సంస్కృత భాషా ప్రచార సమితి

వికీపీడియా నుండి
(సంస్కృతభాషా ప్రచార సమితి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
లోగో

సంస్కృత భాషా ప్రచార సమితి హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భాషా ప్రచార సంస్థ. ఇది జి.పుల్లారెడ్డి చారిటీస్ ట్రస్ట్ అనుబంధ సంస్థ. ఈ సంస్థ కార్యాలయం అబిడ్స్లోని హరేకృష్ణా దేవాలయాన్ని ఆనుకొని ఉన్న భవంతిలో రెండవ అంతస్తులో కలదు.

కార్య కలాపాలు[మార్చు]

సంస్కృత భాష ప్రచారంలో భాగంగా సంస్కృత పుస్తకాల ప్రచురణ, సంస్కృత భాషలో ప్రవేశ-ప్రథమ-మొ|| పరీక్షల నిర్వహణ, ఇంకా సంస్కృత భాషా సంబంధిత కార్యక్రమాలకు సహకారం వంటి పనులను సంస్థ నిర్వర్తిస్తుంటూంది.

చిరునామా[మార్చు]

సంస్కృతభాషా ప్రచార సమితి
6-3-240/6/1, 1వ అంతస్తు,
virinchi Hospital (Banjarahills Road No.1) Back Side, Sarada Street, Prem Nagar,
Khairatabad (PO), హైదరాబాదు-500004 Phone No.040-23305481

సమితి ప్రచురణలు[మార్చు]

సమితి నిర్వహించే పరీక్షలు[మార్చు]

  • సంస్కృతభారతీ పరీక్షలు
ఈ పరీక్షలు 9 స్థాయీల్లో నిర్వహిస్తారు. ప్రవేశిక, ప్రథమ, ద్వితీయ, తృతీయ, నిష్ణాత, పారీణ పూర్వార్ధం, పారీణ ఉత్తరార్ధం, చూడామణి పూర్వార్ధం, చూడామణి ఉత్తరార్ధం.

పరీక్ష రుసుము అత్యల్పంగా ₹15 నుండి అత్యధికంగా ₹75 వరకు. ప్రవేశిక, ప్రథమ రాయటానికి ఏ విద్యార్హతలూ, వయస్సూ నియమాలు లేవు, ఎవరైనా రాయవచ్చు. మిగితా స్థాయిలకు నియమాలున్నా, శుల్కంతో కూడిన మినహాయింపులున్నాయి. ఈ పరీక్షలు మార్చి, సెప్టెంబరు మాసాల్లో శని, ఆదివారాల్లో నిర్వహించబడతాయి. పారీక్షా ఫలితాలు వచ్చిన రెండు మాసములలో ఉత్తీర్ణులకు అంకపత్రములు, విజయపత్రములు పంపబడతాయి.