేశాడు. 1342 లో మూడవ వీరభల్లాలుడు మహమ్మదీయుల చేతిలో స్వర్గస్తుడైయ్యాడు. ఇతడి కుమారుడు కొంతకాలం రాజ్యమేలాడు. హోయసల సామ్రాజ్యం ఇతనితో క్షీణించిపోయింది. వీరభాల్లాలుడి వంశస్తుడైన ఝల్లిగడ గంగరాజు 1608 లో మొగల్తూరు సంస్థానాన్ని స్థాపించాడు.

తూర్పు చాళుక్యులు (లేదా వెంగి చాళుక్యులు)

చంద్ర వంశానికి చెందిన వీరు వెంగి (పశ్చిమ గోదావరి - ఏలూరు సమీపంలో చెందిన పెదవేగి, చినవేగి, దెందులూరు ప్రాంతాలు)ని రాజధానిగా చేసుకొని దక్షిణ భారత దేశాన్ని 500 సంవత్సరాల పాటూ (7 వ శతాబ్దం నుండి క్రీస్తు పూర్వం 1130 వరకూ) పాలించారు. తర్వాత వీరి రాజధాని రాజమహేంద్రవరానికి (తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి రాజమండ్రి) మారింది. బదామి చాళుక్యులలో గొప్పవాడైన పులికేసి 2 క్రీస్తు శకం 616లో తూర్పు డెక్కన్, మరియు సంబంధిత ప్రాంతాలని విష్ణుకుండినులనుండి సాధించి ఆ ప్రాంతాలకు తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడిని వైస్రాయ్ గా నియమించాడు. తర్వాత స్వతంత్ర సామ్రాజ్యంగా ఎదిగింది. తూర్పు చాళుక్యులలో పాలించిన రాజులు వీరు:

  • కుబ్జ విష్ణువర్ధనుడు, జయసింహ, విష్ణువర్ధనుడు 2, రాజరాజ నరేంద్రుడు

బ్రిటీషు వారి కాలం తర్వాత క్షత్రియ రాజుల స్థితి

బ్రిటీషు ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఆక్రమణతో సామ్రాజ్యాలు అంతరించిపోయాయి. క్రమేణా క్షత్రియ వంశస్తులు తమ సామ్రాజ్యాలు విడిచి సామాన్య ప్రజానీకంలో కలిసిపోయారు. విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో స్థిరపడిపోయారు. కొద్దిగా రాయలసీమకు, తమిళనాడు రాజపాలయానికి, కర్నాటకలో దత్త మండలానికి వలస వెళ్ళారు. జమీందారీ వ్యవస్థ కొంత కాలం నడిచినా 1947లో భారత దేశ స్వాతంత్రం వచ్చిన నాటికి ఆ జమీందారీ వ్యవస్థ కూడా పోయి సార్వభౌమ అధికార వ్యవస్థ వచ్చింది. జమీందార్లు తమ ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించారు, పేదలకు పంచిబెట్టారు. కొద్ది మంది మాత్రమే ధనవంతులుగా మిగిలినా చాలా వరకూ పేదవాళ్ళుగా మిగిలిపోయారు.

గోత్రాలు, గృహనామాలు

బ్రాహ్మణ గోత్రాల వలె క్షత్రియ గోత్రాలకు కూడా మూల పురుషులు సప్తఋషులు గాని, వారి వంశస్తులుగాని అయివుందురు. గృహనామాలు ఏర్పడక పూర్వం కేవలం గోత్రాలు మాత్రమే వాడుకలో ఉండేవి. 12, 13 శతాబ్దాల తర్వాత ఆంధ్ర క్షత్రియులకు గోత్రాలు బట్టి గృహనామాలు ఏర్పడ్డాయి. ఉత్తర మద్రాస్ ప్రెసిడెన్సీ (శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, కొండపల్లి, గుంటూరు) లో రాజుల గోత్రాలు ఏవనగా - కౌండిన్య , వశిష్ట , ధనుంజయ , కాస్యప . కర్ణాటక రాజులకు ఆత్రేయ, పశుపతి, భరద్వాజ, విశ్వామిత్ర గోత్రాలున్నాయి. చరిత్ర కారుడైన శ్రీ బుద్దరాజు వరహాలరాజు గారు 1970లో తాను రచించిన శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము లో ధనుంజయ, వశిష్ట, కాస్యప, కౌండిన్య గోత్రములు మాత్రమే పేర్కొన్నారు.

ధనుంజయ గోత్రం:

ధనుంజయ మహారాజు బ్రహ్మర్షి విశ్వామిత్రుడి వంశంలో పుట్టిన వాడు. ఇతడి పేరు మీద ధనంజయ గోత్రం పుట్టినది.

ఋషి ప్రవర: శ్రీమద్వైశ్వామిత్ర మధుచ్చందో ధనుంజయ త్రయార్షేయ ప్రవరాన్విత ధనుంజయ గోత్ర:.

రాజప్రవర: భరత్ పరిక్షిత్ విష్ణువర్ధన ప్రవరాన్విత కోట హరిసీమ కృష్ణ మహారాజ వంశ'

ధనుంజయ గోత్రము లో గృహనామాలు:

1. అడ్డాల; 2. ఈపూరి (వీపూరి); 3. ఉద్దరాజు; 4. ఉయ్యూరి; 5. ఏటికూరి (వేటికూరి); 6. కంకిపాటి; 7. కంతేటి; 8. కమ్మెల (కమ్మెళ్ళ); 9. కళ్ళేపల్లి; 10. కాశి; 11. కూనపరాజు; 12. కూసంపూడి (కూచంపూడి); 13. కొండూరి; 14. కొక్కెర్లపాటి; 15. కొత్తపల్లి; 16. కొప్పెర్ల; 17. కొలనువాడ 18. కొల్నాటి(కొల్లాటి); 19. కొవ్వూరి; 20. గండ్రాజు; 21. గాదిరాజు; 22. గుంటూరి; 23. గూడూరి; 24. గొట్టుముక్కల (గొట్టెముక్కల, గొట్టుముక్కుల); 25. గోకరాజు; 26. చంపాటి (చెంపాటి); 27. చింతలపాటి; 28. చెరుకూరి; 29. చేకూరి; 30. కోటజంపన 31. జుజ్జూరి; 32. తిరుమలరాజు; 33. తోటకూర (తోటకూరి); 34. దండు; 35. దంతులూరి; 36. దాట్ల; 37. నల్లపరాజు; 38. నున్న; 39. పచ్చమట్ల (పట్సమట్ల); 40. పాకలపాటి; 41. పూసంపూడి; 42. పెన్మెత్స (పెనుమత్స); 43. భూపతిరాజు; 44. బైర్రాజు; 45. మద్దాల; 46. ముదుండి; 47. రుద్రరాజు; 48. వడ్లమూడి; 49. వానపాల; 50. వేగిరాజు; 51. సాగిరాజు

ధనుంజయ గోత్రీకులు చంద్ర వంశీయులైన తూర్పు చాళుక్యులు మరియు ధరణి కోట సామ్రాజ్యాలకు చెందినవారు.

వశిష్ట గోత్రం:

వశిష్ట గోత్రమునకు 2 ఋషి ప్రవరలున్నవి. అవి ఏమనగా:

  • శ్రీ మద్వశిష్ట ఏకార్షేయ ప్రవరాన్విత వశిష్ట గోత్ర:
  • శ్రీమధ్వశిష్టేంద్ర ప్రవదా భరద్వసు త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ట గోత్ర:

రాజప్రవర : రఘులవ గుహిల మహారాజ ప్రవరాన్విత పరిచ్చేది శ్రీ దేవవర్మ మహారాజ వంశ

వశిష్ట గోత్రములో గృహనామాలు:

1. అంగరాజు; 2. అడ్డూరి; 3. అల్లూరి; 4. ఇందుకూరి; 5. ఇసుకపల్లి; 6. ఎర్రగుంటల; 7. ఏటికూరి (వేటికూరి); 8. కాకర్లపూడి; 9. కుచ్చర్లపాటి; 10. కొలుకులూరి; 11. కోసూరి; 12. గణపతిరాజు; 13. గాదిరాజు; 14. గురజాల (గురిజాల); 15. గొడవర్తి; 16. చిలువూరి (చిలుగూరి, శిరుగూరి, శిరువూరి); 17. చెరుకువాడ; 18. చేకూరి; 19. చోడరాజు (చోడ్రాజు); 20. దెందుకూరి; 21. ధేనువకొండ (దీనంకొండ); 22. నంద్యాల (నందేల, నందిళ్ళ); 23. నడింపల్లి (నడిమిపల్లి); 24. పిన్నమరాజు; 25. పూసపాటి; 26. పేరిచర్ల; 27. పొత్తూరి; 28. బుద్దరాజు; 29. బెజవాడ; 30. భేతాళ (భేతాళం); 31. భైర్రాజు; 32. మంతెన; 33. ములగపాటి (మునగపాటి); 34. రావిపాటి (రాయపాటి); 35. వత్సవాయి (వత్సవాయ); 36. వలివర్తి; 37. వాడపల్లి; 38. వెలగలేటి (వెలగనాటి); 39. వేగేశ్న (వేగేశన); 40. వేజళ్ళ (వేజర్ల, వేజండ్ల, యేజర్ల); 41. సఖినేటి (సగినేటి); 42. సాగి; 43. సాగిరాజు; 44. సామంతపూడి

వశిష్ట గోత్రీకులు సూర్యవంశీయులైన పరిచ్చేదులకు చెందినవారు. పరిచ్చేదులకు రాజస్థానీ రాజ్పుట్స్ తో కూడా వైవాహిక సంబంధాలు కలవు.

కౌండిన్య గోత్రం:

కౌండిన్యుడు ఒక గొప్ప వేద పండితుడు. ఇతను వశిష్టుడి వంశంలో జన్మించినవాడు. ఇతని పేరు మీద గోత్రం పుట్టింది.

ఋషి ప్రవర: శ్రీమద్వసిష్ట మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత కౌండిన్య గోత్ర:

రాజప్రవర : ఇక్షాకశిబి ముచుకుంద ఆదిత్య చోళమహారాజ ప్రవరాన్విత వర్నాట రాజేంద్ర చోళమహారాజ వంశ

కౌండిన్య గోత్రములో గృహనామాలు:

1 . అద్దేపల్లి; 2 . అయినంపూడి; 3 . కలిదిండి; 4 . కునాధరాజు; 5. చిట్రాజు; 6. చేమర్తి; 7 . ముదునూరి; 8 . యామనమంద, యీమనమంద, వేములమంద; 9 . వర్ణాటజంపన; 10. సరిపల్లి (సరిపెల్ల)

కౌండిన్య గోత్రీకులు సూర్యవంశీయులైన చోళులకు చెందినవారు.

కాస్యప గోత్రం:

ఋషులలో కాస్యప ఒక ఋషి. ఇతనికి భార్య అదితి. విష్ణు పురాణం ప్రకారం ప్రజాపతి దక్షుడు తన పదముగ్గురు కూతుర్లను కాస్యపునికి ఇచ్చి వివాహం చేశాడు. ఇతని కుమారులు సూర్య వంశాన్ని స్థాపించారు. కాస్యప వంశంలో పుట్టిన ఇక్ష్వాకుడి తర్వాత సూర్య వంశం ఇక్ష్వాకు వంశంగా కూడా పిలుబడింది.

కాస్యప గోత్రమునకు 2 ఋషి ప్రవరలున్నవి. అవి ఏమనగా:

  • శ్రీ మత్ కాశ్యపా వత్సార నైధృవం భరైభం శండిల శాండిల్య సప్తార్షేయ ప్రవరాన్విత కాస్యపగోత్ర:
  • శ్రీమత్కాస్యపావత్సార నైధృవత్రయార్షేయ ప్రవరాన్విత కాస్యపగోత్ర:

రాజప్రవర: కుశపుండరీక కరికాళచోర మహారాజ ప్రవరాన్విత కాకతీయ ప్రోలరాజ వంశం

కాస్యప గోత్రములో గృహనామాలు:

1. ఈదురపల్లి (ఈదరపల్లి); 2. ఉప్పలపాటి; 3. కఠారి, 4. కనుమూరి, 5. గోరింట, 6. నంబూరి, 7. పాతపాటి, 8. బెల్లంకొండ; 9. మందపాటి; 10. లఖంరాజు (లకుమరాజు); 11. సయ్యపరాజు

కాస్యప గోత్రీకులు సూర్యవంశీయులైన కాకతీయులకు చెందినవారు.

గమనిక : ఏటికూరి, గాదిరాజు, చేకూరి, బైర్రాజు, సాగిరాజు, ఈ 5 గృహనామములును వశిష్ట , ధనుంజయ ఉభయ గోత్రములందును గలవు. ఆంధ్ర క్షత్రియుల్లో స్వగోత్రీకుల మధ్య వివాహాలు నిషిద్ధం. వేర్వేరు గోత్రముల మధ్య మాత్రమే వివాహాలు జరుగుతాయి. 15 వ శతాబ్దాలలో ఆంధ్ర క్షత్రియులలో కొంతమంది తమ గోదావరి ప్రాంతం నుండి దత్త మండలము (రాయలసీమ, కర్నాటకలో బళ్లారి జిల్లాలు) నకు వలస వెళ్ళిపోయారు. అక్కడివారితో వియ్యమొందుట వలన కాలగమనంలో వారి ఆచారాలు కూడా మారినవి, అందువల్ల నేడు వారితో తెలుగు క్షత్రియులకు వివాహ సంబంధములు లేవు. పురాణాల ప్రకారం బృహస్పతి ఋషి కుమారుడైన భరద్వాజ ఋషి క్షత్రియ కన్య యైన సుశీలను వివాహమాడాడు. అనులోమ వివాహం సూత్రం ప్రకారం వీరి సంతతి క్షత్రియులైయ్యారు. అందువల్ల భరద్వాజ గోత్రీకులను బ్రాహ్మణ-క్షత్రియులని చెప్పవచ్చు. వందల సంవత్సరాలుగా ఒక చోటు నుండి మరొక చోటుకు వలసల వల్ల ఆంధ్ర క్షత్రియుల్లో కొన్ని ఇంటిపేర్లు గోత్ర వర్గీకరణకు సాధ్యము కాక అవి శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరంలో అజ్ఞాత గోత్రంగా వర్గీకరించబడినవి. అవి ఏమనగా: అబ్బరాజు, ఉయ్యూరి, ఈనపరాజు, గరికపాటి, పెమ్మరాజు, ఓరుగంటి, పోచిరాజు, బొమ్మిడాల, అమలరాజు, వులిశి, వడ్లమూడి, వెలగలేటి, దుర్గరాజు, దైవనాల.

ఇతర కులాల్లో గృహనామాలు

క్షత్రియులకు గృహనామాలు 80 గ్రామనామాలు బట్టి, 20 పూర్వీకులలో ప్రసిద్ధులైనవారి పేర్లు బట్టి, 1 లక్షణం బట్టి, 8 ఇతర కారణాల వల్ల ఏర్పడ్డాయి. అయితే గ్రామ నామమే గృహ నామంగా మారినప్పుడు ఒక కులంలో ఉన్న గృహ నామం వేరొక కులంలో కూడా ఉండవచ్చును. ఈ కారణంగా క్షత్రియుల ఇంటిపేర్లలో కొన్ని ఇతర కులాల్లో కూడా ఉన్నాయి. తెలుగు బ్రాహ్మణ కులంలో అవి ఏమనగా - బుద్దరాజు, గణపతిరాజు, గరికపాటి, కఠారి, కాకర్లపూడి, నడింపల్లి, సరిపల్లి, వడ్లమూడి, భూపతిరాజు, గాదిరాజు, కొండూరి, నంబూరి. రెడ్డి కులంలో అవి ఏమనగా - భూపతిరాజు . కాపు కులంలో ఏమనగా - కోసూరి, కఠారి. భట్ట రాజులు కులంలో ఏమనగా - అబ్బరాజు, అల్లూరు, బాలరాజు, ధేనువుకొండ, గాదిరాజు, నండూరి, నడింపల్లి, నాగరాజు, పూసపాటి. కమ్మ కులంలో ఏమనగా- ఉప్పలపాటి, కంతేటి, కొత్తపల్లి, కోసూరు, గరికపాటి, గోకరాజు, ఇందుకూరి, చెరుకూరి, నాగరాజు, బెల్లంకొండ, రాయపాటి, బెజవాడ, చేకూరి, గురిజాల, ఇసుకపల్లి, కనుమూరి, కఠారి, మద్దాల, నడింపల్లి, నందిళ్ళ, నంబూరి, నున్న, పొత్తూరి, వడ్లమూడి. ఉయ్యూరి.

సంస్థానాలు - పరిపాలన

ఈస్ట్ ఇండియా కంపెనీ వారు భారత దేశాన్ని పరిపాలించు కాలంలో జమీందార్లుగా అల్లూరు వారు చించినాడను; ఉప్పలపాటి వారు ముత్త తలగ చీరాలను; సాగివారు సర్వసిద్ధిని; వత్సవాయి వారు తుని ని; భూపతిరాజు వారు రెవిడి, మద్గోలు, గోలుగొండ ప్రాంతాలను; పూసపాటి వారు కాశీపురం, కుమిలి, ఉప్పడ, రాజమండ్రి ప్రాంతాలను; అల్లూరి వారు చింతలపల్లి ప్రాంతాలను; కనుమూరి వారు రాజోలు ను; దంతులూరి వారు ఉరట్ల ప్రాంతాలను; చింతలపాటి వారు దార్లపూడి ప్రాంతాలను; పిన్నమరాజు వారు కొత్తకోట ప్రాంతాలను; కలిదిండి వారు మొగల్తూరు ప్రాంతాలను పరిపాలించారు. పల్నాడు యుద్ధంలో పాల్గొన్న సాగి పోతరాజు పెద్దాపురం పట్టాణాన్ని నిర్మించాడు. అమలరాజు విజయనగరంలో పూసపాడుని నిర్మించాడు. పూసపాటి వారు బెజవాడ (ఇప్పటి విజయవాడ) నగరాన్ని నిర్మించారు.

అపోహ

సూర్యవంశము వారు చంద్రవంశము వారి కంటే గొప్పవారని కొద్దిమందిలో అపోహ ఉంది. ఇది వాస్తవం కాదు. వాల్మీకి రామాయణం ప్రకారం చంద్రవంశానికి చెందిన మిధిల జనక మహారాజు తన కుమార్తె అయిన సీతాదేవిని సూర్యవంశానికి చెందిన ధశరధ మహారాజు కుమారుడైన శ్రీరాముడుకి ఇచ్చి వివాహం చేశాడు. చాళుక్యులు చంద్రవంశీయులు, చోళులు సూర్య వంశీయులు. రాజరాజచోళుని కుమార్తె 'సుతకందవ' తూర్పు చాళుక్యుడైన విమలాదిత్యుని భార్య. 1వ రాజేంద్ర చోళుని కుమార్తె అమ్మంగై దేవి తూర్పుచాళుక్య రాజకుమారుడు రెండవ రాజేంద్రుడు అనే కుళోత్తుంగుని భార్య. సూర్యవంశం కాకాతీయ సామ్రాజ్యానికి చెందిన గణపతి దేవుడు తన పెద్ద కుమార్తె రుద్రమదేవిని చంద్ర వంశం తూర్పు చాళుక్య రాజైన వీరభద్రునికి ఇచ్చి వివాహం చేశాడు, రెండవ చిన్న కుమార్తె గణపాంబను ధరణికోట రాజైన బెతరాజుకు ఇచ్చి వివాహం చేశాడు. ఇలా వేలాది సంవత్సరాల నుండీ సూర్య, చంద్ర వంశముల మధ్య వివాహములు జరుగుచున్నవి. అందువల్ల ఒక వంశము రెండవ వంశముపై ఆధిక్యత సంక్రమించదు. ఎవరి ఘనత వారిదే. కనుక ఆంధ్ర క్షత్రియులలో సూర్య, చంద్ర వంశములు సమానములే.[2].

అంతరించిపోతున్న ఆంధ్ర క్షత్రియులు

ఆధునిక కాలంలో పెద్ద చదువులు, ఆర్ధిక స్వేచ్చ, మితిమీరిన వ్యక్తిగత స్వేచ్చ వలన ఇతర కులస్తుల్లో యువతులవలె క్షత్రియ యువతులు కూడా విచ్చలవిడితనానికి అలవాటుపడి రహస్యంగా పారిపోయి ఇతర కులాలవారిని వివాహం చేసుకొవడం జరుగుతోంది. దీని ఫలితంగా క్షత్రియ వారసత్వం అంతరించిపోవుచున్నది. కొందరు క్షత్రియ యువకులు పేరు చివర "రాజు" లేక "వర్మ" అను పదములను తీసివేసి ఆధునిక పేర్లను పెట్టుకొనుచున్నారు. కొంతమంది కులస్తులు తాము కూడా క్షత్రియులమని చెప్పుకొనుచున్నారు. దీని ఫలితంగా ఇతర వర్ణములు నుండి అసలైన క్షత్రియులను గుర్తించుట సాధ్యం కాకపోవుచున్నది.

ప్రస్తుత స్థితి

భారతదేశం సార్వభౌమాధికార దేశంగా ఆవిర్భవించిన తర్వాత కేంద్ర పభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న జన్మతరహా క్షత్రియ కుటుంబాలను క్షత్రియ కులంగా వర్గీకరించింది. ఆ క్రమంలో ఆంధ్రదేశంలో ఉన్న జన్మతరహా క్షత్రియ కుటుంబాలవారు కూడా క్షత్రియులు (లేక రాజులు) గా వర్గీకరించబడ్డారు. అందువలన క్షత్రియులు అనగా నేడు ఒక కులం మాత్రమే. ప్రస్తుతం క్షత్రియుల జనాభా ఆంధ్రప్రదేశ్ లో కేవలం 1% మాత్రమే ఊన్నారు. ఒకప్పుడు రాజ్యాలేలిన వీరు, ప్రస్తుతం ప్రధానంగా వ్యవసాయం, వ్యాపారరంగం, పారిశ్రామిక రంగం, వివిధ సేవారంగాలైన విద్య, సినిమా, సాంకేతిక రంగం మొదలైన రంగాలలో విస్తరించి యున్నారు. ఈ రంగాలలో వీరు గణణీయమైన అభివృద్ధిని సాధించి, ఆంధ్రప్రదేశ్ సమాజంలో ప్రముఖులుగా పరిగణింపబడుతున్నారు. ఇటీవల వీరిలో చాలా మంది హైదరాబాదు నగరంలోనూ, అమెరికాలోనూ స్థిరపడ్డారు. నేడు ఆంధ్ర క్షత్రియుల్లో కొద్ది మంది మాత్రమే ధనవంతులుగా ఉన్నా చాలా వరకూ దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నారు. భారతదేశంలో రిజర్వేషన్ పద్ధతి ప్రకారం ఆంధ్ర క్షత్రియులు ఒ.సి విభాగానికి చెందుతారు. వీరికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ. అందుచేత రిజర్వేషన్ సిష్టమ్ కేవలం కులాన్ని బట్టి కాకుండా ఆర్ధిక స్థితిని బట్టి ఉంటే న్యాయమని సామాజిక విష్లేషకుల భావన.

సేవా సంస్థలు

క్షత్రియ సేవా సంస్థలు దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాపంగా ఏర్పడ్డాయి. అయితే వీటి సదస్సులు ఆర్ధికంగా వెనుకబడిన క్షత్రియ విద్యార్ధినీ విద్యార్ధులకు, వయో వృద్ధులకు మేలు జరిగే విధంగా కేవలం మహా నగరాల్లోనే కాకుండా గ్రామ స్థాయిలో కూడా నిర్వహించవలసిఉంది.

ఆంధ్ర క్షత్రియ ప్రముఖులు

ఇవీ చూడండి

బయటి లింకులు

మూలాలు

  1. Caste, Class and Social Articulation in Andhra Pradesh: Mapping Differential Regional Trajectories - by K. Srinivasulu Department of Political Science, Osmania University, Hyderabad
  2. శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరం -బుద్దరాజు వరహాలరాజు, 1970 వ సంచిక