కృష్ణ పక్షము (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కృష్ణపక్షము
కృతికర్త: దేవులపల్లి కృష్ణశాస్త్రి
అంకితం: మహారాజా రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు బహద్దరు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన కవితా సంపుటి.
ప్రచురణ: ఓరియంట్ లాజ్మన్ లిమిటెడ్, హైదరాబాదు
విడుదల: 1925
పేజీలు: 85
ముద్రణ: వినాయకసాయి అఫ్‌సెట్ ప్రింటర్స్, హైదరాబాదు
ప్రతులకు: ఓరియంట్ లాజ్మన్ లిమిటెడ్, హైదరాబాదు

కృష్ణ పక్షము దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన కవితా సంపుటి. ఇది 1925లో మొదటిసారిగా ప్రచురించబడిన దేవులపల్లి కృష్ణశాస్త్రి తొలి పద్య కృతుల సంపుటి.[1]

భావ కవితా రీతికి ప్రసిద్ధి కన్నది అతని తొలి పద్య సంపుట త్రయి - కృష్ణపక్షము, ప్రవాసము, ఊర్వశి. కృష్ణపక్షం సంపుటాన్ని మొదట 1925లో సాహితీ సమితి తరపున ప్రచురించినవారు సభాపతి తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి(శివశంకరస్వామి). తరువాత ప్రవాసము - ఊర్వశి అనే సంపుటిని 1929 లో అచ్చువేసినవాడు "జ్యాల" పత్రికాధిపతి ముద్దుకృష్ణ.

ఆ తరువాత కృష్ణపక్షము - ప్రవాసము- ఊర్వశి కలసి ఒకే సంపుటంగా పలు ముద్రణలు పొందాయి. 1975 లో స్వర్ణోత్సవ సందర్భంగా ఈ కావ్యత్రయి తిరిగి ప్రచురితమైంది.

మూలాలు[మార్చు]

  1. "నా అసమగ్ర పుస్తకాల జాబితా -4". Archived from the original on 2016-03-19.

బాహ్యలంకెలు[మార్చు]