క్షత్రియులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[File:Sahasrarjun Image.jpg|thumb|right|క్షత్రియుని తైలవర్ణచిత్రం.]]
[[File:Sahasrarjun Image.jpg|thumb|right|క్షత్రియుని తైలవర్ణచిత్రం.]]
'''క్షత్రియులు''' (Kshatriya) అనునది హిందూ మతములోని వేదాంతాల ప్రకారం చతుర్వర్ణాలలో రెండవది. మిగిలిన చతుర్వర్ణాలలాగే వృత్తి సూచకంగా ప్రారంభమైన క్షత్రియ వర్ణము మధ్యయుగాలలో జన్మతః సంక్రమించే కులంగా రూపాంతరం చెందింది. హిందూ మత గ్రంధాల ప్రకారం క్షత్రియులు యుద్ధ వీరులు, సామ్రాజ్యాలు పరిపాలించవలసినవారు. భారతీయ మత గ్రంధాలల్లో పేర్కొనబడిన శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు, గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు వంటి ఎందరో దైవస్వరూపులు క్షత్రియులు గా జన్మించారు. వట వృక్షము (మర్రి చెట్టు), దండము మరియు రెండు ఖడ్గాలతో కూడిన డాలు క్షత్రియుల చిహ్నాలుగా నిలుస్తాయి.
'''క్షత్రియులు''' (Kshatriya) అనునది హిందూ మతములోని వేదాంతాల ప్రకారం చతుర్వర్ణాలలో రెండవది. మిగిలిన చతుర్వర్ణాలలాగే వృత్తి సూచకంగా ప్రారంభమైన క్షత్రియ వర్ణము మధ్యయుగాలలో జన్మతః సంక్రమించే కులంగా రూపాంతరం చెందింది. హిందూ మత గ్రంధాల ప్రకారం క్షత్రియులు యుద్ధ వీరులు, సామ్రాజ్యాలు పరిపాలించవలసినవారు. భారతీయ మత గ్రంధాలల్లో పేర్కొనబడిన శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు, గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు వంటి ఎందరో దైవస్వరూపులు క్షత్రియులు గా జన్మించారు. వట వృక్షము (మర్రి చెట్టు), దండము మరియు రెండు ఖడ్గాలతో కూడిన డాలు క్షత్రియుల చిహ్నాలుగా నిలుస్తాయి. క్షత్రియుడు అనే పదానికి స్త్రీ లింగము - క్షత్రియాణి.


==చరిత్ర==
==చరిత్ర==

02:31, 8 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

దస్త్రం:Sahasrarjun Image.jpg
క్షత్రియుని తైలవర్ణచిత్రం.

క్షత్రియులు (Kshatriya) అనునది హిందూ మతములోని వేదాంతాల ప్రకారం చతుర్వర్ణాలలో రెండవది. మిగిలిన చతుర్వర్ణాలలాగే వృత్తి సూచకంగా ప్రారంభమైన క్షత్రియ వర్ణము మధ్యయుగాలలో జన్మతః సంక్రమించే కులంగా రూపాంతరం చెందింది. హిందూ మత గ్రంధాల ప్రకారం క్షత్రియులు యుద్ధ వీరులు, సామ్రాజ్యాలు పరిపాలించవలసినవారు. భారతీయ మత గ్రంధాలల్లో పేర్కొనబడిన శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు, గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు వంటి ఎందరో దైవస్వరూపులు క్షత్రియులు గా జన్మించారు. వట వృక్షము (మర్రి చెట్టు), దండము మరియు రెండు ఖడ్గాలతో కూడిన డాలు క్షత్రియుల చిహ్నాలుగా నిలుస్తాయి. క్షత్రియుడు అనే పదానికి స్త్రీ లింగము - క్షత్రియాణి.

చరిత్ర

పూర్వం ఒక వ్యక్తి యొక్క గుణం, ప్రవర్తన బట్టి క్షత్రియ హోదా ఉండేది. వేద కాలంలో కులాన్ని బట్టి కాక వృత్తి బట్టి క్షత్రియ హోదా మొదటి స్థానంలో ఉండేది. తర్వాత బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు ఉన్నాయి. అయితే క్షత్రియులు వ్యవసాయం కూడా చేసేవారని కొన్ని ఆధారాలున్నాయి. కోసల, కాశీ సామ్రాజ్యపు రాజులు ఒక మంచి ఉదాహరణ.

విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరశురాముడు ఇక్ష్వాకుల్ని మినహాయించి మిగతా క్షత్రియుల్ని అంతం చేశాడని కధలు చెబుతున్నాయి. అయితే వేద కాలం తర్వాత క్షత్రియుల స్థానాన్ని బ్రాహ్మణులు మొదటి స్థానం ఆక్రమించారు. వైదిక సిద్దాంతం ప్రకారం మను కి 50 మంది కొడుకులు. రాజు మరియూ పూజారి అయిన మను యొక్క కుమారులైన మానవులందరూ ఉత్తమ జన్మ ఎత్తారు. వారి వారి వృత్తుల్లో తేడాలను బట్టి కులాలు , జాతులు ఏర్పడ్డాయి. వేదాలు చదివిన వారు బ్రాహ్మణులుగాను, వ్యాపారులు వైశ్యులుగాను, కూలివారు శూద్రులుగాను, పరిపాలించేవారు క్షత్రియులు గానూ ఏర్పడ్డారు.

ఒక పురాణ గాధ ప్రకారం క్రీస్తు శకం 6వ శతాబ్దంలో అగస్త్య మహర్షి యజ్ఞం చేయగా దానిలోంచి రాజ్పుట్లు, ధాకూర్ లు పుట్టుకొచ్చారు. ఝాట్స్ - సూర్య, చంద్ర, యాదువంశీయులను కలుపుకున్నట్లుగా , రాజ్ పుట్స్ కూడా ఆంధ్ర క్షత్రియులతో సహా మరి కొన్ని క్షత్రియ జాతులను కలుపుకున్నది. గుజ్జారులు చాలావరకూ సూర్యవంశానికి చెందినవారని తెలుస్తోంది. ప్రస్తుతానికి వివిధ రాష్ట్రాల్లో క్షత్రియులు ఈ క్రింది విధాలుగా పిలువబడుచున్నారు.

  • ఆంధ్ర ప్రదేశ్ - క్షత్రియులు, రాజులు;
  • కర్నాటక - రాజులు;
  • కేరళ - రాజా, వర్మ;
  • తమిళనాడు - రాజా;
  • రాజస్థాన్ - రాజ్పుట్;
  • ఉత్తర ప్రదేశ్ - సింగ్;
  • మధ్యప్రదేశ్ - టాకూరు, సింధియా;
  • బెంగాల్ - బోస్;
  • హర్యానా - వర్మ;
  • కాశ్మీర్ - సింగ్;
  • గుజరాత్ - సోలంకి.

వంశాలు

క్షత్రియులకు వంశాలు నాలుగు. అవి ఏమనగా 1. సూర్యవంశం, 2. చంద్రవంశం, 3. అగ్నివంశం, 4. నాగవంశం.

  • సూర్యవంశం : సూర్యవంశాన్ని ఇక్ష్వాకుడు స్ఠాపించాడు. కనుక ఈ వంశాన్ని ఇక్ష్వాకు వంశమని కూడా అందురు. రామాయణంలో శ్రీరాముడు, జైనమతాన్ని స్థాపించిన వర్ధమాన మహావీరుడు ఈ వంశానికి చెందినవారు. పంజాబి క్షత్రియులైన కత్రియులు, రాజస్థానీ క్షత్రియుల్లో 10 రాజ్పుట్స్ తెగలు, ఆంధ్ర ప్రదేశ్ లో రాజులు (ఆంధ్ర క్షత్రియులు) ఈ వంశానికి చెందినవారు.
  • చంద్రవంశం : క్రీస్తు పూర్వం సుమారు 3000 సంవత్సరాల క్రితం జీవించిన శ్రీకృష్ణుడు చంద్రవంశంలో గొప్పవాడు. చంద్రవంశంలో వృషిణి తెగకు చెందిన శ్రీకృష్ణుడు వేద వ్యాసుడు వ్రాసిన మహాభారత గ్రంధంలో భగవంతుడిగా పేర్కొనబడ్డాడు.
  • అగ్నివంశం : బధారియ, చౌహాన్, పరిహార్, పన్వర్ మరియు సోలంకి మొదలగు తెగలు అగ్నివంశానికి చెందినవారు.ఆజ్మీర్ ను పరిపాలించిన పృధ్వీరాజ్ చౌహాన్ అగ్నివంశంలో గొప్పవాడు, ఆఖరివాడు.
  • నాగవంశం : నాగుపాములను పూజించే తెగ నాగవంశం. వీరు ప్రధానంగా శైవులు. వీరిలో నైర్, బంట్, సహారన్ రాజ్పుట్స్, బైస్ రాజ్పుట్స్, నాగ రాజ్పుట్స్, తక్షక్ రాజ్పుట్స్ , జాట్ తెగలు ఉన్నాయి.

దేశ, ప్రపంచ వ్యాపంగా క్షత్రియ జాతులు

క్షత్రియునిగా జన్మించిన గౌతమ బుద్ధుడు.
  • వాయువ్వ భారత దేశం: అహిర్, జాట్స్, గుజ్జారులు, రాజ్పుట్స్
  • ఈశాన్య భారతదేశం: మణిపురి క్షత్రియ, అహొం, త్రిపురి క్షత్రియ
  • నేపాల్, హిమాలయాలు: పహారి రాజ్పుట్స్, ఛెత్రి, శ్రేష్ట, శాక్య, థకురి, థప
  • డెక్కన్ భారతదేశం: 96 కులి మరాఠాలలో ఒక తెగయైన మరాఠ, క్షత్రియ రాజులు (ఆంధ్ర క్షత్రియులు)
  • తూర్పు భారతదేశం: థాకూర్, ఖండాయత్
  • దక్షిణ భారతదేశం: తమిళ క్షత్రియ, తులునాడు క్షత్రియ, కూర్గులు (కొడవులు), సామంత క్షత్రియులు
  • ఇండోనేషియా: బాలనీయులు, జవనీయులు

క్షత్రియ జాతుల వివరణ

అహీరాలు (లేక అభీరాలు): వీరికే యాదవులు అని పేరు. బీహార్, బెంగాల్, తూర్పు దిశ మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో కన్పిస్తారు. ప్రధానంగా వీరు పశువులను మేపుకుంటారు. వీరిని పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ లో 'అహిర్' అని; బెంగాల్, ఒరిస్సాలలో 'గోవాలా' లేక 'సద్గోప' అని; మహారాష్ట్రలో 'ధన్గార్' అని, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లలో 'యాదవులు' లేక 'కురూబులు' అని; తమిళనాడులో 'ఇదియాన్' లేక 'కొనార్' అని అందురు. ఇరానీ స్కైతీయులు, కుషాణుల చేత వీరు భారతదేశానికి తరుమబడ్డారు. తర్వాత క్రీస్తు శకం 108 లో మార్వా, సౌరాష్ట, మహారాష్ట్ర ప్రాంతాల్లో వారి సామ్రాజ్యాన్ని స్థాపించి 167 సంవత్సరాలు పాలించారు. ర మండలిక మొదటి రాజు. భుభన్ సింహ ఆఖరి రాజు. కిరాతుల దాడితో ఆహీరా సామ్రాజ్యం కూలిపోయింది. మహాభారతంలో శ్రీ కృష్ణుడు ఈ తెగకు చెందినవాడైయుండవచ్చును.గొల్ల కులస్తులు యాదవులు కాదు.

జాట్స్: వీరు పంజాబ్, హర్యానా, బెలుచిస్థాన్, జమ్ము, కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉండే ఇండో ఆర్యన్ తెగలు. రాజ్పుట్స్ వలే వీరు కూడా యుద్ధ వీరులు. మహారాజా సూరజ్ మల్ వీరి పూర్వీకుడు. జాట్స్ తెగలలో 36 రాజవంశాలు ఉన్నాయి.

గుజ్జారులు (లేక గుర్జారులు): వీరు ఇండియా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ లో కన్పిస్తారు. గుజ్జారులు జన్మస్థానం తెలియదు కాని భారతదేశంలో హూణుల పాలన సమయంలో ఉన్నారు. 6 నుండి 12 శతాబ్దాలలో వీరు క్షత్రియులు, బ్రాహ్మణులుగా విభజింపబడ్డారు. దక్షిణ ఆసియాను ముస్లిములు పాలించినప్పుడు వీరిలో చాలా వరకూ ఇస్లాం మతంలోకి చేరారు. రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వీరిని వెనుకబడిన తరగతులుగా పరిగణింపబడుచున్నారు. హిందూ గుజ్జారులలో చాలా వర్ణాలు ఉన్నాయి. గుజ్జారుల్లో చాలా వరకూ సూర్యవంశానికి చెందినవారు. రాజస్థాన్ లో భిన్మల్ అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకుని కొంత ప్రాంతాన్ని పాలించారు. ఇండియాలో గుజ్జారులు హర్యానా, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పడమర ఉత్తరప్రదేశ్ లలో కన్పిస్తారు. పండితుడు వి.ఎ స్మిత్ ప్రకారం అజ్మీర్ ను పాలించిన అగ్నికుల రాజ్పుట్ - సామ్రాట్ పృద్వీరాజ్ చౌహాన్ (1149 - 1192) గుజ్జార జాతికి చెందినవాడు. గుజ్జారుల్లో సిక్కులు కూడా ఉన్నారు. గుజ్జారుల్లో రాజవంశాలు - గుర్జార-ప్రతిహార, సోలంకి, చౌహాన్, తోమర, పార్మర, కసన గోత్రీయులు, మరియూ ఛప


రాజ్పుట్స్: ఉత్తర భారతదేశానికి చెందిన యుద్ధ వీరుల్లో ఒక జాతి. వీరు ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, జమ్ము, మధ్యప్రదేశ్, పంజాబ్, బీహార్, ఉత్తరాంచల్ వంటి రాష్ట్రాల్లోనే కాకుండా పాకిస్తాన్లో కూడా కన్పిస్తారు. వీరికి గుజ్జారులతోనూ,ఆంధ్ర క్షత్రియులతోనూ వివాహ సంబంధాలుండేవి. 6 నుండి 12 వ శతాబ్దాలవరకూ పంజాబ్, రాజస్థాన్, కాశ్మీర్, సౌరాష్ట్ర రాజ్యాలు పాలించారు. వీరికి సూర్య, చంద్ర, అగ్ని వంశాలున్నాయి. మహారాణా ప్రతాప్, రాజా మాన్ సింగ్ వంటి ఎందరో మహారాజులు ఈ జాతికి చెందినవారు. సూర్య వంశంలో తెగలు - బైస్ రాజ్పుట్, ఛత్తర్, గౌర్ రాజ్పుట్, ఖచ్వాహ, మిన్హాస్, పఖ్రాల్, పుందిర్, నారు, రాథోర్, సిసోడియ, సహారన్; చంద్రవంశంలో తెగలు - భటి రాజ్పుట్, ఛండెల, జాడన్, జడేజ, ఛూడసమ, కతోచ్, భంగాలియ, పహోర్, సవోమ్, తొమార; అగ్నివంశంలో తెగలు - భాల్, చౌహాన్, మోరీ, నాగ, పరమర, సోలంకి.


మణిపురి క్షత్రియులు: వీరు మణిపూర్ రాష్ట్రంలో మైతేయి తెగ మరియూ మరో 3 తెగల నుండి ఆవిర్భవించిన వాళ్ళు. క్రీస్తు శకం 1720లో వీరు హిందూ మతాన్ని స్వీకరించి క్షత్రియులలో కలిసారు. వీరిలో 7 తెగలు ఉన్నాయి.


అహోం: వీరు అస్సాంలో బ్రహ్మపుత్ర లోయ ప్రాంతాన్ని 6 శతాబ్దాలపాటూ, అనగా 1228 నుండి 1826 వరకూ పరిపాలించారు. ఈ సామ్ర్యాజ్యాన్ని చైనాకు చెందిన 'సుఖఫా' అను థాయ్ రాజు స్థాపించాడు. మోరానుల యుద్ధంతో అహోం సామ్రాజ్యం క్షీణించి , బర్మా చేత ఆక్రమింపబడి చివరకు 1826లో బ్రిటీషు పాలనలోకి వచ్చింది. అహోం సామ్రాజ్యాన్ని మొత్తం 41 మంది రాజులు పాలించారు. పురంధర్ సిన్హా అహోం ఆ ఆఖరి రాజు.


త్రిపురి క్షత్రియులు: వీరిలో త్రిపురి, రియాంగ్, జమాతియా, నవోతియ తెగలు ఉన్నాయి. త్రిపుర రాష్ట్రంలో నేటికి రాచరికపు పాలన కొనసాగుతోంది. బెంగాలీ భాషలో వ్రాయబడిన 'రాజ్ మాల' (త్రిపుర రాజుల వంశావళి) ప్రకారము మాణిక్య సామ్రాజ్యంలో 15వ శతాబ్దం మొదలు 2006 వరకూ 185 రాజులు పరిపాలించారు. బిర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య ఆఖరి రాజు 1947 లో మరణింఛాడు. ప్రస్తుత రాజు - మహారాజా కృత్ ప్రద్యోత్ దెబ్ బర్మన్ మాణిక్య బహదూర్.


పహారీ రాజ్పుట్స్: వీరు భారత దేశ పాలన ఉన్న జమ్ముకాశ్మీర్, పాకిస్థాన్ పాలన ఉన్న జమ్ముకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియూ ఉత్తరాఖండ్ లలో ఉన్న పిర్ పింజల్ వాలు ప్రాంతాల్లో నివసిస్థారు. వీరిలో ఇస్లాం మంతం స్వీకరించిన వారు కూడా ఉన్నారు. ఇస్లాం మంతం స్వీకరించిన రాజ్పుట్స్ ని ముస్లిం రాజ్పుట్స్ అని అందురు. పహారీ రాజ్పుట్స్ లో వంశావళి - బధన్, పరిహార్ రాజ్పుట్, బైస్, భట్టి, బొంబా, ఛంబియల్, చౌహాన్, చిబ్, దొర్గా/ఛత్తర్, దొమాల్, దౌలీ, జాన్జువా, జర్రాల్, ఖఖా, ఖోఖర్, మంగ్రల్, మన్హాస్, నర్మా, సుల్ హ్రీయా, సా, లాల్హాల్, థాకార్.


ఛెత్రి: వీరు నేపాల్ దేశపు క్షత్రియులు. వీరిలో ఖాసా మరియు థాకూరి వంటి రాజవంశాలు ఉన్నాయి. 16 వ శతాబ్దంలో షా సామ్రాజ్యాన్ని యషో బ్రహ్మ షా అనే వాడు స్థాపించాడు. నేపాల్ లో రాచరికం 1768 లో మొదలయ్యి 2008 వరకూ కొనసాగింది. మొదటి రాజు - మహారాజాధిరాజ పృధ్వీ నారాయణ్ షా. ఆఖరి రాజు - మహారాజాధిరాజ జ్ణానేంద్ర బిర్ బిక్రమ్ షా దేవ్.


శ్రేష్ట: నేపాల్ దేశంలో ఉండే వీరు ప్రధానంగా వర్తకులు. 'నెవార్' సంతతికి చెందిన వీరు ఖట్మండులో కన్పిస్తారు.


శాక్యులు: వీరు నేపాల్ దేశాని క్రీస్తు పూర్వం 650–500 మధ్య పాలించారు. వీరిలో ప్రముఖుడు బౌద్ధ మతాన్ని స్థాపించిన సిద్ధార్ధ గౌతముడు (గౌతమ బుద్ధుడు).


థకూరి: వీరు కూడా నేపాల్ ను పాలించిన రాజులు. క్రీస్తు శకం 879 లో రాఘవ దేవ థకూరి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. రాఘవదేవ తర్వాత నేపాల్ ను 12 వ శతాబ్దం మధ్య వరకూ చాలా థకూరి రాజులు పాలించారు.


థప: థప అనేది నేపాల్ దేశంలో ఛెత్రి మరియూ మగర్ జాతులకు చెందిన ఇంటిపేరు. థప ఛెత్రిలు - టిబెట్, ఉత్తర భారతదేశం, మరియూ ఆఫ్ఘనిస్థాన్ దేశాల సంకర జాతి, థప్ మగర్ లు ఉత్తర నేపాల్ మరియూ దక్షిణ టిబెట్ కు చెందిన వారు. షింటూ సతి నెన్ అనే రాజు కంగ్వాచన్ అనే సామ్రాజ్యాన్ని పాలించాడు. భీమ్ సేన్ థప నేపాల్ మొదటి ప్రధాన మంత్రి.


కులీ మరాఠాలు: మహారాష్ట్ర, గోవా, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కనిపించే వీరిలో 96 తెగలు ఉన్నాయి. భోన్స్లే తెగకు చెందిన ఛత్రపతి శివాజి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు.


రాజులు: ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి వంటి కోస్తా జిల్లాలలో కనిపించే వీరినే ఆంధ్ర క్షత్రియులు లేక క్షత్రియ రాజులు అని అందురు. సూర్య వంశానికి, చంద్ర వంశానికి చెందిన వీరు తూర్పుచాళుక్యులు, విష్ణుకుండినులు, కాకతీయ, వర్ణాట, గజపతి, ఛాగి, పరిచెద, ధరణికోట, కళింగ విజయనగర సామ్ర్యాజ్య వంశస్థులు. హిందూ పురాణాలు, బౌద్ధ , జైన మత గ్రంధాలు ప్రకారం వీరు క్రీస్తు పూర్వమే ఉత్తర భారతదేశం నుండి కోస్తాంధ్రకు వలస వచ్చారు. వీరికి రాజ్పుట్స్ తో వివాహ సంబంధాలుండేవి. నేడు వీరి జనాభా కేవలం 1.2% మాత్రమే. ఆంధ్ర క్షత్రియులు రాయలసీమలోనూ మరియూ తమిళనాడు - రాజపాలయం లోనూ, అమెరికాలోనూ కొద్దిగా కన్పిస్తారు.


థాకూర్: వీరు నైరుతి భారత దేశంలో గుర్జార-ప్రతిహార మరియూ కుషాణుల సామ్రాజ్యాల వారసులయి ఉండవచ్చును. థాకూర్ అనే పదాన్ని రాజస్థాన్ రాజ్పుట్స్, జాట్స్ బిరుదుగా వాడతారు, బెంగాల్లో బ్రాహ్మణులు థాకూర్ పదాన్ని టాగూర్ అనే బిరుదు గా వాడతారు.


ఖండాయత్ లు: వీరు ఒరిస్సాను 16 వ శతాబ్దంలో పాలించారు. ఖండాయత్ లలో గోవింద విద్యాధర (1542-1559Ad.) అనే రాజు గజపతిరాజుల్లో ఆఖరి రాజైన కాఖా రుద్రదేవుడుని హతమార్చి 'భోయ్' సామ్రాజ్యాన్ని స్థాపించాడు.


తమిళ క్షత్రియులు: వన్నియకుల క్షత్రియులు లేక పల్లీలు అనబడే వీరు తమిళనాడు, కేరళ లలోని చాలా ప్రాంతాలు పాలించారు. తమిళనాడులో వీరిని గౌండర్, పదయాశ్చి, నైఖర్, రెడ్డియార్, కందర్, పల్లి అని; పాండిచ్చెరిలో - వన్నియార్, రెడ్డియార్, పదయాశ్చి అని, కర్ణాటక లో తిగల/తిగలారు అని; ఆంధ్ర ప్రదేశ్ లో అనామకులు, ఆర్యమాల, బావురి, ఆగ్నికుల, వన్నె కాపు, వన్నె రెడ్డి అని పిలుస్తారు. పల్లవ రాజుల కాలంలో వీరు సైనికులుగా, సైన్యాధ్యక్షులుగా పనిచేశారు.


తులునాడు క్షత్రియ: వీరినే బంట్స్ లేక బంట్లు అని అందురు. నాగవంశానికి చెందిన వీరు కర్ణాటకలో ఉన్న తులునాడులో కన్పిస్తారు. అలుపాస్ అనే బంట్లు కేరళలో కాసరగోడు నుండి కర్ణాటకలో గోకర్ణ వరకు బంట్లు 'అల్వ ఖేద' సామ్రాజ్యాన్ని స్థాపించి క్రీస్తు శకం 450 C.E నుండి 1450 C.E వరకు పాలించారు. ఉడిపి, మంగళూరు, బొంబాయి లో కూడా వీరు కన్పిస్తారు. వీరిని నాయక, నాడవ, శాస్త్రే (లేక శెట్టి) అని కూడా అందురు.


కూర్గులు (కొడవులు): కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కొడగు జిల్లాలో కన్పించే వీరు వ్యవసాయదారులు మరియూ యుద్ధ వీరులు. స్కంద పురాణం ప్రకారం చంద్రవంశ క్షత్రియుడైన చంద్రవర్మ వీరి పూర్వీకుడని చెప్పవచ్చు.


సామంత క్షత్రియులు: నాగవంశానికి, చంద్ర వంశానికి చెందిన వీరు కేరళ రాష్ట్రంలో కన్పిస్తారు. నైర్ (లేక నాయర్) అనేది వీరి మరో పేరు. సామంత క్షత్రియులలో - ట్రావన్కోర్, థంపన్, తిరుమల్ పడ్ వంటి రాజవంశాలు చంద్రవంశానికి చెందినవి. మార్తాండ వర్మ (1729–1758) ట్రావన్కోర్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు.


బాలనీయులు: నాగవంశానికి చెందిన వీరు ఇండోనేషియాలో ఉన్న బాలి అనే ద్వీపంలో కన్పిస్తారు. దేవ అగుంగ్ (1686-c. 1722) బాలీ ద్వీపాన్ని 500 సంవత్సరాల క్రితం పాలించాడు. ఇంచుమించు బాలనీయ క్షత్రియులందరూ దేవ అగుంగ్ వారసులే. క్రీస్తు శకం 914లో శ్రీ కేసరి వర్మ దేవ 'వర్మ దేవ' సామ్రాజ్యాన్ని స్థాపించాడు. క్రీస్తు శకం 1133 లో శ్రీ జయశక్తి 'జయ' సామ్రాజ్యాన్ని స్థాపించాడు.


జవనీయులు: వీరు ఇండోనేషియా - జావా ద్వీపంలో కన్పిస్తారు. అక్కడ వీరిని ఖ్బో అని, మహిస అని, రంఘ అని పిలుస్తారు. జావాను పాలించిన రాజుల్లో చాలా మంది వైశ్య కులానికి చెందినవారు. 17 వ శతాబ్దంలో ఇస్లాం దాడుల వలన జావనీయులు అంతరించిపోయారు. ఇప్పుడు జావా ద్వీపంలో కేవలం బాలనీయులు, మరియూ ఇతర కులస్తులు మాత్రమే ఉన్నారు.

అపోహ

చంద్రవంశము కంటే సూర్యవంశము గొప్పది అని కొద్ది మందిలో అపోహ ఉన్నది. రామాయణం ప్రకారం సూర్యవంశానికి చెందిన దశరధ మహారాజు కుమారుడైన శ్రీరాముడు చంద్రవంశానికి చెందిన మిధిల జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవిని వివాహమాడాడు. చాళుక్య చోళ వంశాలకు మధ్య కూడా వివాహాలు జరిగేవి. ఇలా వేలాది సంవత్సరాల నుండి సూర్య చంద్ర వంశాల మధ్య వివాహాలు జరుగుతున్నాయి. రెండు వంశాల వారు సామ్రాజ్యాలు పాలించారు కనుక ఒకరి పై ఒకరికి ఆధిపత్యము లేదు. అందువలన సూర్య చంద్ర వంశాలు రెండు సమానములే.

ఇవీ చూడండి

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.