Coordinates: 23°20′N 77°48′E / 23.33°N 77.8°E / 23.33; 77.8

రాయ్‌సేన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాయ్‌సేన్
పట్టణం
Raisen fort
Raisen fort
రాయ్‌సేన్ is located in Madhya Pradesh
రాయ్‌సేన్
రాయ్‌సేన్
Coordinates: 23°20′N 77°48′E / 23.33°N 77.8°E / 23.33; 77.8
దేశంభారత దేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లారాయ్‌సేన్
Population
 (2011)
 • Total44,162
Time zoneUTC+5:30 (IST)
ISO 3166 codeIN-MP
Vehicle registrationMP-38

రాయ్‌సేన్ మధ్యప్రదేశ్ రాష్ట్రం రాయ్‌సేన్ జిల్లా లోని పట్టణం. ఇది రాయ్‌సేన్ జిల్లా ముఖ్యపట్టణం. ఒక కొండ పైన ఉన్న భారీ కోటను బట్టి పట్టణానికి ఈ పేరు వచ్చింది. పట్టణం ఈ కొండ పాదాల వద్ద ఉంది. ఈ పేరు బహుశా రాజవాసిని లేదా రాజశయన్ (రాజ నివాసం) ల నుండి రూపాంతరం చెంది ఉండవచ్చు. రాయ్‌సేన్ జిల్లాలో చూడవలసిన ప్రసిద్ధ ప్రదేశాలు రాయ్‌సేన్ కోట, దర్గా, సాంచి స్థూపం . రాయ్‌సేన్ పట్టణం రాష్ట్ర రాజధాని భోపాల్ నుండి 45.5 కి.మీ. దూరంలో ఉంది.

రాయ్‌సేన్ కోట[మార్చు]

రాయ్‌సేన్ కోట ఒక కొండ శిఖరంపై ఉంది. ఇక్కడి శివాలయం మహాశివరాత్రి వేడుకలకు ప్రసిద్ది చెందింది. పని చేసే స్థితిలో ఉన్న పురాతన ఫిరంగి కూడా కొండపై ఉంది. రంజాన్ మాసంలో సూర్యాస్తమయాన్ని ప్రకటించేందుకు దీన్ని వాడుతారు

జనాభా వివరాలు[మార్చు]

2001 జనగణన ప్రకారం,[1] రాయ్‌సేన్ జనాభా 35,553. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47%. రాయ్‌సేన్ అక్షరాస్యత 66%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 72%, స్త్రీల అక్షరాస్యత 59%. జనాభాలో 15% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు.

మూలాలు[మార్చు]

  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.