పైలెట్ రోహిత్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంజుగుల రోహిత్ రెడ్డి
పైలెట్ రోహిత్ రెడ్డి


పదవీ కాలం
2018-2023
ముందు పి.మహేందర్ రెడ్డి
నియోజకవర్గం తాండూర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1984-06-07) 1984 జూన్ 7 (వయసు 39)
తాటిసుబ్బన్నగూడెం, దమ్మపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు పంజుగుల విఠల్‌రెడ్డి, ప్రమోదినిదేవి
జీవిత భాగస్వామి ఆర్తి రెడ్డి
సంతానం ఒక కుమారుడు
నివాసం అశ్వరావుపేట, తెలంగాణ
పూర్వ విద్యార్థి బ్లేకింగ్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, స్వీడన్

పంజుగుల రోహిత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ శాసన సభ సభ్యుడు.

జననం[మార్చు]

పంజుగుల రోహిత్‌రెడ్డి స్వస్థలం వికారాబాదు జిల్లా, బషీరాబాద్‌ మండలం, ఇందర్‌చెడ్‌ గ్రామం. ఆయన 1984 జూన్ 7లో పంజుగుల విఠల్‌రెడ్డి, [1] ప్రమోదినిదేవి దంపతులకు జన్మించాడు.

విద్యాభాస్యం[మార్చు]

రోహిత్‌రెడ్డి హైదరాబాద్ లోని సెయింట్ పాల్స్ హై స్కూల్లో 2001లో పదవ తరగతి పూర్తి చేశాడు. నారాయణగూడ లోని టెట్రాహెడ్రోన్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. స్వీడన్‌లోని బీటీహెచ్‌ యూనివర్సిటీలో మాస్టర్‌ ఇన్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. స్వీడన్‌కు ఇతర దేశాల నుంచి చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులకు ఆయన కొన్నాళ్ళు కోఆర్డినేటర్‌గా పనిచేశాడు. పైలెట్‌ కావాలన్నా చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక మేరకు రోహిత్ రెడ్డి అమెరికాలోని కాలిఫోర్నియాలో పైలెట్‌ కోర్సులో చేరాడు. ఆయన అక్కడ ఏడు నెలల పాటు పైలెట్‌ శిక్షణ పొందాడు. శిక్షణ పూర్తికాగానే ఆరు నెలల పాటు అక్కడే పైలెట్‌గా పనిచేశాడు. అనంతరం స్వదేశానికి తిరిగివచ్చాడు.[2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

రోహిత్‌రెడ్డికి ఆర్తిరెడ్డితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.[3]

రాజకీయ జీవితం[మార్చు]

పంజుగుల రోహిత్‌రెడ్డి 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాలోకి అడుగు పెట్టాడు. ఆయనను ప్రజారాజ్యం పార్టీ తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం ​ఇంచార్జ్ గా నియమించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నాడు. 2009లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాడు. 2013లో పీఆర్పీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. ఆయన 2014లో యంగ్ లీడర్స్ సంస్థను స్థాపించాడు. 2018లో పైలెట్ రోహిత్ రెడ్డిని టీఆర్‌ఎస్ పార్టీ నుండి బహిష్కరించారు.[4] అనంతరం అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుండి పోటీ చేసి మాజీ మంత్రి పి.మహేందర్ రెడ్డిని ఓడించి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2014 ఎన్నికల్లో తాండూరు నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశించారు. 2014 ఎన్నికలు జరిగే నెల ముందు తెదేపా ఎమ్మెల్యేగా ఉన్న పి.మహేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచాడు. తాండూరు ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం పట్నం మహేందర్ రెడ్డి అనుచరులు రోహిత్ రెడ్డి పై టీఆర్‌ఎస్‌ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడంతో ఆయనను పార్టీ నుండి బహిష్కరించారు. అనంతరం ఆయన తాండూరు నియోజకవర్గంలో యంగ్ లీడర్స్ సంస్థ ద్వారా వివిధ సేవ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కణకు గురైన రోహిత్ రెడ్డి తరువాత 2018లో కాంగ్రెస్ లో చేరి, 2018 లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పై దాదాపు పది వేల ఓట్ల మోజారిటీతో గెలిచాడు.[5] పైలట్‌ రోహిత్‌రెడ్డి 2019 జూన్ లో కాంగ్రెస్‌ పార్టీని వీడి టీఆర్‌ఎస్ పార్టీలో చేరాడు.[6]

మూలాలు[మార్చు]

  1. "Rohith Reddy(Indian National Congress(INC)):Constituency- TANDUR(VIKARABAD) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-10-02.
  2. Sakshi, హోం » పాలిటిక్స్ (12 May 2019). "అప్పటి నుంచి ఎమ్మెల్యే కావాలని కోరిక." Archived from the original on 12 మే 2019. Retrieved 15 April 2021.
  3. "Pilot Rohit Reddy". www.telanganadata.news. Retrieved 2021-10-02.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. Mana Telangana (10 November 2017). "టిఆర్‌ఎస్ నుంచి పైలెట్ రోహిత్‌రెడ్డి సస్పెండ్". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
  5. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  6. "Panjugula Rohith Reddy | MLA | TRS | Tandur | Vikarabad | Telangana". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-23. Retrieved 2021-10-02.