చినాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మొదటి శతాబ్దం నుండి పురాతనభారతీయ సాహిత్యం మహాభారతం, మనునీతి వంటి గ్రంథాలలో చినా (చైనాహు) సంస్కృతం चीन (చినా) గురించి ప్రస్తావించింది.

పేరు వెనుక చరిత్ర[మార్చు]

క్రీ.పూ 221 నుండి చైనాను పాలించిన క్విను (పాత లిప్యంతరీకరణలలో సిను లేదా చిను) రాజవంశం లేదా క్రీ.పూ 9 వ శతాబ్దం నుండి ఉనికిలో ఉన్న (పూర్వపు క్విను రాజ్యం) నుండి ఉద్భవించిందని విశ్వసిస్తున్నారు.[1][2]

గ్రీకో-రోమన్లు చైనాను చినా లేదా సినే అని అంటారు.

అయితే ఈ పదం మూలానికి అనేక ఇతర సూచనలు ఉన్నాయి. కొంతమంది చైనీయ, భారతీయ పరిశోధకులు జింగు (荆) అనే పదం ఈరాజ్యానికి పేరుకు మూలం అని వాదించారు.[3] జియోఫు పద ఉపయోగ సంబంధిత మరొక సిద్ధాంతం ఇప్పుడు చైనా లోని యెలాంగు అని పిలువబడే గుయిజౌ భూభాగరాజకీయాల మీద ఆధారపడింది. ఈ ప్రాంత నివాసులు తమను తాము జినా అని చుప్పుకుంటారు.[3]

మహాభారతం[మార్చు]

8 వ - 9 వ శతాబ్దాల మధ్య వ్రాసిన మహాభారతం అనే సంస్కృత పురాణం రచన చైనా గురించి కొన్ని సూచనలు ఉన్నాయి. దాని ప్రజలను చినా తెగగా సూచిస్తుంది.[4]

మహాభారతంలో ప్రగ్జ్యోతిష (అస్సాం) రాజు భగదత్తుడు సైన్యంలో కిరాతులతో కలిసి చైనా కనిపిస్తుంది. సభాపర్వంలో అదే రాజు కిరాతులు, చినాల చుట్టూ ఉన్నారని చెబుతారు. భీస్మపర్వంలో కూడా భగదత్తుడు సైన్యంలో కిరాతులు, "పసుపు రంగు" చినాలు ఉన్నాయి.[ఆధారం చూపాలి].

మహాభారతానికి చెందిన భీషమపర్వం, యవనులు, కంబోజులు, కుంతలాలు, హ్యూణులు, పరాశికలు, దారుణులు, రామనాలు, దాసమాలికలు వంటి ఉత్తరాన ఉన్న మ్లేచా తెగల జాబితాలో చినాలు కూడా ఉన్నారని పేర్కొంటున్నారు.[5] ఈ రచనలు సా.శ. 5 వ శతాబ్దం నాటికి వీరికి హ్యూణులు, పర్షియాలోని సస్సానియను రాజవంశంతో పరిచయం ఏర్పడింది.[ఆధారం చూపాలి].

మహాభారతానికి చెందిన శాంతిపర్వంలో చినాలను ఉత్తరాపాత గిరిజనులు అని సూచించారు. అంటే ఇక్కడ యవనులు, కిరాతులు, గాంధారాలు, శబరులు, బార్బరాలు, షకాలు, తుషారులు, కనకాలు, పహ్లావాలు, ఆంధ్రులు, మద్రాకాలు, రామతాలు, కంభోజులు నివసిస్తున్నారు. ఈ పురాణ శ్లోకాలు ఈ తెగలు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు నిర్వర్తించే వాటికి భిన్నమైన కొన్ని విధులను నిర్వర్తించారని సూచిస్తున్నాయి.[6]

మహాభారతానికి చెందిన వనపర్వంలో చినాల భూభాగాన్ని చేరుకోవడానికి ఉత్తరాన పర్వత ప్రాంతాలలో కిరాతులు దేశవ్యాప్తంగా భూ-మార్గం ద్వారా ప్రయాణించాలి.

ఉత్తర రాజ్యాలలో చినా ఒకటిగా పేర్కొనబడింది: మహాభారతం పుస్తకం 6, 9 వ అధ్యాయం (MBh.6.9) ఇలా పేర్కొంది: - ఉత్తరాన తెగలలో మ్లేచాలు, క్రురాలు, యవనాలు, చినాలు, కాంభోజులు, దారుణులు వంటి అనేక మ్లేచ్చ తెగలు; సుకృతవాహాలు, కులత్తలు, హ్యూణులు, పరాశికలు; రామనములు, దాసమాలికలు. చివుకాలు, పులిందాలు, ఖాసాలు, హ్యూణులు, పహ్లవాలు, సాకాలు, యనావాలు, సవరలు, పౌండ్రులు, కిరాతులు, కాంచీలు, ద్రవిడాలు, సింహళాలు, కేరళలతో పాటు చైనా గురించి ప్రస్తావించబడింది. ఈ తెగలన్నింటినీ మ్లేచ్చ తెగలుగా అభివర్ణించారు. విశ్వమిత్ర రాజు దాడికి వ్యతిరేకంగా వశిష్ట ఋషి ఆయన ఆవు రక్షకులుగా ఇక్కడ వారిని వర్ణించారు. (1,177)

పహ్లావాలు, దారదాలు, కిరాతులు, యనావాలు, సాకాలు, హరహ్యూణులు, చినాలు, తుఖారాలు, సైంధవులు, జగుదలు, రమథాలు, ముండాలు, మహిళారాజ్యం, తంగనాలు, కేకయులు, మాళవులు, కాశ్మిరాలు పాండవ రాజు యుధిష్ఠిరుడికి కప్పం అర్పించినట్లు (3,51) వద్ద పేర్కొన్నారు.

యానవాలు, కిరాతులు, గాంధర్వులు, చినాలు, సవారాలు, బార్బరాలు, సాకాలు, తుషారాలు, కంకాలు, పాఠవులు, ఆంధ్రలు, మద్రాకులు, పౌండ్రాలు, పులిందులు, రామాతలు, కాంభోజులతో కలిసి వీరు ప్రస్తావించబడ్డారు. ఆర్యవర్త రాజ్యాలను దాటిన ప్రాంతాలలోని తెగలుగా. వీరికి ఆర్యవర్త రాజులతో ఉన్న సంబంధాలలో సందేహాలు ఉన్నాయి. (12,64)

పాండవుల ప్రయాణ-వర్ణనలలో చినా ప్రస్తావించబడింది. మహాభారత గ్రంథం 3, 176 వ అధ్యాయం (MBh 3.176) : - బదరి (ఉత్తరాఖండులోని బద్రీనాథు) అనే స్థలాన్ని వదిలి, కష్టతరమైన హిమాలయ ప్రాంతాలను దాటి ఈ చినాలను ఈ క్రింది భాగాలకు చేరుకున్నట్లు వివరిస్తుంది. చైనా, తుఖారా, దారదా, కులిందా వాతావరణాల వంటి ప్రకృతి సహజ ఆభరణాల కుప్పలతో సమృద్ధిగా ఉంటాయి. ఆ యోధులు పాండవుల పక్షాన యుద్ధం చేయడానికి పులిందాల (కిరాతుల) రాజు సువాహు రాజధానికి చేరుకున్నారు.

భీముడు తన సొంత జాతి (5,74) నాశనానికి కారణమైన "చినా రాజు" ధౌతములక గురించి ప్రస్తావించాడు. "ధౌతములకా" అనే పేరు "క్లీను రూట" అని అనువదిస్తుంది. ఇది చివరి జియా చక్రవర్తి జీ (క్రీ.పూ. 1728-1675) కి సూచన కావచ్చు.

"చైనా నుండి జింక తొక్కలు" (5,86) వద్ద పేర్కొనబడ్డాయి. ధృతరాష్ట్ర రాజు ప్రస్తుతం చైనా నుండి వెయ్యి జింక చర్మాలను వాసుదేవ కృష్ణకు ఇవ్వాలనుకున్నాడు: - చైనా నుండి తెచ్చిన వెయ్యి జింక-చర్మాలతో ఆయన ప్రశంశలకు అర్హమైన ఇతర వస్తువులను నేను అతనికి ఇస్తాను. హ్యూణ రాజవంశం సమయంలో (క్రీ.పూ 2 వ శతాబ్దం, సా.శ. 2 వ శతాబ్దం మధ్య), జింక చర్మాలు 4,00,000 నాణేలను అడ్వాన్సుగా ఇవ్వడానికి తయారు చేయబడ్డాయి అని సూచించబడింది.

రామాయణం[మార్చు]

వాల్మీకి రామాయణం కిస్కింధకాండలో చినా, పరమ-చినాల గురించి ప్రస్తావించాడు. దారదాలు, కంబోజాలు, యవనులు, సాకాలు, కిరాతులు, బహ్లికులు, రిషికాలు, తంకనాలు, హిమాలయ తెగలతో సంబంధం కలిగి ఉన్నాడు.[7]

సినాలు, ఖాసాలు, హ్యూణులు, సాకాలు, కాంభోజులు, యవనులు, పహ్లావాలు, కిరతులు,, సింహళీయులు, మ్లేచ్చులు మొదలైన తెగలను సబాలా లేదా నందిని (కామ్దేను అనే ఆవు) దైవిక శక్తుల ద్వారా వశిష్ఠ మహర్షి చేత సృష్టించబడినట్లు పురాణ సాహిత్యం నొక్కి చెబుతుంది.[8]

పురాణాలు[మార్చు]

కల్కి పురాణంలో మళ్ళీ కాంబోజులు, సాకాలు, ఖాసాలు, బారాబరాలు మొదలైనవాటితో బౌద్ధరాజు కాశీతో కలిసి వేదరాజు కల్కికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో పాల్గొన్నట్లు పేర్కొనబడింది.[9]

పురాణాలలోని భువనకోశా విభాగం చినాలతో తుషారలు, పహ్లావాలు, కాంభోజులు, బార్బరాలను ఉడిచ్యా లేదా పురాతన భారతదేశంలోని ఉత్తర విభాగంలో గుర్తించింది.[10] వాయుపురాణం, బ్రహ్మాండపురాణం, చినాలను " చినా-మారు " అనిపేర్కొనబడింది. మత్స్యపురాణం పురాణం చినాలను " వీర మరు " అని పేర్కొన్నది. డాక్టరు కె.పి. జస్వాలు, డాక్టరు ఎం.ఆర్ సింగు అభిప్రాయం ఆధారంగా ఆఫ్ఘనిస్థాను (టర్కీస్థాను) ఉత్తరాన ఉన్న " అందు-కుయి " ప్రాంతంలో చినా-మరు, వీర మరు అనే పేర్లు గుర్తించబడ్డాయి.

బౌద్ధసాహిత్యంలో[మార్చు]

ఇతర సమకాలీన తెగలైన షకాలు, యవనులు, కిరాతులు, కంభోజులు, భాహ్లికాలు, పహ్లవాలు, ఖాసాలు, గాంధారలు, కలుటాలు మొదలైన వాటితో జాబితా చేయబడ్డారు.

బౌద్ధరచన మిలిందాపన్హో (చూడండి: తూర్పులోని సేక్రేడ్ బుక్స్, 1006, 204), చినాలను సకాలు, యవనులు, కాంభోజులు, విలాతాలు మొదలైన వాటితో అనుబంధిస్తుంది. పశ్చిమ టిబెటు (లడఖు) లో గుర్తించిందని డాక్టరు మైఖేలు విట్జెలు తెలిపారు. [11]

ఇతర సాహిత్యంలో[మార్చు]

మౌర్యసామ్రాజ్యం ప్రధాన మంత్రి, తక్షశిల విశ్వవిద్యాలయం ప్రొఫెసరు చాణక్య (క్రీ.పూ. 350-283) చైనా పట్టును తన అర్థశాస్త్రంలో "సినామ్సుకా" (చైనా పట్టు దుస్తులు), "చినాపట్ట" (చైనా పట్టు కట్ట) అని పేర్కొన్నారు.[12]

సన్మోహా తంత్రం బహ్లిక (బాక్ట్రియా), కిరాతా, భోటా (టిబెటు), చినా, మహా-చినా, పరాసికా, ఐరాకా, కంభోజులు, హ్యూణ, యవన, గాంధార, నేపాల వంటి విదేశీదేశాల తాంత్రిక సంస్కృతి గురించి వివరిస్తుంది:

క్రీస్తుపూర్వం 2 వ శతాబ్దంలో, మను చట్టాలు చైనీయుల పతనంతో పాటు భారతదేశంలోని అనేక విదేశీ సమూహాలను వివరిస్తాయి.

"43. కానీ పవిత్ర ఆచారాలను విస్మరించడం, వారు బ్రాహ్మణులను సంప్రదించకపోవడం వంటి కారణాలతో క్షత్రియుల ఆధ్వర్యంలో తెగలు క్రమంగా ఈ ప్రపంచంలో శూద్రుల స్థితికి మునిగిపోయాయి;
44. పాండ్రాకులు, చోడులు, ద్రావిడులు, కంభోజులు, యవనులు, షకులు, పరదాలు, పహ్లవులు, చైనీయులు, కిరాతులు, దారదాలు, ఖాషాలు. "[13]

మనసోల్లసాలో చైనా, పరమ-చైనాతో మహాచినా గురించి కూడా ప్రస్తావన ఉంది. ఈ రచనలో మహాచినా నుండి వచ్చిన బట్టలు ఉన్నాయి.[2] చైనా బహుశా పశ్చిమ టిబెట్టు (లడఖు), మహాచినా లోని టిబెట్టు, పరమ-చైనా ప్రధాన భూమి చైనా అని సూచించే అవకాశం ఉంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Yule, Henry. Cathay and the Way Thither. pp. 2–3. ISBN 8120619668.
  2. 2.0 2.1 Geographical Data in Early Puranas, 1972, p172, Dr M. R. Singh
  3. 3.0 3.1 Wade, Geoff, "The Polity of Yelang and the Origin of the Name 'China'", Sino-Platonic Papers, No. 188, May 2009.
  4. Kisari Mohan Ganguli, The Mahabharata of Krishna-Dwaipayana Vyasa Translated into English Prose, 1883-1896.
  5. MBH 6/9/65-66
  6. MBH 12/65/13-15
  7. The Ramayana of Valmiki: An Epic of Ancient India, Volume 4, Kiskindhakanda, p 151, Rosalind Lefeber
  8. Ramayana (1.52-55) & Mahabharata (1.174.6-48)
  9. Kalika Purana 20/40
  10. ":ete desha Udichya
    Kambojashchaiva Dardashchaiva Barbarashcha Angaukikah || 47 ||
    Chinashchaiva Tusharashcha Pahlavadhayata narah || 48 ||
    (Brahma Purana 27.44-53)"
  11. Early East Iran, And The Atharvaveda, 1980, (Persica-9), p 106, Dr Michael Witzel.
  12. Tan Chung (1998). A Sino-Indian Perspective for India-China Understanding. Archived 2007-06-06 at the Wayback Machine
  13. Manusmritti (Laws of Manu), X.43-44

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=చినాలు&oldid=3505868" నుండి వెలికితీశారు