ఐఐఐటి- బెంగుళూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ఐఐఐటి-బీ సెప్టెంబర్ 15, 1999 లో ఐ.టి.పి.ఎల్ అనే ప్రదేశము యొక్క ఒక భాగములో భారతీయ సాంకేతిక సమాచార పీఠం పేరుతో నిర్మించబడింది.[1] ఈ పీఠము తమ విద్యార్థులకు మొదటి నాలుగు సంవత్సరములు ఐ.టి.పి.ఎల్ లో పాఠాలు చదివించారు. ఆగస్టు 2003 లో ఐఐఐటీ-బీని ఐ.టి.పి.ఎల్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ (విద్యుత్తు పట్నం) అనే ప్రదేశానికి మార్చారు. జాతీయ ప్రాముఖ్య పీఠములను స్ఫూర్తిగా తీసుకొని ఐఐఐటీ-బీని స్థాపించారు. ఉదాహరణకు, మన దేశములో భారతీయ సాంకేతిక పీఠములు, జాతీయ సాంకేతిక పీఠములు, భారతీయ యోజన పీతములు జాతీయ ప్రాముఖ్య పీతములుగా గుర్తిస్తారు. ఈ పీఠము ప్రారంభించినప్పుడు, విద్యార్థులకు సాంకేతిక సమాచారములో పట్టాలు బహుకరించేది. జనవరీ 2005 లో విశ్వవిద్యాలయ ఖ్యాతి కలిగిన తరువాత ఈ పీఠము తమ విద్యార్థులకు సాంకేతిక సమాచారములో ప్రవీణులుగా గుర్తించి డిగ్రీ లను బహుకరించడం ప్రారంభించింది. ఈ పీఠము విశ్వవిద్యాలయముగా పరివర్తన చెందక క్రితము భారతీయ సాంకేతిక సమాచార పీఠమునుంచి అంతర్జాతీయ సాంకేతిక సమాచార పీఠముగా పేరు అనువదించబడింది (2004 లో).

మూలాలు[మార్చు]

  1. "About us The International Institute of Information Technology Bangalore". www.iiitb.ac.in. Retrieved 2021-08-31.
IIIT బెంగళూరు లైబ్రరీ