ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Prasad Art Pictures
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్

ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ భారతదేశంలో సినీ నిర్మాణ సంస్థ. ఈ సంస్థ అధిపతి అనుమోలు వెంకటసుబ్బారావు. ఈ సంస్థ మొదటి చిత్రం ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన పెంపుడు కొడుకు. ఈ సంస్థ ద్వారా సుబ్బారావు 22 తెలుగు, ఒక తమిళ, 3 హిందీ చిత్రాలు నిర్మించాడు. విజయ, సురేష్, అన్నపూర్ణ లాంటి సంస్థలకు ధీటుగా సినిమాలు నిర్మించింది ఈ సంస్థ. రచయిత శ్రీశ్రీకి ఇది మాతృసంస్థ లాంటిది.

నిర్మించిన సినిమాలు[మార్చు]

1953లో ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వం వహించిన పెంపుడు కొడుకు ఈ సంస్థ నిర్మించిన మొదటి చిత్రం. 1959లో తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో ఇల్లరికం నిర్మించిన తర్వాత అతని వద్ద సహాయకునిగా పనిచేసిన కె.ప్రత్యగాత్మతో భార్య భర్తలు (1961), కులగోత్రాలు (1962) నిర్మించాక, 1963 లో పునర్జన్మ చిత్రాన్ని నిర్మించాడు.[1]

మూలాలు[మార్చు]

  1. "కళల కోసమే.. పునర్జన్మ". సితార. Archived from the original on 2019-11-09. Retrieved 2020-04-19.

బయటి లింకులు[మార్చు]