కాశీ కథలు చెప్పే కాశీ కావడి

వికీపీడియా నుండి
(కాశీ కావడి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కాషాయ వస్త్రాలను ధరించిన వ్వక్తి కాశీ కావడి అంటూ ఒక కావడిని భుజాన వేసుకుని రెండు ప్రక్కలా పసుపు రంగు బట్టతో మూత గట్టిన బిందెలుగానీ రెండు బుట్టలను గానీ కావడి బద్దకు కట్టి, కావడిలో కాశీ విశ్వనాథుని విగ్రహాలను ఉంచి, పసుపు కుంకాలతోనూ, పుష్పాలతోనూ అలంకరించుతాడు.

బొమ్మల చిత్ర పటం[మార్చు]

ఆ కావడి కొమ్ముకు మూడు గజాల చిత్ర పటాన్ని, ఒక ప్రక్క కావడి కొమ్ముకు తగిలించి, కాశీ విశ్వనాథుని సందర్శనాన్ని గురించి, వారు ప్రయాణించే దీర్ఘ ప్రయాణంలో దర్శించే క్షేత్రాలను గురించీ, పూర్వ కాలంలో కాశీ యాత్ర చేయాలంటే ఎంత కష్టమో ఈ కథ ద్వారా వినిపిస్తాడు. యాత్రికులు బయలు దేరిన దగ్గర నుంచీ, కాశీకి పోయే దారిలో, అడవుల్ని గురించి, ప్రకృతి వర్ణన గురించీ, క్రూర మృగాల ఆర్భాటాలూ, నదీ ప్రవాహాలూ, సత్రాలూ, దొంగల దోపిళ్ళూ, మజిలీలూ, ఇతర యాత్రా స్థలాలూ, పర్వతాలలో ప్రయాణం, చివరికి కాశీ విశ్వనాథుని సందర్శనం. ఈ మధ్యలో వచ్చే బాధల్ని గురించీ, క్రూర మృగాల బారినుండి తప్పు కోవడం గురించీ, వరుస క్రమంలో కథను నడుపుతూ ఆ కథా సంవిధానంలో అన్ని రసాలనూ చిత్రిస్తూ, చివరికి అన్ని కష్టాలనూ అధిగమించి, కాశీ విశ్వేశ్వరాలయానికి చేరి ముక్తి పొందడంగా దీనిని జీవితానికి అన్వయించి, మనం స్వర్గానికి చేరు కోవడం ఎంత కష్టమో, ఈ కష్టాలను ఉదాహరణగా చెపుతాడు. కథకుడు ద్విపద నడకలో కథను బహులబ్జుగా నడుపుతాడు.

ప్రజల మధ్యలో పగటి వినోదం[మార్చు]

ముఖ్యంగా ఈ కాశీ కావడి చిత్ర కథా విధానం, పగటి పూట ప్రజల మధ్యనే జరుగుతుంది. ఎక్కువగా ఉదయపు సమయాల్లోనే జరుగుతుంది. కథా కాలం కనీసం అరగంట సేపు ఉంటుంది. కాశీ కావడి, కాశీ కావడి అంటూ గంటలు మ్రోగించు కుంటూ నడి బజారులో కావడి దించి, కథకుడు కథను ప్రారంభిస్తాడు. పిల్లా జల్లా ముందుగా వస్తారు. తరువాత పెద్ద వాళ్ళు ఆ తరువాత స్త్రీలూ అందరూ కావడి చుట్టూ మూగుతారు. ఆ రోజుల్లో కాశీ క్షేత్రాన్ని సందర్శించడ మంటే విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చి నట్లే. ధనవంతులు తప్ప ఆ క్షేత్రాన్ని ఇతరులు దర్శించ లేక పోయే వారు. ఈ చిత్ర కథావధానంద్వారా, వారు కాశీ క్షేత్రాన్ని చూసి నట్లే అనుభూతి చెందేవారు. కథ చివరకు అందరూ రస సిద్ధిని పొందే వారు. ఆధ్యాత్మిక చింతనతో, తృప్తి పొంది ఎవరికి తోచిన పారితోషికాలను వారు ముట్ట చెప్పేవారు.

ఈ విధంగా కథకుని ఒడి నిండి మరో వీధికి బయలుదేరేవాడు. వీరి బొమ్మలన్నీ చీరల మీద వరుసగా చిత్రించబడి అతి సుందరంగా ఉంటాయి. అవి బందరు కలంకారీ బొమ్మల రంగుల్లో ఉంటాయి. బొమ్మల ద్వారా కథ చెప్పడం వల్ల చదువు రాని వయోజను లందరికీ ఈ కథా విధానం సుబోధకంగా ఉండేది. వీరు కేవలం కాశీ మహత్తునే కాక ఆ యా రాజుల మతాల వారి దేవతల గురించి దేవుళ్ళను గురించీ కూడా కథలు చెపుతారు. ఆ నాడు ఈ చిత్ర కథా విధాన్నాన్ని కాశీ కావడి ద్వారా చెప్పేవారు. ఎంతో భక్తి "శ్రద్ధలతో చెప్పే వారు. వినే వారు కూడా అలాగే వినే వారు. అయితే రాను రాను ఈ కళారూపం భక్తినీ, ముక్తినీ ప్రబోధించే కంటే భుక్తికే ప్రాధాన్య మిచ్చి యాచక వృత్తిలో దించేశారు.

కాశీకి పోయాను రామా హరి[మార్చు]

కాశీ కావడి కళారూపం ఈ నాడు అంతగా ప్రచారంలో లేక పోయినా, అక్కడక్కడా ఈ కావడి ప్రదర్శనతో బ్రతుకు తున్న వారు కూడా కనిపిస్తారు. బ్రాహ్మణ వేషాలతో కావడిని మోసుకుంటూ బజారున పడి కాశీకి పోయి వచ్చామనీ, గంగ తీర్థం తెచ్చామనీ, కాశీ విశ్వేశ్వరుని పటాలు చూపిస్తూ, ప్రజల మధ్యలో పగటి వినోదం: ముఖ్యంగా ఈ కాశీ కావడి చిత్ర కథా విధానం, పగటి పూట ప్రజల మధ్యనే జరుగుతుంది. ఎక్కువగా ఉదయపు సమయాల్లోనే జరుగుతుంది. కథా కాలం కనీసం అరగంట సేపు ఉంటుంది. కాశీ కావడి, కాశీ కావడి అంటూ గంటలు మ్రోగించు కుంటూ నడి బజారులో కావడి దించి, కథకుడు కథను ప్రారంభిస్తాడు. పిల్లా జల్లా ముందుగా వస్తారు. తరువాత పెద్ద వాళ్ళు ఆతరువాత స్త్రీలూ అందరూ కావడి చుట్టూ మూగుతారు.

ఆ రోజుల్లో కాశీ క్షేత్రాన్ని సందర్శించడ మంటే విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చి నట్లే. ధనవంతులు తప్ప ఆ క్షేత్రాన్ని ఇతరులు దర్శించ లేక పోయే వారు. ఈ చిత్ర కథావిధానంద్వారా, వారు కాశీ క్షేత్రాన్ని చూసి నట్లే అనుభూతి చెందేవారు. కథాంతానికి అందరూ రస సిద్ధిని పొందే వారు. ఆధ్యాత్మిక చింతనతో, తృప్తి పొంది ఎవరికి తోచిన పారితోషికాలను వారు ముట్ట చెప్పేవారు. ఈ విధంగా కథకుని ఒడి నిండి మరో వీధికి బయలుదేరేవాడు. వీరి బొమ్మలన్నీ చీరల మీద వరుసగా చిత్రించబడి అతి సుందరంగా ఉంటాయి. అవి బందరు కలంకారీ బొమ్మల రంగుల్లో ఉంటాయి.

బొమ్మల ద్వారా కథ చెప్పడం వల్ల చదువు రాని వయోజను లందరికీ ఈ కథా విధానం సుబోధకంగా ఉండేది. వీరు కేవలం కాశీ మహత్తునే కాక ఆ యా రాజుల మతాల వారి దేవతల గురించి దేవుళ్ళను గురించీ కూడా కథలు చెపుతారు. ఆ నాడు ఈ చిత్ర కథా విధానాన్ని కాశీ కావడి ద్వారా చెప్పేవారు. ఎంతో భక్తి శ్రద్ధలతో చెప్పే వారు. వినే వారు కూడా అలాగే వినే వారు. అయితే రాను రాను ఈ కళారూపం భక్తినీ, ముక్తినీ ప్రబోధించే కంటే భుక్తికే ప్రాధాన్య మిచ్చి యాచక వృత్తిలో దించేశారు.

కాశీకి పోయాను రామ హరి[మార్చు]

కాశీ కావడి కళారూపం ఈ నాడు అంతగా ప్రచారంలో లేక పోయినా, అక్కడక్కడా ఈ కావడి ప్రదర్శనంతో బ్రతుకు తున్న వారు కూడా కనిపిస్తారు. బ్రాహ్మణ వేషాలాతో కావడిని మోసుకుంటూ బజారున పడి కాశీకి పోయి వచ్చామనీ, గంగ తీర్థం తెచ్చామనీ, కాశీ విశ్వేశ్వరుని పటాలు చూపిస్తూవుంటారు. ఇలాంటి వారిని గురించి, వెలువడిన జానపద గేయం ఈ విధంగా ఉంది.

కాశీకి పోయాను రామా హరీ
కాశి తీర్థమే తెచ్చాను రామా హరీ
కాశీకి పోలేదు రామా హరీ
వూరి కాల్వలో నీరండి రామాహరీ
కాశీకి పోయాను రామహరీ
కాశీవీభూతి తెచ్చాను రామాహరీ
కాశీకి పోలేదు రామాహరీ
వీడి, కాష్టంలో బూడిదండీ రామాహరీ
పంచేంద్రియాలూ రామాహారీ
నేను బంధించి యున్నాను రామా హరీ
కొంచెము నమ్మినా రామాహరీ
కొంప ముంచి వేస్తాడండి రామాహారీ
ఆలు బిడ్దలు లేరు రామా హరీ
ఆత్మ యోగే నండి రామా హరీ
ఆలు బిడ్డలెల్ల రామా హరీ
వీనికా యూర నున్నారు రామా హరీ

అంటూ కాశీ యాత్రను వ్వంగ్యంగా చిత్రించి చుట్టూ మూగిన ఊరి జనాన్ని నవ్వించి, ఆ విధంగా పారి తోషికాలను పొంది బ్రతుకు వెళ్ళబుచ్చుకునేవారు. పూర్వ కాలంలో చాల మంది మోక్షం కోసం, పుణ్యం కోసం కాశీ యాత్రలు చేసేవారు. ఈ నాడు కాశీ యాత్ర అంత కష్టమైన పని కాదు. ఈ కాలంలో బ్రతకడం కోసమే, కాశీ కావడి ప్రదర్శనాల నిస్తున్నారని లక్ష్మీకాంత మోహన్ అంటున్నాడు.