వరాహమిహిరుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox person
| name = वराहमिहिर<br>Varāhamihir
| image =
| imagesize =
| alt =
| caption =
| pseudonym =
| birth_name = <big>మిహిరుడు</big>
| birth_date = 505 CE
| birth_place = [[ఉజ్జయిని]]
| death_date = 587 CE
| death_place =
| occupation = భారత ఖగోళ శాస్త్రవేత్త<br />, భారతీయ గణిత శాస్త్రవేత్త,<br /> హిందూ జ్యోతిష శాస్త్రవేత్త
| other names = వరాహమిహిరుడు
| nationality = భారతీయుడు
| ethnicity =
| citizenship =
| education =
| alma_mater =
| period = గుప్తుల కాలం
| genre =
| subject =
| movement =
| notableworks = పంచ సిద్ధాంతిక, బృహత్ సంహిత
| spouse =
| partner =
| children =
| relatives =
| influences =
| influenced =
| awards =
| signature =
| signature_alt =
| website =
| portaldisp =
}}


'''దైవజ్ఞ వరాహమిహిర''' '''Daivajna Varāhamihira''' ([[సంస్కృత భాష|సంస్కృతం]] : वराहमिहिर; [[505]] – [[587]]), లేదా వరాహమిహిరుడు, లేదా వరాహ, లేదా మిహిర. భారత [[ఖగోళ శాస్త్రజ్ఞుడు]], [[గణిత శాస్త్రజ్ఞుడు]], మరియు [[జ్యోతిష్య శాస్త్రవేత్త]]. [[ఉజ్జయిని]] లో ఒక విశ్వకర్మ బ్రాహ్మణ వంశం లో జన్మించాడు. [[చంద్రగుప్త విక్రమాదిత్యుడు II|చంద్రగుప్త విక్రమాదిత్య]] ఆస్థానములోని 'నవరత్నాల'లో ఒకడు.
'''దైవజ్ఞ వరాహమిహిర''' '''Daivajna Varāhamihira''' ([[సంస్కృత భాష|సంస్కృతం]] : वराहमिहिर; [[505]] – [[587]]), లేదా వరాహమిహిరుడు, లేదా వరాహ, లేదా మిహిర. భారత [[ఖగోళ శాస్త్రజ్ఞుడు]], [[గణిత శాస్త్రజ్ఞుడు]], మరియు [[జ్యోతిష్య శాస్త్రవేత్త]]. [[ఉజ్జయిని]] లో ఒక విశ్వకర్మ బ్రాహ్మణ వంశం లో జన్మించాడు. [[చంద్రగుప్త విక్రమాదిత్యుడు II|చంద్రగుప్త విక్రమాదిత్య]] ఆస్థానములోని 'నవరత్నాల'లో ఒకడు.



13:49, 8 మార్చి 2013 నాటి కూర్పు

वराहमिहिर
Varāhamihir
జననం
మిహిరుడు

505 CE
మరణం587 CE
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లువరాహమిహిరుడు
వృత్తిభారత ఖగోళ శాస్త్రవేత్త
, భారతీయ గణిత శాస్త్రవేత్త,
హిందూ జ్యోతిష శాస్త్రవేత్త


దైవజ్ఞ వరాహమిహిర Daivajna Varāhamihira (సంస్కృతం : वराहमिहिर; 505587), లేదా వరాహమిహిరుడు, లేదా వరాహ, లేదా మిహిర. భారత ఖగోళ శాస్త్రజ్ఞుడు, గణిత శాస్త్రజ్ఞుడు, మరియు జ్యోతిష్య శాస్త్రవేత్త. ఉజ్జయిని లో ఒక విశ్వకర్మ బ్రాహ్మణ వంశం లో జన్మించాడు. చంద్రగుప్త విక్రమాదిత్య ఆస్థానములోని 'నవరత్నాల'లో ఒకడు.

ఉజ్జయిని నగరానికి సమీపంలో క్రీ.శ 4 వ శతాబ్దంలో ఆదిత్యదాసుడనే జ్యోతిశ్శాస్త్ర పండితునకు జన్మించాడు మిహిరుడు. తండ్రి వద్ద గణిత జ్యోతిశ్శాస్త్రములు నేర్చుకున్న మిహిరుడు పాట్నా లో నాటి సుప్రసిద్ధ గణీత శాస్త్రవేత్త ఆర్యభట్టు ను కలుసుకొని ఆయనతో శాస్త్ర చర్చ జేశాడు. అనంతరము ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలను అధ్యయనం జేయాలని నిర్ణయించుకొని అసాధారణ కృషి సలిపారు. ఆయన నిరంతర అధ్యయన ఫలితాలు అతని గ్రంధాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

శాస్త్రాలే గాక, పత్యేకించి గ్రీకు శాస్త్రాలు అధ్యయనం జేసినట్లు అక్కడకు వెళ్ళీ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో గణిత శాస్త్రజ్ఞుడైనా అనేక శాస్త్ర విషయాలను వివరించారు.

అనతి కాలంలో ఉజ్జయిని గొప్ప విద్యా కేంద్రము, అక్కడ కళలు, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రము అనే అంశాలలో ప్రసిద్ధులైన ఎందరో పండితులు సుదూరాల నుంచి వచ్చేవారు. పరస్పర భావ వినిమయం వుండేది. అచ్చటి శాస్త్ర చర్చలలో మిగిరుని శాస్త్ర పటిమ తెలియ వచ్చిన రెండవ విక్రమాదిత్య చంద్ర గుప్తుడు తన ఆస్థాన మండలి నవరత్నములలో నొకనిగా ఆయనకు గౌరవించాడు. దీనికి సంబంధించిన ఒక సంఘటన చెప్తారు. విక్రమాదిత్యుని కుమారుడు వరాహము కారనంగా మరణిస్తాడని మిహిరుడు జ్యోతిషము చెప్పగా రాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతో కట్టుదిట్టము చేసినా శాస్త్ర ప్రకారము చెప్పిన సమయానికి, చెప్పిన కారనముగానే రాకుమారుడు మరణిస్తే విక్రమాదిత్యుడు తన కుమారుని గతికి విలపించినా మిహిరుని ప్రతిభను శ్లాఘించి మగధ సామ్రాజ్య గౌరవ చిహ్నము వరహముద్రాంకితముతో సత్కరించాడు. నాటి నుంచి ఆ జ్యోతిః శాస్త్ర వేత్త వరాహమిగిరుడుగా పిలువబడ్డాడు. వేదాలన్నీ చదివి ఎంతో పండితుడైనా మానవాతీత శక్తులను గ్రుడ్డిగా నమ్మేవాడు కాడు. అతనొక అద్భుత శాస్త్రవేత్త!

సిద్ధాంత స్కందానికి చెందిన "పంఛా సిద్ధాంతిక" అనే గ్రంధంము దేశంలో అతి ప్రాచీన కాలము నుండి ప్రచారంలో ఉన్న పైతాహహ, వాశిష్ట, రోమిక, పౌలిక, సౌర సిద్ధాంతాల సారాన్ది సంకలనము చేసిన రూపము. వీనిలో సౌర సిద్ధాంతము ఉన్నతమైనదని తెలిపాడు. వేధకు సరిపోయేటట్లు వున్న ప్రాచీన సూర్య సిద్ధాంతాన్ని వెయ్యికి పైబడిన సంవత్సరము అనంతరం చేయబడిన పరిశోధనలు, స్వకల్పనలతో మార్చి గ్రంధస్తము చేశాడు. దీనికి తప్ప మిగిలిన నాల్గు సిద్ధాంతాలకు మూల గ్రంధాలు లభింపక పోవుటచే వాటిని తన గ్రంధ రూపంలో అందించిన వరాహ మిహిరునికి ఎంతో ఋణపడి ఉన్నాము.

జ్యోతిష ఫల విభాగానికి చెందిన బృహ జ్ఞాతకములో 26 అధ్యాయాలు, 417 శ్లోకాలు ఉన్నాయి. దీనినే హోరా శాస్త్రమని పిలిచాడు. ఇలాంటి రచనలకు సాధారణంగా వాడే ఛందస్సులు గాక వృత్తులలో విషయాలను అందంగా అందించాడు. దీనికి సహాయకారిగా సవాంశ గణీతం కూడా రచించాడు. ఈ రెండు గ్రంధాలు ఆధారంగా సరియైన జ్యోతిష ఫలితాలు వస్తాయని ప్రతీతి. నేటి వరకు గూడా ప్రచారంలో వున్నదీ శాస్త్రము

బృహత్సంహితలో గ్రహాల సంచారము, వాటి వలన భూమి మీద ప్రాణులకు కలుగు ఫలాలు, నక్షత్ర మండల ఉదయాదుల వల్ల ఫలితాలు, మేఘాలు, గర్భధారణ, భూకంప ఉల్క పాతములు, ఇంద్ర ధనుస్సు, ప్రతి సూర్యుడు, పిడుగు పడటం వంటి అనేక సృష్టి వైచిత్రాలు, శకున ఫలములు, వాస్తు ప్రకరణము, భూమిలో రకాన్ని బట్టి ఎంత లోతున నీళ్ళు దొరుకుతుందనే విషయం, వృక్షాయర్వేదము, వజ్ర లెపనము, జంతువులు, మణుల పరీక్ష తిధి, గోచార ఫలితాలు వంటి అనేక విషయాలు విస్తారంగా తెలియ జేశాడు.


బయటి లింకులు