గీతాంజలి (కవిత)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చలం

రవీంద్రుని రచనలలో గీతాంజలి చాల గొప్పది. రవీంద్రుడు తాను బెంగాలీ భాషలో రచించిన భక్తిగీతాలను కొన్నింటిని ఆంగ్లంలోనికి అనువదించి గీతాంజలి అని పేరు పెట్టాడు. అది అనేక ప్రపంచ భాషలలోనికి అనువదించబడింది. ప్రపంచ సాహిత్యంలో ఇది గొప్ప రచన. మానవుని కృంగదీసే నిరాశా నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూచి శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం. 1913 వ సంవత్సరంలో సాహిత్యానికి సంబంధించి రవీంద్రుని గీతాంజలికే నోబెల్ బహుమతి లభించింది. విశ్వకవి అనే బిరుదును సాధించి పెట్టింది. ఆసియా ఖండంలో మొదటిసారి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి. గీతాంజలి వెలువడిన తరువాత అన్ని దేశాలవారు రవీంద్రుని గ్రంథాలను చదవడం ఆరంభించారు.

రవీంద్రనాథ ఠాగూర్ గారు బెంగాలి లో రచించిన గీతాంజలి కవితను చలం (గుడిపాటి వెంకట చలం) గారు తెలుగు లోనికి అనువదించారు.

కవిత[మార్చు]

అంతులేని లోకాల సముద్ర తీరాన
పిల్లలు కలుసుకున్నారు,
పైన అనంతాకాశం నిశ్ఛలంగా వుంది,
అవిరామంగా సముద్రం పొంగి పొర్లుతోంది,
అంతంలేని లోకాల సముద్ర తీరాన
పిల్లలు అరుపులతో నృత్యాలతో కలుసుకున్నారు.



ఇసుకుతో ఇళ్ళు కట్టుకుంటారు.
ఉత్త ఆల్ఛిప్పలతో ఆడుకుంటారు.
ఎండుటాకులతో పడవలు చేసి
విశాల సముద్రం పైన చిరునవ్వులతో వొదులుతారు
లోకాల సముద్రతీరాన పిల్లలాడుకుంటున్నారు



ఈడద మెట్లానో తెలీదు వారికి.
వలలు వెయ్యడమూ ఎరుగరు.
పల్లెవాళ్ళు ముత్యాలకోసం మునుగుతారు
వర్తకులు ఓడల్లో ప్రయాణమౌతారు

.

కాని పిల్లలు గులకరాళ్ళని పోగు చేసికొని
వాతిని నీళ్ళల్లో వెదచల్లుతారు
గుప్తభాగ్యరాసుల కోసం వెతకరు
వాళ్ళకి వలలు వెయ్యడం చాతకాదు.



నవ్వులతో పొంగుతోంది సముద్రం
తీరపు చిరునవ్వు తెల్లగా మెరుస్తోంది
మృత్యుభయనంకరమైన అలలు
శిశువుకి ఉయ్యాలలూపే తల్లివలె
అర్థంలేని జోలపాటల్ని పాడునతున్నాయి
సముద్రం పిల్లలతో ఆడుకుంటోంది
తీరపు చిరునవ్వు తెల్లగా మెరుస్తోంది



అంతులేని లొకాల సముద్రతీరాన
పిల్లలు కలుసుకున్నారు.
తోవ తెలీని ఆకాశంలో తుఫాను విహరిస్తోంది,
నావలు భగ్నమౌతున్నాయి
మృత్యువు విచ్చలవిడిగా సంచరిస్తోంది
పిల్లలు ఆడుతున్నారు,అంతులేని లొకాల తీరంపైన
పిల్లల గొప్ప సమావేశం జరుగుతోంది.

యివి కూడా చూడండి[మార్చు]