మహారాష్ట్రలో కోవిడ్-19 మహమ్మారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Map of districts with confirmed cases (as of 4 May 2020)
  1000+ confirmed cases
  500–999 confirmed cases
  100–499 confirmed cases
  50–99 confirmed cases
  10–49 confirmed cases
  1–9 confirmed cases
వ్యాధికొవిడ్ 19
ప్రదేశంమహారాష్ట్ర భారతదేశం
మొదటి కేసుపూణే
ప్రవేశించిన తేదీ9 మార్చి2020
(4 సంవత్సరాలు, 1 నెల, 1 వారం , 3 రోజులు)
కేసులు నిర్ధారించబడింది5,35,601
బాగైనవారు49,346 (13 జూన్ 2020)
క్రియాశీలక బాధితులు4,67,949
మరణాలు
18,306 (11 ఆగస్టు 2020)
ప్రాంతములు
36 జిల్లాలు
అధికార వెబ్‌సైట్
arogya.maharashtra.gov.in
Public Health Department, Maharashtra

మహారాష్ట్రలో కరోనా వైరస్ మొదటి కేసు 2020 మార్చి 9 న నమోదయ్యింది. మార్చి 17 న, మొదటి కరోనా సోకిన వ్యక్తి మరణించాడు.

కాలక్రమం[మార్చు]

రోజువారి పాజిటివ్ కేసులు

ప్రభుత్వ సహాయక చర్యలు[మార్చు]

మార్చి9 మహారాష్ట్రలో మొదటి పాజిటివ్ కేసు నమోదయ్యింది
మార్చి13 వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు మూసివేత
మార్చి14 బహిరంగ సభలు, కార్యక్రమాలపై నిషేధం
మార్చి20 అవసరమైన సేవలను మినహాయించి అన్ని కార్యాలయాలు మూసివేత
మార్చి 22 సెక్షన్ 144 , లాక్డౌన్ విధించారు
మార్చి 23 అన్ని జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. సరిహద్దు రాష్ట్రాలను మూసివేశారు.
మార్చి 25

ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా

లాక్ డౌన్ విధించారు.
ఏప్రిల్ 11 లాక్డౌన్ ఏప్రిల్ 30 వరకు పొడిగించారు.
ఏప్రిల్ 14 మే 3 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగించారు
మే 1

మే 17 వరకు దేశవ్యాప్తంగా

లాక్ డౌన్ పొడిగించారు
  • మార్చి 22 న మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సెక్షన్ 144 ప్రకటించింది. మార్చి 23 మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది.
  • మార్చి 23 న సిఎం ఉద్ధవ్ ఠాక్రే అన్ని జిల్లాల సరిహద్దులను మూసివేస్తున్నట్లు రాష్ట్రవ్యాప్తంగా కఠినమైన కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు.[1]

విద్య వ్యవస్థ ప్రభావం[మార్చు]

పాఠశాలల ద్వారా కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి అన్ని విద్యాసంస్థలు మూసివేశారు.మహారాష్ట్ర ప్రభుత్వ పరీక్షలను అన్ని రద్దు చేసింది.1 నుండి 8 వ తరగతి పరీక్షలను అన్ని రద్దు చేసింది. పరీక్షలు లేకుండా పై తరగతుల్లో వెళ్ళడానికి ఆదేశాలు జారీ చేసింది.

రవాణా వ్యవస్థ ప్రభావం[మార్చు]

కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 11 నుండి మహారాష్ట్ర ప్రభుత్వం 20,000 కి పైగా బస్సు సర్వీసులు రద్దు చేశారు ఫలితంగా మార్చి 17 నాటికి ₹ 3 కోట్ల నష్టం వాటిల్లింది.ఇతర రాష్ట్రాల నుంచి వైరస్ వ్యాపిస్తుందని రాష్ట్ర సరిహద్దులను మూసివేశారు. మార్చి 22 నుంచి 31 మధ్య ముంబై సబర్బన్ రైల్వే స్టేషన్‌ను మూసివేస్తున్నట్లు భారత రైల్వే ప్రకటించింది.

పర్యాటక వ్యవస్థ ప్రభావం[మార్చు]

రాష్ట్రవ్యాప్తంగా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా అనేక పర్యాటక ప్రదేశాలు, ప్రార్థనా స్థలాలను మూసివేస్తామని ఆరోగ్య అధికారులు ప్రకటించారు. పర్యాటక ప్రదేశాలు ఔరంగాబాద్ జిల్లాలోని అజంతా , ఎల్లోరా గుహలు , రాయ్‌గడ్ జిల్లాలోని ఎలిఫాంటా గుహలు పై ప్రభావం పడింది.రాష్ట్రంలో హోటళ్ళు, టాక్సీలు ప్రైవేట్ బస్సు సర్వీసు వ్యాపారాలు రద్దు చేశారు.

ఆర్థిక రంగం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Uddhav Thackeray imposes curfew in entire Maharashtra". The Economic Times. 2020-03-23. Retrieved 2020-03-23.