కంకణ (కన్నడ సినిమా): కూర్పుల మధ్య తేడాలు
పంక్తి 20: | పంక్తి 20: | ||
==చిత్రకథ== |
==చిత్రకథ== |
||
అది మైసూరు పట్టణం. అప్పుడే బి.ఏ. పరీక్షలు రాసి, తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తూ కుర్చున్నారు ఆరుగురు అమ్మాయిలు. కాలేజీలో చదువుకుంటుండగా - వాళ్ళ మధ్య ఏర్పడిన మైత్రి అంతా ఇంతా కాదు. అందుకే వాళ్ళు ఒక చోట కూర్చుని భవిష్యత్తు పట్ల తమ ఆశలు, ఆశయాలు చెప్పుకుంటూ, ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకోవడం పట్ల ఎంతో ఆసక్తి చూపారు. మనసులు విప్పి మాట్లాడుకున్నారు. |
అది మైసూరు పట్టణం. అప్పుడే బి.ఏ. పరీక్షలు రాసి, తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తూ కుర్చున్నారు ఆరుగురు అమ్మాయిలు. కాలేజీలో చదువుకుంటుండగా - వాళ్ళ మధ్య ఏర్పడిన మైత్రి అంతా ఇంతా కాదు. అందుకే వాళ్ళు ఒక చోట కూర్చుని భవిష్యత్తు పట్ల తమ ఆశలు, ఆశయాలు చెప్పుకుంటూ, ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకోవడం పట్ల ఎంతో ఆసక్తి చూపారు. మనసులు విప్పి మాట్లాడుకున్నారు. |
||
ఒక్కొక్కరి కుటుంబంలోను రకరకాల సమస్యలు... రమ, సుశీలల కుటుంబాలు పెద్దవి.అంచేత వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ, తమ తమ కుటుంబాలకు సాయపడదామనుకున్నారు. వేదవల్లి గృహిణిగా స్థిరపడాలని అనుకున్నా, ఆమె నల్లగా ఉండడంవల్ల సంబంధం చేసుకోడానికి వచ్చేవాళ్ళు ఎక్కువ కట్నం అడగడడమో - లేదా పిల్ల నచ్చలేదనడమో ఆమెకు ఒక సమస్యగా పరిణమించించిది. కస్తూరికి పెద్ద చదువులు చదువుకుని - పెద్ద ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని పెళ్ళాడాలని కోరిక. అమృతకు పెళ్ళి మీద అంతగా ఆసక్తి లేదు. ఇక వాళ్ళందరితో పోలిస్తే - ఏ చీకూ చింతా లేని అమ్మాయి - అంబిక. ఆమె శ్రీమంతుల ఇంట్లో పుట్టడమే అందుకు కారణం! |
|||
చదువైపోగానే సరదాగా కొంత కాలం గడపకుండా అప్పుడే రకరకాల ఆలోచనలతో సతమతమైపోవడం ఎందుకని - అంబిక - తన స్నేహితురాళ్ళందరినీ తీసుకుని 'చిక్మగళూర్'లోని తన మామయ్యగారి కాఫీ ఎస్టేట్కు విహారయాత్రకు బయలుదేరింది. |
|||
==మూలాలు== |
==మూలాలు== |
08:08, 26 మే 2017 నాటి కూర్పు
కంకణ 1974లో విడుదలైన కన్నడ చలనచిత్రం. ఎం.బి.ఎస్.ప్రసాద్ దర్శకత్వంలో వెలువడిన ఈ చిత్రం కన్నడలో జాతీయ ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా ఎంపికయ్యింది. త్రివేణి రచించిన నవల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ కన్నడ రచయిత యు.ఆర్.అనంతమూర్తి స్క్రీన్ప్లే, సంభాషణలు సమకూర్చాడు.
పాత్రలు - పాత్రధారులు
- రమ - రేవతి
- కస్తూరి - దివ్య అధికారి
- అమృత - వసుమతి
- సుశీల - గిరిజ
- వేదవల్లి - డి.భారతి
- అంబిక - ప్రమీల
- నాగేంద్ర - హెచ్.బి.యాజమాన్
- సురేష్ - సురేష్ హెబ్లికర్
సాంకేతిక వర్గం
- దర్శకత్వం : ఎం.బి.ఎస్.ప్రసాద్
- కథ : త్రివేణి
- సంభాషణలు, స్క్రీన్ ప్లే : యు.ఆర్.అనంతమూర్తి
- ఛాయాగ్రహణం : ఎస్.రామచంద్ర
- కళ : ఆర్.ఎం.హాద్పాడ్
- సంగీతం : హెచ్.జె.ఇమామ్
- కూర్పు : ఉమేష్ కులకర్ణి
చిత్రకథ
అది మైసూరు పట్టణం. అప్పుడే బి.ఏ. పరీక్షలు రాసి, తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తూ కుర్చున్నారు ఆరుగురు అమ్మాయిలు. కాలేజీలో చదువుకుంటుండగా - వాళ్ళ మధ్య ఏర్పడిన మైత్రి అంతా ఇంతా కాదు. అందుకే వాళ్ళు ఒక చోట కూర్చుని భవిష్యత్తు పట్ల తమ ఆశలు, ఆశయాలు చెప్పుకుంటూ, ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకోవడం పట్ల ఎంతో ఆసక్తి చూపారు. మనసులు విప్పి మాట్లాడుకున్నారు.
ఒక్కొక్కరి కుటుంబంలోను రకరకాల సమస్యలు... రమ, సుశీలల కుటుంబాలు పెద్దవి.అంచేత వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ, తమ తమ కుటుంబాలకు సాయపడదామనుకున్నారు. వేదవల్లి గృహిణిగా స్థిరపడాలని అనుకున్నా, ఆమె నల్లగా ఉండడంవల్ల సంబంధం చేసుకోడానికి వచ్చేవాళ్ళు ఎక్కువ కట్నం అడగడడమో - లేదా పిల్ల నచ్చలేదనడమో ఆమెకు ఒక సమస్యగా పరిణమించించిది. కస్తూరికి పెద్ద చదువులు చదువుకుని - పెద్ద ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని పెళ్ళాడాలని కోరిక. అమృతకు పెళ్ళి మీద అంతగా ఆసక్తి లేదు. ఇక వాళ్ళందరితో పోలిస్తే - ఏ చీకూ చింతా లేని అమ్మాయి - అంబిక. ఆమె శ్రీమంతుల ఇంట్లో పుట్టడమే అందుకు కారణం!
చదువైపోగానే సరదాగా కొంత కాలం గడపకుండా అప్పుడే రకరకాల ఆలోచనలతో సతమతమైపోవడం ఎందుకని - అంబిక - తన స్నేహితురాళ్ళందరినీ తీసుకుని 'చిక్మగళూర్'లోని తన మామయ్యగారి కాఫీ ఎస్టేట్కు విహారయాత్రకు బయలుదేరింది.