గాలి సరస్వతి
Jump to navigation
Jump to search
కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ | |||
శాసనమండలి సభ్యురాలు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 25 జూన్ 2018 - 11 ఆగస్టు 2021 | |||
ముందు | గాలి ముద్దుకృష్ణమ నాయుడు | ||
---|---|---|---|
తరువాత | కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ | ||
నియోజకవర్గం | చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల కోటా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1951 వేలంజేరి గ్రామం, తిరువళ్లూరు జిల్లా, తమిళనాడు రాష్ట్రం | ||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | గాలి ముద్దుకృష్ణమ నాయుడు | ||
సంతానం | భానుప్రకాష్, జగదీష్ ప్రకాష్, లావణ్య | ||
నివాసం | తిరుపతి |
గాలి సరస్వతి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆమె 2018లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైంది.[1]
రాజకీయ జీవితం[మార్చు]
గాలి సరస్వతి తన భర్త గాలి ముద్దు కృష్ణమనాయుడు మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చింది. గాలి ముద్దు కృష్ణమనాయుడు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ మంత్రివర్గంలో అటవీ, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా, ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పని చేశాడు. ఆయన 7 ఫిబ్రవరి 2018న అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
గాలి ముద్దు కృష్ణమనాయుడు మృతితో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఆ స్థానంలో ముద్దు కృష్ణమనాయుడు సతీమణి గాలి సరస్వతి ఏకగ్రీవంగా ఎన్నికై [2] 25 జూన్ 2018న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసింది. ఆమె ఈ పదవిలో 11 ఆగస్టు 2021 వరకు కొనసాగింది.[3]
మూలాలు[మార్చు]
- ↑ Vaartha (25 June 2018). "ఎమ్మెల్సీగా గాలి సరస్వతి". Archived from the original on 1 జనవరి 2022. Retrieved 1 January 2022.
- ↑ Zee News Telugu (5 May 2018). "ఎమ్మెల్సీగా గాలి సరస్వతమ్మ ఏకగ్రీవం..!". Archived from the original on 1 జనవరి 2022. Retrieved 1 January 2022.
- ↑ Andhrajyothy (17 November 2021). "ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ విడుదల". Archived from the original on 1 జనవరి 2022. Retrieved 1 January 2022.