నువ్వు నాకు నచ్చావ్: కూర్పుల మధ్య తేడాలు
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 32: | పంక్తి 32: | ||
#నా చెలియ పాదాలు... హంసలకు పాఠాలు |
#నా చెలియ పాదాలు... హంసలకు పాఠాలు |
||
#ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని |
#ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని |
||
==మూలాలు== |
|||
{{మూలాలజాబితా}} |
11:50, 20 జూలై 2013 నాటి కూర్పు
నువ్వు నాకు నచ్చావ్ (2001 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | విజయ భాస్కర్ |
---|---|
నిర్మాణం | డి.సురేష్ బాబు |
రచన | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
తారాగణం | వెంకటేష్ ఆర్తీ అగర్వాల్ ప్రకాష్ రాజ్ చంద్ర మోహన్ సుధ ఎమ్మెస్ నారాయణ సునీల్ తనికెళ్ళ భరణి సిజ్జు ఆశా సైని పృథ్వీ రాజ్ బ్రహ్మానందం |
సంగీతం | కోటి |
గీతరచన | సిరివెన్నెల సీతారామశాస్త్రి |
కూర్పు | శ్రీకర్ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నువ్వు నాకు నచ్చావ్ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా సెప్టెంబర్ 6, 2001 లో విడుదలై అత్యంత ప్రజాధరణ పొందిన చిత్రం.
కథ
వెంకీ అని పిలవబడే వెంకటేశ్వర్లు (వెంకటేష్) అనకాపల్లి నుంచి హైదరాబాద్ లో తన తండ్రి శేఖరం (చంద్రమోహన్) బాల్యమిత్రుడైన మూర్తి (ప్రకాష్ రాజ్) ఇంటికి వస్తాడు. సంధర్బం మూర్తి ఏకైక కుమార్తె నందిని ఒక అమెరికా కుర్రాడితో (తనికెళ్ళ భరణి కుటుంబం) నిశ్చితార్థం. వెంకీ వాళ్ళకు నిశ్చితార్థం సాఫీగా జరగడంలో సహాయపడతాడు. మూర్తి వెంకీకి ఒక ఉద్యోగం చూపిస్తాడు. ఇక గొడవలతో ప్రారంభమై వెంకీ, నందులు స్నేహితులవుతారు. ఒకరినొకరు అభిమానించుకోవడం మొదలవుతుంది. నందు వెంకీని తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. కానీ తమ కుటుంబాల మధ్య ఉన్న సత్సంబంధాల దృష్ట్యా , కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాళ్ళను వదిలి వచ్చేయాలనుకుంటాడు. అయితే రైల్వే స్టేషన్ దాకా వెళ్ళిన వెంకీని మూర్తి నచ్చజెప్పి మళ్ళీ ఇంటికి తీసుకుని వస్తాడు.
అయితే నందు మాత్రం తనకు చెప్పకుండా వెంకీ వెళ్ళిపోయినందుకు అతనితో మాట్లాడదు. అయితే ఒక పెళ్ళిలో మళ్ళీ ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఆ పెళ్ళి అయిపోయిన తరువాత అందరూ కలిసి వాటర్ వరల్డ్ కి వెళతారు. అక్కడ బ్రహ్మానందం వెంకీ, నందూ చేతులు కలిపి ఉండగా ఒక ఫోటో తీస్తాడు. ఆ ఫోటో నందూ పెళ్ళి సమయంలో పెళ్ళికొడుక్కి చేరుతుంది. దాంతో వాళ్ళు నందు శీలాన్ని అవమానించి పెళ్ళి పందిరి నుంచి వెళ్ళిపోతుంటారు. అయితే ఎలాగైనా పెళ్ళి జరిపించాలని వెంకీ వాళ్ళను బ్రతిమాలుకుంటాడు. అదే సమయానికి మూర్తి అక్కడికి వస్తాడు. వెంకీ పెద్ద మనసును గమనించి నందును అతనికిచ్చి పెళ్ళి చేయటంతో కథ సుఖాంతమౌతుంది.
హాస్య సన్నివేశాలు
- ఏదైనా ఉద్యోగం చూడమని మూర్తి యింటికి వచ్చిన వెంకటేష్ రొజూ సెకండ్ షో సినిమాకి వెళ్ళివస్తుంటాడు. బ్రతకడానికి ఏమివచ్చునంటే సంగీతం, బొమ్మలేయడం, ఈత మొదలైనవి చెబుతాడు. ఈ సీన్ చూడండి.[1]
- ఆరతియింట్లో అందరూ భోజనం చేస్తున్నప్పుడు అమ్మ జ్ఞాపకం వచ్చి తాను రాసిన కవిత చదువుతాడు. ఆ కవిత చాలా కామెడీగా ఉంటుంది. అందరూ తప్పకుండా నవ్వుతారు.
పాటలు
- ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి
- ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్య తారా
- ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు
- నా చెలియ పాదాలు... హంసలకు పాఠాలు
- ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని