తంగి సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు
K.Venkataramana (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 55: | పంక్తి 55: | ||
[[వర్గం:1931 జననాలు]] |
[[వర్గం:1931 జననాలు]] |
||
[[వర్గం:2009 మరణాలు]] |
[[వర్గం:2009 మరణాలు]] |
||
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యులు]] |
06:13, 20 మే 2013 నాటి కూర్పు
Tangi Satyanarayana తంగి సత్యనారాయణ | |||
తంగి సత్యనారాయణ గారి విగ్రహం | |||
ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ స్పీకరు
| |||
పదవీ కాలం 1983 - 1984 | |||
ముందు | కోన ప్రభాకర రావు | ||
---|---|---|---|
తరువాత | డి.శ్రీపాదరావు | ||
నియోజకవర్గం | శ్రీకాకుళం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1931 , సెప్టెంబరు 8 శ్రీకాకుళం జిల్లా | ||
మరణం | అక్టోబరు 25 , 2009 కిల్లిపాలెం, శ్రీకాకుళం జిల్లా | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం | ||
మతం | హిందూ |
తంగి సత్యనారాయణ (1931 - 2009) శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుప్రసిద్ధ శాసనసభ్యుడు.
శ్రీకాకుళం జిల్లా నుండి ఈయనోక్కరే స్పీకర్ గా చేశారు . చాలా మంచి స్వభావము కలవారు . వెలమ కులములో పుట్టి న్యాయవాది గా ఎదిగి రాజకీయాలలో అత్యున్నత పదవి అయిన అసంబ్లీ స్పీకర్ గా ఎన్నికయ్యారు . రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ తంగి సత్యనారాయణ(78) : శ్రీకాకుళం రూరల్ మండలంలో కిల్లి పాలెంలో 1931 సెప్టెంబరు 8న జన్మించిన సత్యనారాయణకు భార్య ఆదిలక్ష్మి, నలుగురు కుమార్తెలు, నలుగురు కుమారులు ఉన్నారు. గార సమితికి ప్రప్రథమ అధ్యక్షునిగా 1959-64లో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన 1967-72 మధ్య స్వతంత్య్ర పార్టీ తరపున శాసనసభ్యునిగా చేశారు.1972లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు, తిరిగి 1983లో రెండోసారి శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏడాదిన్నర పాటు శాసనసభ స్పీకరుగా వ్యవహరించారు. 1984లో నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నెలరోజుల పాటు రెవెన్యూ శాఖా మంత్రిగా విధులు నిర్వర్తించారు.తిరిగి 1986లో తెలుగుదేశం పార్టీలో చేరారు. మళ్లీ 2008లో తంగి సత్యనారాయణ కాంగ్రెస్లో చేరారు. రెండుసార్లు బార్ అసోసియేషన్కు అధ్యక్షులుగా ఎన్నికైన ఈయన క్రిమినల్ లాయర్గా జిల్లాలో మంచి ఖ్యాతి నార్జించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోథులు గౌతు లచ్చన్న, ఎన్.జి.రంగాలకు సహచరునిగా రాజకీయాల్లో కొనసాగారు. ఎ.ఐ.సి.సి. సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ లో కొనసాగేరు .
తంగి సత్యనారాయణ - శ్రీకాకుళంలోని తన నివాసంలో అక్టోబరు 25 , 2009, ఆదివారం ఉదయం కన్నుమూశారు.అన్నవాహికలో ఏర్పడిన క్యాన్సర్తో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయనకు హైదరాబాద్లో ఇటీవలనే శస్త్రచికిత్సలు కూడా నిర్వహించారు.
- ఈయన 1967 మరియు 1983 సంవత్సరాలలో శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.
- ఈయన 1983-84 మధ్య (18.01.1983 నుండి 28.08.1984 వరకు) ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు పదవిని సమర్ధవంతంగా నిర్వర్తించారు.[1]
- నందమూరి తారక రామారావు పదవీచ్యుతులైన పిదప ఈయన నాదెండ్ల భాస్కరరావుతో చేతులు కలిపి కొద్దికాలం రెవిన్యూ మంత్రిగా పనిచేశారు.[2]
- సత్యనారాయణ అక్టోబరు 25, 2009 తేదీన తన సొంత ఊరు కిల్లిపాలెంలో పరమపదించారు.[2]
చిత్రమాలిక
-
తంగి సత్యనారాయన విగ్రహం
-
తంగి సత్యన్నారాయణ గూర్చి తెలియజేసే శిలా ఫలకం
మూలాలు
- ↑ http://legislativebodiesinindia.nic.in/STATISTICAL/AP.htm
- ↑ 2.0 2.1 "Former speaker Satyanaryana dies". Times of India. 2009-10-26. Retrieved 2009-10-28.