ఎం. కె. సుగంబాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎం. కె. సుగంబాబు తెలుగు రచయిత, జర్నలిస్టు.[1] అతను పలు చలన చిత్రాలకు దర్శకుడిగా, రచయితగా వ్యవహరించాడు. అతను 9 సంపుటాల కవిత్వాన్ని, 3 సంపుటాల ఇతర రచనలను చేసాడు. రెండు డాక్యుమెంటరీలకు దర్శకత్వం వహించాడు. అతను రాసిన గురజాడ జీవిత విశేషాలతో కూడిన "అస్తమించిన సూర్యుడు"[2] కు బంగారు నంది పురస్కారం లభించింది. [3]

జీవిత విశేషాలు[మార్చు]

గుంటూరు జిల్లా గుంటూరు పట్టణంలో 1944 ఏప్రిల్‌ 1 న సకినాబీబి, ఫరీద్‌ఖాన్ దంపతులకు సుగం బాబు జన్మించారు. ఆయనకు తల్లితండ్రులు పెట్టిన పేరు మహబూబ్‌ ఖాన్‌ కాగా అదికాస్తా "సుగంబాబు" గా పేరు స్థిరపడింది.[4] తాడికొండలోని ఎస్. వి. వి. ఉన్నత పాఠశాలలో పదవతరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో 1964 లో డిగ్రీ పూర్తి చేసుకున్నారు. బి.ఏ (తెలుగు) చదివారు. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డక్కన్ క్రానికల్ లో 1978లో ఉద్యోగంలో చేరారు. 1999 వరకు అదే పత్రికలో పనిచేశారు. రచయితగా, జర్నలిస్టుగా, దర్శకునిగా, మాటల రచయితగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. తెలుగు సాహిత్యంలో పైగంబర కవుల్లో ఒకరిగా ప్రత్యేక స్థానం పొందారు.

రచనా వ్యాసంగం[మార్చు]

1963 డిసెంబర్‌లో 'భారతి' మాసపత్రికలో 'మట్టీ బొమ్మ' కవిత ప్రచురణతో ఆయన రచనా వ్యాసంగం ఆరంభం అయింది. అప్పటినుండి వివిధ పత్రికల్లో, సంకలనాల్లో కవితలు, కథానికలు, సాహిత్య వ్యాసాలు రాశారు. తెలుగు సాహిత్యంలో 'రెక్కలు' అనే నూతన కవితా ప్రక్రియను 2003లో ప్రారంభించి ఐదుఎడిషన్లు వెలువరించారు. తొలిసారిగా హిబ్రూ విశ్వవిద్యాలయం (ఇజ్రాయిల్‌) కు చెందిన ఆచార్య సుర్మన్‌ డేవిస్‌ ఆంగ్ల భాషలో 'వింగ్స్' పేరిట వాటిని అనువదించి వెలువరించినప్పటి నుండి తెలుగులోనే కాకుండా జాతీయ స్థాయిలో 'రెక్కలు' ప్రక్రియ పాఠకాదరణ పొందింది. అది కన్నడం, హిందీ భాషా సాహిత్యంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ‘మయూరి’ వీక్లీలో ‘ప్రముఖుల పేజీ’ పేరుతో శీర్షిక నిర్వహించారు. పాతతరం కవులపై ఈ శీర్షికలో రాశారు.

తొలిరోజుల్లో మనసు కవి ఆత్రేయ దగ్గర, ప్రముఖ నిర్మాత ఎం. ఎస్. రెడ్డి దగ్గర పనిచేశారు. కొన్ని సినిమాలకు మాటలు రచయితగానూ, దర్శకత్వ శాఖలోనూ పనిచేశారు. ఆయన రాసిన గ్రంథాలలో 'సూరీడు' ఆయనకు ఖ్యాతి తెచ్చిపెట్టింది. గురజాడ జీవిత విశేషాలతో కూడిన ‘అస్తమించిన సూర్యుడు’ డాక్యుమెంటరీకి సుగమ్ బాబును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1985లో బంగారు నందితో సత్కరించింది.

అస్తమయం[మార్చు]

సుగంబాబు 2022 అక్టోబరు 18వ తేదీన అస్తమించారు.

రచనలు[మార్చు]

  • చరలో సెలయేరు (1968)
  • విప్లవం (1969)[5]
  • పైగంబర కవులు (1971)
  • సూరీడు (పాటల పుస్తకం, 1971)
  • లెనిన్‌...లెనిన్‌ (1984)[6]
  • రెక్కలు (2003)
  • కొత్తనీరు రెక్కలు[7]

"రెక్కలు" కవితా ప్రక్రియ[మార్చు]

ఈ ప్రక్రియ 20 వ దశకం నుండి ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిని సుగం బాబు రూపకల్పన చేశాడు.[2] ఈ ప్రక్రియలో

  1. అక్షరాల నియమం లేదు .
  2. ఆరు వరసలు ఉండాలి.
  3. మొదటి నాలుగు వరుసల్లో స్టేట్ మెంట్ చెప్పాలి . చివరి రెండు వరుసలూ పై స్టేట్ మెంట్ ని ఉన్నతీకరించి ఎగిరేటట్టు చేయాలి. అవే రెక్కలు అన్నమాట.
  4. తాత్విక విషయాలకు ప్రాధాన్యత నివ్వాలి.

ఉదాహరణ[మార్చు]

నిన్ను నీవు
ప్రశ్నించుకో
ఎదుటి వానిలో
దర్శించుకో !

ఆత్మజ్ఞానం
దైవ సమానం !

------పి. లక్ష్మణ్ రావ్

మరణం[మార్చు]

ఎం.కె. సుగంబాబు 2022 అక్టోబర్ 18న మరణించాడు.[8]

మూలాలు[మార్చు]

  1. "పుట:అక్షరశిల్పులు.pdf/151 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-02-04.
  2. 2.0 2.1 "Vivid and Vibrant - 8 by Rama Rao Vadapalli V.B." www.boloji.com. Retrieved 2020-02-04.
  3. "Kritya :: Poetry In Our Time". www.kritya.in. Archived from the original on 2020-02-04. Retrieved 2020-02-04.
  4. "ELK Asia Pacific Journals – Special Issue" (PDF). Archived from the original (PDF) on 2018-06-02.
  5. Babu, M. K. Sugam (1970). Viplavaṃ.
  6. Babu, M. K. Sugam (1988). Lenin ... lenin: vacana kavita. For copies, M.K. Sugam Babu.
  7. "Green Book - 2 Kotha Neeru Rekkalu". www.logili.com (in ఇంగ్లీష్). Retrieved 2020-02-04.
  8. "రచయిత, జర్నలిస్ట్ సుగంబాబు ఇక లేరు" (in ఇంగ్లీష్). 18 October 2022. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.