పాలవసల విక్రాంత్
పాలవసల విక్రాంత్ | |||
ఎమ్మెల్సీ
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 23 నవంబర్ 2021 - 22 నవంబర్ 2027 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 23 డిసెంబర్ 1971 పాలకొండ, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | పాలవలస రాజశేఖరం, ఇందుమతి | ||
జీవిత భాగస్వామి | గౌరీ పార్వతి | ||
బంధువులు | రెడ్డి శాంతి | ||
సంతానం | సాయి గణేష్, మణికంఠ కార్తికేయ | ||
నివాసం | పాలకొండ, శ్రీకాకుళం జిల్లా | ||
పూర్వ విద్యార్థి | ఆంధ్ర విశ్వవిద్యాలయం బీఈ | ||
మతం | హిందూ మతము |
పాలవసల విక్రాంత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 11 నవంబర్ 2021న ఎమ్మెల్యే కోటాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికయ్యాడు.[1]
జననం, విద్యాభాస్యం[మార్చు]
పాలవసల విక్రాంత్ 23 డిసెంబర్ 1971లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, పాలకొండ లో పాలవలస రాజశేఖరం, ఇందుమతి దంపతులకు జన్మించాడు. ఆయన బీఈ ( బ్యాచ్లర్ ఆఫ్ ఇంజనీరింగ్) పూర్తి చేశాడు.[2]
కుటుంబ నేపథ్యం[మార్చు]
పాలవసల విక్రాంత్ తండ్రి పాలవలస రాజశేఖరం ఉణుకూరు నియోజక వర్గం ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా , శ్రీకాకుళం జిల్లా జెడ్పీ ఛైర్మన్గా పని చేశాడు. ఆయన సోదరి రెడ్డి శాంతి పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా, తల్లి ఇందుమతి, రేగిడి జెడ్పీటీసీగా, భార్య గౌరీ పార్వతి, పాలకొండ జెడ్పీటీసీగా భాద్యతలు నిర్వహిస్తున్నారు.[3]
రాజకీయ జీవితం[మార్చు]
పాలవసల విక్రాంత్ తన తండ్రి పాలవలస రాజశేఖరం అడుగుజాడల్లో రాజకీయతలోకి వచ్చాడు. ఆయన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా, శ్రీకాకుళం జిల్లా డీసీసీబీ ఛైర్మన్గా పని చేశాడు.[4] ఆయనను 11 నవంబర్ 2021న ఎమ్మెల్యే కోటాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. ఆయనకు సీఎం జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 16న బీఫాం అందజేయగా సెక్రటేరియట్ లో నామిషన్ దాఖలు చేశాడు.[5]
మూలాలు[మార్చు]
- ↑ Sakshi (11 November 2021). "ముగ్గురు ఎమ్మెల్సీల ఖరారు". Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.
- ↑ Sakshi Post (16 November 2021). "AP CM YS Jagan Hands Over B-forms To MLC Candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
- ↑ Andhrajyothy (10 November 2021). "పాలవలస విక్రాంత్కు ఎమ్మెల్సీ". Archived from the original on 13 జనవరి 2022. Retrieved 13 January 2022.
- ↑ The Hans India (6 December 2019). "Srikakulam: DCCB, DCMS chairmen assume office" (in ఇంగ్లీష్). Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
- ↑ TV9 Telugu, TV9 (16 November 2021). "ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. వైసీపీ అభ్యర్థులకు బీఫాం అందజేసిన సీఎం వైఎస్ జగన్". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)