కోట సామ్రాజ్యము: కూర్పుల మధ్య తేడాలు
పంక్తి 34: | పంక్తి 34: | ||
==జమీందారులు== |
==జమీందారులు== |
||
కోట సామ్రాజ్యపు వంశస్తులైన ధనుంజయ గోత్రపు రాజులు (భూపతిరాజు, దాట్ల, కలిదిండి, దంతులూరి గృహనామాలు కలవారు) ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పరిపాలించు కాలములో రెవిడి, మద్గోలు, గోలుగొండ, దార్లపూడి, ఉరట్ల, మొగల్తూరు ప్రాంతాలకు సామంతులుగా, |
కోట సామ్రాజ్యపు వంశస్తులైన ధనుంజయ గోత్రపు రాజులు (భూపతిరాజు, దాట్ల, కలిదిండి, దంతులూరి గృహనామాలు కలవారు) ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పరిపాలించు కాలములో రెవిడి, మద్గోలు, గోలుగొండ, దార్లపూడి, ఉరట్ల, మొగల్తూరు ప్రాంతాలకు సామంతులుగా, జమీందార్లుగా వ్యవహరించారు. భారత దేశం సార్వభౌమ అధికార దేశంగా అవతరించిన తర్వాత జమీందారీ వ్యవస్త అంతరించింది. |
||
==అపోహ== |
==అపోహ== |
06:55, 12 మార్చి 2013 నాటి కూర్పు
పరిచయం
ధరణి కోట వంశము | |
---|---|
800–1200 | |
స్థాయి | సామ్రాజ్యము |
రాజధాని | ధరణికోట (గుంటూరు) |
సామాన్య భాషలు | తెలుగు |
మతం | జైన మతం |
ప్రభుత్వం | Monarchy |
చరిత్ర | |
• స్థాపన | 800 |
• పతనం | 1200 |
చాళుక్య చోళ సామ్రాజ్యాలు అస్తమించిన తర్వాత కాకతీయ సామ్రాజ్యం స్థాపించబడువరకూ గడచిన మధ్య కాలంలో సామంతరాజులు స్వతంత్రులైయ్యారు. అట్టి వారిలో కోట వంశీయులు ఒకరు. వీరు ధరణికోటను రాజధానిగా చేసుకొని ద్రాక్షారామం (తూర్పుగోదావరి జిల్లా), త్రిపురాంతకం (ప్రకాశం జిల్లా), తాడికొండ (గునూరు జిల్లా), యనమందల (తూర్పు గోదావరి జిల్లా), నటవాడి (నెల్లూరు జిల్లా) ప్రాంతాలను 12వ శతాబ్దం నుండీ సుమారు 400 సంవత్సరాల పాటూ పాలించారు. కోట సామ్రాజ్యాన్ని తూర్పుచాళుక్య వంశస్తుడైన హరిసీమ కృష్ణుడు స్థాపించాడు. కోట సామ్రాజ్యపు రాజులు నేడు ఆంధ్రదేశంలో ఉన్న ధనుంజయ గోత్రపు క్షత్రియులకు పూర్వీకులు. రాజస్థాన్ కోట రాజులకు, వీరికి ఎటువంటి సంబంధము లేదు.
విశేషాలు
కోట రాజులు మొదట్లో జైన మతాన్ని ఆచరించినా తర్వాత కాలంలో చాళుక్యుల వలె హిందూ మతాన్ని కూడా ఆచరించారు. శైవ తత్వాన్ని కూడా ప్రోత్సహించారు. వీరికి తూర్పు చాళుక్యులతోను, సూర్యవంశీయులైన కాకతీయులతోను వివాహ సంబంధాలుండేవి. కాకతీయ గణపతి దేవుని రెండవ కుమార్తె అయిన గణపాంబను కోట బేతరాజు వివాహమాడాడు. మంగళగిరి ఆనంద కవి వ్రాసిన 'విజయనందన విలాసము' లో హరిసీమ కృష్ణుడు చంద్రవంశానికి చెందినవాడని వ్రాయబడినది. క్రీస్తు శకము 1182 ప్రాంతంలో జరిగిన పల్నాటి యుద్ధంలో నలగామరాజుకు సహాయం చేయడానికి కాకతీయ రుద్రదేవరాజు కొంత సైన్యాన్ని పంపాడు. ఈ సైన్యం ధరణికోటను ముట్టడించి జయించింది. కోట దొడ్డభీమరాజు మరణించాడు. ఆనాటి నుండి కోట వంశీయులు కాకతీయులకు సామంతులయ్యారు. 1323 వ సంవత్సరంలో మహమ్మదీయుడైన ఉయిన్ ఖాన్ కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మూలించాడు. ఆ సందర్భంలో కోట వంశం కూడా రాజ్యం కోల్పోయింది. ఈ వంశం వారు చెదిరిపోయి దాట్ల, పాకలపాడు, చింతలపాడు, జంపన వంటి గ్రామాలకు వెళ్ళిపోయారు [1].
కోట సామ్రాజ్యాన్ని పాలించిన రాజులు:
- కోట భీమరాజు 1 - క్రీస్తు శకం 1100
- కోట కేతరాజు 1 - క్రీస్తు శకం 1300
- కోట భీమరాజు 2
- కోట కేతరాజు 2 - క్రీస్తు శకం 1182 నుండి 1232 వరకు
- కోట రుద్రరాజు
- కోట బేతరాజు - క్రీస్తు శకం 1268
జమీందారులు
కోట సామ్రాజ్యపు వంశస్తులైన ధనుంజయ గోత్రపు రాజులు (భూపతిరాజు, దాట్ల, కలిదిండి, దంతులూరి గృహనామాలు కలవారు) ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పరిపాలించు కాలములో రెవిడి, మద్గోలు, గోలుగొండ, దార్లపూడి, ఉరట్ల, మొగల్తూరు ప్రాంతాలకు సామంతులుగా, జమీందార్లుగా వ్యవహరించారు. భారత దేశం సార్వభౌమ అధికార దేశంగా అవతరించిన తర్వాత జమీందారీ వ్యవస్త అంతరించింది.
అపోహ
కోట రాజులు కమ్మ కులస్తులకు పూర్వీకులని కొంతమంది భావం. కోట అనే పదం గృహనామంగా కమ్మ కులస్తుల్లో ఉండటం వల్ల కూడా ఈ భావం ఉండవచ్చును. ఇందులో వాస్తవం లేదు. కోట వంశము వారిది ధనుంజయ గోత్రం. ఈ గోత్రం కమ్మ కులస్తుల్లో లేదు. గృహనామాలు ఉరి పేరుని బట్టి ఏర్పడతాయి కాబట్టి ఒక కులంలో ఉన్న గృహనామం మరొక కులంలో కూడా ఉండవచ్చు. కమ్మ కులస్తులు సూర్యవంశానికి గాని చంద్రవంశానికి గాని చెందినవారు కాదు.
మూలాలు
- ↑ శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము - బుద్ధరాజు వరహాలరాజు, 1970