కె.కె.మీనన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె.కె.మీనన్
కె. కె. మీనన్
జననం1942
రామరాజు లంక, తూర్పుగోదావరి
మరణం1 ఆగస్టు 2012
జాతీయతభారతీయుడు
వృత్తితెలుగు రచయిత

కానేటి కృష్ణమీనన్ (1942 - 2012) (కె.కె.మీనన్ ) తెలుగు రచయిత. ఆయన సుమారు 80 లఘు కథలు, 6 నవలలు రాసాడు. ఆయన రాసిన అనేక కథలు వివిధ భాషలలోనికి అనువాదమయ్యాయి.[1]

జీవితం[మార్చు]

కె.కె.మీనన్ హైదరాబాదు లోని అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేసాడు. ఆయన తూర్పు గోదావరి జిల్లా లోని రామరాజులంక గ్రామంలో జన్మించాడు. ఆయన సెకండరీ విద్యను రాజోలు లోనూ, గ్రాడ్యుయేషన్ నూ భీమవరం లోనూ పూర్తిచేసడు. తరువాత నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో ఎం.ఎ చేసాడు.

అయన లఘు కథలను తాను 9వ తరగతి చదువుతున్నప్పుడే రాయడం ప్రారంభించాడు. ఆయన ఉపాధ్యాయుడు కందుకూరి రామభద్రం ప్రముఖ రచయిత అయినందున మీనన్ ను రచనా వ్యాసంగంపై ప్రోత్సహించాడు. ఆయన్ రాసిన ఒక రచనకు పురస్కారం లభించడంతో ఆయన రచనలను ఉత్సాహభరితంగా కొనసాగించాడు.

మీనన్ రచనలు, భావజాలాలు ప్రసిద్ధ రచయితలైన శ్రీశ్రీ, ఆత్రేయ, గుడిపాటి వెంకట చలం, కాళీపట్నం రామారావు వంటి వారు ప్రభావితులైనారు

సేవలు[మార్చు]

మీనన్ యొక్క మొదటి కథ "ప్రజామంత్ర" అనే బెంగళూరు పత్రికలో ప్రచురితమైనది. అప్పుడు ఆయన 12వ తరగతి చదువుతున్నాడు.

1974నుండి ఆయన లఘు కథలు వివిధ వార, దిన పత్రికల్లో ప్రచురితమవుతూనే ఉన్నాయి.

1977లో మొదటి నవల "బకి బతుకులు"[2] విశాలాంధ్ర పత్రికలో ప్రచురితమైనది. ఆ నవల మరల 1994లో అదే పబ్లిషర్స్ చే తిరిగి ప్రచురితమైనది.

1979లో "ఇది స్ట్రీకింగ్ కాదు" అనే లఘు కథాల్ సంపుటిని వెలువరించాడు. 1996లో "పులి కూడు" [3] ప్రచురితమైనది.

ఆయన రాసిన ఎనిమిది కథలు డా. భీమ్‌సేన్ నిర్మల్ చే హిందీలో అనువాదం చేయబడినవి. అందులో ఒక కథ "ద్వారం" పంజాబీ భాషలో అనువాదం చేయబడింది.

ఆయన యామినీ వేరేంధ్రనాథ్ తో కలసి "రంగుల నీడ" రచించాడు.

మీనన్ యొక్క రచనలు సాధారణంగా సమకాలీన సమాజిక ఆర్థిక వ్యవస్థలపై ప్రతిబించే విధంగా ఉందేవి. అందులోని పాత్రలు సమాజంలో పేద ప్రజలు.

ఆయన సర్ రాబర్ట్ ఎడ్వర్డ్స్, డా. పాట్రిక్ స్టెప్టో ద్వారా రచించబడిన "మేటర్ ఆఫ్ లైఫ్"తో ప్రభావిడుడై, "క్రతువు" [4] ను రచించాడు. అది ఆయనకు బహుమఖ రచయితగా గుర్తింపు తెచ్చింది.

తెలుగు సాహిత్యంలోని సైన్స్ ఫిక్షన్ విభాగంలో పి.హెచ్.డి చేయు వారికి ఈ "క్రతువు" నవల ఎంపికయింది.

ఒక సందర్భంలో ప్రముఖ రచయిత మధురాంతకం రాజారాం "గత 25 సంవత్సరాలలో క్రతువు వంటి నవల వంటి నవలను నేను చూడలేదు" అని అభివర్ణించాడు.

2014లో ఈ నవల జి.ప్రేమేశ్వర్ చే హిందీలో అనువాదం చేయబడింది.

పురస్కారాలు[మార్చు]

1993లో ఏటుకూరు వెంకటనరసయ్య మెమోరియల్ పురస్కారం తెలుగు విశ్వవిద్యాలయం నుండి లభించింది.

మీనన్‌ను సత్కరిస్తున్న ఆరుద్ర

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆయన రాజీలు వద్ద మారుమూల పల్లె ఐన దిండిలో వెంకటమ్మ, తాతయ్య దంపతులకు జన్మించాడు. ఆయన తన నలుగురు సహోదరులలో పెద్దవాడు. చిన్నతనంలో ఆయన తన పిన్ని సతమ్మ, శ్రీ జేమ్స్ లచే పెంచుకోబడ్డాడు. అందువలన రామరాజు లంకలో పెరిగాడు. తన బాల్యమంతా రామరాజు లంకలోనే గడిపాడు. ఆయనకు ఇద్దరు సోదరీమణులు, ఇద్దరు సోదరులు. ఆయన 1963 జూన్ 19లో సిరోరత్నమ్మను వివాహమాడాడు. 1965లో హైదరాబాదు లోని ఎ.జి. ఆఫీసులో ఉద్యోగంలో చేరాడు. ఆయనకు ఇద్దరు పిల్లలు. కుమార్తె డా.అపర్ణ నేత్ర వైద్యురాలు, కుమారుడు వంశీ బహ్రేయిన్లో నివసిస్తున్నాడు. మీనన్ రంజనీ (సాహితీ సంస్థ) లో క్రియాశీలక సభ్యుడు. ఆయన అనేక సాహిత్య కార్యక్రమాలలో పాల్గొనాడు. 2005లో పార్కిన్‌సన్ వ్యాధితో బాధపడి 2012 ఆగస్టు 1 న మరణించాడు.

మూలాలు[మార్చు]