చర్చ:ఇస్లాం మతం
Jump to navigation
Jump to search
ఈ విషయాలు ఏదైనా పుస్తక సమీక్ష కోసం నేను రాయలేదు.తెలుగు మాత్రు భాషగా ఉన్న ముస్లిములు అల్లాను తెలుగులో ప్రార్దించుకోవడానికి ఇస్లాం లేఖనాలను ఉటంకించాను.ఇది తెలుగు ముస్లిం జాతికి ఎంతో అవసరమైన సమస్య.ఎవరూ పట్టించుకోకపోతే ఎలా? అసలు మీరు పెట్టిన హెడ్డింగే తప్పు.మహమ్మదీయ మతము కాదు.ఇస్లాం మతము.ఎందుకంటే ఏముస్లిమూ మహమ్మదును పూజించడు.సర్వేశ్వరుడైన అల్లాను పూజిస్తాడు.చర్చ జరగనివ్వండి.పెరుగును చిలికితే మజ్జిగ ,వెన్నను కాచితే నెయ్యి వచ్చినట్లు అరబీలో వున్న లేఖనాలు మన తెలుగు ప్రజలకు అర్దమయితే ప్రశ్నించడం మొదలు పెడతారు. అప్పుడు బయటికొస్తాయి సత్యాలు.
- ఈ వ్యాసం పేరు ఇస్లాం అని మార్చడం పెద్ద పని కాదు. ఇందులోని విషయం, రచనా శైలి ఏదైనా పత్రికకో, బ్లాగుకో తగును. వికీపీడియా సమస్యల వేదికకాదు. ఇంకా ఏది కాదో ఇక్కడ చూడండి. వికీపీడియాలో ఇస్లాం సంబంధిత వ్యాసాలు ఒకటీ రెండే ఉన్నాయి. మీలాంటి తెలిసిన వారు మరిన్ని వ్యాసాలు రాస్తే బాగుంటుంది. రంజాన్, మొహమ్మద్ ప్రవక్త గురించి ఈపాటికే వ్యాసాలున్నాయి. సున్నా, హదిత్, హిజ్రీ శకం, షియా ఇలాంటి పలు విషయాలపై రాసే అవకాశం ఉంది. --వైజాసత్య 11:20, 12 జూన్ 2007 (UTC)
POV అని నిపించిన ఈ క్రింది సమాచారాన్ని వ్యాసం నుండి తొలగిస్తున్నాను[మార్చు]
మహమ్మదీయ మతము
ఇస్లాం అనే అనాలి.మహమ్మదీయ మతము అనకూడదు.ముస్లిములు అనాలి కానీ మహమ్మదీయులు అనకూడదు. అరబ్బీ బాష అత్యున్నతమైనదే కావచ్చు. ఆది అర్ధం అయ్యే వారికే దాని గొప్పతనం తెలుస్తుంది.ఆందరికీ అదే భాషను అవశ్యం చెయ్యటం కంటె ఆ భాషలో వెలువడిన దైవ సందేశాన్ని అందరికీ అర్ధం అయ్యెట్లు చెప్పటం వివేకవంతంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని దృష్టిలో భాషకంటె భావమే విలువైనది. [[ఖురాన్]] బోధ చాలా సులువైనది(చంద్రుడు17,22,40). కానీ ప్రపంచంలోని కోట్లాది అరబ్బేతరులకు అది అర్ధం కాని మంత్ర పఠనంలా ఎందుకు ఉంది? కేవలం ఆ మహా ఘనత గల దైవ సందేశాన్ని(కహఫ్:1)అరబ్బీ భాషలో బంధించటం వల్లనే కాదా? "ఏ జాతి వారి తాత ముత్తాతలకు భయ బోధ చేయబడలేదో వారిని భయపెట్టటం కోసం ఈ అరబ్బు ప్రవక్తగా పంపబడ్డారు(యాసీన్:6). ఈ అరబ్ ప్రవక్త తెచ్చిన భయబోధ ఆ జాతి వారికే పరిమితమై ఉంటుందని, అరబ్బేతరులకు వర్తించదని ఎవరైనా చెప్పగలరా? మానవ నిర్మితమైన పారంపరిక ఆచార్యాలను నిలుపుకోవాలనే తలంపుతో, దైవోపదేశాలను వదిలివేసి, కేవలం మన హేతుబుధ్ధితో అగోచర విషయాలను తర్కించబూనటం అవివేకం అవుతుంది. (ఇమ్రాన్:7) అందరికీ వచ్చే భాష అందరికీ అర్ధమయ్యె భాష ఏది? "వీళ్ళు గ్రహించటం కోసం ఈ ఖురాన్ను నీ భాషలో సులువుగా చేశాము"(పొగ:58) అంటే అరబ్బులు తప్ప ఇతర భాషల జనం దాన్ని గ్రహించకూడదని దేవుని భావం కాదు. ప్రవక్త అరబీయుదు,అతని స్వజనం అతని మాటలు వినాలంటే అతని భాషలోనే దైవ సందేశం రావాలి. ప్ర్రవక్తకే అర్ధం కాని భాష ప్రవక్త జాతి ప్రజలకు అర్దం ఎలా అవుతుంది? ఒక వేళ దేవుడు పరాయి భాషలను అర్ధం చేసుకునే అద్బుత శక్తిని ప్రవక్తకు ఇచ్చి సందెశాన్ని పంపినప్పటికీ ఆ జనం "అరబ్బీ ప్రవక్త- అర్ధంకాని అజమీ కురాన్" అని ఎగతాళి చేస్తారు (సజ్దా:44). ఆరబ్బేతరుడు అరబీలొ ప్రవచిస్తూ వస్తే అతన్నీ నమ్మరు (కవులు:198,199). అందువలన ప్రవక్త స్వభాషలోనే ప్రవచనం రావటం ఎంత ఆవశ్యకమో ఆ ప్రవచనం ఆయా ప్రజల భాషలలోనే వారికి అందించబడటం కూడా అంతే అవసరం. ఆద్వితీయ దేవుని గురించి అరబ్బులకు అరబీలో చెబుతుంటేనే, నీ మాటలు మా హృదయాల్లో దూరవు, మా చెవులు చెవిటివైపోయాయి. నీకూ మాకూ మధ్య పెద్ద తెర ఒకటి అడ్డంగా ఉంది, నీ దారి నీదీ మాదారి మాదీ అన్నారు విగ్రహారాధకులు(హామీం:5). అరబ్బేతరులకు అరబీలొ చెప్పి ఒప్పింపచేయటం అలవి అయ్యే పనేనా? రాజ్యాధికారం పొందిన ఆంగ్లేయులు ఇంగ్లీషును అందరిమీదా రుద్దినలాగా అరబీని అందరికీ అంటగట్టగలిగితేనే అది సాధ్యం అవుతుంది. ఆయినా ఇక్కడ సమస్యను చిటికెలో తీర్చగల సర్వలోకాల ప్రభువు ఖురాన్ను అరబీలొ పంపి ఆదమరచి నిద్రపోలేదు. పంపిన ఉద్దేశం వెల్లడించాడు.ఆది విశ్వాసులకు స్థిరత్వం ఇవ్వాలి,సన్మార్గం చూపించాలి, సువార్త వినిపించాలి (తేనెటీగ:103) నమాజులోకానీ, మరో చోట కానీ అరబీ కురాన్ వింటుంటే మనకు పై మూడు ప్రయోజనాలు కలగటం లేదు.తెలుగు కురాన్ ద్వారా అవి మనకు సిద్ధిస్తున్నాయి. నిశ్చయంగా కురాన్ మనను కష్టపెట్టటానికి గాక మనకు బోధ చెయ్యడానికే వచ్చింది.(ఓ మానవుడా:2,3). మాటిమాటికి పఠించే ఆ ఏడు వాక్యాలు (గుట్ట:87) కూడా ప్రతి ప్రార్ధనలో మనకు బోధ చేస్తూ ఉండాలి.అది మన మాత్రుభాషలొనె మనకు సాధ్యమవుతుంది. మనిషిని ఉద్ధరించగల ప్రార్ధనలో 4 ముఖ్య విషయాలున్నాయి:- 1. మనల్ని చూస్తున్న దేవుని ముందు మనం నిలబడ్డామని గ్రహించాలి. 2.ఆయన గొప్పతనం మన హీనత్వం గుర్తించాలి. 3.ఆయన మనల్ని ప్రేమించి సహాయం చెయజూస్తున్నాడని తెలిసికొని అడగాలి. 4.మనం అడిగేదేమిటో మనకు అర్దమై ఉండాలి. ఇలా చేసే ప్రార్దన మనల్ని దేవునికి సన్నిహితులుగా మారుస్తుంది.పాపకార్యాలకు పాల్పడనీయదు. దుష్టతలంపులను కలుగనీయదు.దేవుని సర్వొన్నతను పదే పదే గుర్తు చెస్తుంది. క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. హ్రుదయాన్ని శుద్ధి చేస్తుంది.దేవునిపై ఆధారపడే స్వభావాన్ని పెంచుతుంది.దేవుని ప్రీతికోసం ఎట్టి త్యాగానికైనా తగిన తెగింపును ఇస్తుంది.మరి ఇదంతా నైతికమైన సముద్ధరణే గదా? "నిశ్చయంగా నమాజు సిగ్గుమాలిన పనులనుండి అధర్మకార్యాలనుండి ఆటంకపరుస్తుంది" (సాలెపురుగు:46). ఈ వచనాన్ని గురించి అబ్దుల్ గఫూర్ గారు ఇలా వ్యాఖ్యానించారు: "నమాజు చాలా మహిమగలది.దానిని నియమముగా భక్తి పూర్వకముగా చేసినచో అది భక్తులను సిగ్గుమాలిన పనులనుండి పాపకార్యములనుండి మానిపించును. దుర్గుణములను తొలగించి మంచి గుణములను కలిగించుట దాని స్వభావము. ఎట్లు మందును నియమముగా పథ్యముతో సేవించిన రోగము పోయి ఆరోగ్యము చేకూరునో, అట్లే నమాజు సలుపుచు దానికి విరోద కార్యములను మాను కొనినచో, ఆత్మ సంబందమైన రోగములు అను దుర్గుణములు నశించి, ఆత్మకు ఆరొగ్యము అనెడి సుగుణములు అలవడును. భక్తుడు పాపములు వదలుకొనును.దొంగ భక్తి వలన పాపములు తొలగనిచో అది వాని తప్పుయే కాని నమాజు దోషము కాదు.నమాజు చేయునపుడు దేవుని సాన్నిధ్యమున నిలచి భక్తితోనుందునని వాగ్ధానము చేసి నమాజు ముగించిన పిదప పాప కార్యములు చెయువాడు మాట తప్పిన వాడగును. అట్లు చేయవలదు అని నమాజు హెచ్చరించుచుండును". "నేను జిన్నాతులను మానవులను పుట్టించినది వారు నన్ను ఆరాధించుట కొరకే" (51:56) అంటే మనిషి జీవిత ఉద్దేశమే దైవారాధన. మీరు నన్ను పొషించనవసరం లేదు.నాకు అన్నం పెట్టనక్కరలేదు. నేనే మీకు అవన్నీ ఇస్తాను.నా ద్వారా మేళ్ళు పొంది క్రుతజ్ఞులై నన్ను ఆరాధించండి అని దేవుడు అంటున్నాడు.తీర్పుదినాన దేవుని సిం హాసనానికి కుడివైపు చేరిన సజ్జనులు నరకాగ్నిలొ మాడుతున్న వారిని ఒక ప్రశ్న వేస్తారు:"మీరు నరకంలో త్రోయబడటానికి కారణం ఎమిటి?" అంటే వాళ్ళు నాలుగు కారణాలు చెబుతారు. ఆందులో మొదటిది" నమాజు చెయ్యకపోవటం"(74:43) “ఓ విశ్వాసులారా, శుక్రవారం నాడు నమాజుకు పిలుపు వినబడగానే మీ వ్యాపారాన్ని వదిలిపెట్టి దేవుని ధ్యానించటానికి పరుగెత్తి రండి. ఆది మీకెంతో మేలైనదని తెలిసికోండి"(62:9) మరి ఇంతమేలైనది,మనల్ని నరకశిక్ష నుండి తప్పించేది,నైతికంగా ఉద్ధరించేది అయిన నమాజు అనేక మందికి నిరుపయోగంగా ఉంటున్నది.నమాజు ద్వారా మనిషి పొందవలసినంత ప్రయోజనం పొందటం లేదు.అర్ధంకాని మంత్రాలలాంటి కొన్ని పదాలను వల్లించటం అనే తంతుతో నమాజు ముగుస్తున్నది. గొంతులోనుండి వెలువడే నమాజు ఉచ్చారణ కంటే, హ్రుదయంలోంచి పెల్లుబికే ప్రార్ధన నిశ్చయంగా గొప్పది. నమాజు అనేకుల జీవితాల్లొ మార్పుతేలేకపోవటానికి ఒక కారణం "ఆ నమాజు వాళ్ళకు అర్ధంకాక పోవటం". అర్ధంకాకపోవటానికి కారణం అతనికి అరబ్బీ భాష రాకపోవటం దేవునికి అరబ్బీ భాషలొ మాత్రమే నమాజు చెయ్యలి అనే కట్టడి.ప్రతి విశ్వాసీ తప్పని సరిగా అరబ్బీ నేర్వాలి అనే నిర్బంధం.అర్ధం అయినా కాకపొయినా సరే అరబ్బీలో రాయబడిన కురానే చదవాలి అని ఒత్తిడి చెయ్యటం.ఇది అనుల్లంఘనీయమైన సంప్రదాయం కావటం. "మోకరించి మీ మాత్రుభాషలో దేవుని అయిదుపూటలా ప్రార్దించుకోండి,మీకు వచ్చిన భాషల్లొనే కురాన్ చదువుకోండి అంటే ప్రపంచ ప్రజలందరికీ "అర్ధం అయ్యే నమాజు" అందుబాటులొ ఉందేది.కానీ అరబ్బీలో మాత్రమే ఇలా ఇలా వంగుతూ లేస్తూ నమాజు చెయాలి అనటంతో ఈ శారీరక విన్యాసంలోని అంతరార్దమేమిటొ ప్రజలకు అర్ధం కాలెదు. "అర్ధం లెని చదువు వ్యర్ధము" అన్నట్లే" అర్ధం కాని ప్రార్ధన కూడా వ్యర్ధమే". మహా ప్రవక్త గారి మాత్రుభాషలోనె దైవ సందేశం ఎందుకు వచ్చింది?మరో భాషలోవస్తే ఆయనకు అర్ధం కాదనే గదా!". "సకలలోకాల ప్రభువా! అనంత కరుణామయుడా!, అపారక్రుపాశీలుడా!, తీర్పు దినపు యజమానీ! మాదేవా!, నీకే స్తోత్రములు! మేము నిన్నే ఆరాధిస్తాము. సహాయం కోసం నిన్నే అర్ధిస్తున్నాము. నీవు దీవించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురి కాని వారి మార్గం, మార్గభ్రష్టులు కాని వారి రుజుమార్గం మాకు చూపించు". అని చెప్పుకుంటే ఒక తెలుగు వానికి నమాజు అర్ధవంతంగా ఉంటుంది.అల్లా అంటే ఒక్కడేననీ ఆయనకు ఆలుబిడ్డలు లేరనీ, ఆయన ఎవరికీ పుట్టలేదనీ, ఆయన ఎవరినీ కనలేదనీ ఆయన సర్వోన్నతుడైన ఏకైక దేవుడనీ-విగ్రహారాధన హేయమనీ, తీర్పు రోజున మనం లెక్క అప్పజెప్పుకోవలసి ఉంటుందనీ తెలుగుజనానికి తెలుగులోనే అర్ధం అవుతుంది. ఆయన అద్వితీయుడనీ ఆయనకు సాటి కల్పించరాదని తెలుగులో చెబితే తెలుగుజనం సుళువుగానె అర్ధం చేసికొంటారు. కానీ అక్కడినుండి ఆరంభమయ్యే అరబ్బీ ఆంక్షలు, నియమనిష్టలు, ప్రత్యేక తరహాలో సాగే ప్రార్ధనా పద్దతులు వారిని అల్లా సన్నిధికి రాకుండా ఆటంకపెడతాయి. ఆయన సన్నిధికి వచ్చి"అలహందులిల్లాహి" అనవలసినదేగాని"సర్వలోకాలప్రభూ"అని సంబోధించలేడు తెలుగువాడు.గుండెలోని భావం గొంతుదాటి రాకూడదా? అది దేవుడు వినడా? అరబ్బీ రాని ప్రజల యాతన చూడండి. మతంలో బలాత్కారం లేదన్న వాళ్ళే బలవంతంగా ఒక భాషను నిర్బంధం చేసారు.ఆ భాషరానిదే నీవు ముస్లిం కాదు పొమ్మన్నారు.దేవుని ప్రార్ధించుకోటానికి ఆ భాషలో ఉచ్చరించనిదే మసీదు గడపతొక్కటానికి సైతం నీకు అర్హత లేదు పొమ్మన్నారు.అన్ని రంగులూ, అన్ని భాషలూ దేవునివేనని చెప్పేవారూ ఈ భాష తప్ప మరో భాషలో చేసే ప్రార్ధన దేవునికి అర్ధం కాదు అన్నట్లుగా పట్టు పడుతున్నారు. నమాజు మనిషిని నైతికంగా ఉద్ధరిస్తుంది.కాని అరబిక్ సూరాల కంఠస్తం అవశ్యం కావటం వల్ల అన్యుల ప్రవెశానికి ఆటంకం కలిగిస్తొంది.హ్రుదయంలో వున్న విషయాలను చెప్పుకొను వీలు లేదు.తెలుగు భక్తుడు,అరబ్బీ దేవుడు.తెలుగు ముస్లిములు అయిదు వేళలా దేవుని తెలుగులోనే ధ్యానిస్తే వారి మది సేద తీరుతుంది.దేవుని స్తుతించి, హ్రుదయమంతా ఆయన ప్రసన్నతను నింపుకొని, ఆయన ఆజ్ఞలను మనస్సులొ నిలుపుకొని జాగ్రత్తతో బ్రతుకవచ్చు.కానీ అరబ్బీ ఆచార సంపన్నులు తెలుగుముస్లిముల తెలుగు ప్రార్ధనలకు ఆమోదముద్ర వేయరట! మరి మన తెలుగు ప్రార్దనలు అల్లా దరి జేరవా? గడ్డం పెంచలేదనీ, నమాజు సమయంలొ కాలి గిలకలు కాన రాలెదనీ, అన్నం తిన్నాక ఫలానా వరుసలో చేతివేళ్ళు నాకలేదనీ, అరబ్బీ రాదనీ విమర్శించే వాళ్ళను లెక్క చెయ్యకండి.అన్ని భాషలూ దేవునివే గనుక అయితే, అన్ని భాషలను ఆయనే అనుమతించి ఉంటే ఈ ప్రత్యేక భాషాదాస్యం చెయ్యమని ఆయన చెప్పడు. తెలుగు ముస్లిములకోసం తెలుగులో నమాజును,తెలుగు మసీదులను ప్రారంభించాలి.అల్లా సన్నిధికి చేరి మన హ్రుదయాలను ధారాళంగా తెరిచే అవకాశం మనకు తెలుగులోనే దొరుకుతుంది"
__మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 08:14, 6 జూలై 2007 (UTC)