Coordinates: 4°27′41.42″N 101°9′23.82″E / 4.4615056°N 101.1566167°E / 4.4615056; 101.1566167

అరుల్మిగు మహా ముత్తు మరియమ్మన్ ఆలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరుల్మిగు మహా ముత్తు మరియమ్మన్ ఆలయం
ஸ்ரீ முத்துமாரியம்மன் கோவில்
马里安曼兴都庙
Mǎ lǐ Àn Màn xīng dū miào
అరుల్మిగు మహా ముత్తు మరియమ్మన్ ఆలయం is located in Malaysia
అరుల్మిగు మహా ముత్తు మరియమ్మన్ ఆలయం
Location in Malaysia
భౌగోళికం
భౌగోళికాంశాలు4°27′41.42″N 101°9′23.82″E / 4.4615056°N 101.1566167°E / 4.4615056; 101.1566167
దేశంమలేషియా
రాష్ట్రంపెరాక్
జిల్లాకంపర్ జిల్లా
ప్రదేశంగోపెంగ్
సంస్కృతి
దైవంమరియమ్మన్
వాస్తుశైలి
నిర్మాణ శైలులుద్రవిడ నిర్మాణ శైలి
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీ1962

అరుల్మిగు మహా ముత్తు మరియమ్మన్ ఆలయం, మలేషియాలోని పెరాక్ లో గల కంపర్ జిల్లా లోని, కొప్పాంగ్ లో గల, గోపిసన్ బారులో గల హిందూ దేవాలయం.

చరిత్ర[మార్చు]

1962లో నిర్మించిన అసలు ఆలయాన్ని కాళీయమ్మన్ ఆలయం అని పిలుస్తారు. ఇది 57,860 చదరపు అడుగుల (5,375 మీ2) స్థలంలో నిర్మించబడింది, దీనిని కోపెంగ్ బెర్హాద్ నిర్మించాడు.

1964లో, ఇది మరియమ్మన్ దేవిని ప్రధాన దేవతగా ఉంచడానికి పునరుద్ధరించబడింది. శ్రీ సుబ్బయ్య నేతృత్వంలో శ్రీ తురై, పెరియసామి, మరుగముత్తు, నల్లభైరవి, శంకరన్‌లు పునరుద్ధరణ పనులు చేపట్టారు. దీనికి కాంట్రాక్టర్గా శ్రీ అర్జునన్ ఉన్నాడు. 22 సెప్టెంబర్ 1967న ఈ ఆలయం శ్రీ ముత్తుమారియమ్మన్ దేవాలయంగా నమోదు చేయబడింది.

2000లో, ఆలయ భూమి 30,797 చదరపు అడుగులు (2,861.1 మీ2)గా ఉంది. ఆలయ స్థలం చిన్నదిగా ఉండడంతో కాళియమ్మన్ అమ్మన్, ఎడమ హాలును వేరే చోటికి మార్చాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న ఆలయ భవనంలోని కాళియమ్మన్‌ను, హాలును తరలించే ఆలోచనను ఆలయ కమిటీ పరిశీలించింది. అయితే ప్రస్తుతం ఉన్న ఆలయ భవనంలో స్థలం లేకపోవడంతో ఈ ప్రతిపాదన సరికాదని ప్యానెల్ గుర్తించింది. అందుకే ప్రస్తుతం ఉన్న భవనం స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించాలని ఆలయ కమిటీ యోచించింది.

కొత్త ఆలయానికి శంకుస్థాపన కార్యక్రమం 10 డిసెంబర్ 2006న జరిగింది, ఆ తర్వాత వెంటనే నిర్మాణం ప్రారంభమైంది. 4 మే, 2009న ఈ ఆలయాన్ని అరుల్మిగు మహా మరియమ్మన్ దేవస్థానంగా మార్చారు. ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేసి 2010 డిసెంబర్ 12న కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించారు.

కుంభాభిషేక కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మహా మరియమ్మన్ దేవస్ధానంగా మార్చడానికి భక్తుల విశ్వాసలే కీలకమని నాటి ఆలయ కమిటీ పేర్కొంది. ఆలయంలో ప్రతిష్టించిన మరియమ్మన్ శిలా విగ్రహం భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలసిల్లింది అని ప్రజలు నమ్ముతారు.

విశ్వాసాలు[మార్చు]

కుంభాభిషేకం ఉత్సవాల ముగింపు సమయంలో ఈ ఆలయం సమీపంలోకి డేగల గుంపు వచ్చింది. గరుడ పెరుతో ఉన్న డేగలు - విష్ణువు వాహనాన్ని సూచిస్తాయని నమ్ముతారు. గరుడ సన్నిధితో ఈ కార్యక్రమాన్ని విష్ణువు ఆశీర్వదించడాన్ని ఇది సూచిస్తుందని ప్రజలు నమ్ముతారు.

డేగలు గరుడ పక్షిగా పిలవబడతాయి కాబట్టి వాటిని పవిత్రమైనవిగా అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. శ్రీ మహా విష్ణువు గరుడ వాహనుడు కాబట్టి వాటిని పవిత్రమైన పక్షులుగా కొలుస్తారు. విష్ణువును పక్షి వాహనుడిగా ఆరాధిస్తారు. తద్వారా ఈ ప్రాంతంలోకి డేగలు రావడంతో స్వయంగా మహావిష్ణువు వాహనాలే ఇక్కడికి వచ్చినట్లు, విష్ణువే వాటిని పంపించినట్టు అక్కడి ప్రజల విశ్వాసం. విష్ణువు ఆజ్ఞ మేరకు ఆశీర్వచనాలు ఇవ్వడానికి వచ్చాయని నమ్మకం.

పండుగలు[మార్చు]

ముఖ్యంగా దీపావళి నాడు ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. పవిత్రమైన తైపూసం రోజున, మురుగన్‌కు మతపరమైన సేవగా పది గుహల వరకు సుదీర్ఘ ఊరేగింపును ప్రారంభించడానికి వేలాది మంది భక్తులు ఉదయాన్నే ఆలయానికి వస్తారు. వారు మరియమ్మకు నైవేద్యంగా పాలు ఉన్న పాత్రలను చేతితో లేదా పెద్ద అలంకరించబడిన క్యారియర్‌లలో పాలను తెస్తారు.[1]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Rprabhu (5 May 2006). "The Glorious Garuda". http://rprabhu.wordpress.com/2006/05/05/the-glorious-garuda/. Retrieved 30 December 2010.