పసువులేటి వేణు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పసువులేటి వేణు
జననం1938
మరణం2002
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, నాటక రచయిత

పసువులేటి వేణు (1938 - 2002) ప్రముఖ రంగస్థల నటుడు, నాటక రచయిత.[1]

జననం - ఉద్యోగం[మార్చు]

వేణు 1938లో నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జన్మించాడు. ఆర్.వి.ఎమ్. హైస్కూలులో విద్యాభ్యాసం చేశాడు.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

వృత్తిరీత్యా వైద్యుడైన వేణు వెంకటగిరిలో అమెచ్యూర్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ స్థాపించాడు.

రచించినవి[మార్చు]

1955లో నిరాశ ప్రొడక్షన్ నెం. 1 అనే హాస్య నాటికలో తన నాటక రచనను ప్రారంభించి, 5 నాటికలు 2 నాటకాలు రాశాడు.

నాటికలు:

  1. నిరాశ ప్రొడక్షన్ నెం. 1 (1955)
  2. దిష్టి బొమ్మలు (1958)
  3. చీకటిదొంగలు (1958)
  4. రాజీవం (1960)
  5. అన్నపూర్ణ (1961)
  6. పద్మవ్యూహం (1961)
  7. వంశవృక్షం (1973)

నాటకాలు:

  1. నటరాజ్
  2. ఎట్ లాస్ట్

బహుమతులు[మార్చు]

ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటుడు - దిష్టి బొమ్మలు - ఆంధ్ర నాటక కళా పరిషత్తు

మరణం[మార్చు]

వేణు 2002లో చిత్తూరు జిల్లా, కార్వేటినగరంలో మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.575.