వాడుకరి:SIDDANTHAPU BEN JOHNSON

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

SIDDANTHAPU BEN JOHNSON[మార్చు]

బెన్ జాన్సన్ విద్యావంతులైన ఉపాధ్యాయుల కుటుంబం నుంచి వచ్చారు. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగస్తులు .1967 జూన్ 22 న తొండంగి లో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం తొండంగి ప్రాధమిక పాఠశాలలోను , ఉన్నత పాఠశాల విద్య తొండంగి, దివిలిమరియు ఉప్పాడ కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఇంటర్మీడియట్ విద్య ఆర్ ఆర్ బి హెచ్ ఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పిఠాపురం నందు జరిగింది. కాకినాడలోని పి . ఆర్ ప్రభుత్వ కళాశాలలో బిఎస్సి బోటనీ మెయిన్ సబ్జెక్టుతో చదవడం జరిగింది . కాకినాడలోని సెయింట్ మేరీ కాలేజీ నందు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదవడం జరిగింది. పెరియార్ యూనివర్సిటీ నుండి ఎం ఏ ఇంగ్లీష్ లో పట్టా పొందారు.

     1995 డీఎస్సీ బ్యాచ్ కు చెందిన సిద్ధాంత బెన్ జాన్సన్ సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయునిగా తొండంగి మండలం  కొత్త పెరమాళ్ళపురం లో జూలై 1 న చేరడం జరిగింది. చిన్నతనం నుండి సాంఘిక సేవ  పట్ల ఆసక్తి కలిగిన మాస్టారు అదే  ఒరవడిని ఉపాధ్యాయ వృత్తిలోనూ  కొనసాగించారు. వీరి జీవిత కాలంలో ఎక్కువగా సముద్రతీర ప్రాంతాలు  పెరుమాళ్ళపురం ,ఉప్పాడ, పొన్నాడ  మత్స్యకార గ్రామాలలో ఉపాధ్యాయునిగా పని చేశారు. మత్స్యకార విద్యార్థులను ఎందరినో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు.
 కొత్త పెరుమాళ్ళపురం ప్రాథమిక పాఠశాలలో ఏకోపాధ్యాయునిగా  పనిచేస్తూ అదే పాఠశాలను 2000 లో ప్రాథమికోన్నత పాఠశాల గానూ  2003వ సంవత్సరంలో ఉన్నత పాఠశాల గాను  అప్ గ్రేడ్ చేసి అధికారుల మన్ననలు పొందారు. 
    గడ్డిపేట గ్రామస్తులనుండి ఐదు ఎకరాల స్థలమును పాఠశాలకు సేకరించి పాఠశాల భవనాలను నిర్మించారు. హేచరీస్  వారినుండి రెండు లక్షల రూపాయలు విరాళాలను సేకరించి పాఠశాల ప్రహారీలను , ఐరన్ మెష్ లను నిర్మించి పాఠశాలను అభివృద్ధి పరిచారు. గ్రామస్తులను కూడగట్టి 2000 సంవత్సరంలో పాఠశాల 60వ వార్షికోత్సవం  నిర్వహించారు. 
      స్వంత నిధులను వెచ్చించి పాఠశాలకు బీరువా ,కుర్చీలు మొదలగు ఫర్నిచర్ పాఠశాలకు సమకూర్చారు. సొంత నిధులతో తీర గ్రామాలలో మొట్టమొదటిసారిగా మండల స్దాయి విద్యా వైజ్ఞానిక  ప్రదర్శనను ఏర్పాటు చేశారు. 
    పాఠశాల విద్యా కమిటీ తో పనిచేస్తూ డ్రాపౌట్స్ అయిన  విద్యార్థులను 200 మందిని తిరిగి పాఠశాలలో చేర్చడం జరిగింది . అక్షర గోదావరి లో తీర గ్రామాలలోని  డ్వాక్రాగ్రూపు నిరక్షరాస్య  మహిళలను విద్యావంతులను చేయడం జరిగింది. 
   సముద్ర తీర గ్రామమైన  పెరుమాళ్ళపురంలో గ్రామస్తుల నుండి పదివేల రూపాయలు సేకరించి ప్రభుత్వ సహకారంతో మొట్టమొదటిసారిగా నిరంతర విద్యా కేంద్రం ప్రారంభించడం జరిగింది.
 2003 నందు కొత్తపల్లి మండలం ప్రాథమిక పాఠశాల నందు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా బదిలీపై చేరిన జాన్సన్ మాస్టారు . ప్రజల సహకారంతో 15 వేల రూపాయల విరాళం సేకరించి రాష్ట్రంలోనే తొలిసారిగా మధ్యాహ్న భోజన పథకము సమర్థవంతంగా అమలు కొరకు భోజనశాల నిర్మించడం జరిగింది . మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు కొరకు వంటపాత్రలను సొంత నిధులతో సమకూర్చడం జరిగింది. 
 కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పదోన్నతి పొందిన  సిద్ధాంతపు బెన్ జాన్సన్ మాస్టారు కాకినాడ రోటరీ క్లబ్ వారి సహకారంతో మధ్యాహ్న భోజనం సమర్థవంతంగా అమలు చేయుటకు లక్ష రూపాయల విలువైన హ్యాండ్ వాష్ స్టేషన్ ను నిర్మించడం జరిగింది.

కొత్త పల్లి కి చెందిన సూర్య వాటర్ ప్లాంట్ వారి సహకారంతో నిరంతరం మంచినీటి మినరల్ వాటర్ సదుపాయం కల్పించి విధ్యార్దులు స్వచ్చమైన నీటిని త్రాగేలా చేయడం జరిగింది. స్వచ్చభారత్ కార్యక్రమమును విధ్యార్దులు, గ్రామస్దులతో చైతన్యవంతంగా నిర్వహిస్తున్నారు.

   పూర్వ విద్యార్థుల నుండి పాఠశాలకు 25 వేల రూపాయల విలువైన  క్రీడలు మరియు పాఠశాల దినోత్సవములు నిర్వహించునప్పుడు అలంకరణకు అనువైన స్టీలు జెండా ఫోలులు 20 సేకరించడం జరిగింది.
    ఎన్ వి ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా బాల కార్మిక విమోచన వేదిక టీచర్ ఫార్మ్ జిల్లా కన్వీనర్ గా పనిచేస్తూ వందల మంది బాలకార్మికులను బడిలోనికి చేర్చడం జరిగింది. అనేక మంది బాల కార్మికులకు యూనిఫారంలు,నోట్స్ పుస్తకములు సొంత నిధులతో సమకూర్చి పాఠశాలలో చేర్చడం జరిగింది. ఎందరో ఎయిడ్స్ రోగులకు మందులు, బట్టలు, రేషను  విరాళంగా ఇవ్వడం జరిగింది. సునామి మరియు కరోనా వంటి విపత్తులలో అనేక మంది నిరుపేదలకు వస్త్రదానములు, అన్నదానములు విద్యార్థులతో కలసి చేయడం జరిగింది.
 కళాకారుడైన జాన్సన్ మాస్టారు ఎందరో విద్యార్థులను సాంస్కృతిక కళా రంగం పట్ల ఆకర్షితులు చేశారు. పాటలు పాడడం,
లోనూ, నాటకములు వేయడం లోనూ, డాన్సులు చేయడంలోనూ శిక్షణ ఇచ్చారు . 
     విధ్యార్దులతో వైద్యానికి జీవం అనే లఘుచిత్రాన్ని నిర్మించారు. జాతీయ స్థాయి  లఘు చిత్ర ఫోటీలలో  విద్యార్థులు బహుమతులు గెలుచుకునేలా ప్రొత్సహించారు.
  అనేక పాఠశాల వార్షికోత్సవం లోనూ పాఠశాల దినోత్సవాలలోనూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మండల స్థాయిలలో విద్యార్థులు ప్రదర్శనలు చేయించి బహుమతులు పొందేలా చేసారు.విద్యార్దులెందరికో  రచనారంగంలో   తర్ఫీదు నిచ్చారు .
పాఠశాల వార్షికోత్సవాలలోను పాఠశాల దినోత్సవాలలోనూ, మండల స్థాయి స్థాయిలలోనూ క్విజ్ మరియు వకృత్వ పోటీల్లో విధ్యార్దులు పాల్గొనెలా  తర్ఫీదు ఇచ్చి బహుమతులు గెలుచుకునేలా ప్రోత్సహించారు . 
 కాకినాడ క్రియా రాష్ట్రస్థాయి పోటీలలో చిత్రలేఖనం ,కథ చెప్పడం, మట్టితో బొమ్మలు చేయడం, భోధనోపకరణాల ఫోటీ, బృందనాట్యం, నాటకం, అనేక అంశాలలో విద్యార్థుల పాల్గొనేలా తర్ఫీదు ఇచ్చి బహుమతులు గెలుచుకునేలా ప్రోత్సహించారు.
     
 మండల స్థాయి గణిత మేళా,  బోధనోపకరణాల మేళ వంటి పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకునే లా విద్యార్థులను ప్రోత్సహించారు. మండలస్దాయి 

సైన్స్ ఫేర్ నందు బహుమతులు గెలుచుకునేలా ప్రోత్సహించారు.

      విద్యార్థులతో పాఠశాల పత్రిక ధ్రువతారను ప్రారంభించి రాష్ట్రస్థాయిలోనే మొట్టమొదటిసారిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పత్రికను ప్రారంబించి అధికారుల మన్ననలు పొందారు. విద్యార్థులు స్వయంగా రచించిన కథలను ,చిత్రించిన బొమ్మలను , కవితలను పాఠశాల వార్తలను ,ప్రతి నెల పాఠశాల పత్రిక రూపంలో ముద్రించి రాష్ట్రస్దాయిలో మన్ననలు పొందారు.

  స్కౌట్ గైడ్  శిక్షణ పొందిన జాన్సన్ మాస్టారు కొమ్మనాపల్లి  జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో  విద్యార్థులుచే స్కౌట్  ను ప్రారంభించి విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. వీరితో చుట్టు పక్కల గ్రామాలలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు .
  పెరుమాళ్ళపురంలో  కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి  వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహించారు. ఉప్పాడలో కాకినాడ అపోలో ఆసుపత్రి వైద్యులతో  ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు .
  
పర్యావరణ పరిరక్షణ కొరకు ప్లాస్టిక్ నిషేదం కొరకు  గ్రామాలలో అనేక ర్యాలీలు చేపట్టారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తూ పర్యావ పరిరక్షణపై  అనేక  అవగాహన తరగతులు నిర్వహించారు. క్లీన్ అండ్ గ్రీన్ భాగంగా అనేక మొక్కలను విద్యార్థులతో నాటించారు.
 

స్వతహాగా రచయిత అయిన బెన్ జాన్సన్ మాస్టారు తూర్పుగోదావరి జిల్లా బాలసాహితీ నందు కథావాచకాల విభాగానికి కన్వీనర్ గా పనిచేసి స్వయంగా అల్లరి ,పద కదంబం , తూర్పు గోదావరి జిల్లా జానపద కళారూపాలు వంటి పుస్తకాలను విద్యార్దుల కొరకు రచించారు వీటిని రాష్ట్ర సర్వ శిక్ష అభియాన్ రాష్ట్రవ్యాప్తంగా ముద్రించి పాఠశాలలకు పంపడం జరిగింది.

   సి సి ఈ ఆర్ టి రాజస్థాన్లో పప్పెట్రీలో శిక్షణ పొందిన జాన్సన్ మాస్టారు  పప్పెట్ మేకింగ్ అనే పుస్తకాన్ని రచించారు. బడి గంటలు హ్యాండ్ బుక్ ఆఫ్ హెడ్మాస్టర్ అనే పుస్తకాన్ని రచించారు. 
యూనిసెఫ్ వారు ముద్రించిన కమ్యూనికేట్ ఇన్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్  అనే  అంతర్జాతీయ పుస్తకాన్ని తెలుగులోనికి అనువదించారు.  చెట్టు నా బొమ్మలు అనే  పుస్తకాన్ని ప్రాధమిక పాఠశాల విద్యార్థుల కొరకు రచించారు.
   పదవ తరగతి విధ్యార్దుల కొరకు ఆంగ్ల  స్టడీ మెటీరియల్  రూపొందించారు . ఈ స్టడీ మెటీరియల్ ప్రభుత్వం ముద్రించి పాఠశాలలకు పంపిణీ చేయడం జరిగింది. 
  ఆన్ లైన్ ద్వారా క్రియేటివ్ బడ్డీస్ అనే బ్లాగులను సృష్టించి విద్యార్థుల యొక్క టాలెంట్లను  ప్రదర్శింప చేస్తున్నారు. వియ్ విన్   యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి విద్యార్థులే స్వయంగా ఛానల్  నిర్వహించేలా ప్రోత్సహిస్తూ ఆ చానల్ ద్వారా విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు బోధిస్తున్నారు .
 పాఠశాల లైబ్రరీను  బలోపేతం చేస్తూ గ్రామంలోని విద్యావంతుల నుండి విలువైన పుస్తకాలను సేకరించి పాఠశాల లైబ్రరీ ను బలోపేతం చేస్తున్నారు. 
2010 లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగాను, 2018 లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడుగాను, ప్రభుత్వ అవార్డులు పొందారు. అనేక సంస్దలు  జిల్లాస్దాయిలోను, రాష్ట్ర స్దాయిలోనూ, నేషనల్ స్దాయిలోను అవార్డులు ఇచ్చి బెన్ జాన్సన్ మాస్టారును సత్కరించాయి.



BORN[మార్చు]

బెన్ జాన్సన్ విద్యావంతులైన ఉపాధ్యాయుల కుటుంబం నుంచి వచ్చారు. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగస్తులు .1967 జూన్ 22 న తొండంగి లో జన్మించారు.

PROFFESSION[మార్చు]

1995 సెకండరీగ్రేడు ఉపాద్యాయుడుగా తొండంగి మండలం కొత్తపెరుమళ్ళపురం ప్రాధమిక పాఠశాలలోను 2003 నుండికొత్తపల్లిమండలం పొన్నాడ నెం 2 ప్రాథమిక పాఠశాలనందు 2011 నుండి ఆంగ్లభాషోపాద్యాయునిగా తొండంగి మండలం కొమ్మనాపల్లి హైస్కూలునందు 2017 నుండి కొత్తపల్లి హైస్కూలునందు 2021 నుండి కొత్తపల్లి బాలికల హైస్కూలు నందుపనిచేయుచున్నారు

PARENTS[మార్చు]

సిద్దాంతపు దేవయ్య రిటైర్డు హెల్త్ సూపర్ వైజరు ఏడిద దైవకటాక్షం టీచరు

EDUCATION[మార్చు]

ప్రాథమిక విద్యాభ్యాసం తొండంగి ప్రాధమిక పాఠశాలలోను , ఉన్నత పాఠశాల విద్య తొండంగి, దివిలిమరియు ఉప్పాడ కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఇంటర్మీడియట్ విద్య ఆర్ ఆర్ బి హెచ్ ఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పిఠాపురం నందు జరిగింది. కాకినాడలోని పి . ఆర్ ప్రభుత్వ కళాశాలలో బిఎస్సి బోటనీ మెయిన్ సబ్జెక్టుతో చదవడం జరిగింది . కాకినాడలోని సెయింట్ మేరీ కాలేజీ నందు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదవడం జరిగింది. పెరియార్ యూనివర్సిటీ నుండి ఎం ఏ ఇంగ్లీష్ లో పట్టా పొందారు.

ACHIVEMENTS[మార్చు]

  పూర్వ విద్యార్థుల నుండి పాఠశాలకు 25 వేల రూపాయల విలువైన  క్రీడలు మరియు పాఠశాల దినోత్సవములు నిర్వహించునప్పుడు అలంకరణకు అనువైన స్టీలు జెండా ఫోలులు 20 సేకరించడం జరిగింది.
   ఎన్ వి ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా బాల కార్మిక విమోచన వేదిక టీచర్ ఫార్మ్ జిల్లా కన్వీనర్ గా పనిచేస్తూ వందల మంది బాలకార్మికులను బడిలోనికి చేర్చడం జరిగింది. అనేక మంది బాల కార్మికులకు యూనిఫారంలు,నోట్స్ పుస్తకములు సొంత నిధులతో సమకూర్చి పాఠశాలలో చేర్చడం జరిగింది. ఎందరో ఎయిడ్స్ రోగులకు మందులు, బట్టలు, రేషను  విరాళంగా ఇవ్వడం జరిగింది. సునామి మరియు కరోనా వంటి విపత్తులలో అనేక మంది నిరుపేదలకు వస్త్రదానములు, అన్నదానములు విద్యార్థులతో కలసి చేయడం జరిగింది.
కళాకారుడైన జాన్సన్ మాస్టారు ఎందరో విద్యార్థులను సాంస్కృతిక కళా రంగం పట్ల ఆకర్షితులు చేశారు. పాటలు పాడడం,

లోనూ, నాటకములు వేయడం లోనూ, డాన్సులు చేయడంలోనూ శిక్షణ ఇచ్చారు .

    విధ్యార్దులతో వైద్యానికి జీవం అనే లఘుచిత్రాన్ని నిర్మించారు. జాతీయ స్థాయి  లఘు చిత్ర ఫోటీలలో  విద్యార్థులు బహుమతులు గెలుచుకునేలా ప్రొత్సహించారు.
 అనేక పాఠశాల వార్షికోత్సవం లోనూ పాఠశాల దినోత్సవాలలోనూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మండల స్థాయిలలో విద్యార్థులు ప్రదర్శనలు చేయించి బహుమతులు పొందేలా చేసారు.విద్యార్దులెందరికో  రచనారంగంలో   తర్ఫీదు నిచ్చారు .

పాఠశాల వార్షికోత్సవాలలోను పాఠశాల దినోత్సవాలలోనూ, మండల స్థాయి స్థాయిలలోనూ క్విజ్ మరియు వకృత్వ పోటీల్లో విధ్యార్దులు పాల్గొనెలా తర్ఫీదు ఇచ్చి బహుమతులు గెలుచుకునేలా ప్రోత్సహించారు .

కాకినాడ క్రియా రాష్ట్రస్థాయి పోటీలలో చిత్రలేఖనం ,కథ చెప్పడం, మట్టితో బొమ్మలు చేయడం, భోధనోపకరణాల ఫోటీ, బృందనాట్యం, నాటకం, అనేక అంశాలలో విద్యార్థుల పాల్గొనేలా తర్ఫీదు ఇచ్చి బహుమతులు గెలుచుకునేలా ప్రోత్సహించారు.

AWARDS[మార్చు]

2010 లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగాను, 2018 లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడుగాను, ప్రభుత్వ అవార్డులు పొందారు. అనేక సంస్దలు జిల్లాస్దాయిలోను, రాష్ట్ర స్దాయిలోనూ, నేషనల్ స్దాయిలోను అవార్డులు ఇచ్చి బెన్ జాన్సన్ మాస్టారును సత్కరించాయి.