ఆంధ్రదేశము విదేశయాత్రికులు

వికీపీడియా నుండి
(ఆంధ్రదేశము విదేశ యాత్రికులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆంధ్రదేశము విదేశయాత్రికులు
కృతికర్త: భావరాజు వేంకట కృష్ణారావు
అంకితం: కోలవెన్ను రామకోటేశ్వరరావు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: ఆంధ్రదేశ చరిత్ర
ప్రచురణ: ఆంధ్రదేశీయేతిహాస పరిశోధకమండలి
విడుదల: 1926


ఆంధ్రదేశము విదేశయాత్రికులు, 1926 ముద్రించబడిన తెలుగు రచన. దీనిని భావరాజు వేంకట కృష్ణారావు రచించి, ఆంధ్రదేశీయేతిహాస పరిశోధకమండలి వారిద్వారా ప్రచురించారు. ఈ కృతిని అతని ప్రియస్నేహితుడైన కోలవెన్ను రామకోటీశ్వరరావుకు అంకితమిచ్చారు. వీనిలో యుఆన్ చ్వాంగ్, అబ్దుర్ రజాక్ యాత్రా విశేషాలను శారద, భారతి పత్రికలలో ప్రచురించబడ్డాయి.

యాత్రికులు[మార్చు]

నేపథ్యం[మార్చు]

మన తెలుగుభాషలో వచ్చిన చరిత్ర గ్రంథములు చాలా తక్కువ. ఒక్క చరిత్రపఠనం వలననే ఆదేశప్రజానీకానికి, దేశాభిమానం, గౌరవంను కలిగే అవకాశముంది. అంతట జాఱిన దేశగౌరవంను చక్కదిద్దుటకు ప్రయత్నాలు జరుగటానికి అవకాశం కలుగుతుంది. రచయిత ఈ చిన్న గ్రంథమును, ఆంధ్రయువతీ యువకులకు, ఆంధ్రదేశముపై, నాంధ్రజాతిపై, నభిమానమును, గౌరవమును జనింపజేయుటకు వ్రాసియున్నారు.

విశేషాలు[మార్చు]

యుఁఆన్ చ్వాంగ్ బౌద్ద బిక్షువు, చైనా యాత్రికుడు చిత్రం.

ఈ గ్రంథంనందు, ముగ్గురు యాత్రికులను వర్ణించినాడు. అందొకడు ఏడవశతాబ్దాదిని యేతెంచిన చీనాయత్రికుడు యుఁఆన్ చ్వాంగ్. రెండవ వాడు, కాకతీయాంధ్ర సామ్రాజ్యము మహోచ్ఛదశయండుండిన కాలమున వచ్చిన ఇటలీ వాస్తవ్యుడు మార్కో పోలో. మూడవవాడు విజయనగర సామ్రాజ్యవైభవమును చవిజూచిన పారశీక రాయబారి అబ్దుల్ రజాక్ సమర్కాండి

ఏడవశతాబ్దిని హిందూదేశమునంతటను మాహత్తరములయిన పరిణామములు జరుగుచుండెను. ఉత్తరమున హర్ష సామ్రాజ్య ముచ్ఛస్థితికి వచ్చియుండెను. దక్షిణాపథమున పశ్చిమ చాళుక్య సామ్రాజ్యము సత్యాశ్రయ రెండవ పులకేశి వల్లభునిచే స్థాపింపబడి, అచిరకాలంలోనే యొక్క వెలుగు వెల్గి మెఱపువలె మాయమయ్యెను. తూర్పున చాళుక్యాన్వయ మొకటి రాజ్యము స్థాపించుకొని ఆరు శతాబ్దములకాల మవిచ్ఛిన్నముగ నాంధ్రభూమిని యేలుటకు బునాదులు వేయుచుండెను. దక్షిణమున కాంచీపుర పల్లవులు విజృంభింప నారంభించుచుండిరి. ఎక్కడజూచినను అసహ్యకరములయిన మహాయాన సంప్రదాయాచారములుతో నిండిన బౌద్ధమతము జనులచే పరిత్యజింపబడుచుండెను. జైనమతమును అట్లే క్షీణించుచుండెను. కాని దీనికింకను కొంత రాజాశ్రయ ముండెను. అట్టికాలమున, బౌద్ధుడును, విమతద్వేషియునగు యుఁఆ౯చాంగ్‌ మన యాంధ్రదేశమును సందర్శించి, బౌద్ధక్షేత్రములందించుక కాలముగడుపుచు, దేశమునందు రెండేండ్లు సంచారముచేసి వెడలిపోయెను.

పదమూడవ శతాబ్దాంతమున మార్కొ పోలో సందర్శింప నేతెంచినపుడును ఆంధ్రదేసమునందు, మత, సాంఘిక రాజకీయ విప్లములు జరుగుచుండెను. అయ్యది చాళుక్యచోళ సామ్రాజ్యమంతరించిన కాలము. అయ్యది వెలనాటి చోడరాజుల ప్రయభణగిపోయి, కాకతీయభూపాలురు విజృంభించిన సమయము. ఆంధ్ర యువతి, పురుషవేష ధారిణియై, వీరవనితయై, యాంధ్రభూమిని, నిరుపమానమైన ప్రజ్ఞతో నేలిన కాలమది. జైన మతము విధ్వస్తము గావింపబడి, వీరశైవము ప్రతిష్టింపబడిన తరుణమది. చిల్లర, చిల్లర రాజ్యములు, అణగద్రొక్కబడి, ఆంధ్రదేశమంతయు నేకచ్ఛత్రాధిపత్యము క్రిందకు గొని రాబడిన కాలమది. కులభేదములును, వైషమ్యములును బాటింపక, క్షత్రియ, చతుర్థవంశజులు, నొక్కటిగా కలసిపోయిన కాలమది. ఆంధ్రుల సముద్రవ్యాపారవైభవము, దేశదేశాంతరముల మారుమ్రోగిన కాలమది.

మరి రెండు శతాబ్దములనాటికి దేశమున గలిగిన మార్పులవలన, కాకతీయ సామ్రాజ్యము అంతరించిపోయెను. దానిస్థానమున భామినీ రాజవంశము, తురుష్క సామ్రాజ్యమును నెలకొల్పియుండెను. దక్షిణాపథమంతయు, ఇంచుమించుగా, పూర్వాంధ్రదేశము తప్ప, మహమ్మదీయుల వశమయ్యెను. పూర్వాంధ్రదేశము కొంతకాలము రెడ్ల పరిపాలనము క్రిందను, మరికొంతకాలము, ఒడ్దెగజపతిరాజుల క్రిందను పరిపాలింపబడుచుండెను. కృష్ణకు దక్షిణమున గల దేశముపై సర్వాధికారము నెఱపుచు, రెండున్నర శతాబ్దముల కాలము హిందూమతమును, సంఘమును, హిందువుల స్వాతంత్ర్యమును సంరక్షించుకొఱకు విజయనగర సామ్రాజ్యము వెలసియుండెను. ఆ సామ్రాజ్యపు వైభవప్రారంభదశయందు, యిమ్మడి దేవరాయలు చక్రవర్తియై పరిపాలించి యుండెను. అతనితో నెయ్యము నెఱపుటకు, పారశిక సుల్తాను ఖాకాని సయ్యద్‌ షారుఖ్‌ సుల్తాను, అబ్దుర్‌ రజాక్‌ను రాయబారిగా పంపియుండెను.

మూలాలు[మార్చు]

Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:


వెలుపలి లంకెలు[మార్చు]