మర్రి రాజశేఖర్‌రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మర్రి రాజశేఖర్‌రెడ్డి
మర్రి రాజశేఖర్‌రెడ్డి


రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త, విద్యావేత్త

వ్యక్తిగత వివరాలు

జననం (1970-06-17)1970 జూన్ 17
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు మర్రి లక్ష్మణ్‌ రెడ్డి, అరుంధతి రెడ్డి[1]
జీవిత భాగస్వామి మమతారెడ్డి
సంతానం అనుశ్రేయా రెడ్డి (కుమార్తె)
ధీరెన్‌ రెడ్డి (కుమారుడు)
నివాసం హైదరాబాదు

మర్రి రాజశేఖర్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త, విద్యావేత్త. ఈయన మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (దుండిగల్), మరికొన్ని విద్యాసంస్థలకు చైర్మన్, డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మర్రి రాజశేఖర్‌రెడ్డి 2019 లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడు.[2]

జీవిత విషయాలు[మార్చు]

మర్రి రాజశేఖర్రెడ్డి 1970 జూన్ 17న హైదరాబాద్ లో జన్మించారు. ఆయన తండ్రి లక్ష్మణ్ రెడ్డి, తల్లి అరుంధతిరెడ్డి, రాజశేఖర్‌ గారికి మమత రెడ్డితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.[3]

విద్యారంగ సేవలు[మార్చు]

తన తండ్రి లక్ష్మణ్రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో మార్పులను తీసుకురావాలంటే విద్యను మాధ్యమికరంగంగా ఇంజనీరింగ్విద్యను మరింత విస్తరించాలని చిన్న వయసులోనే ఈ రంగంలోకి ప్రవేశించి మారుతున్న పోటీ ప్రపంచానికి విద్యావసరాలను తగిన విధంగా రాజశేఖర్రెడ్డి నూతన సంస్కరణలను తీసుకువస్తూ,  అంచెలంచెలుగా ఎదిగి నేడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఎం.ఎల్.ఆర్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎం.ఎల్.ఇర్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ లకు చైర్మన్ గా, వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కలశాలలో ఉన్నత పదవులను నిర్వర్తిస్తున్నారు.[4]

సామాజిక సేవ[మార్చు]

సమాజంలో తనవంతు సహాయం చేయాలన్న సేవాదృక్పధంతో వివిధ వర్గాలకు రాజశేఖర్ రెడ్డి విద్యార్థులకు, ప్రతిభావంతులకు, పేదవర్గాలకు, క్రీడల్లో రాణిస్తున్న వారికి  ఉపకార వేతనాలను తన విద్యాసంస్థల ద్వారా అందిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరిలో ఆరు గ్రామాలను దత్తత తీసుకుని విద్యా, వైద్య, మౌలిక వసతులకు పెద్ద పీఠ వేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. దేశంలోనే ఎక్కువ కార్మికులు కలిగినట్టి హైదరాబాద్ కరోనా, లాక్ డౌన్ సమయంలో ఈ ప్రాంతాలనుండి ఇతర ప్రాంతాలకు వెళ్తున్న వలస కార్మికులకు రోజువారీ కూలీలు, ఆశ్రియులకు భోజన, వసతి, రవాణా ఏర్పాట్లు చేసాడు. మేడ్చల్ జిల్లాలో మున్సిపాలిటీ, ఫ్రంట్ లైన్ వర్కర్ లకి (పారిశుద్ధ్య,వైద్య,పోలీస్,మీడియా) వారికి PPE కిట్ లను అలాగే నిత్యావసర సరుకులను వితరణ చేసాడు. అనాథవృద్ధాశ్రమాలకు, సామాజిక సేవ సంస్థలకు, కరోనా సమయంలో సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు . ముఖ్యమంత్రి సహాయ నిధికి 30 లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించారు. తాను నెలకొల్పిన అరుంధతి హాస్పిటల్ లో ఉచితంగా 5000 పైగా సర్జరీస్ చేయించారు.[5]

రాజకీయరంగం[మార్చు]

రాజశేఖర్‌రెడ్డి సమీప బంధువు సి.హెచ్. మల్లారెడ్డి రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు. మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడై 2019లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2019లో మల్కాజిగిరి పార్లమెంట్‌కు పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. ఆ తరువాత మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం ఇన్‌చార్జిగా పనిచేశాడు.[2] 2023 ఏప్రిల్ 09న కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్‌చార్జిగా నియమితుడయ్యాడు.[6]

2023 శాసనసభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గం స్థానానికి మైనంపల్లి హన్మంతరావు పేరు ఖరారు కాగా తన కుమారుడికి మెదక్ సీటు ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేయడంతో అక్టోబరు 18న మర్రి రాజశేఖర్‌ రెడ్డికి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ బి ఫారం అందజేశాడు.[7] ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో 49530 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచాడు.[8]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (19 October 2023). "గెలిచి రావాలి". Archived from the original on 21 October 2023. Retrieved 21 October 2023.
  2. 2.0 2.1 మన తెలంగాణ, రాష్ట్ర వార్తలు (3 April 2019). "కంటోన్మెంట్ సమస్యలు పరిష్కరిస్తా". Chauhan Ramesh. Archived from the original on 22 July 2021. Retrieved 22 July 2021.
  3. The New Indian Express, Telangana (4 April 2019). "Malla Reddy's son-in-law is confident". Archived from the original on 4 April 2019. Retrieved 22 July 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 22 అక్టోబరు 2019 suggested (help)
  4. "Marri Rajashekar Reddy, Secretary of Marri Laxman Reddy Institute of Technology speaks about the future of education". Edex Live (in ఇంగ్లీష్). Retrieved 2023-08-14.
  5. "Free medical services to be provided at Arundhati Institute of Medical Sciences (AIMS)". Edex Live (in ఇంగ్లీష్). Retrieved 2023-08-14.
  6. T29 Ne (9 April 2023). "కంటోన్మెంట్ ఇంచార్జ్ గా మర్రి రాజశేఖర్ రెడ్డి". T29 Telangana. Archived from the original on 14 ఆగస్టు 2023. Retrieved 9 April 2023.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: numeric names: authors list (link)
  7. Disha (18 October 2023). "బిగ్ బ్రేకింగ్: మల్కాజిగిరి BRS అభ్యర్థి ఫిక్స్.. బీఫాం ఇచ్చిన సీఎం కేసీఆర్". Archived from the original on 21 October 2023. Retrieved 21 October 2023.
  8. Eenadu (4 December 2023). "వారికి మస్త్‌ మెజారిటీ.. వీరికి బొటాబొటీ". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.