జల్హణుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జల్హణ లేదా జల్హణుడు 12వ శతాబ్దపు కాశ్మీర్ ప్రసిద్ధ సంస్కృత కవి. అతని తండ్రి లక్ష్మీదేవ్. క్రీ.శ.1147లో రాజ్యాన్ని పొందిన రాజ్‌పురి కృష్ణ అనే రాజుకు మంత్రి. అతని రచనలు చాలా మట్టుకు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. చారిత్రక కవిత్వ రచయితలలో, అతని పేరు రాజతరంగిణి కల్హణుడు తర్వాత వచ్చింది. 'శ్రీకంఠచరితం' ఇతిహాసం రచించిన మంఖకుడు కథనానుసారం, జల్హణుడు తనకు సోదరుడు అని అలంకారుడనే మంత్రి విద్వత్సభలో జల్హణుడు పండితుడుగా తెలియుచున్నది. ఈ అలంకారుడు కాశ్మీర్ రాజు జై సింగ్ యొక్క మంత్రి, అతని సమయం క్రీ.శ 1129-1150.

రచనలు

[మార్చు]

జల్హాణుడు రచించిన గ్రంథాలలో 'సోంపాల్ విలాస్' ఒక చారిత్రక ఇతిహాసం. ఇందులో అతను రాజ్‌పురి రాజు సోంపాల్ వంశవృక్షం, ఉమ్మడి రాజులు, సోంపాల్ జీవితంపై రచన చేసాడు. ఈ సోంపాల్ రాజు చివరకు సుస్సల వంశీయుల చేతిలో ఓడిపోయాడని చెప్పునాడు. ఈతను రచించిన 'సూక్తిముక్తావళి', 'సుభాషిత ముక్తావళి'లో సంపద, దయ, అదృష్టం, దుఃఖం, ప్రేమ, ప్రభుత్వ సేవ మొదలైన అంశాలను క్రమపద్ధతిలో వివరణ చేశాడు. ఇతని పూర్వీకులు దామోదర్ గుప్తా, క్షేమేంద్రుడు మొదలైన వారి రచనల ప్రభావంతో, జల్హణుడు మొత్తం 66 శ్లోకాలతో 'ముగ్ధోపదేశ్'ను రచించాడు. జల్హణుడు రచించిన 'సప్తశతి ఛాయా' అనే మరో రచన కూడా ఈయనకు మంచి పేరు తెచ్చిపెట్టినది.

మూలములు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=జల్హణుడు&oldid=4323281" నుండి వెలికితీశారు