స్వామి రామానంద తీర్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వామి రామానంద తీర్థ
స్వామి రామానంద తీర్థ
జననంస్వామి రామానంద తీర్థ
అక్టోబర్ 3, 1903
గుల్బర్గా జిల్లా, జాగిర్ గ్రామం
మరణంజనవరి 22, 1972
ప్రసిద్ధిస్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాద్ సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు, భారత పార్లమెంట్ సభ్యుడు, సన్యాసి.

స్వామి రామానంద తీర్థ (అక్టోబర్ 3, 1903 - జనవరి 22, 1972) స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాద్ సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు, భారత పార్లమెంట్ సభ్యుడు, సన్యాసి.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

స్వామి రామానంద తీర్థ బాల్యనామం వెంకటరావు ఖెడ్గేకర్. ఈయన అక్టోబర్ 3, 1903లో గుల్బర్గా జిల్లా, జాగిర్ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి సన్యాసం స్వీకరించటంతో బంధువుల ఔదార్యంతో తన విద్యాభ్యాసాన్ని సాగించవలసి వచ్చింది. లోకమాన్య బాల గంగాధర తిలక్‌ను ఈయన ఆదర్శంగా తీసుకున్నాడు. గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని బడికి గాంధీ టోపి వేసుకుని వెళ్ళి తన నిరసన తెలిపి కొంత కాలం చదువుకు సెలవిచ్చాడు. తరువాత కాంగ్రెస్లో చేరాడు. తన ఇరవై ఒకటో యేడాది తరువాత చదువుపై దృష్టి పెట్టి ఎం ఏ పట్టా సాధించాడు.

యవ్వనం[మార్చు]

కొంత కాలం ప్రసిద్ధ కార్మిక నాయకుడు ఎన్ ఎం జోషి కార్మికోద్యమంలో పాల్గొన్నాడు. 1926 లో ఢిల్లీలో ఉండగా పాక్షిక పక్షవాతానికి గురై కొంత కాలానికి కోలుకున్నాడు. తన ఆరోగ్య పరిమితి దృష్ట్యా జోషి అనుమతితో కార్మికోద్యమానికి స్వస్తి చెప్పి ఒస్మనాబాద్ స్కూల్ లో ప్రధానోపాధ్యాయుడిగా చేరారు. ఈ దరిమిలా హైదరాబాదు రాష్ట్రంలో హిందువులపై జరుపుతున్న దుశ్చర్యలు, ఆంక్షల గురించి తెలుసుకున్నాడు. అప్పటి ప్రభుత్వం, హిందూ ఉన్నత పాఠశాల స్థాపపనకు నిరాకరించింది. ఐతే ఓ లొసుగును ఉపయోగించుకుని ప్రాథమిక పాఠశాలను విస్తరించి ఉన్నత పాఠశాల నెలకొల్పాడు. ఆ స్కూల్ ప్రప్రథమ ప్రధానోపాధ్యాయుడిగా రామానంద తీర్థను నియమించడం జరిగింది.

రామానంద తీర్థ స్మారక తపాళా బిల్ల.

1930 జనవరి 14 లో ఆయన సన్యాస దీక్ష స్వీకరించాడు. ఆయన పేరును స్వామి రామానంద తీర్థగా మార్చుకున్నాడు. వితరణల ద్వారా జీవనం సాగిస్తూ విద్యారంగానికే అంకితమైయ్యారు.

మరణం[మార్చు]

1972, జనవరి 22న మరణించారు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]