మండన మిశ్రుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


మండన మిశ్రుడు 8వ శతాబ్దపు హిందూ తత్వవేత్త, ఆది శంకరాచార్యుని శిష్యుడు. మీమాంస, అద్వైత దర్శనాలపై రచనలు చేశాడు. ఈయన సన్యాసము స్వీకరించిన తర్వాత సురేశ్వరాచార్యుల అను పేరుతో ప్రసిద్ధిపొందాడు. శంకరాచార్యులను తర్క గోష్ఠిలో ఓటమి పాలై శంకరులను గురువుగా అంగీకరిస్తారు. ఆ ఓటమి సురేశ్వరాశ్వరాచార్యులకు విజయవంతమైన ఓటమి ఎందువలనంటే అ ఓటమి వల్ల జగద్గురువైన శంకరులకు శిష్యరికం చేసే అవకాశం దొరికింది. శంకరాచార్యులకు అత్యంత ప్రీతి పాత్రులైన శిష్యులలో సురేశ్వరచార్యులు ఒకరు. శంకరాచార్యులు అందువలన దక్షిణామ్నాయ మఠమైన శారదా మఠానికి మెదటి పీఠాదిపతిగా నియమిస్తారు. సురేశ్వరాచార్యులకు ఒక ప్రత్యేక ఉన్నది. సాధారణంగా గురువుల వయస్సు శిష్యుడి వయస్సు కంటే ఎక్కువగా ఉంటుంది. కాని సురేశ్వరాచార్యుల విషయంలో సాధారణానికి భిన్నంగా శిష్యుడి వయస్సు గురువు కన్నా ఎక్కువ.

వేదంత సంస్కృతి[మార్చు]

వేదాంత సంస్కృతిని అనుసరించి రెండు రకాలా మీమాంసలు ఉన్నాయి. ఒకటి పూర్వ మీమాంస ( మీమాంస అని అంటే దాని అర్థం పూర్వమీమాంస) రెండొ మీమాంస ఉత్తర మీమాంస దీనినే వేదాంత విద్య అని కూడా పిలుస్తారు. వేదాంత విద్య అంటే వేద=జ్ఞనం అంత = అంచులు జ్ఞానం అంచులు తెలిపేది పూర్ణ జ్ఞానం). ఫుర్వమీమాంస అనుసరించి వైదిక కర్మ కండ,యజ్ఞ యాగాదులు నమ్మకాలు ఉంటాయి. ఉత్తర మీమాంస అంతా ఉపనిషత్తుల సారం , జ్ఞాన సముపార్జన గురించి ఉంటుంది.