సీ.పీ. రాధాకృష్ణన్
సీ.పీ. రాధాకృష్ణన్ | |||
| |||
తెలంగాణ గవర్నర్
(అదనపు భాద్యత) | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 19 మార్చి 2024 | |||
ముందు | తమిళిసై సౌందరరాజన్ | ||
---|---|---|---|
పుదుచ్చేరి గవర్నర్
(అదనపు భాద్యత) | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 19 మార్చి 2024 | |||
ముందు | రమేష్ బైస్ | ||
10వజార్ఖండ్ గవర్నర్
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 12 ఫిబ్రవరి 2023[1] | |||
లోక్సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1998 – 2004 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారి వాజపేయి | ||
ముందు | ఎం. రామనాథన్ | ||
తరువాత | కె. సుబ్బరాయన్ | ||
నియోజకవర్గం | కోయంబత్తూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తిరుప్పూర్, మద్రాస్, భారతదేశం | 1957 అక్టోబరు 20||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | ఆర్. సుమతి | ||
నివాసం | తిరుప్పూర్ |
సీపీ రాధాకృష్ణన్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు కోయంబత్తూరు లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా, తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు. సీపీ రాధాకృష్ణన్ 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్గా నియమితుడయ్యాడు.[2]
తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ 2024 మార్చి 18న రాజీనామా చేయడంతో తెలంగాణ గవర్నర్గా & పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలును అప్పగిస్తూ 2024 మార్చి 19న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసింది.[3]
రాజకీయ జీవితం
[మార్చు]సీపీ రాధాకృష్ణన్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1998లో కోయంబత్తూరు నుంచి తొలిసారి లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1999లో రెండోసారి ఎంపికై 2004, 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు.
ఆయన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా, 2016 నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కోయిర్ బోర్డు చైర్మన్గా పని చేశాడు.[4]
ఎన్నికల్లో పోటీ
[మార్చు]సంవత్సరం | ఎన్నికల | పార్టీ | నియోజకవర్గం పేరు | ఫలితం | ఓట్లు వచ్చాయి | ఓటు వాటా% | |
---|---|---|---|---|---|---|---|
1998 | 12వ లోక్సభ | భారతీయ జనతా పార్టీ | కోయంబత్తూరు | విజేత | 4,49,269 | ||
1999 | 13వ లోక్సభ | భారతీయ జనతా పార్టీ | కోయంబత్తూరు | విజేత | 4,30,068 | ||
2004 | 14వ లోక్సభ | భారతీయ జనతా పార్టీ | కోయంబత్తూరు | రన్నర్ | 3,40,476 | ||
2014 | 16వ లోక్సభ | భారతీయ జనతా పార్టీ | కోయంబత్తూరు | రన్నర్ | 3,89,701 | 33.12 | |
2019 | 17వ లోక్సభ | భారతీయ జనతా పార్టీ | కోయంబత్తూరు | రన్నర్ | 3,92,007 | 31.34 |
మూలాలు
[మార్చు]- ↑ The Avenue Mail (12 February 2023). "C.P. Radhakrishnan appointed Jharkhand Governor". Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.
- ↑ Namasthe Telangana (12 February 2023). "మహారాష్ట్ర గవర్నర్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం.. ఏపీ సహా 12 రాష్ట్రాలకు నూతన గవర్నర్లు". Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.
- ↑ Zee News Telugu (19 March 2024). "తెలంగాణ కొత్త గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్.. జార్ఖండ్ గవర్నర్ కు అదనపు బాధ్యతలు." Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
- ↑ The Hindu (12 February 2023). "Being appointed Governor is growth in politics: Radhakrishnan" (in Indian English). Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.