నందిని సిధారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నందిని సిధారెడ్డి
సినివారంలో నందిని సిధారెడ్డి
జననంనందిని సిధారెడ్డి
(1955-06-12) 1955 జూన్ 12 (వయసు 68)
బందారం, కొండపాక మండలం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ
నివాస ప్రాంతంసిద్ధిపేట ,తెలంగాణ , భారతదేశంIndia
వృత్తితెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్
అధ్యాపకుడు
రచయిత
పదవీ కాలం2 మే 2017 - మే 2020
మతంహిందూ
భార్య / భర్తమల్లీశ్వరి
పిల్లలువీక్షణ
తండ్రినర్రా బాలసిధారెడ్డి
తల్లిరత్నమాల

నందిని సిధారెడ్డి[1] తెలంగాణ రాష్ట్రానికి చెందిన రచయిత, పాటల రచయిత, సామాజిక ఉద్యమకారుడు. 2017 మే 2 నుండి 2020 మే వరకు తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ గా పనిచేశాడు.[2]

జీవిత విశేషాలు[మార్చు]

నందిని సిధారెడ్డి 1955, జూన్ 12న బాలసిద్ధారెడ్డి - రత్నమాల తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, కొండపాక మండలంలోని బందారం గ్రామంలో జన్మించాడు. సిద్ధారెడ్డి తండ్రి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు యోధుడు.[3] బందారం, వెల్కటూరు, సిద్ధిపేటలలో చదువు ముగించుకుని హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.పూర్తిచేసి, 'ఆధునిక తెలుగుకవిత్వంలో సూర్యుడు' అనే అంశంపై ఎం.ఫిల్‌ (1981) పట్టా ఆ తర్వాత 'ఆధునిక కవిత్వం, వాస్తవికత - అధివాస్తవికత' పై పరిశోధన చేసి పి.హెచ్.డి (1986) పట్టా పుచ్చుకున్నాడు.[4]

రచనా ప్రస్థానం[మార్చు]

మెదక్‌లో కొంతకాలం పనిచేసి తరువాత సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేసి 2012లో పదవీవిరమణ చేశాడు. విద్యార్థి దశనుండే కథలు, కవిత్వం వ్రాశాడు. నవసాహితి, మెదక్ స్టడీ సర్కిల్ అనే సంస్థలను నడిపాడు. గులాబి అనే చిన్నపత్రికను ప్రకటించాడు. మంజీరా రచయితల సంఘం ఏర్పాటు చేసి పలు సాహితీ కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు 'మంజీర' బులెటిన్‌కు సంపాదకత్వం వహించి ఏడు కవితాసంకలనాలను వెలువరించాడు. సోయి అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. 2001లో తెలంగాణ రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించాడు.

1997 ఆగస్టులో కేవలం ఒకేఒక గంట వ్యవధిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం - ఆవశ్యకతపై సిద్ధారెడ్డి రచించిన కవితే "నాగేటి చాల్లల్ల" కవితగా ప్రసిద్ధి చెందింది. ఈ కవితలో సిధారెడ్డి తెలంగాణ సంస్కృతి (బతుకమ్మ పండుగ, ఆటపాటలు, బోనాలు, యక్షగానాలు, ఒగ్గు కళారూపాలు) మొత్తాన్ని వివరించాడు. ఇదే కవితను "పోరు తెలంగాణ" సినిమాలో పాటగా తీసుకున్నారు.[5] ఈ పాటకు నంది అవార్డు కూడా అందుకున్నాడు. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ, గోరటి వెంకన్న రచించిన "గానమా తెలంగాణమా" కవితల కంటే ముందే సిధారెడ్డి తెలంగాణపై కవిత రచించాడు. ఈ కవితలో మొత్తం 10 చరణాలున్నాయి. ఈ కవిత బతుకమ్మ పాటగా తెలంగాణలో ఇంటింటా మారుమ్రోగిపోతోంది.

హోదాలు[మార్చు]

  • 2014లో తెలుగు భాషా పాఠ్యపుస్తకాలను సమీక్షించే కమిటీలో నందిని సిధా రెడ్డి సభ్యుడిగా పనిచేశాడు.[6]
  • 2015లో రిక్రూట్‌మెంట్ పరీక్షల కోసం సిలబస్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కమిటీకి నియమించబడ్డాడు.[7]
  • తెలుగు భాషపై నిరంతర పరిశోధన, విశ్లేషణ, ప్రచురణ, ప్రచారం కోసం 2017, మే 2న ఏర్పడిన తెలంగాణ సాహిత్య అకాడమీ కి తొలి చైర్మన్‌గా నియమించబడి, 2020 మే వరకు పనిచేశాడు.[8][2][9]
  • 2017 ఆగస్టులో కాళోజీ నారాయణరావు అవార్డుకు అర్హులైన ప్రముఖ వ్యక్తిని ఎంపిక చేసేందుకు ఒక ప్యానెల్‌కు నేతృత్వం వహించాడు.[10]
  • 2017 డిసెంబరు 15 నుండి 19 వరకు హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు అకాడెమీ బాధ్యతలు నిర్వర్తించాడు.[11]

రచనలు[మార్చు]

  1. భూమిస్వప్నం
  2. సంభాషణ
  3. ఆధునిక తెలుగుకవిత్వం - వాస్తవికత - అధివాస్తవికత (సిద్ధాంతగ్రంథం)
  4. దివిటీ
  5. ప్రాణహిత
  6. ఒక బాధ కాదు
  7. నది పుట్టుబడి
  8. ఇగురం
  9. ఆవర్థనం
  10. నాగేటి చాల్లల్ల (పాటలు)
  11. ఇక్కడి చెట్లగాలి
  12. చిత్రకన్ను (కథా సంపుటి)
  13. అనిమేష (దీర్ఘకవిత)

పాటలు[మార్చు]

  1. నాగేటి సాల్లల్ల నా తెలంగాణ (పోరు తెలంగాణ-2011)
  2. ఒక పువ్వు ఒక నవ్వు ఉయ్యాలలూగేనా.. ఒక నువ్వు ఒక నేను ఊహల్లో తేలేమా (జై బోలో తెలంగాణ-2011)
  3. పుడమి పండుగ పువ్వుల జాతర మగువల పండుగ మమతల జాతర (కొలిమి)
  4. ఇది చరిత్ర ఇది పవిత్ర జనవిముక్తి సమరం.. సాయుధ రైతాంగ పోరు సాహసమే అమరం (బందూక్-2015)
  5. చెలియా చెలియా విడిపోకే కలలా (2 కంట్రీస్-2017)

పురస్కారాలు[మార్చు]

  1. 1986లో భూమిస్వప్నం కవితాసంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం
  2. 1988లో భూమిస్వప్నం కవితాసంపుటికి ఇందూరు భారతి వారి దాశరథి పురస్కారం
  3. 2001లో ప్రాణహిత కవితాసంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం
  4. 2009లో ఒక బాధకాదు కవితాసంపుటికి విశ్వకళాపీఠం వారి స్నేహనిధి ఉత్తమ కవితా పురస్కారం
  5. 2010లో 'నాగేటి సాలల్లో నా తెలంగాణా' పాటకు ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారం
  6. 2016లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్యంలో విశిష్ట పురస్కారం[12][13]

మూలాలు[మార్చు]

  1. పాతికేళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు
  2. 2.0 2.1 ఆంధ్రప్రభ. "సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నందిని సిధారెడ్డి". Retrieved 11 May 2017.[permanent dead link]
  3. http://www.prabhanews.com/medak/article-268306[permanent dead link]
  4. "యాసే..శ్వాసగా!..తెలంగాణ సినిమా కవులు". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-03-07. Archived from the original on 2021-06-30. Retrieved 2021-11-08.
  5. నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మలో కందుకూరి రమేష్‌బాబు రచించిన వ్యాసం, తేది 16-03-2014
  6. Ch Sushil Rao (10 September 2014), "Telangana dialect in textbooks?", Times of India, retrieved 2020-07-14
  7. "Job aspirants in dilemma over changed syllabus", The Siasat Daily, 6 January 2015, retrieved 2020-07-14
  8. నవతెలంగాణ. "రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మెన్‌గా నందిని సిధారెడ్డి నియామకం". Retrieved 11 May 2017.
  9. "Cinare 'Everest' of Telugu literature: Niranjan Reddy", Telegana Today, 14 July 2020, retrieved 2020-07-14
  10. "Telangana government forms panel for Kaloji Narayana Rao award", Deccan Chronicle, 9 August 2017, retrieved 2020-07-14
  11. ["WTF aimed at preserving and strengthening Telugu language: CM", Hyderabad Youth Mirror, 17 November 2017, archived from the original on 2020-07-14, retrieved 2020-07-14
  12. నమస్తే తెలంగాణతెలుగు (24 November 2016). "నందిని సిధారెడ్డికి తెలుగు వర్సిటీ విశిష్ట పురస్కారం". Archived from the original on 14 జూలై 2020. Retrieved 4 May 2018.
  13. ఆంథ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు (3 December 2016). "నందిని సిధారెడ్డికి తెలుగు వర్సిటీ పురస్కారం". Retrieved 4 May 2018.[permanent dead link]

బయటి మూలాలు[మార్చు]