చెల్లమెల్ల సుగుణ కుమారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెల్లమెల్ల సుగుణ కుమారి
చెల్లమెల్ల సుగుణ కుమారి

చెల్లమెల్ల సుగుణ కుమారి


ముందు జి. వెంకటస్వామి
తరువాత జి. వెంకటస్వామి
నియోజకవర్గం పెద్దపల్లి

వ్యక్తిగత వివరాలు

జననం (1955-07-25) 1955 జూలై 25 (వయసు 68)
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి డా. ఎం. రాజేంద్రప్రసాద్
సంతానం 2 కొడుకులు
నివాసం హైదరాబాద్
మూలం వెబ్సైటు

డాక్టర్ చెల్లమల్ల సుగుణ కుమారి (Dr. Chellamalla Suguna Kumari) ప్రముఖ పార్లమెంటు సభ్యురాలు.[1]

జననం, విద్య[మార్చు]

ఈమె హైదరాబాద్లో 1955 సంవత్సరం జన్మించింది. ఈమె తండ్రి సి. పోచయ్య. ఈమె ఉస్మానియా వైద్య కళాశాల నుండి M.B., B.S., M.D., D.G.O. and D. Ch. పూర్తిచేసి ఆధునిక వైద్యంలో ప్రజలకు సేవ చేస్తున్నది. ఈమెకు సాంఘిక సేవ మీద మక్కువ ఎక్కువ.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఈమె 1981 సంవత్సరంలో డా. ఎం. రాజేంద్రప్రసాద్ ను వివాహం చేసుకున్నది. వీరికి ఇద్దరుకుమారులు.

రాజకీయ జీవితం[మార్చు]

ఈమె 1998లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి 12వ లోక్‌సభ తెలుగుదేశం పార్టీ సభ్యురాలిగా పోటీచేసి, గెలిచి భారత పార్లమెంటులో ప్రవేశించింది. ఆ తరువాత 2004 రెండవసారి అదే నియోజకవర్గం నుండి 13వ లోక్‌సభకు ఎన్నికయ్యింది.

పెట్రోలియం, రసాయనాలు, ప్రభుత్వ హామీలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖపై వివిధ పార్లమెంటరీ కమిటీలలో ఆమె సభ్యురాలిగా పనిచేవారు.

మూలాలు[మార్చు]

  1. "Biography at Parliament of India". Archived from the original on 2013-06-01. Retrieved 2013-03-01.