ఉమాభాయి దభాదె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Umabai Dabhade
జననంNot known
Abhone, Nasik, India
మరణం28 November 1753
Pune, Maharashtra, India
SpouseKhande Rao Dabhade
IssueTrimbak Rao Dabhade
ClanDabhade
తండ్రిDevrao Thoke Deshmukh

ఉమాబాయి దభడే (1753 లో మరణించారు) మరాఠా దభడే వంశంలో ప్రముఖ సభ్యురాలు. ఆమె కుటుంబ సభ్యులు వంశపారంపర్యంగా సెనాపతి (కమాండర్-ఇన్-చీఫ్) ను పదవిని కలిగి ఉన్నారు. వారు గుజరాతులోని అనేక భూభాగాలను నియంత్రించారు. ఆమె భర్త ఖండే రావు, ఆమె కుమారుడు త్రింబకు రావు మరణించిన తరువాత. ఆమె కార్యనిర్వాహక అధికారాలను వినియోగించుకోగా. ఆమె కుమారుడు పిన్నవస్కుడూ అయిన యశ్వంత రావు సేనాపతిగా ఉన్నాడు. పేష్వా బాలాజీ బాజీ రావుకు వ్యతిరేకంగా ఆమె చేసిన విఫలమైన తిరుగుబాటు దబాడే కుటుంబం పతనానికి దారితీసింది.

ఆరంభకాల జీవితం[మార్చు]

ఉమాబాయి దభడే అభోంకరు దేవరావు తోకే దేశ్ముఖు కుమార్తె. ఆమె ఖండేరావు దభడేను వివాహం చేసుకుంది. ఆయన ముగ్గురు భార్యలలో చిన్నది. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు (త్రింబక్రావు, యశ్వంతరావు, సవాయి బాబూరావు), ముగ్గురు కుమార్తెలు (షాబాయి, దుర్గాబాయి, ఆనందైబాయి) ఉన్నారు. 1710 లో ఉమాబాయి కొండ మీద 470 మెట్లు నిర్మించి నాసికు సమీపంలోని సప్తశృంగి దేవత ఆలయానికి చేరుకున్నాడు.

దభాదె నాయకురాలిగా[మార్చు]

ఉమాబాయి భర్త ఖండే రావు ఛత్రపతి షాహు ఆధ్వర్యంలో మరాఠా సేనపతి (కమాండర్-ఇన్-చీఫ్)గా పనిచేసాడు. 1729 లో ఆయన మరణించిన తరువాత వారి కుమారుడు త్రింబకు రావు దభదె సేనపతి అయ్యాడు. సుసంపన్నమైన గుజరాతు ప్రావింసు మీద దభేడులు అనేకసార్లు దాడి చేశారు. ఆ ప్రావిన్సు నుండి పన్నులు (చౌతు, సర్దేష్ముఖి) వారికి ముఖ్యమైన ఆదాయ వనరుగా మారింది. షాహు పేష్వా (ప్రధానమంత్రి) మొదటి బాజీరావు గుజరాతు నుండి పన్ను వసూలు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు దభదేలు ఛత్రపతి, పేష్వా మీద తిరుగుబాటు చేశాడు. 1731 లో దభోయి యుద్ధంలో బాజీరావు త్రింబాకు రావును ఓడించి చంపాడు.[1][2]


ఆమె భర్త, ఆమె కుమారుడు మరణించిన తరువాత ఉమాబాయి దభదె కుటుంబానికి మాతృక అయ్యారు. త్రింబకు రావు అన్ని ఆస్తులు, బిరుదులను (సేనాపతితో సహా) ఆయన మైనరు కొడుకు యశ్వంత రావుకు ఛత్రపతి షాహు మంజూరు చేశారు.[3] వారు ఆదాయంలో సగం తన ఖజానాకు పంపించాలనే షరతుతో గుజరాతు నియంత్రణను నిలుపుకోవటానికి పేష్వా వారిని అనుమతించారు.[2] ఆయన పెరుగుతున్నప్పుడు యశ్వంత రావు మద్యం, నల్లమందుకి బానిసయ్యాడు. దభేదుల లెఫ్టినెంటు దామాజీ రావు గైక్వాడు తన శక్తిని పెంచుకున్నాడు.[4]

పేష్వాకు వ్యతిరేకంగా తిరుగుబాటు[మార్చు]

ఉమాబాయి పేష్వా బాజీరావుతో సయోధ్యను నటించినప్పటికీ కాని తన కొడుకును చంపినందుకు అతని మీద ఎప్పుడూ పగ పెంచుకున్నది. ఆమె ఆధ్వర్యంలో దభేదులు ఆదాయంలో సగం వాస్తవానికి షాహు ఖజానాకు పంపించలేదు. కాని దుఃఖిస్తున్న వితంతువు, కొడుకును కోల్పోయిన తల్లి మీద ఎటువంటి తీవ్రమైన చర్యలు తీసుకోవటానికి షాహు ఇష్టపడలేదు. మొదటి పేష్వా బాజీరావు 1740 లో ఛత్రపతి షాహు 1749 లో మరణించారు. కొత్త ఛత్రపతి రెండవ రాజారాం, ఆయన పేష్వా బాలాజీ బాజీ రావు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. తత్ఫలితంగా పేష్వా బాలాజీ దభేదులను లొంగదీసుకుని ఛత్రపతి ఖజానాకు డబ్బు పంపించమని బలవంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఉమాబాయి పేష్వాకు దభాదేలను విడిపించడానికి ఛత్రాపతితో ఆదాయాన్ని పంచుకోవాల్సిన ఒడంబడిక చేసుకోవడానికి అంగీకరించింది.[4]


మాజీ మరాఠా రాణి తారాబాయి కూడా పేష్వా మీద పగ పెంచుకున్నది. పేష్వాకు వ్యతిరేకంగా పొత్తు పెట్టుకోవడానికి ఆమె ఉమాబాయిని సంప్రదించింది. 1750 లో ఇద్దరు మహిళలు కలుసుకున్నారు. ఒడంబడిక నుండి డాభేదులను విడుదల చేయడానికి పేష్వా నిరాకరిస్తే ఆమెకు మద్దతు ఇస్తామని ఉమాబాయి హామీ ఇచ్చింది. 1750 అక్టోబరు 1 న తారాబాయి, ఉమాబాయి మళ్ళీ శంభు మహాదేవు ఆలయంలో కలుసుకున్నారు. అక్కడ తారాబాయి ఛత్రపతికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయమని ఆమెను ప్రేరేపించి ఉండవచ్చు. 1750 అక్టోబరు 20 న ఉమాబాయి తన ప్రతినిధి యాడో మహాదేవు నిర్గుడేను పెష్వాకు తుది విజ్ఞప్తి చేయాలని, ఆదాయ భాగస్వామ్య ఒడంబడిక నుండి దభేదులను విడుదల చేయాలని కోరారు. పేష్వా బాలాజీ ఈ విజ్ఞప్తిని తిరస్కరించాడు. వెంటనే ఛతపతి ఖజానాకు డబ్బు పంపించాలని తాను కోరుకుంటున్నానని ప్రకటించాడు. ఉమాబాయి ఇంకా తిరుగుబాటు చేయడానికి ఇష్టపడలేదు. పేష్వాతో వ్యక్తిగత సమావేశాన్ని కోరింది. 22 నవంబరున అలండిలో ఇద్దరూ కలిశారు. ఈ సమావేశంలో ఉమాబాయి ఒడంబడిక బలవంతంగా అన్యాయంగా విధించబడిందని, అందువలన కట్టుబడి ఉండవలసిన అవసరం లేదని వాదించారు. పేష్వా దీనిని చెల్లుబాటు అయ్యే వాదనగా అంగీకరించడానికి నిరాకరించి గుజరాతు నుండి వసూలు చేసిన ఆదాయంలో సగం ఇవ్వాలని నిర్భంధం చేసాడు.[4]

బాలాజీ బాజీ రావు మొఘలు సరిహద్దుకు బయలుదేరినప్పుడు, తారాబాయి ఛత్రపతి రెండవ రాజారాంను 1750 నవంబరు 24 న జైలులో పెట్టించింది.. తారాబాయికి మద్దతుగా ఉమాబాయి మరాఠీ, గుజరాతీ సైనికుల దళాన్ని తన సైనికాధికారి దామాజీ గైక్వాడు నేతృత్వంలో తారాబాయికి సహాయం చేయడానికి పంపించింది. 1751 మార్చిలో పేష్వా విధేయులకు వ్యతిరేకంగా ప్రారంభ విజయాలు సాధించిన తరువాత, గైక్వాడు కృష్ణ నది లోయలోని ఒక తోటలో చిక్కుకున్నాడు. ఆతని సైనికులు ఆతనిని విడిచిపెట్టినప్పుడు, ఆతను పేష్వాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవలసి వచ్చింది. పేష్వా గుజరాతు భూభాగాలలో సగం రూపాయలు చెల్లించడంతో యుద్ధ నష్టపరిహారంతో రూ. 25,00,000 / - చెల్లించాలన్న ఒక ఒప్పందం మీద సంతకం చేయడానికి దామాజీ నిరాకరించాడు. ఆయన తాను సబార్డినేటు మాత్రమే అని పేర్కొని, ఉమాబాయిని సంప్రదించమని పేష్వాను కోరాడు. ఏప్రిలు 30 న, పేష్వా గైక్వాడూ శిబిరం మీద సాయంత్ర సమయంలో ఆశ్చర్యకరమైన సాయంత్రం దాడి చేసాడు. వారు ప్రతిఘటన లేకుండా లొంగిపోయారు.[4]

1751 మే లో, పేష్వా దామాజీ గైక్వాడు, ఆయన బంధువులను ఖైదుచేసి, పూణేకు పంపారు. కొంతకాలం తర్వాత ఉమాబాయి, యశ్వంత రావు, దభడే కుటుంబంలోని ఇతర సభ్యులను కూడా ఖైదు చేశారు. వారు వారి జాగీర్లతో పాటు వారి వంశపారంపర్య శీర్షిక అయిన సెనాపతిని కోల్పోయారు.[3]

1752 మార్చిలో పేష్వాకు అనుకూలంగా దభేడులను వదలివేయడానికి గైక్వాడు అంగీకరించాడు. ఆయన గుజరాతుకు మరాఠా అధిపతిగా చేశారు. గైక్వాడు దభాదే కుటుంబానికి వార్షిక నిర్వహణ వ్యయాన్ని అందించడానికి అంగీకరించారు.[4]

మరణం[మార్చు]

ఖైదుచేయబడి, తరువాత గేక్వాడు పేష్వాతో కూటమి ఏర్పరుచుకున్న తరువాత దభాదేలు వారి అధికారం, సంపదలను కోల్పోయారు. [4] ఉమాబాయి 1753 నవంబరు 23 న పూనాలోని నడ్గమొడి వద్ద మరణించింది. ఆమె సమాధి తాలెగావు దభాదే వద్ద " శ్రీమంతు సర్సేనాపతి దభాదే శ్రీ బనేశ్వరు మందిరం " పేరుతో నిర్మించబడింది.

మూలాలు[మార్చు]

  1. G.S.Chhabra (2005). Advance Study in the History of Modern India (Volume-1: 1707-1803). Lotus Press. pp. 19–28. ISBN 978-81-89093-06-8.
  2. 2.0 2.1 Stewart Gordon (1993). The Marathas 1600-1818. Cambridge University Press. pp. 120–131. ISBN 978-0-521-26883-7.
  3. 3.0 3.1 Jaswant Lal Mehta (2005). Advanced Study in the History of Modern India 1707-1813. Sterling. pp. 213–216. ISBN 9781932705546.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 A History of the Maratha People Volume 3. Oxford University Press. 1918. pp. 2–10. {{cite book}}: Cite uses deprecated parameter |authors= (help)