గెడ్డాపు సత్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గెడ్డాపు సత్యం
జననం(1936-02-03)1936 ఫిబ్రవరి 3
మరణం2015 జనవరి 8(2015-01-08) (వయసు 78)
మరణ కారణంశ్వాసకోశ వ్యాధి
జాతీయతభారతీయుడు
వృత్తితెలుగు అధ్యాపకుడు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల
సుపరిచితుడు/
సుపరిచితురాలు
పద్యకవి
గుర్తించదగిన సేవలు
  • కవితా వైజయంతి
  • జైత్రయాత్ర
పిల్లలుజి.లక్ష్మీప్రసాద్
తల్లిదండ్రులు
  • ఎర్రంనాయుడు (తండ్రి)
  • లక్ష్మమ్మ (తల్లి)

గెడ్డాపు సత్యం ప్రముఖ పద్యకవి, సాహితీవేత్త.

జీవిత విశేషాలు[మార్చు]

ఈయన శ్రీకాకుళం జిల్లా, సంతకవిటి మండలం, కాకరపల్లి గ్రామంలో 1936, ఫిబ్రవరి 3న లక్ష్మమ్మ, ఎర్రంనాయుడు దంపతులకు జన్మించారు. శ్రీకాకుళంలోని డిగ్రీ కళాశాలలో ఆచార్యులుగా పనిచేశారు.

సాహితీసేవ[మార్చు]

వీరు త్రిలిఙ్గపత్రిక, మిసిమి తదితర మాసపత్రికల్లో వ్యాసాలు రాశారు. ఆకాశవాణిలో కవితా స్రవంతి కార్యక్రమంలో స్వీయ కవితలు వినిపించారు. వర్ణనరత్నాకరం అనే పద్య సంకలనాలకు ఆయన వ్యాఖ్యానాలు రాశారు.

రచనలు[మార్చు]

  1. మృత్యుంజయుడు
  2. జైత్రయాత్ర
  3. శివకేశవమ్‌
  4. ప్రసన్నధర్మము
  5. కవితా వైజయంతి
  6. శ్రీ వేణుగోపబాల శతకము
  7. త్రికుటేశ్వర సుప్రభాతం మొదలైనవి.

మరణం[మార్చు]

వీరు విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శ్వాసకోశ వ్యాధితో జనవరి 8, 2015న మరణించారు.[1]

మూలాలు[మార్చు]