కందిమళ్ల ప్రతాపరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కందిమళ్ల ప్రతాపరెడ్డి

కందిమళ్ల ప్రతాపరెడ్డి రచయిత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల కమిటీకి కన్వీనర్. అతను రావి నారాయణరెడ్డి వద్ద చాలాకాలం వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశాడు.[1] అతను తెలంగాణ సాయుధ పోరాటంలో బాల గెరిల్లాగానూ, ముఖ్య నాయకులకు కొరియరుగానూ పనిచేసాడు.[2]

రచనలు[మార్చు]

  1. ఖానూన్ (నవల)
  2. బందూక్ (నవల) : నిజాం పాలిత ప్రాంతంలో యధేచ్ఛగా కొనసాగిన దొరల అకృత్యాలనూ, రజాకార్ల అమానుషాలనూ, ఆరాచకాలనూ ఈ నవల చిత్రించింది.
  3. వీరతెలంగాణ సాయుధ సమరం[3]
  4. నీ కవిని బతికించుకోవాలిరా (సంపాదకత్వం)
  5. భారత స్వాతంత్ర్య సమరవీరులు[4]
  6. బద్దం ఎల్లారెడ్డి సంక్షిప్త జీవిత పరిచయము

పురస్కారాలు[మార్చు]

  • 2006లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ వారిచే కొండేపూడి సాహితీ సత్కారం అందుకున్నాడు.[5]

పదవులు[మార్చు]

  • కార్యదర్శి - తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు
  • జాతీయ కార్యదర్శి - ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసోసియేషన్ (ఇప్టా)

మూలాలు[మార్చు]

  1. "ఆదర్శ నేత రావి నారాయణరెడ్డి". www.andhrajyothy.com. Archived from the original on 2021-05-14. Retrieved 2020-07-05.
  2. సత్యనారాయణ, డా ఎస్పీ (2008-04-18). "బాల గెరిల్లా జ్ఞాపకాల కథనం". telugu.oneindia.com. Retrieved 2020-07-05.
  3. "Veera Telangana Sayudha Samaram (Telugu) - 2007". Chirukaanuka. Retrieved 2020-07-05.
  4. "Bharata Swatnatrya Samaraveerulu - భారత స్వాతంత్ర్య సమరవీరులు by Kandimalla Pratapa Reddy - Bharata Swatnatrya Samaraveerulu". anandbooks.com/ (in ఇంగ్లీష్). Archived from the original on 2020-07-05. Retrieved 2020-07-05.
  5. పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284.