తేకుమళ్ళ రాజగోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తూర్పు గోదావరి జిల్లా కవులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 15: పంక్తి 15:
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా కవులు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా కవులు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు]]

05:17, 27 ఆగస్టు 2017 నాటి కూర్పు

టేకుమళ్ళ రాజగోపాలరావు విద్యావేత్త, దార్శనికుడు, పండితుడు, గ్రంథాలయోద్ధారకుడు, మరియు రచయిత. ఇతడు వ్రాసిన విహంగ యానం అనే నవల తెలుగులో వెలువడిన మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ నవలగా గుర్తించబడింది. ఇతడు 1876, జూలై 9న తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం లో జన్మించాడు. విజయవాడలో స్థిరపడ్డాడు. ఇతడు గ్రంథాలయోద్ధరణకు చేసిన సేవలకుగాను, విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ ఇతని పేర గ్రంథాలయం నెలకొల్పి తన కృతజ్ఞతను చాటుకుంది. ఇతని కుమారుడు రామచంద్రరావు తన వద్ద వున్న అమూల్య గ్రంథాలను ఈ గ్రంథాలయానికి సమర్పించాడు.

రచనలు

  • శారదా పద్య వాచకములు
  • విహంగ యానం (తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్ నవల)
  • త్రివిక్రమ విలాసము (సాంఘిక నవల) - 1895 చింతామణి పత్రిక నిర్వహించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందింది.
  • ఛందశ్శాస్త్రము
  • మణిభూషణము (సంపాదకత్వం)
  • కనకవల్లి (నవల)