మనశ్శరీరములపై పరిసరముల ప్రభావము

వికీపీడియా నుండి
(మనశ్శరీరాలపై పరిసరాల ప్రభావం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

మనశ్శరీరములపై పరిసరముల ప్రభావము అనే తెలుగు పుస్తకాన్ని పారనంది జగన్నాధ స్వామి రచించారు.

చార్లెస్ రాబర్ట్ డార్విన్ భూమిపై జీవజాలము ఏ విధంగా పరిణామక్రం చెందాయి అనే విషయంపై పరిశోధనలు చేశాడు తత్ఫలితంగా పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ప్రకృతి లో జీవజాతులు వేటికవే ఏక కాలంలో రూపొందినట్లు ఎంతో కాలం నుండి నమ్ముతూ వస్తున్న ప్రజానీకానిని - అదంతా వాస్తవం కాదని ఒక మాతృక నుంచి సకల జీవరాశులు క్రమానుగతంగా పరిణామం చెందుతూ ఏర్పడతాయని, ఈ చర్య అనంతంగా కొనసాగుతూ ఉంటుందని వివరించినవాడు చార్లెస్ డార్విన్. వానరుని నుంచి నరవానరుడు, నరవానరుని నుంచి నరుడు పరిణామ పరంగా ఉద్భవించాడని తెలిపి సంచలనం రేపిన ప్రకృతి శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్. ఆయన సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని ప్రకృతి/పరిసరాలు మనస్సుపైనా, శరీరంపైనా చూపే ప్రభావాన్ని ఈ పుస్తకంలో రచయిత వివరించారు. ఆయన డార్విన్‌తో పాటు ఇతరులు ఏమన్నారో, ప్రాచీన భారతీయ సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయో కూడా ఈ గ్రంథంలో రాశారు.

విషయసూచిక[మార్చు]

  • ఉపోద్ఘాతము
  • పరిసరములు; డార్విన్ యొక్క విచారణ
  • పరిసరములు; వాటి విభజన
  • పరిసరములు; ప్రాణుల సంభవము
  • పరిసరములు; ప్రాణుల సృష్టి
  • పరిసరములు; ప్రాణుల లయము
  • ప్రాణులు సరిపెట్టుకొనుట
  • ఆహారము
  • శీతోష్ణస్థితి; వేడిమి; చవి
  • వెలుతురు; సూర్యరశ్మి
  • నివాస స్థలము
  • ఉపయోగానుపయోగములు
  • మిగిలిన పరిసరములు
  • పరిసరముల సామాన్య ప్రభావము
  • పరిసర ప్రభావ సిద్ధాంతము
  • సిద్ధాంతానుబంధ ప్రశ్నలు
  • సంఘము
  • వరణ సిద్ధాంత నిరూపణ
  • పరిసరములు; మనోవృత్తులు

మూలాలు[మార్చు]