వేటూరి ప్రభాకరశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలుగు కవులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:సంస్కృత రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 70: పంక్తి 70:
[[వర్గం:తెలుగు నాటక రచయితలు]]
[[వర్గం:తెలుగు నాటక రచయితలు]]
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:సంస్కృత రచయితలు]]

15:50, 2 సెప్టెంబరు 2013 నాటి కూర్పు

వేటూరి ప్రభాకరశాస్త్రి
వేటూరి ప్రభాకరశాస్త్రి
వేటూరి ప్రభాకరశాస్త్రి
పుట్టిన తేదీ, స్థలంఫిబ్రవరి 7, 1888, పెద్దకళ్ళేపల్లి
కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
మరణం1950
జాతీయతభారతీయుడు
పౌరసత్వంభారతదేశం

వేటూరి ప్రభాకరశాస్త్రి, తెలుగు కవి, భాష పరిశోధకుడు, చరిత్రకారుడు, రచయిత, విమర్శకుడు, రేడియో నాటక రచయిత మరియు తెలుగు, సంస్కృత పండితుడు. చరిత్రలో లభ్యమౌతున్న మొట్టమొదటి తెలుగు పదము నాగబు అని కనుగొన్నది ఈయనే.సాహిత్య చరిత్ర ఆ జాతి మనోవికాస వైభవానికి చిహ్నం. వేటూరి ప్రభాకరశాస్త్రి అలాంటి ఓ సాహిత్య చరిత్రకే ప్రకాశం. ఆయన ఒట్టి మేధావి కాదు..తెలుగు భాషా, చారిత్రక సాహిత్య నిర్మాణానికి అక్షరాలు మోసిన కూలీ!ఆయన ఒట్టి రచయిత కాదు..విమర్శనా వ్యాస రచనకు ఆద్యుడు. పన్నెండో ఏటే పరభాషలో కవితా సుమాలు వెదజల్లిన అనన్యుడు.

జీవిత విశేషాలు

ప్రభాకరశాస్త్రి, కృష్ణా జిల్లా, మోపిదేవి మండలములో కృష్ణా నది తీరమున ఉన్న పెదకళ్ళేపల్లిలో శ్రీవత్స గోత్రజులైన వేటూరి సుందరశాస్త్రి, శేషమ్మలకు మూడవ సంతానముగా 1888, ఫిబ్రవరి 7న జన్మించాడు. ఈయనకు నలుగురు సోదరులు, నలుగురు సోదరీమణులు. తండ్రి సుందరశాస్త్రి ఆయుర్వేద వైద్యుడు. ప్రభాకరశాస్త్రి ప్రాథమిక విద్య స్వగ్రామములోనే సాగినది, తండ్రి వద్ద, మద్దూరి రామావధాని వద్ద సంస్కృతాంధ్రములను నేర్చుకొన్నాడు. ఉపనయనమైన తర్వాత ప్రభాకరశాస్త్రిని ఆయన తండ్రి శాస్త్రాలు అభ్యసించడానికి చల్లపల్లిలోని అద్దేపల్లి సోమనాథశాస్త్రి వద్ద చేర్పించాడు.

16 యేళ్ల వయసులో, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి బందరు ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని తెలిసి కొందరు సహాధ్యాయులతో కలిసి అక్కడ చేరాడు. బందర్లో విద్యాభ్యాసము చేస్తున్న కాలములో ఈయన కొండా వెంకటప్పయ్య మరియు వల్లూరి సూర్యనారాయణరావుల ఇంట నివసించాడు. తెలుగులో తనకు తెలిసినదంతా చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రితో ముఖతః వినోదగోష్ఠిలో విని నేర్చుకున్నదేనని ఆ తరువాత ప్రభాకరశాస్త్రి చెప్పుకున్నాడు.

ఆ తరువాత తన 19వ యేట మద్రాసు చేరి వెస్లీ మిషన్ హైస్కూలులో తెలుగు పండితునిగా రెండేళ్ళు పనిచేశాడు. ఆ సమయములో మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తకశాలకు వెళ్ళి అక్కడి గ్రంథాలను చదువుతుండేవాడు.

ప్రభాకరశాస్త్రి, తెలుగులో అనేక కావ్యములు రచించడముతో పాటు అనువాదాలు, వివరణా గ్రంధాలు రచించాడు. ఈయన ప్రాచ్యలిఖిత పుస్తకాలయములో అనేక తెలుగు గ్రంథాలను చారిత్రకాధారములతో సవివరముగా పరిష్కరించి ప్రకటించాడు.

రచనాశైలి, రచనలు

పిన్నవయసు శతావధాని, తొలితెలుగు పదం ‘నాగబు’ ఆవిష్కర్త, ‘కలికి చిలుక’ను పలికించిన కథకుడు, ‘కడుపు తీపు’, ‘దివ్యదర్శనం’, ‘మూణ్ణాళ్ల మచ్చట’, ‘కపోతకథ’ వంటి ఖండకావ్యాల విరచితుడు, విమర్శకాగ్రేసరుడు, కాలగర్భంలో కలిసిపోతున్న తెలుగు సంస్కృతీ చరిత్రను దక్షిణదేశమంతటా ఈది మరీ ఒడ్డుకు చేర్చిన సాహిత్య ఘనాపాటి.

  • శృంగారశ్రీనాథం
  • క్రీడాభిరామం
  • బసవపురాణం
  • రంగనాథ రామాయణం
  • తంజావూరి ఆంధ్ర రాజుల చరిత్ర
  • ప్రాచీనాంధ్ర శాసనములు
  • శాతవాహనులు
  • ఇక్ష్వాకులు
  • రెడ్డిరాజులు
  • అన్నమాచార్య కీర్తనలు తొలితెలుగు రచయిత్రి తిమ్మక్క, తొలి తెలుగు శాసనము... ఇవన్నీ, వీరందరూ ఈరోజు మనకందుబాటులో ఉండటానికి ముఖ్యకారకుడు ఈ మహానుభావుడే!

ఇతర విశేషాలు

  • ఈయనకు ఆనందమూర్తి అనే ఒక కుమారుడు కలడు.

మూలములు

  • తెలుగు వైతాళికులు రెండవ భాగములో వేటూరి ప్రభాకరశాస్త్రిపై ఎన్.సచ్చిదానందం రాసిన వ్యాసం (పేజి.87-104) (ఆంధ్ర ప్రదేశ సాహిత్య అకాడమీ ప్రచురణ.1977)
  • Dr.Seshagirirao వెబ్ సైట్