అంబటి లక్ష్మి నరసింహరాజు
Jump to navigation
Jump to search
అంబటి లక్ష్మి నరసింహారాజు తెలుగు కవి, రచయిత.[1]
జీవిత విశేషాలు[మార్చు]
అంబటి లక్ష్మీనరసింహరాజు వరంగల్ జిల్లా ములుగు తాలూకా ఆత్మకూరు గ్రామంలో 1892లో జన్మించాడు. తండ్రి సుందరరాజు. అతను ఎన్నో నాటకాలు కావ్యాలు శతకాలు రచించాడు. అతని రచనలపై వసుచరిత్ర రచించిన రామరామభుషణుని(భట్టుమూర్తి) ప్రభావం చాలా ఉంది.
కర్ణుడు అధినాయకుడిగా చేసి ' కర్ణాభ్యుదయము ' కావ్యం రచించాడు.లాగి సెట్టి పేటవాసులు పూస్కూరు రంగారావు ప్రోత్సాహం మీద అర్జునుని అధి నాయకునిగా ' విజయ విజయం ' కావ్యాన్ని రచించాడు.చాలా శతకాలు అలభ్యాలు.
ప్రబంధాలు[మార్చు]
- ప్రచ్ఛన్న పాండవము
- ప్రహ్లాద చరిత్ర
- ప్రభావతి ప్రద్యుమ్నo.
- యదువీర విజయం
- హానుమద్విజయం
- విజయ విజయం
- కర్ణాభ్యుదయం
నిర్వచన మహాకావ్యాలు:[మార్చు]
- సుమతి
- శశిరేఖ
- ద్రౌపతి
- రుక్మాంగద
- పార్వతి పరిణయం.
నవలలు[మార్చు]
- శాంతాబాయి[2]
శతకాలు:[మార్చు]
- శ్రీ వెంకటేశ్వర శతకం
- యాదగిరి నృకేసరి శతకం
- నిరోష్ట్య శతకం
- సాంబమూర్తి
మూలాలు[మార్చు]
- ↑ తెలుగు సాహితీ కిన్నెర, తెలుగు (2018). డిగ్రీ ద్వితీయ సంవత్సరం తెలుగు పుస్తకం. హిమాయత్ నగర్: తెలుగు అకాడమీ. pp. Page. ISBN 8181803329.
- ↑ telugu, NT News (2022-02-06). "నవలా ప్రభంజనం.. తెలంగాణ సాహిత్య ప్రస్థానం". www.ntnews.com. Retrieved 2023-09-12.