నీ నామమే మాకు నిధియు నిధానము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నీ నామమే మాకు నిధియు నిధానము అనేది అన్నమాచార్యులు రచించిన కీర్తన.

కీర్తన[మార్చు]

నీ నామమే మాకు నిధియు నిధానము

నీ నామమే ఆత్మ నిధానాంజనము

నమో నమో కేశవ నమో నారాయణ - నమో నమో మాధవ నమో గోవింద

నమో నమో విష్ణు నమో మధుసూదన - నమో త్రివిక్రమ నమో వామనా

నమో నమో శ్రీధర నమో హృషీకేశ - నమో పద్మనాభ నమో దామోదర

నమో సంకర్షణ నమో వాసుదేవ - నమో ప్రద్యుమ్న తే నమో యనిరుద్ధా

నమో పురుషోత్తమ నమో యధోక్షజ - నమో నారసింహ నమోస్తు యచ్యుత

నమో జనార్దన నమోస్తు ఉపేంద్ర - నమో శ్రీ వేంకటేశ నమో శ్రీకృష్ణా

వివరణ[మార్చు]

ఈ సంకీర్తనలో అన్నమాచార్యులు విష్ణువును ఆత్మ అనే నిధిని దర్శించుటకు తోడ్పడే అంజనముగా పేర్కొంటాడు. దీని కోసం 24 లో 23 కేశవ నామాలు ప్రయోగించాడు. ఓం కేశవాయనమ: ఓం మాధవాయ నమ: అంటూ త్రికాలాల్లో, పూజాదికాల్లో చేసే ఆచమనంలో ఉపయోస్తూ వస్తున్న నామాలివి.[1]

భారతీయ సంస్కృతి[మార్చు]

పూర్తి పాఠం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. సప్తగిరి సచిత్ర మాస పత్రిక, జూలై 2008.
  2. ఎమ్మెస్ గానం చేసిన నీ నామమే కీర్తన.